-
అందరూ మహానటులే
‘‘నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావుగార్లు ధ్రువతారలు. ఏ వేడుకలకు పిలిచినా వచ్చేవారు. అవార్డులు ఇస్తే తీసుకునేవారు. కానీ నేటి తరంలో కొందరు కళాకారులు పబ్లిక్లోకి వచ్చి అవార్డులు అందుకోవడం వల్ల తమ గౌరవం తగ్గిపోతుందన్నట్లుగా భావిస్తున్నారు. అది సరైనది కాదు. వారు ఎన్టీఆర్, ఏయన్నార్ల క్రమశిక్షణను ఫాలో కావాలని కోరుకుంటున్నాను’’ అని కళాబంధు, టీఎస్సార్ లలిత కళాపరిషత్ వ్యవస్థాపకులు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయన జన్మదిన వేడుకలు ఈ నెల 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘అభినయ మయూరి’ అనే బిరుదుతో ప్రముఖ నటి జయసుధను సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాల గురించి హైదారాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలామంది సినిమాను, కళాకారులను అపార్థం చేసుకుంటుంటారు. నిజం చెప్పాలంటే సినిమాల్లో ఉన్న దైవశక్తి ఇంకెందులోనూ లేదు. నటీనటులు, దర్శకులు, రచయితలు, గాయకులు.. ఇలా అందరూ కలిస్తేనే మనం సినిమాను ఎంజాయ్ చేయగలుగుతున్నాం. నేను సంతోషంగా ఉండటానికి కారణం కళాకారులను ప్రోత్సహించుకోవడమే. కళని ఒక ఈశ్వరశక్తిగా భావించే వ్యక్తిని నేను. గత ఏడాది జమునగారిని సన్మానించాం. ఈ ఏడాది ఈ నెల17న ‘అభినయ మయూరి’ బిరుదుతో జయసుధగారిని సత్కరిస్తున్నాం. దాదాపు 46ఏళ్ల సినిమా ప్రస్థానం ఉన్న ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకస్థానం ఏర్పరచుకున్నారు. మనమందరం గర్వించదగ్గ నటీమణి ఆమె. 16న ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది’’ అన్నారు. ‘‘తిరుపతి’ సినిమాలో నేను, జయసుధగారు కలిసి నటించాం. ‘జ్యోతి’ సినిమాతో ఆమెకు పెద్ద పేరు వచ్చింది. సుబ్బరామిరెడ్డిగారు జయసుధగారికి ఈ అవార్డు ఇవ్వబోతుండటం సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో అవార్డు ఫంక్షన్స్ను కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. ప్రభుత్వం తరఫు అవార్డులు ఇవ్వడం లేదు. నంది అవార్డుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే అవార్డు అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటి ప్రభుత్వమైనా గుర్తించి అవార్డులను ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సుబ్బరామిరెడ్డిగారికి కళలన్నా, కళాకారులన్నా మంచి అభిమానం. మహానటి అంటే మనమందరం ఒకరే అనుకుంటాం. కానీ అందరూ మహానటులే. లేకపోతే ఒక ఆర్టిస్టుగా ఎక్కువ కాలం నిలబడలేం. జమునగారి నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నాను. గొప్పనటి జమునగారు నన్ను మహానటి అని పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోకాలంగా కష్టపడుతున్నందుకు కళాకారులకు అవార్డులనేవి గుర్తింపు. కొన్ని అవార్డ్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులను పక్కన పెట్టేశాయి. అవార్డ్స్ ఇవ్వండి.. మీరే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? వేడుకలకు, ప్రారం భోత్సవాలకు, స్వచ్ఛంద సేవ, సామాజిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటాం. స్వచ్ఛభారత్ అంటూ ఊడ్చుతాం. ఇలా అన్నీ చేస్తాం. మమ్మల్ని గుర్తించి అవార్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇండస్ట్రీలో ఇద్దరు సోదరులు.. ఒకరు మురళీమోహన్గారు, మరొకరు మోహన్బాబుగారు. వీరితో ఎన్నో సినిమాలు చేశాను’’ అన్నారు. ‘‘ఇంతమంది కళాకారులను ప్రోత్సహిస్తూ తనకు సినిమాల పట్ల, సినిమా పరిశ్రమల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు సుబ్బరామిరెడ్డిగారు. కళాకారులను మర్చిపోకుండా గౌరవిస్తున్నారు. మురళీమోహన్గారు అందాల హీరో. ఆయన ఇప్పుడు తెల్ల జుత్తుతో ఉంటే మాకు నచ్చడం లేదు (నవ్వుతూ). ‘పండంటి కాపురం’ సినిమాలో నా కూతురిగా నటించారు జయసుధ. మా అమ్మాయి నటిగా ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నటి జమున. -
‘...అందకపోతే కాళ్లు చంద్రబాబు నైజం’
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజమని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి విమర్శించారు. హైదరాబాద్ వస్తే నరేంద్ర మోదీని అరెస్టు చేయిస్తామని గతంలో హెచ్చరించిన చంద్రబాబే మోదీ కాళ్లకు మొక్కారని, ఆయన దేనికైనా సమర్థుడని నారాయణస్వామి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రధాని మోదీ కాళ్లకు మొక్కుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని ఆయన తెలిపారు. సోషల్మీడియాలో కనిపిస్తున్న ఫొటోలను నారాయణస్వామి మీడియాకు విడుదల చేశారు. తప్పుడు ప్రచారం చేయొద్దు సభలో ప్రధానమంత్రికి విజయసాయిరెడ్డి పాదాభివందనం చేయకపోయినా చేసినట్లు తప్పుడు ప్రచారం సాగించడం సరైంది కాదు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు నమస్కారం పెట్టడం మామూలే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేను కూడా మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీకి నమస్కరించా. పెద్దలకు నమస్కారం చేయడం మన భారతీయ సంప్రదాయం, సంస్కృతిలో భాగం. – టి.సుబ్బిరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ సభలో విజయసాయిరెడ్డి కనిపించలేదు సభలో ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చే వరకూ మేమంతా కామ్గా ఉంటామని, ఆ తర్వాత నిరసన కొనసాగిస్తామని తెలియజేశాం. ప్రధానమంత్రి సభలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారో కూడా కనిపించలేదు. నేను ప్రధానమంత్రికి నమస్కారం పెట్టానో లేదో నాకైతే గుర్తులేదు. పెద్దవాళ్లు వస్తూ పోతూ ఉన్నప్పుడు నమస్కారం, ప్రతి నమస్కారం అనేది మన సంస్కారం. అది భారతదేశ సంస్కృతి. పెద్దవాళ్లు కనిపిస్తే దగ్గరికెళ్లి నమస్కారం పెడతాం. అది సహజం, అందులో తప్పులేదు. – సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ -
ఆశాభోస్లేకు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు
భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధం తోనే యశ్ చోప్రా తనువు చాలించిన తరువాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుంచి నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును సినీ ప్రముఖులకు అందజేస్తున్నారు. 2017 సంవత్సరానికి గానూ ఈ అవార్డును ప్రముఖ నేపథ్య గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఆశాభోస్లేకు ఇవ్వనున్నారు. శనివారం ముంబైలో సమావేశమైన టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు సర్వశ్రీ బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి, ఆశాభోస్లే పేరును నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు. గతంలో ఈ అవార్డును లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017'ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. 1933లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ వయసులోనే నేపథ్య గాయనిగా తన కెరీర్ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలను ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్' మరో మైలు రాయిగా నిలువబోతోంది. -
వైభవంగా టీయస్సార్ అవార్డుల వేడుక
ఇటు దక్షిణాది అటు ఉత్తరాది.. ఏ ప్రాంతమైతేనేమి.. కళాకారులందరూ ఒక్కటే. అయితే అందర్నీ ఒకే వేదిక మీద చూస్తే సినీప్రియులకు కలిగే ఆనందమే వేరు. శనివారం సాయంత్రం వైజాగ్లో జరిగిన ‘టీయస్సార్’ అవార్డుల వేడుక అలాంటి ఆనందాన్నే కలిగించింది. 2015, 2016 సంవత్సరాలకు గాను పలువురు కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు.కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత వైభవంగా ఈ వేడుక నిర్వహించారు. 2015లో... ♦ ఉత్తమ నటుడు: వెంకటేశ్ (గోపాల గోపాల) ♦ కథానాయకుడు: అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి) ♦ నటి: శ్రియ (గోపాల గోపాల) ♦ కథానాయిక: రకుల్ప్రీత్ సింగ్ (బ్రూస్ లీ, పండగ చేస్కో) ♦ తొలి చిత్రకథానాయకుడు: ఆకాశ్ పూరి (ఆంధ్రాపోరి) ♦ తొలి చిత్రకథానాయిక: ప్రగ్యా జైస్వాల్ (కంచె) ♦ దర్శకుడు: గుణశేఖర్ (రుద్రమదేవి) ♦ చిత్రం: కంచె ♦ ప్రతినాయకుడు: ముఖేశ్ రుషి (శ్రీమంతుడు) ♦ సహాయ నటి : నదియ (బ్రూస్ లీ) ♦ హాస్యనటుడు: అలీ (సన్నాఫ్ సత్యమూర్తి) ♦ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (సన్నాఫ్ సత్యమూర్తి) ♦ గాయకుడు: దేవిశ్రీ ప్రసాద్ (సూపర్ మచ్చి... సన్నాఫ్ సత్యమూర్తి) ♦ గాయని: యామిని (మమతల తల్లి... బాహుబలి) 2016లో... ∙ఉత్తమ నటుడు: నాగార్జున (సోగ్గాడే చిన్ని నాయనా) ∙కథానాయకుడు: బాలకృష్ణ (డిక్టేటర్) ∙స్పెషల్ జ్యూరీ బెస్ట్ యాక్టర్ : రామ్చరణ్ (ధృవ) ∙స్పెషల్ జ్యూరీ పాపులర్ ఛాయిస్: నాని (జెంటిల్మన్) ∙నటి: రకుల్ప్రీత్ సింగ్ (ధృవ, నాన్నకు ప్రేమతో) ∙కథానాయిక: కేథరిన్ త్రేసా (సరైనోడు) ∙తొలి చిత్రకథానాయిక: నివేదా థామస్ (జెంటిల్మన్) ∙దర్శకుడు: సురేందర్రెడ్డి (ధృవ) ∙చిత్రం: ఊపిరి ∙హాస్యనటుడు: బ్రహ్మానందం (బాబు బంగారం) ∙సంగీత దర్శకుడు: ఎస్.ఎస్. తమన్ (సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు) ∙గాయకుడు : శ్రీకృష్ణ (జెంటిల్మన్) ∙గాయని: ప్రణవి (జెంటిల్మన్) ‘స్పెషల్ జ్యూరీ అవార్డు’ విజేతలు ∙మిలీనియమ్ స్టార్ అవార్డ్ – హీరో శత్రుఘ్న సిన్హా ∙మిలీనియమ్ స్టార్ అవార్డ్ – హీరోయిన్ హేమమాలిని ∙సెన్సేషనల్ స్టార్ అవార్డ్ – జాకీ ష్రాఫ్ ∙5 దశాబ్దాల స్టార్ అవార్డ్ – కృష్ణంరాజు ∙4 దశాబ్దాల స్టార్ అవార్డ్ – మోహన్బాబు ∙జీవిత సాఫల్య పురస్కారం – సంగీతదర్శకుడు బప్పీ లహరి ∙స్పెషల్ జ్యూరీ అవార్డ్ – రేవంత్ (ఇండియన్ ఐడల్ విన్నర్) 2015, 16 సంవత్సరాలకు గాను స్పెషల్ జూరీ అవార్డులు ∙నేషనల్ స్టార్: ప్రభాస్ (బాహుబలి) ∙బెస్ట్ ఫర్ఫార్మెన్స్: రానా (బాహుబలి) ∙మాస్ ఎంటర్టైనర్: కల్యాణ్రామ్ (పటాస్) ∙బెస్ట్ యాక్ట్రెస్: మంచు లక్ష్మి (దొంగాట) ∙బెస్ట్ హీరోయిన్: హెబ్బా పటేల్ (కుమారి 21ఎఫ్) ∙బెస్ట్ డైరెక్టర్: క్రిష్ (కంచె) ∙బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ (లయన్) ∙సింగర్ (మేల్): సింహ (దిమ్మ తిరిగే.. శ్రీమంతుడు) ∙స్పెషల్ అప్రిషియేషన్ హీరో: నాగచైతన్య (ప్రేమమ్) ∙బెస్ట్ డైరెక్టర్: ఇంద్రగంటి మోహనకృష్ణ (జెంటిల్మన్) ∙బెస్ట్ ఆల్రౌండర్ యాక్టర్: రాజేంద్ర ప్రసాద్ (నాన్నకు ప్రేమతో) ∙స్పెషల్ అప్రిషియేషన్ యాక్టర్: శర్వానంద్ (ఎక్స్ప్రెస్ రాజా) ∙స్పెషల్ అప్రిషియేషన్ హీరో: నారా రోహిత్ (జ్యో అచ్యుతానంద) ∙బెస్ట్ ప్రామిసింగ్ హీరో: విజయ్ దేవరకొండ (పెళ్ళి చూపులు) ∙బెస్ట్ ప్రోగ్రెస్సివ్ ఫిల్మ్: పెళ్ళి చూపులు ∙బెస్ట్ అప్కమింగ్ యాక్టర్: దీపక్ సరోజ్ (మిణుగురులు) ∙బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: మాస్టర్ ఎన్టీఆర్ (ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ కుమారుడు – దాన వీర శూర కర్ణ) ∙బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్: దాన వీర శూర కర్ణ ∙స్పెషల్ అప్రిషియేషన్ డైరెక్టర్: బాబ్జి (రఘుపతి వెంకయ్య) ∙సింగర్ (ఫీమేల్): సమీర (తెలుసా తెలుసా... సరైనోడు) ∙బెస్ట్ యాక్టర్ (తమిళ్): మాధవన్ ∙బెస్ట్ యాక్ట్రెస్ (తమిళ్): హన్సిక ∙బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ): ప్రియమణి ∙బెస్ట్ డెబ్యూ యాక్టర్ (కన్నడ): నిఖిల్ గౌడ ∙బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ (హిందీ): సోనాల్ చౌహన్ ∙బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ (హిందీ): ఊర్వశీ రౌతెల -
ప్రేక్షకుల ఆనందమే నాకు కొండంత బలం
‘‘కళలను ఎంతో అభిమానిస్తాను. కళాకారులను ప్రోత్సహించి అభినందించడం గొప్ప అదృష్టం. అందుకే ‘టీయస్సార్’ అవార్డులను స్టార్ట్ చేశాం. అవార్డు గ్రహీతల ఎంపిక విషయంలో సొంత నిర్ణయాలకు తావు లేకుండా ప్రజాభిప్రాయాన్నే అంతిమ తీర్పుగా జ్యూరీ సభ్యులు పాటించారు’’ అని ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. ‘టీయస్సార్’ జాతీయ అవార్డుల వేడుక ఈ నెల 8న విశాఖపట్నంలో జరగనుంది. విజేతల పేర్లు ప్రకటించేందుకు గురువారం హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ –‘‘టీయస్సార్ అవార్డులు జాతీయ స్థాయిలో నంబర్ వన్గా నిలవాలనేది నా కల. తెలుగువారికి జాతీయ స్థాయిలో గౌరవం లభించాలి. తెలుగువారు ఇంత పెద్ద ఫంక్షన్ చేసారే అని హిందీవాళ్లు ఆశ్చర్యపోవాలి. ఈ అవార్డుల్లో రెండు రకాలు ఉన్నాయి. ప్రేక్షకులు కొన్ని ఎంపిక చేయగా, మరికొన్ని అవార్డులను జ్యూరీ మెంబర్స్ ఎంపిక చేశారు. మంచి సినిమాల సంఖ్య పెరగడంతో ఈసారి అవార్డుల సంఖ్య పెరిగింది. ఈ ప్రోగ్రామ్ను చూసేందుకు ప్రేక్షకులు ఇబ్బందిపడకుండా నిమిషాల వ్యవధిలో అన్ని ఛానెల్స్లో ప్రసారం అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సుబ్బిరామిరెడ్డికి డబ్బు ఎలా వస్తుందని కొందరు అనుకుంటారు. రాత్రికి రాత్రే నేను ధనవంతుణ్ని కాలేదు. 50 ఏళ్లకు పైగా అన్ని రంగాల్లో వ్యాపారవేత్తగా కష్టపడుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందు మనసు రావాలి, ఏకాగ్రత కుదరాలి, కృషి ఉండాలి. అప్పుడే చేయగలం. ప్రేక్షకులు ఈ ప్రోగ్రామ్ చూసి, ఎంజాయ్ చేస్తారు. వారి ఆనందమే నాకు కొండంత శక్తిని ఇస్తుంది’’ అని అన్నారు. జ్యూరీ సభ్యులు రఘురామ కృష్ణమ్రాజు, బి.గోపాల్, ఆర్.వి ప్రసాద్, పింకీరెడ్డి, విక్రమ్ పాల్గొన్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
Advertisement