-
మృత్యు ఒడిలోకి వెళ్లే ముందు...
-
తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలిన డిప్యూటీ స్పీకర్ సతీమణి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. తాబేళ్లను సంరక్షించడం ద్వారా పునరుత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలీవ్ రిడ్లే సముద్రపు తాబేళ్ల పిల్లలను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సతీమణి రమాదేవి సముద్రంలోకి శుక్రవారం వదిలారు. జల కాలుష్యం నివారణలో తాబేళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని కోన రమాదేవి పేర్కొన్నారు. తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, వాటి పునరుత్పత్తి కేంద్రాన్ని బాపట్ల సూర్యలంకలో రాష్ట్ర అటవీ శాఖ ఏలూరు జోన్ అవనిగడ్డ అటవీ రేంజ్ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. చదవండి: (ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరం: ఆర్.నారాయణమూర్తి) -
లెహర్ వణుకు
బాపట్లటౌన్,రేపల్లె, న్యూస్లైన్ :‘లెహర్’ తుపాను తీరం దాటే సమయంలో సముద్ర తీరప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. గురువారం మధ్యాహ్నం సూర్యలంక వద్ద సముద్రంలో అలజడి రేగింది. సుమారు నాలుగు మీటర్ల మేర అలలు ఎగసిపడ్డాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని తీర ప్రాంత మత్స్యకారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీరం వెంబడి వంద నుంచి 120 కి.మీ. వేగంతో ఈదురుగాలలు వీచాయి. తొలుత పెను తుపాను అంటూ ప్రమాద హెచ్చరికలు పంపినా లెహర్ బలహీనపడటంతో గురువారం ఉదయం నుంచి విస్తారంగా వానలు పడుతున్నాయి. వీటికి తోడు మధ్యాహ్నం నుంచి చలిగాలులు కూడా తోడుకావడంతో జిల్లా వణికిపోయింది. వర్షానికి తోడు చలి గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. నిజాంపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వేటకు వెళ్లరాదని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. పునరావాస కేంద్రాలకు తరలింపు తీరం అల్లకల్లోలంగా మారడంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మండలంలోని సూర్యలంక, అడవిపల్లిపాలెం గ్రామాల్లోని ప్రజలను హుటాహుటిన ముత్తాయపాలెం, ఏఎంజీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. గృహాలు విడిచి వచ్చేందుకు గ్రామస్తులు ససేమిరా అని మొండికేసినా సిబ్బంది బలవంతంగా తరలించారు. తీర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ తీరప్రాంత గ్రామాలైనా అడవిపల్లిపాలెం, సూర్యలంక, ముత్తాయపాలెం గ్రామాల్లో గురువారం జిల్లా కలెక్టర్ సురేశ్కుమార్ పర్యటించారు. లెహర్ తుపాను తీరం దాటిందని అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు,ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, సిబ్బంది మరో 12 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను బాధితులను పునరావాస కేంద్రంలో వదిలి మీకిష్టమొచ్చినట్లు మీరు తిరిగితే కుదరదు అంటూ కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. బాధితులు తిరిగి వారి గృహాలకు వెళ్లే వరకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహించినా, వారిని పట్టించుకోకపోయినా కఠిన చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ సేనాపతి ఢిల్లీరావు, తహశీల్దార్ జి.వి.సుబ్బారెడ్డి, డిఎస్పీ ఏ. భాస్కర్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఉషాకిరణ్, హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు వున్నారు. రైతులకు తప్పని నష్టం.. అక్టోబర్లో కురిసిన అధిక వర్షాలు, పై-లీన్, హెలెన్ తుపానుల ప్రభావంతో జిల్లాలో పత్తి, మిర్చి,వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. లెహర్ తుపాను రైతులను మరింతగా కుంగదీస్తోంది. హెలెన్ ప్రభావంతో కంకి, పొట్టదశల్లో ఉన్న వరి నేలకొరిగింది. కనీసం పంటను కట్టలు కట్టేందుకు కూడా అవకాశం లేక పోవటంతో రోజుల తరబడి నీటిలోనే నానిపోతున్నది. ఇప్పుడిప్పుడే పంట చేలల్లోని నీరు బయటకు పోతున్న తరుణంలో లెహర్ వర్షాలతో పంటపై రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు. ఈదురు గాలులు కూడా తోడవడంతో వరి పూర్తిస్థాయిలో నేలకొరిగింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు కలవరపడుతున్నారు. మత్స్యకారుల అవస్థలు వరస తుపానులతో తీరప్రాంత మత్స్యకారులు తల్లడిల్లుతున్నారు. మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పుతోపాటు సముద్రం వేటకు అనుకూలంగా లేకపోవడం, పెనుతుపాను హెచ్చరికల నేపథ్యంలో తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులంతా సుమారు 320 పడవలను అడవిపల్లిపాలెంలోని ఈపూరుపాలెం డ్రెయిన్లో లంగరు వేసి నిలిపేశారు. మూడు నెలలుగా వేట సాగక తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను సమయంలో హెచ్చరికలు జారీచేసే అధికారులు రెక్కాడితే కాని డొక్కాడని తమ గురించి పట్టించుకోవడం లేదన్నారు. వరసగా పదిరోజుల పాటు వేటాడిన రోజులు లేవన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement