-
ప్రపంచంలోనే అతిపెద్ద భవనం.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా..?
అహ్మదాబాద్: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం పెంటగాన్పై ఉన్న రికార్డ్ ప్రస్తుతం మారిపోనుంది. ఇప్పుడు ఆ వేదిక ఇక గుజరాత్లోని సూరత్ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం డైమండ్ ట్రేడింగ్ సెంటర్ను సూరత్లో నిర్మించారు. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇది తొమ్మిది ధీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. దాని ఫ్లోర్ 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఈ ట్రేడింగ్ భవనాన్ని ఈ ఏడాది నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఇదీ చదవండి: విపక్షాల భేటీకి దీటుగా.. 38 పార్టీలతో ఎన్డీఏ కూటమి సమావేశం.. -
ముచ్చటగా మూడోసారి రూ.లక్ష కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు మరోసారి రూ. లక్ష కోట్ల వసూళ్లను దాటాయి. జనవరి మాసానికి సంబంధించి లక్ష కోట్ల రూపాయల మార్కెను అధిగమించాయని ఆర్థికమంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. గతనెల రూ. 94, 725 కోట్ల రూపాయలతో పోలిస్తే , గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ. 89, 825కోట్లతో పోలిస్తే జనవరిలో ఈ వసూళ్లను సాధించినట్టు ట్వీట్ చేసింది. కాగా గత ఏడాది ఏప్రిల్లో తొలిసారి లక్షకోట్ల రూపాయలను దాటాయి. అనంతరం మళ్లీ అక్టోబర్ రెండవసారి ఈ మైలు రాయిని దాటాయి. రెండు నెలల విరామం తరువాత తిరిగి జనవరి మాసంలో ముచ్చటగా మూడోసారి జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల మార్క్ను దాటాయి. The total Gross GST Revenue collected in the month of January, 2019 has today crossed ₹ 1 lakh crore. This has been a significant improvement over collection of ₹ 94,725 crore during last month and ₹ 89,825 crore during the same month last year — Ministry of Finance (@FinMinIndia) January 31, 2019 -
రూ. 30,000 దాటిన బంగారం
రెండేళ్ల గరిష్టంలో ధరలు న్యూఢిల్లీ: అంతర్జాతీయ ట్రెండ్ను అనుసరిస్తూ మన దేశంలో పసిడి ధరలు పైకి ఎగిసాయి. దేశ రాజధానిలో పసిడి ధర (10 గ్రాములు) చూస్తుండగానే శుక్రవారం రూ.30,000 మార్క్ను అధిగమించింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, అమెరికా ఫెడ్ కూడా వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం, డాలర్ విలువ పది నెలల కనిష్టానికి చేరడం తదితర కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు పెరిగాయి. దీనికి తోడు దేశంలో జువెలర్స్ నుంచి డిమాండ్ పెరగడం కూడా ఇక్కడి పసిడి ధరల పెరుగుదల ఒక కారణ మయ్యాయి. ప్రపంచ మార్కెట్లో కడపటి సమాచారంమేరకు పసిడి ధర ఔన్స్కు 1,295 డాలర్లకు పెరిగింది. వెండి ధర 1.7 శాతం పెరుగుదలతో 17.84 డాలర్లకు చేరింది. వెండికి గతేడాది జనవరి నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల 99.9%, 99.5 శాతం స్వచ్ఛతగల బంగారం ధరలు రూ.350 పెరుగుదలతో వరుసగా రూ.30,250కు, రూ.30,100కు చేరాయి. 2014, మే 13 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. అలాగే పరిశ్రమలు సహా నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర (కిలో) కూడా రూ.600 పెరుగుదలతో రూ.41,600కు ఎగసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement