-
పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు తీపికబురు!
ఒకవేళ మీకు కనుక పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా ఉన్నట్లయితే శుభవార్త. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఖాతా విషయంలో ₹3,500 వరకు సంపాదించిన వడ్డీపై పన్ను మినహాయింపును కేంద్రం అందిస్తుంది. ఒకవేళ మీకు ఉమ్మడి ఖాతా ఉన్నట్లయితే పన్ను మినహాయింపు ₹7,000 వరకు ఉంటుంది. అలాగే, చాలా తక్కువ వడ్డీ రేటును అందిస్తున్న బ్యాంకు పొదుపు ఖాతా కంటే అధిక వడ్డీరేటుతో పాటు పన్ను మినహాయింపు ఇస్తూ పోస్టాఫీసు కొత్త ఖాతాదారులను ఆకట్టుకుంటుంది. పొదుపు ఖాతాలపై పోస్టాఫీసు అందిస్తున్న వడ్డీ రేట్లు చారిత్రాత్మకంగా తక్కువగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పొదుపు ఖాతాపై వడ్డీ రేటు 2.7 శాతం అందిస్తుంది. అదే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ పై 4 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. కనీసం ₹500 డిపాజిట్తో పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాను తెరవవచ్చు. తపాలా కార్యాలయ పొదుపు ఖాతాపై వడ్డీ ప్రతి నెలా 10వ తేదీ లేదా నెలలో చివరి రోజు కనీస బ్యాలెన్స్ పై లెక్కిస్తారు. ఒకవేళ ఆర్థిక సంవత్సరం చివరల్లో అకౌంట్ బ్యాలెన్స్ రూ.500కు మించి డబ్బులు జమ చేయకపోతే అకౌంట్ మెయింటెనెన్స్ ఫీజుగా రూ.100 కట్ చేస్తారు. పోస్టాఫీసు పొదుపు ఖాతాతో సహా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను త్రైమాసిక ప్రాతిపదికన సమీక్షిస్తారు. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును యథాతదంగా ఉంచిది. -
బంగ్లాదేశ్కు చైనా ఆఫర్!
ఢాకా: భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్ను మచ్చిక చేసుకుందుకు చైనా తంటాలు పడుతోంది. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తుల్లో 97 శాతం ఉత్పత్తులకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇటీవల సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. బంగ్లాదేశ్కు చెందిన 8,256 ఉత్పత్తులు చైనాలో పన్ను మినహాయింపు కిందకు రానున్నాయి. ఆసియా–పసిఫిక్ వాణిజ్య ఒప్పందంకింద 3,095 బంగ్లా ఉత్పత్తులకు చైనాలో పన్ను మినహాయింపు ఉంది. జూలై 1 నుంచి ఈ సంఖ్య 8,256కు చేరనుంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఇప్పటికే దెబ్బతిన్న బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ చైనా ఇచ్చిన పన్ను మినహాయింపుతో కొంత పుంజుకుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
ఇన్వెస్టెర్రర్ 2.0
విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను విషయంలో ఊరట లభించగలదన్న అంచనాలు ఆవిరవ్వడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. అంతంతమాత్రంగానే ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు, వినియోగం మందగించడం, నైరుతి రుతు పవనాల విస్తరణ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. వరుసగా మూడు రోజుల పాటు నష్టపోతూ వచ్చిన డాలర్తో రూపాయి మారకం విలువ పుంజుకున్నా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత విషయమై సానుకూల సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లు పెరిగినా, మన మార్కెట్ పతన బాటలోనే పయనించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 560 పాయింట్లు పతనమై 38,337 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 178 పాయింట్లు నష్టపోయి 11,419 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది సెన్సెక్స్, నిఫ్టీలకు ఇవే రెండో అత్యధిక రోజువారీ నష్టాలు. ఈ రెండు సూచీలు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. బడ్జెట్ రోజు సెన్సెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 793 పాయింట్లు నష్టపోయింది. విద్యుత్తు, కన్సూమర్ డ్యూరబుల్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని బీఎస్ఈ రంగాల సూచీలు క్షీణించాయి. వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 399 పాయింట్లు, నిఫ్టీ 133 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. లాభాల్లో ఆరంభమైనా... ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలను మించి రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని ఫెడరల్ రిజర్వ్ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడంతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగాయి. ఈ దన్నుతో మన మార్కెట్ కూడా మంచి లాభాలతో ఆరంభమైంది. అయితే ఆ తర్వాత వెంటనే సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఒక దశలో 161 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 626 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 787 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 43 పాయింట్లు పెరిగి, ఆ తర్వాత 198 పాయింట్లు పతనమైంది. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం 5 పైసలు లాభపడి 68.92 వద్ద ముగిసింది. ఇక ముడిచమురు ధరలు 1.7 శాతం ఎగిశాయి. మరిన్ని విశేషాలు.... ► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, టీసీఎస్, ఓఎన్జీసీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, గెయిల్ ఇండియా, మహీంద్రా, ఐషర్ మోటార్స్, అరబిందో ఫార్మా, ఫోర్స్ మోటార్స్, వొడాఫోన్ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ షేర్ ఆల్టైమ్ హై, 2,370ను తాకింది. చివరకు 7%(రూ.147)లాభంతో రూ.2,317 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 20 శాతానికి పైగా ఎగసింది. పతనానికి కారణాలు ► పన్ను విషయమై తగ్గేది లేదు... సంపన్నులపై విధించిన పన్ను(విదేశీ ఇన్వెస్టర్లకు ఈ పన్ను వర్తిస్తుంది) కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తరలిపోతాయనే వాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపడేశారు. గురువారం ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె ఈ పన్ను విషయమై పునరాలోచన లేదని తెగేసి చెప్పారు. ఎఫ్పీఐలు కంపెనీగా వ్యవహరిస్తే, ఈ పన్ను పోటు ఉండదని ఆమె పేర్కొన్నారు. ఎఫ్పీఐలకు పన్ను విషయంలో ఊరట లభించకపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► అమ్మకాల్లో తగ్గని ఎఫ్పీఐలు ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, పన్ను పోటు కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారంతో కలుపుకొని వరుసగా 14వ రోజూ నికర అమ్మకాలు జరిపారు. ఒక్క గురువారం రోజే రూ.1,405 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నికర కొనుగోళ్లు జరిపిన ఎఫ్పీఐలు ఈ నెలలో ఇప్పటిదాకా రూ.7,000 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ► జోష్నివ్వని ఆర్థిక ఫలితాలు... ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లలో జోష్ని నింపలేకపోయాయి. ఒక్క ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా ఇతర కంపెనీల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. యస్బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, మైండ్ట్రీ, విప్రో, డీసీబీ బ్యాంక్ ఫలితాలు నిరాశపరిచాయి. ఫలితాలు ఓ మోస్తరుగా ఉంటాయన్న అంచనాలను కూడా కొన్ని కంపెనీలు అందుకోలేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. ► వర్షాలు.. అంతంతే.... ఈసారి నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. సాధారణ వర్షపాతం కంటే 16 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో వర్షాధార వ్యవసాయ దేశమైన మన దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండగలవన్న ఆందోళన నెలకొన్నది. ► జీడీపీ అంచనాలు తగ్గించిన ఏడీబీ భారత దేశ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించింది. 2 రోజుల్లో రూ. 3.79 లక్షల కోట్లు ఆవిరి గత రెండు రోజుల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.79 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్డైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ రూ.3.79 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.145.35 లక్షల కోట్లకు పడిపోయింది. శుభవార్తల కోసం మన స్టాక్ మార్కెట్ మొహం వాచిపోయి ఉంది. కంపెనీల డిఫాల్ట్లు కొనసాగుతుండటం, పన్నులు అధికంగా ఉండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండటం.. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. – జగన్నాథమ్ తునుగుంట్ల, సెంట్రమ్ బ్రోకింగ్ అనలిస్ట్ -
శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు: కేబినెట్
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హీరోగా నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధ్రప్రదేశ్లో వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. పలు అంశాలపై చర్చకు మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు 638 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించారు. అనంతపురంజిల్లాలో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 4018 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం సబ్ కాంట్రాక్టర్ అయిన ఎల్అండ్టీ సంస్థకు రూ. 95 కోట్లను ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించేందుకు అనుమతించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని పిలవాలని నిర్ణయించారు. ఇక గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు.. అది తన వియ్యంకుడికి సంబంధించిన విషయం కావడంతో ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశం నుంచి బయటకు వెళ్లినట్లు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement