-
ఇళయ దళపతికి గాలం
ఇళయ దళపతి విజయ్కి గాలం వేసే పనిలో పడింది కప్పల్ కథానాయికి సోనం బాజ్వా. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో రాణించాలని ఆకాంక్షించే ఉత్తరాది బ్యూటీస్ జాబితాలో చేరిందీ భామ. ఆమె మాట్లాడుతూ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించానంది. అలా సినీ అవకాశాలు వరించినట్లు చెప్పింది. పంజాబిలో బెస్ట్ ఆఫ్ లక్, పంజాబ్ 1984 చిత్రంలో నాయికగా నటించానని పేర్కొంది. తర్వాత తమిళంలో కప్పల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిం దని తెలిపింది. ఈ చిత్రంలో చాలా ఎంజాయ్ చేస్తూ నటించానని వెల్లడించింది. చిత్ర యూనిట్ సహకారం మరువలేనిదంది. కప్పల్ చిత్రంలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చిందని, ఇక్కడ తొలి చిత్రమే విజయం సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. కోలీవుడ్లో విజయ్ సరసన నటించడానికి ఆశగా ఎదురుచూస్తున్నానని అసలు విషయం చెప్పింది. కప్పల్ చిత్రం తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయని, వాటి వివరాలు త్వరలోనే చెబుతానని తెలిపింది. -
తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు
‘‘తమిళ చిత్ర పరిశ్రమలో డబ్బు లేదు. ఇక్కడ రొటేషన్ మాత్రమే జరుగుతోంది అలాంటిది లేనిపోని దుమారాలు రేపి మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేయకండి’’ అని సీనియర్ నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి రాధారవి వ్యాఖ్యానించారు. ఆదివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ నాలుగు చిత్రాల కార్యక్రమాలకు వేదికైంది. అందులో ఒకటి నటుడు, శరత్కుమార్ నాయకుడిగా, ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన చండమారుతం చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం. నటుడు ధనుష్ నటిస్తున్న మారి, విక్రమ్ ప్రభు నటిస్తున్న ఇదు ఎన్న మాయం, వర్ధమాన నటుడు బాలు సింహ హీరోగా నటిస్తున్న పాంబుసట్టై తదితర మూడుచిత్రాల పరిచయ కార్యక్రమాలు జరిగారుు. చండమారుతం చిత్రంలో శరత్కుమార్ సరసన ఓవియ, మీరానందన్ నటిస్తున్నారు. ఎ.వెంకటేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్కుమార్ కథ, కథనం, సమకూర్చడంతో పాటు రాధికా శరత్కుమార్ లిస్టింగ్ స్టీఫెన్తో కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టడం విశేషం. జేమ్స్ వసంతన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియోను నిర్మాత ఆర్బి చౌదరి ఆవిష్కరించగా శరత్కుమార్, ధనుష్ తదితర చిత్ర యూనిట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాధారవి మాట్లాడుతూ కోట్లు వెచ్చించి రూపొందిస్తున్న చిత్రాలపై కొందరు విడుదలైన తొలిరోజునే దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. రజనీకాంత్ వంటి సూపర్స్టార్ నటించిన లింగా చిత్రంపై కూడా ఇలాంటి ప్రచారం జరుగుతోందన్నారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి రూపొందించిన ఆ చిత్రంలో అది బాగోలేదు, ఇది సరిగా లేదు, ఇది మూడు గంటలు సాగే కథ అంటూ దుమారం రేపుతున్నారన్నారు. ఇలాంటివి సినిమా పరిశ్రమకు మేలు చేయదన్నారు. వందలమంది శ్రమను పైరసీలతో దోచుకుంటున్నారన్నారు. దయ చేసి పైరసీని ప్రోత్సహించకండి అని పేర్కొన్నారు. ఒక వేదికపై నిర్వహించిన ఈ నాలుగు చిత్రాలను మ్యాజిక్ ఫ్రేమ్స్ సంస్థలు నిర్మించడం విశేషం. -
సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ నటిస్తా
అనారోగ్యాన్ని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సినిమాల్లో నటిస్తానని సీనియర్ నటీమణి మనోరమ దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో అందరూ అభిమానంగా ఆచ్చి అని పిలుచుకునే గొప్పనటి మనోరమ. ఎంజీఆర్, శివాజీగణేశన్ల కాలం నుంచి నటనే జీవితంగా ముందుకు సాగుతున్నారు. మనోరమ సుమారు 1200కు పైగా చిత్రాల్లో నటించారు. నాయికగా, ముఖ్య పాత్రధారిగా, హాస్యపాత్రధారిగా, ప్రతినాయకిగా ఇలా ఆమె పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. మనోరమ నటించారంటే ఆ పాత్రకు పరిపూర్ణత చేకూరినట్లే. మనోరమ హాస్యం పోషించారంటే ఆ చిత్రంలో నవ్వు లు విరబూయాల్సిందే. అంత అంకితభావం తో ఆమె నటిస్తారు. అలాంటి నటీమణి కొం తకాలం క్రితం బాత్రూమ్లో కాలుజారి పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తరువాత వెన్నునొప్పి, మూత్రనాళ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి పొందుతు న్న మనోరమ మళ్లీ మూత్రనాళ సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల తన కూతురు వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికి మనోరమ ఇంటికి వెళ్లినప్పుడు ఆమె దయనీయ పరిస్థితి చూసి బాధేసిందంటూ వాపోయారు. మనోరమకు తగిన వైద్య చికి త్స అందిస్తే ఆమె మరిన్ని చిత్రాల్లో నటిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మనోరమను కాపాడుకోవలసిన బాధ్యత ఆమె అభిమానులైన సినీ ప్రముఖలందరికీ ఉందంటూ ప్రకటించారు. మనోరమ ఒక తమిళ పత్రికకు ఇచ్చిన భేటీని చూద్దాం... ‘నేను సినిమా రంగ ప్రవేశంచేసి 50 ఏళ్లు దాటింది. మొట్టమొదటిసారిగా సింహళ భాషా చిత్రంలో నటించాను. తమిళంలో ముల్లైతొట్ట మంగై చిత్రం లో పరిచయమయ్యాను. దివంగత ప్రఖ్యాత రచయిత కన్నదాస్ నన్ను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. ఆ తరువాత వరుసగా అన్ని భాషల్లోనూ నటించాను. ప్రస్తుతం పేరాండి అనే చిత్రంతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తున్నాను. కొన్ని నెలలుగా బయటకు వెళ్లడం లేదు. అలాంటిది సీనియర్ నటుడు ఎస్ఎస్ రవిచంద్రన్ కన్నుమూశారన్నవార్త విని ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి వచ్చాను. నా ఆరోగ్యం బాగుండలేదని తెలిసి కొందరు సినీ ప్రముఖులు ఫోన్ చేస్తూ పరామర్శిస్తున్నారు. ఎంజీఆర్ జ్ఞాపక చిహ్నం, శివాజీ గణేశన్ ఇల్లు చూడడానికి వచ్చే అభిమానులు నన్ను చూడడానికి వస్తుంటా రు. ఇది నాకెంతో మనశ్శాంతిని కలిగిస్తున్న విష యం. కమలహాసన్ జన్మదినం నాడు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. అప్పుడు కమ ల్ అమ్మలేని కొరతను తీర్చారు అని అన్నారు. ప్రస్తుతం షూటింగ్లకు వెళ్లడం లేదు. ఇప్పుడిక నాకు కాలక్షేపం టీవీనే. నేను నటించిన పాత చిత్రాల సన్నివేశాలను చూస్తుంటే నాటి మధుర జ్ఞాపికలు గుర్తుకొస్తుంటాయి. నా కొడుకొకసారి నీ ఒంట్లో విషం చేరుతోందని చెప్పారు. తను అన్నట్లు గానే ఇప్పుడు జరిగింది. నా ఈ పరిస్థితి అశాశ్వతమే. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నటిస్తాను’ అంటూ మనోరమ తన మనసులోని మాటను బయటపెట్టారు. -
విమల్తో మరోసారి
నటి అంజలి కోలీవుడ్లో మళ్లీ పాగా వేస్తోంది. ఇంతకుముందు అంగాడి తెరు, ఎంగేయుం ఎప్పోదు, కలగలప్పు వంటి చిత్రాలతో విజయాల బాట పట్టిన అంజలి అనూహ్యంగా తన పినతల్లితో మనస్పర్థలు కారణంగా హైదరాబాదుకు వెళ్లిపోయి తమిళ చిత్ర పరిశ్రమకు దూరమైంది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ తెలుగమ్మాయి తాజాగా మళ్లీ కోలీవుడ్పై దృష్టి సారించింది. ప్రస్తుతం సూరజ్ దర్శకత్వంలో జయం రవితో జతకడుతున్న అంజలికి మరో అవకాశం వచ్చింది. మాప్పిళ్లై సింగం అనే నూతన చిత్రంలో విమల్ సరసన నటించడానికి సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు తూంగానగరం, కలగలప్పు చిత్రాలు తెరకెక్కాయి. మూడోసారి విమల్తో రొమాన్స్కు సై అంది. ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ సంస్థ అధినేత మదన్ నిర్మించనున్నారు. ఇంతకు ముందు మాన్ కరాటే వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ఈయన ప్రస్తుతం ప్రభుసాల్మన్ దర్శకత్వంలో కయల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తదుపరి విమల్, అంజలిల మాపిళ్లైసింగం చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజశేఖర్ దర్శకత్వం వహించనున్నారు. -
ముద్దులతో రికార్డు సాధిస్తా
పెదవి ముద్దులతో రికార్డ్ సాధిస్తానంటోంది నటి రెజీనా. కోలీవుడ్ హీరోయిన్లకు అచ్చొచ్చిన సినిమారంగం అనవచ్చు. మలయాళ భామలు, ముంబయి బ్యూటీస్ దృష్టి ముందుగా దక్షిణాదిలో తమిళ చిత్ర పరిశ్రమ పైనే పడుతుంది. ఇక్కడ హీరోయిన్గా కాలుపెట్టి కాస్త పేరు తెచ్చుకుంటే చాలు ఇతర భాషల్లో బ్రహ్మరథం పట్టేస్తారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నా తాజాగా రెజీనా సినీ కెరీర్నే ఉదహరించవచ్చు. ఈ బ్యూటీ తమిళంలో కేడీ బిల్లా కిలాడీ రంగ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. అయినా రెజీనాకు ఇక్కడ మరిన్ని అవకాశాలు రాలేదు. అయితేనేం ఈ అమ్మడిపై టాలీవుడ్ దృష్టి పడింది. అక్కడ కొత్త జంట చిత్రంలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత రారా కృష్ణయ్య, పవర్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. పవర్ చిత్రంలో ఆ చిత్ర హీరో రవితేజతో లిప్లాక్ సన్నివేశాల్లో నటించి బోలెడు ప్రచారం పొందింది. తాజాగా నవ నటుడు, ప్రఖ్యాత నటుడు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ సరసన పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంలో ఆయన్ని లిప్లాక్లతో ముంచెత్తిందనే ప్రచారం హోరెత్తుతోంది. నటి రెజీనా ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ ఏదో ఒక విషయంలో ప్రశ్నలు గుప్పిస్తూ తనను నోరుజారే పరిస్థితికి తీసుకొస్తారని నిష్టూరం ఆడింది. మళ్లీ తనే మాట్లాడుతూ ఇంతకీ మీరడిగిన ప్రశ్న ఏమిటి లిప్లాక్ల విషయం గురించేనా? అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి చుంభనాల సన్నివేశాలలో నటించి రికార్డ్ కెక్కుతానని రెజీనా పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement