-
కొత్తగా మూడు దేశాలకు ఐసీసీ సభ్యత్వం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్తగా మూడు దేశాలకు సభ్యత్వం ఇచ్చింది. దీంతో ఐసీసీ సభ్య దేశాల సంఖ్య 106కు చేరింది. ఆసియా ఖండం నుంచి మంగోలియా, తజకిస్థాన్.. యూరప్ నుంచి స్విట్జర్లాండ్కు ఐసీసీ సభ్యత్వాలు ఇచ్చింది. ఆదివారం వర్చువల్గా జరిగిన 78వ సర్వసభ్య సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్తగా సభ్యత్వం లభించిన దేశాలు వారి వారి ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడాలని ఐసీసీ సూచించింది. అందుకు అవసరమైన మద్దతు తమవైపు నుంచి ఉంటుందని హామీ ఇచ్చింది. Congratulations to Mongolia, Switzerland and Tajikistan, who are now among ICC's 94 Associate Members 👏Know more about their journeys 👉 https://t.co/33UFKEgNZr pic.twitter.com/sw54PsPBir— ICC (@ICC) July 18, 2021 -
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
భారత్, తజకిస్తాన్ ప్రతిన రక్షణ రంగంలో మరింత సహకారం.. పలు రంగాల్లో ఒప్పందాలు ఉగ్రవాద మూలాలున్న ప్రాంతానికి మన రెండు దేశాలు దగ్గర్లో ఉన్నాయన్న మోదీ దుషాంబె: ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్, తజకిస్తాన్ నిర్ణయించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమెమలి రెహ్మాన్ సోమవారం తజక్ రాజధాని దుషాంబెలో రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు సహా విస్తృత అంశాలపై చర్చలు జరిపారు. ప్రతిపాదిత ‘పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, తజకిస్తాన్ త్రైపాక్షిక వాణిజ్య, రవాణా ఒప్పందం’లో భారత్ను కూడా చేర్చే విషయంపైనా సంప్రదింపులు జరిపారు. అంతకుముందు వారిద్దరూ కలసి రవీంద్రనాథ్ టాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అన్యాపదేశంగా పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్లను ఉద్దేశిస్తూ.. ఉగ్రవాద మూలాలు బలంగా ఉన్న ప్రాంతానికి భారత్, తజకిస్తాన్లు అత్యంత సమీపంలో ఉన్నాయని మోదీ వ్యాఖ్యానించారు. అఫ్ఘాన్తో తజకిస్తాన్ కూడా సరిహద్దును పంచుకుంటోంది. అఫ్ఘాన్లో శాంతియుత, సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్న అక్కడి ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు భారత్, తజక్లు సహకరిస్తాయని మోదీ అన్నారు. వాణిజ్యాభివృద్ధికి రెండు దేశాల మధ్య మెరుగైన అనుసంధానత ఆవశ్యకమన్నారు. తజక్లో జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణంలో సహకరించాలని తజక్ అధ్యక్షుడు మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు సంస్కృతి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తజకిస్తాన్లో ఏర్పాటు చేసిన ఇండియా - తజక్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ను మోదీ సందర్శించారు. అందులో భారతీయ వైద్యులు తజక్ సైనికులకు, పౌరులకు వైద్యసేవలందిస్తున్నారు. మోదీ, రెహ్మాన్ల చర్చల అనంతరం ఇరుదేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. అందులోని ముఖ్యాంశాలు.. ►{పపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రబలుతూ.. భారత్, తజకిస్తాన్లకు ముప్పుగా పరిణమించాయి. ►ఉగ్రవాదంపై పోరులో భాగంగా జాయింట్ వర్కింగ్ గ్రూప్ను ప్రారంభించి, త్వరగా అధికారస్థాయి చర్చలు మొదలుపెట్టాలి. ►రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన రక్షణ రంగ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. ►తజకిస్తాన్లో భారత్ ద్వారా టెలీ మెడిసిన్ ప్రాజెక్టు రూపకల్పన, అమలు. పరస్పర వ్యవ‘సాయం’: వ్యవసాయంలో పరస్పర సహకారానికి సంబంధించి ఏర్పాటు చేసిన సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. సాగు అనుభవాల్ని, శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రజ్ఞులను, సమర్థ జల వినియోగ పద్ధతులను.. పంచుకోవడం ద్వారా ఈ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలన్నారు. 17వ శతాబ్దానికి చెందిన పర్షియన్ కవి అబ్దుల్ ఖాదిర్ బెదిల్ సమాధి ‘బాఘ్ ఇ బెదిల్’ సూక్ష్మ చిత్రాన్ని మోదీ తజక్ అధ్యక్షుడికి బహూకరించారు. 1644లో భారత్లోని పాట్నాలో జన్మించిన బెదిల్ను తజకిస్తాన్లో గొప్ప పర్షియన్ కవిగా పరిగణిస్తారు. ఆరు దేశాల్లో 8 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని మోదీ సోమవారం రాత్రి స్వదేశానికి బయల్దేరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement