-
రాష్ట్ర చేపగా కొరమీను
-
రాష్ట్ర చేపగా కొరమీను
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ‘కొరమీను’ను రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక చేపగా కొరమీనుకు గుర్తింపునిచ్చింది. దీన్నే మరేల్ లేదా మురేల్ ఫిష్గా పిలుస్తారు. మత్స్యశాఖ పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం కొరమీనును అధికారిక చేపగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొరమీను శాస్త్రీయ నామం చన్నా స్ట్రయేటస్. ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్ర చేపగా ఒక రకాన్ని గుర్తిస్తారు. అలా గుర్తించిన చేపలను కాపాడుకోవడమే కాకుండా వాటి సంతతి అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆ చేప జన్యువును లక్నోలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్లో భద్రపరుస్తారు. రాష్ట్రంలో లభించే వివిధ రకాల చేపల్లో కొరమీనుకు అత్యంత ప్రాధాన్యముంది. చేపల పులుసులో కొరమీను రుచికి మించింది లేదు. అందుకే పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఈ చేపలకు డిమాండ్ ఎక్కువ. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రేటు కూడా ఎక్కువే. రాష్ట్రంలో మత్స్యకారులకు లాభాల పంట పండించే చేపగా కొరమీను అందరికీ సుపరిచితమే. -
జర్నలిస్టులందరికీ ఆరోగ్య పథకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు, పదవీ విరమణ జర్నలిస్టులందరికీ ఆరోగ్య పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్చందా బుధవారం మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే నిర్దేశిత జాబితాలోని నెట్వర్క్ ఆసుపత్రులన్నింటిలో ఇన్పేషెంట్ వైద్యసేవలు పొందొచ్చు. ఈ పథకాన్ని ‘వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకం’గా పరిగణిస్తారని ప్రభుత్వం పేర్కొంది. జాబితాలో పేర్కొన్న వ్యాధులన్నింటికీ ఏమాత్రం ఆర్థిక పరిమితి లేకుండా నగదురహిత చికిత్సలు పొందొచ్చు. జర్నలిస్టుల నుంచి ఒక్కపైసా తీసుకోకుండా ఈ పథకాన్ని వర్తింపచేస్తారని సర్కారు స్పష్టంచేసింది. తెల్లరేషన్కార్డున్న జర్నలిస్టులు ఆరోగ్యశ్రీ పథకంలోనైనా ఉండొచ్చు... లేదా జర్నలిస్టుల ఆరోగ్యపథకంలోనైనా చేరొచ్చు. అయితే రెండింటిలో ఉండటాన్ని అనుమతించరు. మార్గదర్శకాలు ఇవే... * జర్నలిస్టులపై ఆధారపడిన తల్లిదండ్రులకూ ఈ పథకం వర్తిస్తుంది. దత్తత పిల్లలకు, నిరుద్యోగ కూతుళ్లు, పెళ్లికాని వారు లేదా వితంతువులు లేదా విడాకులు తీసుకున్నవారికీ, అలాగే 25 ఏళ్లలోపున్న నిరుద్యోగ కుమారులకూ వర్తిస్తుంది. * వైద్య, సర్జిక ల్ చికిత్సలకు ఇన్పేషెంట్ వైద్యం పొందొచ్చు. చికిత్స పూర్తయ్యే వరకు నగదురహిత చికిత్సలు పొందొచ్చు. వైద్య పరీక్షలు, మందులు, డిశ్చార్జ్ అయ్యాక పది రోజుల వరకు మందులు తదితర సదుపాయాలు వర్తిస్తాయి. * నిర్దేశిత ప్యా కేజీ మేరకు ఏడాదిపాటు కన్సల్టేషన్, ఫాలోఅప్ వైద్య సేవలు వంటివి కూడా పొందొచ్చు. * దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఔట్పేషెంట్ వైద్య సేవలు అందుతాయి. దానికి ప్రత్యేకంగా మార్గదర్శకాలు విడుదల చేస్తారు. * ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులన్నీ జర్నలిస్టులకు వైద్య సేవలు అందిస్తాయి. * ప్యాకేజీ ప్రకారం ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రకారమే ఇస్తారు. * జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు అమలు చేస్తుంది. సమాచార పౌరసంబంధాలశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఆరోగ్య పథకం కిందికి వచ్చే జర్నలిస్టుల వివరాలన్నింటినీ ఈ శాఖే ఆరోగ్యశ్రీకి అందజేస్తుంది. అనంతరం అక్కడి నుంచే జర్నలిస్టుల ఆరోగ్యకార్డులు జారీ చేస్తారు. కార్డులను ఆరోగ్యశ్రీ ట్రస్టు వెబ్సైట్ నుంచి పొందొచ్చు. ఆధార్ నంబర్ లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ నంబరే జర్నలిస్టుల ఆరోగ్య పథకం గుర్తింపు నంబర్గా పరిగణిస్తారు. * ఆరు నెలల తర్వాత పథకం అమలుతీరును ప్రభుత్వం సమీక్షిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు ఈ పథకం కింద 60 శాతం మేరకు సేవలు అందించాయా లేదా అన్నదీ సమీక్షిస్తారు. అయితే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అని చెబుతున్న ప్రభుత్వం ఈ ‘60 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు’ అనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. -
అంతా మీ కళ్ల ముందే..!
పారదర్శకతకు పెద్దపీట వేసిన వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్చందా తన చాంబర్లో సీసీ కెమెరా ఏర్పాటు.. ఇంటర్నెట్తో అనుసంధానం ఎవరిని కలిసినా, ఏం మాట్లాడినా అంతా నిక్షిప్తం ఇంటర్నెట్ ద్వారా ఎక్కడినుంచైనా గమనించొచ్చు హైదరాబాద్: సురేశ్చందా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి. సచివాలయంలోని ‘డి’ బ్లాక్ రెండో అంతస్తులోని ఆయన చాంబర్లోకి ప్రవేశించగానే కొట్టొచ్చినట్లుగా సీసీ కెమెరా కనిపిస్తుంది. ఆయన వద్దకు ఎవరు వెళ్లినా ఆ కెమెరాలో రికార్డయిపోతుంది. అంతేకాదు ఎప్పుడైనా, ఎవరైనా ఆ కెమెరాలోంచి ఆ చాంబర్ను పరిశీలించే ఏర్పాటూ ఉంటుంది. ఇది ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసిన కెమెరా కాదు. పాలనలో పారదర్శకత కోసం స్వచ్ఛం దంగా సురేశ్చందానే ఆ సీసీ కెమెరాను ఏర్పాటు చేయించుకున్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ ఇలా తన చాంబర్లోనే సీసీ కెమెరా ఏర్పాటు చేయించుకోవడం చర్చనీయాంశమైంది. సురేశ్చందా దీని గురించి చెబుతూ.. ‘‘కేరళ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒకరు తన చాంబర్లో ఇలాగే సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. ఆయనే నాకు ఆదర్శం. అవినీతి అక్రమాల నిరోధానికి పారదర్శకత ప్రాణం వంటిది. ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఎవరు వచ్చి ఏం మాట్లాడినా రహస్యమంటూ ఏదీ ఉండకూడదనే ఈ ఏర్పాటు..’’ అని చెప్పడం గమనార్హం. ఆయన చాంబర్కు వచ్చే వారందరితోనూ ఆయన జరిపే చర్చలు, సమావేశాలు అన్నీ ఆ కెమెరాలో నిక్షిప్తమై ఉంటాయి. ఎవరైనా చూడొచ్చు.. సురేశ్చందా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్) అడ్రస్ కలిగి ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంటుంది. కెమె రా, సంబంధిత సాఫ్ట్వేర్ ధర దాదాపు రూ.7 వేలు. అన్ని కోణాల్లో తిరిగేలా కెమెరా ఏర్పాటు ఉంటుంది. ఆయన చాంబర్లో ఏం జరుగుతుందనే దానిని ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కలిగి ఉన్నవారు తమ కంప్యూటర్ లేదా సెల్ఫోన్ ద్వారా చూడొచ్చు. 24 గంటల పాటు సీసీ కెమెరా దృశ్యాలను నిల్వచేయడానికి ఒక జీబీ సామర్థ్యం ఉంటే సరిపోతుంది. ‘‘ఎనిమిదేళ్లుగా నేను ఎక్కడ పనిచేసినా ఇటువంటి ఏర్పాటు చేసుకునేవాడిని..’’ అని సురేశ్ చందా చెప్పారు. అంతేకాదు తాను నోట్ఫైల్ చేసిన ఫైళ్లను కూడా తక్షణమే ఇంటర్నెట్లో పెడుతుంటారు. ‘‘ఆర్టీఐ చట్టం వచ్చాక ఏదీ రహస్యం కాదు. ఎవరు ఎప్పుడు ఏది అడిగినా నిర్ణీత కాలంలో సమాచారం ఇస్తు న్న నేపథ్యంలో ఎవరూ అడగకుండానే సమాచారం అం దరికీ అందుబాటులో ఉంచ డం మరింత పారదర్శకత అవుతుంది..’’ అని చెబుతున్నారాయన. గాంధీ ఆసుపత్రిలో.. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలోనూ 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సురేశ్చందా రంగం సిద్ధం చేశారు. ఆ ఆసుపత్రిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆయన యోచిస్తున్నారు. పారిశుద్ధ్యం, వైద్యుల రాకపోకలు, వైద్య సేవలు సక్రమంగా అందించడం కోసం రూ.30 లక్షలతో ఐపీ కలిగిన 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికోసం రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా టెండర్లు పిలవాల్సిందిగా ఆదేశించారు కూడా. ‘‘అక్కడికి వెళ్లి రోజూ పర్యవేక్షించడం కష్టం. అదే సీసీ కెమెరాలు ఉంటే సచివాలయంలోని నా కంప్యూటర్, మొబైల్ ద్వారా కూడా పర్యవేక్షించవచ్చు. తద్వార ఆస్పత్రిలో వైద్యసేవలు మరింత మెరుగ్గా అందుతాయి..’’ అని సురేశ్చందా పేర్కొన్నారు. ఇలా వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లోనూ, కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, వైద్యవిద్యా విభాగం వంటి వాటిల్లోనూ సీసీ కెమెరాలు పెట్టే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
‘కమీషన్ల కొనుగోళ్ల’పై నివేదిక ఇవ్వండి
‘సాక్షి’ కథనంపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ సాక్షి, హైదరాబాద్: ఫార్మసిస్ట్లు, మందుల సరఫరాదారుల కుమ్మక్కుపై ప్రభుత్వం స్పందిం చింది. ‘కమీషన్ల కొనుగోళ్లు’ శీర్షికతో గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా మందుల కొనుగోలుకు సంబంధించి రెండేళ్ల నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో రెండేళ్లుగా ఏ సరఫరాదారునికి ఎంత మోతాదులో ఆర్డర్ ఇచ్చారు, వాటి రేటు ఎంత అనే వివరాలు సేకరించే పనిలో రాష్ట్ర మౌలిక వైద్యసేవలు, సదుపాయాల సంస్థ సిబ్బంది నిమగ్నమయ్యారు. వీటిని పరిశీలించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే అమాక్సిక్ క్లావ్లిక్ యాసిడ్ అనే దగ్గు మందును తమిళనాడులో కంటే 100 శాతం ఎక్కువ రేటుతో కొనుగోలు చేసినట్టు తేలింది. ఇదిలావుండగా కొద్ది రోజుల్లో 2015-16 సంవత్సరానికి తొలి త్రైమాసికం కొనుగోలు ఆర్డర్లు పెట్టాల్సి ఉంది. అయితే నాలుగేళ్లుగా డెప్యుటేషన్పై అక్కడే కొనసాగుతున్న ఫార్మసిస్ట్లు కొందరు తొలి త్రైమాసిక ఆర్డర్లు పెట్టేవరకైనా ఇక్కడే ఉండేందుకు యత్నిస్తున్నారు. వారి కోసం కొంతమంది సరఫరాదారులు కూడా పైరవీలు చేస్తున్నట్టు తెలిసింది. సుమారు రూ.40 కోట్లకు ఆర్డర్లు ఉండడంతో భారీగా కమీషన్లు వచ్చే అవకాశం ఉండడంతో వాటిని వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు
షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement