-
కలాం స్పూర్తితో...
లక్ష్య సాధన కోసం ఆరుగురు చిన్నారులు అవరోధాలను జయించి విజయతీరం చేరుకునేందుకు చేసిన సాహసాలు ఏంటి? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. మహమ్మద్ అఫ్పాన్ సమర్పణలో హెడ్విజన్ ఇండియా పతాకంపై అనంతపురం ఫిల్మ్ సొసైటీ సహకారంతో రషీద్ బాషా దర్శకత్వంలో ఎన్. ఇబ్రహీం నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దర్మక-నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు చూపించాల్సిన చిత్రం ఇది. ‘దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగలం’ అన్న అబ్దుల్ కలాం ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ చిత్రం చేశాం. అందుకే ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచే చిత్రం అవుతుంది’’ అన్నారు. -
అంబేడ్కర్ని అర్థం చేసుకున్నామా?!
అంబేడ్కర్ ఇచ్చిన మూడు నినాదాలు educate, organise, agitate... అనేవి నేటికీ అవసరమవుతున్నాయంటే అవి నిత్య సత్యాలనుకోవాలో, మన అలసత్వానికి తలదించుకోవాలో తెలియకుండా ఉంది. బొజ్జా విజయభారతి అంబేడ్కర్ ఏ లక్ష్యసాధన కోసం తన జీవితసర్వస్వాన్నీ తన భక్తిజ్ఞాన వైరాగ్యాలనూ ధారబోశాడో ఈ దేశం ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా అర్థం చేసుకున్నదా? లేదు. educate.. అంటే సంతకం చేయటం నేర్పడం,organise కావటం అంటే గొర్రెలను... తోడేళ్లు, నక్కలూ చేరదీయటం.agitate అంటే ‘పోరాడు’ అనీ ఆందోళన చెయ్యి అనీ అనుకుంటున్నాం! సమాజంలో మానవకల్పితమైన అధర్మాలనూ అన్యాయాలనూ కొనసాగిస్తూనే ఉన్నాం. సమైక్య భావన ఎక్కడ? అన్ని సమస్యలకూ రాజకీయాలే మొదలూ తుదీ అవుతున్నప్పుడు రాజకీయ దౌర్జన్యాలను ఎదుర్కొనే పోరాటపటిమ ఎక్కడ? మతాలు మనుషులకు నీతినియమాలు బోధించాయి. ఊహా ప్రపంచాలను చూపించాయి. అభూత కల్పనలతో మనిషిని ముంచెత్తాయి, భయపెట్టాయి. అంతేకాని మనిషి సుఖంగా జీవించటానికి కావలసిన జీవితావసరాలను అందించటానికి మార్గాలు చూపించలేక పోయాయి. మనిషి మనిషిగా బతకటం కోసం పోరాటం తప్పనిసరి అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈనాడు. ‘బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య’ అనే సూత్రాన్ని పూర్వ ప్రవక్తలు వేదాంతానికే అన్వయించి ఊరుకున్నారు. దానిని వాస్తవ ప్రాపంచిక వ్యవస్థకు అన్వయించి ఆచరణలోపెట్టి ఉంటే ఎలా ఉండేదో! పంచవర్ష ప్రణాళికలు నిజాయితీగా అమలుచేసి ఉంటే ఎలా ఉండేదో! కానీ అలా జరగలేదు. సామాజిక అసమానతలూ కులమతలింగ పరమైన వివక్షలూ తారస్థాయిని చేరిన నేటి సమాజానికి అంబేడ్కర్ సూచించిన పోరాట మార్గమే అవశ్యకర్తవ్యంలాగా కనిపిస్తోంది. సంఘటితమై రాజకీయశక్తిగా మారి సమసమాజాన్ని నెలకొల్పుకోవాలన్నారు అంబేడ్కర్. ఇప్పుడు రాజకీయశక్తులు సంఘటితంగా జనాన్ని మింగేస్తున్న ఈ శుభసమయంలో మహాభారతంలోని పద్యం.. ‘సారపుధర్మమున్ విమల సత్యము...’ అనేది గుర్తుకువస్తోంది. రక్షకులే అధర్మానికి పూనుకొన్నప్పుడు సమర్థులైనవారు చూస్తూ ఊరుకోవటం దోషం. ఎప్పటికైనా ధర్మము, సత్యమూ నిలబడతాయి.. నెగ్గుతాయి. దైవం ఆ బాధ్యత తీసుకుంటాడు.. అన్నారు ఆ పద్యంలో. అది అప్పటి నమ్మకం. ఇప్పుడు దైవం రాజకీయ శక్తుల అధీనంలో ఉన్నాడు నిస్సహాయుడై. అందుకే గణతంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చుకోవాలి. ‘మేకలనే బలి ఇస్తారు గానీ పులులను కాదు’ అన్నారు అంబేడ్కర్. బలికాకుండా ఉండాలంటే అంబేడ్కర్ను చదవాలి. అర్థంచేసుకోవాలి. చైతన్యవంతులు కావాలి! (వ్యాసకర్త తెలుగు అకాడమీ మాజీ డెరైక్టర్, అంబేడ్కర్ జీవిత చరిత్ర రచయిత్రి, ఫోన్: 040-27632525)
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement