-
7న బీసీ పారిశ్రామిక వేత్తల సమ్మేళనం
పంజగుట్ట: రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నగరం ఆబిడ్స్ లోని తాజ్మహల్ హోటల్లో సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ పారిశ్రామిక వేత్తల సమాఖ్య తెలిపింది. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పారిశ్రామికవేత్తల సమ్మేళనం పోస్టర్ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి వకుళాభరణం కృష్ణమోహన్, సమాఖ్య చైర్మన్ మర్రి ప్రభాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ పారిశ్రామికవేత్తలను, కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులను ఒకే చోట సమావేశపరచి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణలో బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం రూపొందించి ప్రోత్సహించాలన్నారు. -
‘గే’ల మధ్య గలాటా
యువకుడి దుర్మరణం నిందితుడు రిటైర్డ్ డిప్యూటీ డెరైక్టర్ హిమాయత్నగర్: విచక్షణ మరిచిన ఓ రిటైర్డ్ ఉన్నతాధికారి తీరు సభ్య సమాజం తలదించుకొనేలా చేసింది. పదుగురికి స్ఫూర్తిగా నిలవాల్సిన ఆయన వికృత చేష్టలు ఓ నిండుప్రాణం గాలిలో కలసిపోయేలా చేసింది. ‘తోడు’ కోసం తెచ్చుకున్న ఓ యువకుడిని మూడో అంతస్తు పైనుంచి తోసేయడంతో దుర్మణం పాలయ్యాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన నారాయణగూడ లింగంపల్లిప్రాంతంలో సంచలనం సృష్టించింది. పోలీసుల వివరాల మేరకు...పరిశ్రమల శాఖ (చిరాక్ అలీలేన్)లో డిప్యూటీ డెరైక్టర్గా వి. నరసింహారావు 2011లో పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన ఓ న్యాయవాది వద్ద స్టెనో కం టైపిస్టుగా పనిచేస్తున్నారు. న్యాయవాది కార్యాలయం నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని లింగంపల్లికి చెందిన అన్నపూర్ణ ఏఎస్ఎన్ రెసిడెన్సీ 3వ అంతస్తులో ఉంది. పని ఎక్కువగా ఉండటంతో సోమవారం రాత్రి 10 గంటల వరకూ కార్యాలయంలోనే ఉన్నారు. తర్వాత అబిడ్స్లోని తాజ్మహల్ హోటల్ వద్దకు వెళ్లారు. వాస్తవానికి నరసింహారావు స్వలింగసంపర్కుడు (గే). అక్కడ గుర్తు తెలియని యువకుడు పరిచయమయ్యాడు. రాత్రి నరసింహారావుతో ఉండేందుకు వారి మధ్య ఒప్పందం కుదిరింది. అక్కడ నుంచి వారు న్యాయవాది కార్యాలయానికి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. తన కోరిక తీర్చలేదంటూ ఆ యుకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడో అంతస్తుపై నుంచి తోసేశాడు నరసింహారావు. ఆ యువకుడు కాంపౌండ్వాల్పై పడిపోయాడు. రాత్రి విధులు నిర్వర్తిస్తున్న నారాయణగూడ పోలీసులు అటుగా వచ్చి పైనుంచి పడిన యువకుడ్ని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే యువకుడు చనిపోయాడు. పోలీసులు నరసింహారావును అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం మంగళవారం సాయంత్రం రిమాండ్కు తరలించారు. అయితే మృతి చెందిన యువకుడు కూడా ‘గే’గానే అనుమానిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement