-
న్యాయవిచారణ కోసం మంత్రి పదవినుంచి తొలగించాలి
సూర్యాపేట : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జగదీష్రెడ్డిపై న్యాయ విచారణ కోసం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని కరీనంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్చేశారు. గురువారం సూర్యాపేట కోర్టుకు హాజరైన అనంతరం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి నివాసం ఎదుట ఆయన విలేకరులతో మాట్లాడారు. అవినీతి రహిత పరిపాలన అందించడానికి హిట్లర్ను అని చెప్పిన సీఎం ఎలాంటి ఆరోపణలు రాకపోయినా దళితుడైన రాజయ్యను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జగదీష్రెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. ఈనెల 28న లోకాయుక్త విచారణకు హాజరై ఆధారాలను చూపించనున్నట్లు పేర్కొన్నారు. మంత్రి తన పది నెలల కాలంలో ప్రజా వ్యతిరేకిగా ముద్రపడడం వల్లనే సూర్యాపేటలో కరపత్రాలు వెలువడడం, ల్యాండ్ మాఫియా, అవినీతి పరులకు అండగా నిలుస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ మంత్రి జగదీష్రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై సీఎం ఎందుకు న్యాయ విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో సబ్సిడీపై 129 ట్రాక్టర్లు రైతులకు అందించగా.. అందులో అధికార పార్టీకి చెందిన 94 మందికి ట్రాక్టర్లు ఇచ్చారని తెలిపారు. దీనిపై సీఎం, విజిలెన్స్కు లేఖలు రాసినా కూడా ఏ మాత్రం స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. తక్కువ ధర కలిగిన నాసిరకమైన ట్రాక్టర్లు తెచ్చి వాటికి రూ. 9 లక్షల ధరలుగా నిర్ణయించి రైతులకు అంటగడ్డం ఎంతవరకు సమంజసమన్నారు. వాటర్ గ్రిడ్ పనుల్లో ఆంధ్రాకు చెందిన వారికి ఏ విధంగా కాంట్రాక్టర్లు ఇచ్చారని సీఎంను ప్రశ్నించారు. పొన్నంపై వేసిన పరువు నష్టం కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రికి హితవుపలికారు. పొన్నంకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, మంత్రి జగదీష్రెడ్డి చేసిన అవినీతిని నిరూపించడానికి పార్టీ సిద్ధంగా ఉందన్నారు. డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ వారం రోజులుగా జిల్లాలో వడగండ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి మాట్లాడుతూ కోర్టుకు హాజరు కానున్న పొన్నం ప్రభాకర్కు పార్టీ పరంగా శాంతియుతంగా ఆహ్వానం పలికేందుకు ముందుగానే పోలీసులను అనుమతి కోరగా.. అనుమతులు ఇవ్వకుండా రాజకీయం చేయడం న్యాయమాఅని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, పోతు భాస్కర్, తూముల భుజంగరావు, తండు శ్రీనివాసయాదవ్, చకిలం రాజేశ్వరరావు, గోపగాని వెంకటనారాయణగౌడ్, రవిబాబు, అబ్దుల్హ్రీం, బైరు వెంకన్నగౌడ్, అమ్జద్షాహీన్బేగం, షేక్ బాషా, అంగిరేకుల నాగార్జున, అయూబ్ఖాన్, అబూబకర్సిద్దీఖ్, నగిరె పిచ్చమ్మ, మంజుల, సువర్ణ, అన్నపూర్ణ, కిషోర్బాబు, మధు తదితరులు పాల్గొన్నారు. -
సూర్యాపేట కోర్టుకు హాజరైన పొన్నం, జగదీష్రెడ్డి
సూర్యాపేట : రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్పై ఫిబ్రవరి 26న పరువునష్ట దావా వేసిన కేసు విషయంలో విచారణ నిమిత్తం పొన్నం ప్రభాకర్ గురువారం సూర్యాపేట కోర్టుకు హాజరయ్యారు. ఆయనకు న్యాయస్థానం కేసుకు సంబంధించిన కాగితాలు అందజేసింది. ఫిర్యాదు దారుడైన మంత్రి జగదీష్రెడ్డి కూడా ఉదయం 10.30గంటలకు కోర్టుకు హాజరయ్యారు. సూర్యాపేట ప్రథమ శ్రేణి న్యాయమూర్తి డి.కిరణ్కుమార్ జూన్ 3వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఇరువురు కోర్టు హాల్ నుంచి వెళ్లిపోయారు. మంత్రి తరుపున న్యాయవాదులు గ్రంథి వెంకటేశ్వర్లు, గుడిపూడి వెంకటేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్ వెంట న్యాయవాదులు టేకులపల్లి శ్రీనివాసరావు, నూకల సుదర్శన్రెడ్డిలు ఉన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement