-
టాటా మోటార్స్ ఏడీఎస్కు టాటా
న్యూఢిల్లీ: అమెరికన్ డిపాజిటరీ షేర్ల(ఏడీఎస్లు)ను స్వచ్చందంగా డీలిస్ట్ చేస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా పేర్కొంది. సాధారణ షేర్లను ప్రతిబింబించే వీటిని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి డీలిస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. సోమవారం(23న) ట్రేడింగ్ ముగిశాక ఓవర్ ద కౌంటర్ మార్కెట్లో వీటి ట్రేడింగ్ నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఏడీఎస్లు కలిగిన వాటాదారులు వీటిని సాధారణ షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు 2023 జులై24లోగా ఎక్స్ఛేంజీ లోని డిపాజిటరీవద్ద దాఖలు చేయవలసి ఉంటుందని టాటా మోటార్స్ తెలియజేసింది. కాగా.. దేశీయంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయిన టాటా మోటార్స్ ఈక్విటీ షేర్లపై ఈ ప్రభావం ఉండబోదని కంపెనీ స్పష్టం చేసింది. -
టాటా డీలర్లకు ఐసీఐసీఐ గుడ్ న్యూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ డీలర్స్కు గుడ్ న్యూస్. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్తో టాటా మోటార్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా టాటా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించే డీలర్లకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం సమకూరుస్తుంది.తీసుకున్న రుణాన్ని సౌకర్యవంతంగా తిరిగి చెల్లించేలా కాల పరిమితి ఉంటుంది. టాటాకు చెందిన డీజిల్, పెట్రోల్ వాహనాలను విక్రయిస్తున్న డీలర్లకు ఇప్పటికే ఈ బ్యాంక్ రుణం అందిస్తోంది. -
దిగ్గజ కంపెనీల మధ్య అమ్మకాల పోటీ, భారీగా తగ్గిన టాటా ఎలక్ట్రిక్ కారు ధర
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో దిగ్గజ సంస్థల మధ్య పోటీ నెలకొంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో ఒక సంస్థతో మరో సంస్థ పోటీపడుతున్నాయి. ఇటీవల మహీంద్రా అండ్ మహీంద్ర ఈవీ ఎస్యూవీ 400ను విడుదల చేసింది. ఆ కారు విడుదలైన మరుసటి రోజే ఈవీ మార్కెట్లో కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న నెక్సాన్ ఈవీ కారు ధరల్ని తగ్గిస్తూ టాటా మోటార్స్ నిర్ణయం తీసుకుంది. నెక్సాన్ వేరియంట్కు పోటీగా ఎక్స్యూవీ 400 మార్కెట్లో విడుదలైంది. దాని ధర రూ.18.99 లక్షలుగా ఉంది. ఇప్పుడు దానికి గట్టిపోటీ ఇచ్చేలా నెక్సా ఈవీ ధరల్ని తగ్గించడం గమనార్హం. నెక్సాన్ ఈవీ కారు ఇంతకుముందు రూ.14.99 లక్షలు ఉండగా.. ధర తగ్గించడంతో ఇప్పుడు అదే కారును రూ.14.49 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. నెక్సాన్ వేరియంట్లో లేటెస్ట్గా విడుదలైన నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ధర రూ. 16.49లక్షలుగా ఉంది. వ్యూహాత్మకంగా ఈ సందర్భంగా టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..మేం పక్కా స్ట్రాటజీతో టియాగో నుంచి నెక్సాన్ ఈవీ కార్ల వరకు కస్టమర్లను ఆకట్టుకునేలా తయారు చేస్తున్నాం. స్మార్ట్ ఇంజనీరింగ్, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మా లక్ష్యాలను చేరుకునేందుకు దోహదం చేస్తున్నాయి. కొనుగోలు దారుల అభిరుచులకు అనుగుణంగా కార్లను అందియ్యగలుగుతున్నామని అన్నారు. టాటా మోటార్స్ ఫోర్ట్ పోలియోలో మూడు ఈవీ కార్లు టాటా మోటార్స్ ఫోర్ట్ ఫోలియోలో టియాగో, టైగోర్,నెక్సాన్ ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.18.99లక్షల మధ్యలో ఉన్నాయి. ఇక ఎంట్రీ లెవల్ టిగాయో యూవీ మార్కెట్ ప్రారంభ ధర రూ.8.49 లక్షల నుంచి రూ.11.79లక్ష మధ్యలో ఉండగా టిగోర్ ఈవీ ప్రారంభ ధర రూ.12.49లక్షల నుంచి రూ.13.75లక్షల మధ్య ధరతో సొంతం చేసుకోవచ్చు. -
టాటా మోటార్స్కు భారీ ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ముంబైకి చెందిన ఎవరెస్ట్ ఫ్లీట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 5,000 యూనిట్ల ఎక్స్ప్రెస్–టి ఎలక్ట్రిక్ వాహనాలను ఎవరెస్ట్కు సరఫరా చేయనుంది. తొలి విడతగా 100 కార్లను అందించినట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. దేశంలో ఈవీల వాడకం పెరిగేందుకు ఇటువంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ తెలిపింది. ఎక్స్ప్రెస్–టి సెడాన్ శ్రేణిలో 213 కిలోమీటర్లు, 165 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్లు ఉన్నాయి. చదవండి: Flipkart Big Saving Days Sale: ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్! -
కొత్త ఏడాదిలో యూజర్లకు షాకివ్వనున్న టాటా మోటార్స్
న్యూఢిల్లీ: అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుంచి 2 శాతం పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. మోడల్ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. పెరిగిన తయారీ ధరల భారాన్ని సర్దుబాటు చేసుకునేందుకే ధరలను పెంచాల్సి వస్తున్నట్టు వివరణ ఇచ్చింది. పెరిగిన వ్యయాల్లో ఎక్కువ మొత్తాన్ని తామే సర్దుబాటు చేసుకున్నట్టు, కొంత మేర కస్టమర్లకు బదిలీ చేయాల్సి వస్తున్నట్టు పేర్కొంది. జనవరి నుంచి రేట్లను పెంచనున్నట్టు టాటా మోటార్స్ లోగడే ప్రకటించగా, తాజాగా ఎంత మేర పెంచేదీ ప్రకటించింది. చదవండి: మారుతి కార్ లవర్స్కి షాకింగ్ న్యూస్: ఆ కారణం చెప్పి..! ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement