-
మా రూటు.. కార్పొ‘రేటు’
సాక్షి, హైదరాబాద్ : సర్కారు కొలువులకు స్పెషాలిటీ వైద్యులు ముఖం చాటేస్తున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్కు స్పందనే కరువైంది. మొత్తం 1,133 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా 337 దరఖాస్తులకు మించి రాలేదు. స్పెషలిస్టులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చెల్లిస్తున్న వేతనాలతో పోలిస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇస్తున్న ప్యాకేజీలు రెండు మూడు రెట్లు అదనంగా ఉండటమే ఇందుకు కారణం. జిల్లా, మండల కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కంటే నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేయడానికే స్పెషాలిటీ డాక్టర్లు ఎక్కువ ఇష్టపడుతున్నారు. 149 గైనకాలజీ పోస్టులకు 42 దరఖాస్తులు రాగా, 172 పీడియాట్రిక్స్ పోస్టులకు 31 దరఖాస్తులే వచ్చాయి. 176 అనస్థీషియా పోస్టులకు 38 దరఖాస్తులు, 107 జనరల్ సర్జన్ పోస్టులకు 32 దరఖాస్తులు అందాయి. ఇక ఆర్థోపెడిక్, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, సైక్రియాటిక్ విభాగాల్లో 192 ఖాళీ పోస్టులకు 129 దరఖాస్తులే అందడం గమనార్హం. అధిక ప్యాకేజీల వల్లే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులతో పోలిస్తే.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇస్తున్న ప్యాకేజీలు అధికంగా ఉన్నాయి. కాస్త అనుభవం ఉండి, రోగుల్లో మంచి గుర్తింపు ఉన్న వైద్యులకు కార్పొరేట్ ఆసుపత్రులు నెలవారీ ప్యాకేజీ రూ.10 లక్షల వరకు ఇస్తున్నాయి. అదే ప్రభుత్వ ఆస్పత్రిలో ఎన్ని సర్జరీలు చేసినా.. ఎంత గుర్తింపు పొందినా వేతనంలో మాత్రం తేడా ఉండదు. నిమ్స్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ.1.20 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.1.60 నుంచి రూ.1.80 లక్షలు, ప్రొఫెసర్కు రూ.2 లక్షల వరకు వేతనం చెల్లిస్తున్నారు. అదే ఉస్మానియా, గాంధీ, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం బేసిక్ వేతనం రూ.40 వేలతో మొదలవుతుంది. సీనియర్ వైద్యులకు రూ.లక్ష చెల్లిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ సాధారణ వైద్యుడి వేతనంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంతేకాదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేకపోవడంతోపాటు అంతర్గత రాజకీయాలు కూడా స్పెషలిస్టులు వైద్యులు కార్పొరేట్ వైపు వెళ్లడానికి మరో కారణమని సీనియర్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఎవరూ రాకపోవడంతోపాటు ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు కూడా స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా ఆస్పత్రులను మెరుగుపరిచి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం చాలా కాలంగా పట్టించుకోవడం లేదు. పనిభారం.. అవమానాలు: డాక్టర్ లాలు ప్రసాద్, కన్వీనర్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ శాతం పెరిగింది. ఆస్పత్రుల్లో రోగులు, వైద్యుల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అవసరమైన నర్సులు, పారామెడికల్ స్టాఫ్, వైద్య పరికరాలు ఉండటం లేదు. వేతనాల చెల్లింపులోనే కాదు పదోన్నతుల్లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని భారం పెరగడంతోపాటు తక్కువ కేడర్ ఉన్న వ్యక్తులు ఆస్పత్రులకు వచ్చి రోగుల సమక్షంలోనే వైద్యులను అవమానించడం, దాడులకు పాల్పడం వంటి ఘటనలు కూడా వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపకపోవడానికి కారణం. -
రిఫర్ చేస్తేనే ప్రైవేటు వైద్యం!
* ఉద్యోగుల ఆరోగ్య పథకంలో మార్పులు * నేరుగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే అవకాశం ఎత్తివేత * జిల్లాకో రిఫరల్ క్లినిక్.. అక్కడ రిఫర్ చేస్తేనే ‘ప్రైవేటు’కు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకంలో సమూల మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నుంచి విడదీసి ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో భాగంగా మరో మార్పు చేయనుంది. కిందిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక క్లినిక్ల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తేనే పైస్థాయిలోని ప్రైవేటు లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించాలని నిర్ణయించింది. క్లినిక్లలో సాధ్యం కాని మొండి జబ్బులు ఉంటే వాటిని నిర్ణీత ప్రైవేటు లేదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. బీపీ, షుగర్, జ్వరం, ఇతరత్ర చిన్న జబ్బులకు పైస్థాయిలోని ప్రభుత్వ, ప్రైవేటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రాకుండా నిరోధించాలని, వాటిపై ఒత్తిడి లేకుండా చేయాలన్నదే సర్కారు ఉద్దేశం. ఈ నేపథ్యంలో తొలుత జిల్లాకో క్లినిక్ను ఏర్పాటు చేసి, ఒక్కో క్లినిక్లో కనీసం ముగ్గురు వైద్యులను నియమిస్తారు. వారితోపాటు నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డయాగ్నొస్టిక్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి జిల్లాల్లో మరికొన్ని క్లినిక్లను ఏర్పాటు చేస్తారు. ఆరు నెలల్లో అందుబాటులోకి? రాష్ట్రంలో 5.5 లక్షల మంది ఉద్యోగులు, మరో లక్షన్నర మందికిపైగా పింఛనుదారులు.. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే దాదాపు 22 లక్షల మందికిపైగా ఉన్నారు. అలాగే వేలాది మంది జర్నలిస్టులున్నారు. వీరందరి కోసం ప్రభుత్వం నగదు రహిత ఆరోగ్య సేవల పథకాన్ని అమలుచేస్తోంది. రిఫరల్ క్లినికల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ప్రభుత్వం దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేశాక జిల్లా స్థాయిలో క్లినిక్లను ఏర్పాటు చేస్తారు. ఇదంతా అమల్లోకి రావాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగులు, జర్నలిస్టులు చిన్న జబ్బుల కోసం సూపర్ స్పెషాలిటీలు, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చినా చికిత్స అనంతరం రిఫరల్ క్లినిక్ల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయంపై కొందరు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement