-
బీజేపీలో చేరిన భారత తొలి మహిళా రేసర్
భారత తొలి మహిళా రేసింగ్ నేషనల్ ఛాంపియన్ అలీషా అబ్దుల్లా (33) బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. తమిళనాడుకు చెందిన అలీషా.. శనివారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. బీజేపీ కుటుంబంలో చేరినందుకు సంతోషంగా ఉందని, రాష్ట్ర బీజేపీ బాస్ అన్నామలై కుప్పుస్వామి, అమర్ ప్రసాద్ రెడ్డి పిలుపు మేరకు తాను పార్టీలో చేరానని ఆమె ఈ సందర్భంగా పేర్కొంది. I’m happy to be apart of @BJP4TamilNadu family The reason I wanted to be apart of BJP is because of the recognition and respect @annamalai_kuppusamy sir and @amarprasadreddyofficial has 4me. I promise to do my best to uplift more women❤️🙏🏻 pic.twitter.com/ZP73A0So5p — Alisha abdullah (@alishaabdullah) September 3, 2022 తమ పిలుపు మేరకు అలీషా పార్టీలో చేరడం చాలా సంతోషాన్ని కలిగించిందని.. అలీషా చేరిక తమిళనాడు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నామలై, అమర్ ప్రసాద్ రెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అలీషా.. పురుషాధిపత్యం కలిగిన రేసింగ్ క్రీడలో విశేషంగా రాణించి భారత తొలి నేషనల్ రేసింగ్ ఛాంపియన్గా నిలిచింది. Very happy to welcome a true sporting icon & fabulous competitive racer, Selvi @alishaabdullah to @BJP4TamilNadu today. An inspiring woman who had broken barriers in a sport dominated by men, she has left an indelible mark in her chosen racing career. (1/2) pic.twitter.com/TpNSjompVm — K.Annamalai (@annamalai_k) September 3, 2022 చదవండి: సలాం 'సెరెనా విలియమ్స్'.. నీ ఆటకు మేము గులాం -
బీజేపీ నేత కారులో.. రూ. 20 లక్షల కొత్త నోట్లు!
తమిళనాడులో ఒక బీజేపీ యువ నాయకుడి కారులో రూ. 20 లక్షల విలువైన నగదు పట్టుబడింది. అందులో 900కు పైగా 2000 రూపాయల నోట్లున్నాయి. సేలం జిల్లా బీజేపీ యువజన విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్న జేవీఆర్ అరుణ్.. తన ఫేస్బుక్ పేజీలో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. మన దేశ ప్రగతి కోసం క్యూలైన్లలో నిలబడదామని కూడా పిలుపునిచ్చారు. అయితే, సేలం జిల్లాలో జరుగుతున్న సాధారణ చెకింగ్లోనే ఆయన పట్టుబడ్డాడు. ఆయన కారులోంచి రూ. 20.5 లక్షల విలువైన నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 2000 రూపాయల నోట్లు 926, 100 రూపాయల నోట్లు 1530, 50 రూపాయల నోట్లు 1000 చొప్పున ఉన్నాయి. మొత్తం నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని ట్రెజరీలో డిపాజిట్ చేశారు. ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందన్న విషయాన్ని అరుణ్ సంతృప్తికరంగా చెప్పలేకపోయారు. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలిపారు. బ్యాంకు అధికారులు ఎవరైనా అతడికి సహకరించారా, లేదా కమీషన్ పద్ధతిలో ఆ నోట్లు తీసుకున్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ బీజేపీ రాష్ట్రశాఖ అరుణ్కు షోకాజ్ నోటీసు జారీచేసింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement