-
అయోధ్య రామ మందిరం : పన్ను చెల్లింపు దారులకు శుభవార్త!
అయోధ్యలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండువ జరిగింది. దీంతో ప్రపంచం మొత్తం రామనామ స్మారణ మారుమ్రోగుతుంది. భక్తులు భారీ ఎత్తున రాములోరికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలో విరాళాల సేకరణకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక నిబంధనలకు అనుగుణంగా అయోధ్య రామమందిర్ ట్రస్ట్కు చేసే విరాళంతో ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) అయోధ్య రామమందిరాన్ని ప్రజల ప్రార్థనా స్థలంగా ప్రకటించింది. మే 8, 2020 నాటి సీబీడీ సర్క్యులర్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం' (పాన్: AAZTS6197B) చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా, ప్రజల ఆరాధనా స్థలంగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అయోధ్య రామమందిర మరమ్మతు, నిర్వహణ కోసం అన్ని విరాళాలు సెక్షన్ 80జీ కింద మినహాయింపు పొందవచ్చు’ అని తెలిపింది. ఈ విరాళంలో 50 శాతం సెక్షన్ 80G (2)(B) కింద పేర్కొన్న షరతులకు లోబడి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80 జీ కింద రూ. 2000 కంటే ఎక్కున నగదు విరాళం పన్ను మినహాయింపు పరిధిలోకి రాదు. -
పన్ను శూన్యం.. ఆదాయం అదనం
ఆదాయపన్ను ఆదాచేసే పెట్టుబడి సాధనాలకు మంచి డిమాండ్ ఉంది. మధ్యాదాయ వర్గాల వారికి పాత పన్ను విధానమే మెరుగైనది. అందులో పన్ను ఆదా, మినహాయింపునిచ్చే సెక్షన్లు చాలానే ఉన్నాయి. పన్ను ఆదా కోసం ఈ తరహా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారు చాలా మంది ఉన్నారు. ఆర్థిక సంవత్సరం చివర్లో కాకుండా ఆరంభం నుంచే ఈ సాధనాల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడం వల్ల చివర్లో ఏకమొత్తంలో సమకూర్చుకోవాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అయితే, పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు లాభ, నష్టాల గురించి పూర్తిగా విచారించుకోవాలి. లాక్ ఇన్ పీరియడ్ను చూడాలి. రాబడిని చూడాలి. రిస్క్ను అర్థం చేసుకోవాలి. పన్ను బాధ్యత ఏ మేరకు అన్నది పరిశీలించాలి. ముందస్తు ఉపసంహరణలకు అవకాశం ఉందా? లేదా? తెలుసుకోవాలి. చాలా మంది పెట్టుబడిపై పన్ను ఆదానే చూస్తుంటారు. కానీ రాబడిపై పన్ను బాధ్యత గురించి తెలుసుకోరు. ముఖ్యంగా రిస్క్లేని సంప్రదాయ డెట్ సాధనాల్లో రాబడి 6–8 శాతం మించదు. కానీ, దీనిపై పన్ను చెల్లించాల్సి వస్తే.. ఇక మిగిలేది ఏముంటుంది? కనుక పెట్టుబడిపై పన్ను ఆదాయే కాదు, రాబడిపైనా పన్ను లేని సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అదనపు రాబడిని సంపాదించుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సాధనాల గురించి తెలియజేసే కథనమే ఇది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసే వారు పాత, కొత్త విధానాల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. కాకపోతే కొత్త విధానంలో పన్ను ఆదా ప్రయోజనాలు పెద్దగా లేవు. స్టాండర్డ్ డిడక్షన్, ఉద్యోగి తరఫున యాజమాన్యం ఎన్పీఎస్ ఖాతాకు చేసే జమపైనే పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. పాత విధానంలో అయితే సెక్షన్ 80సీ, 80డీ సహా ఎన్నో సెక్షన్లు పన్ను భారాన్ని తగ్గిస్తున్నాయి. కనుక పాత, కొత్త విధానాల్లో ఒక దానిని ఎంపిక చేసుకునే ముందు తమ ఆదాయం, పెట్టుబడులు తదితర అంశాలన్నీ విశ్లేషించుకున్న తర్వాత ఎంపిక చేసుకోవాలి. పాత విధానంలో అయితే, ఇక్కడ చర్చించే సాధనాలు రిస్క్లేని రాబడిని, పన్ను లేని రాబడినిస్తాయి. కనుక ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అన్నది ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోతగిన సాధనం. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మొత్తంపైనా ఎలాంటి పన్ను లేదు. అంతేకాదు ఈ సాధనానికి మూడు రకాల పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఇందులో పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడిపైనా పన్ను కట్టక్కర్లేదు. చివర్లో గడువు తీరిన తర్వాత ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను లేదు. భద్రత దృష్ట్యా చూస్తే.. సార్వభౌమ గ్యారంటీతో కూడిన పథకం ఇది. ప్రస్తుతం 7.1 శాతం వార్షిక రాబడి ఈ పథకంలో ఉంది. పీపీఎఫ్ అకౌంట్ కాల వ్యవధి 15 ఏళ్లు. లాకిన్ పీరియడ్ కూడా ఇంతే ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి మొదలు పెట్టిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల కాలం అమలవుతుంది. ఆరంభం నుంచి కాదు. ఖాతా ప్రారంభించిన ఆరో ఏట నుంచి రుణ సదుపాయం అమల్లో ఉంటుంది. ఖాతా ప్రారంభించిన ఏడో ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. ఇందుకు కొన్ని షరతులు అమలవుతాయి. పోస్టాఫీసు లేదా బ్యాంక్లో ప్రారంభించుకోవచ్చు. పోస్ట్ ఆఫీసు అయితే అక్కడ సేవింగ్స్ ఖాతా తెరవాలని షరతు పెడుతున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి, స్వచ్ఛంద భవిష్య నిధి సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్ కిందకు వస్తారు. వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్ ఖాతాకు ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది. పని చేయించుకునే సంస్థ కూడా ఉద్యోగి తరఫున అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. ఉద్యోగులు తన వంతుగా జమ చేసే మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ నిధికి 12 శాతానికి మించి జమ చేసుకోవాలంటే అందుకు వీలు కల్పించేదే స్వచ్చంద భవిష్య నిధి (వీపీఎఫ్). ఈపీఎఫ్ నిబంధనలు వీపీఎఫ్కు సైతం వర్తిస్తాయి. ఈపీఎఫ్ వడ్డీ రేటే వీపీఎఫ్ జమలపైనా అమలవుతుంది. ఈపీఎఫ్ పథకాన్ని కేంద్ర సర్కారు నిర్వహిస్తోంది. కనుక నూరు శాతం భద్రత ఉంటుంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్పై 8.1 శాతం వడ్డీ రేటు అమలు చేయగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ పథకం రిటైర్మెంట్ వరకు కొనసాగుతుంది. ముందస్తు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఉన్నత విద్య, వివాహం, వైద్య చికిత్సల కోసం ఈపీఎఫ్ బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన పథకాల మాదిరే ఈపీఎఫ్పైనా పన్ను లేదు. కాకపోతే ఒక ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్, వీపీఎఫ్కు ఉద్యోగి చేసే జమ రూ.2.5 లక్షలు మించినప్పుడు.. అంతకుమించి చేసే జమలపై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించి జమ చేసే వారు 5 శాతం మంది కూడా ఉండరు. వీపీఎఫ్, ఈపీఎఫ్ రెండు కలసి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పరిమితిపైనే పన్ను ఆదా పరిమితం. జీవిత బీమా పాలసీలు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కలిగిన సాధనాల్లో జీవిత బీమా సాధనాలు కూడా ఉన్నాయి. టర్మ్ పాలసీలు, ఎండోమెంట్ పాలసీలు, యూనిట్ లింక్డ్ పాలసీల (యులిప్లు)కు ఏటా చెల్లించే ప్రీమియం మొత్తాన్ని సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. జీవిత బీమాను పెట్టుబడి కోణంలో చూడొద్దు. కుటుంబానికి రక్షణ సాధనంగానే చూడాలి. అలా చూసినప్పుడు అసలైన బీమా ప్లాన్ అంటే టర్మ్ ప్లాన్ అనే చెప్పుకోవాలి. తక్కువ ప్రీమియంకే ఎక్కువ రక్షణ కవరేజీ లభిస్తుంది. పాలసీదారుడికి ఏదైనా జరిగితే కుటుంబం ఆర్థిక ఇబ్బుందుల పాలు కాకుండా ఉంటుంది. గడువు తీరే వరకు జీవించి ఉంటే చివర్లో ఏమీ తిరిగి రాదు. అందుకే చాలా మంది దీని పట్ల విముఖత చూపిస్తుంటారు. దీనికి బదులు చివర్లో ఎంతో కొంత చెల్లింపులు చేసే ఎండోమెంట్ ప్లాన్ల వైపు వెళుతుంటారు. సంప్రదాయ పాలసీల్లో 20 ఏళ్లకు మించి కాలంపై రాబడి 4–6 శాతం మించదని గుర్తుంచుకోవాలి. యులిప్ ప్లాన్లు బీమా రక్షణ, పెట్టుబడితో కూడినవి. వీటిల్లోనూ ప్రీమియం అధికంగానే ఉంటుంది. యులిప్ ప్లాన్లలో పెట్టుబడులను ఈక్విటీ లేదా డెట్, లేదా ఈక్విటీ డెట్ కలసినవి ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ నుంచి డెట్కు, డెట్ నుంచి ఈక్విటీకి ఎలాంటి చార్జీల్లేకుండా మార్చుకోవచ్చు. గడువు తీరిన తర్వాత చివర్లో వచ్చే మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించకుండా చూసుకుంటే మెచ్యూరిటీపై పన్ను పడదు. యులిప్లలో ఉన్న మరో ప్రతికూలత ఇవి చాలా తక్కువ టర్మ్తో వస్తుంటాయి. యులిప్ ప్లాన్లలోనూ రాబడులకు హామీ ఉండదు. అంచనా రాబడినే బీమా సంస్థలు వెల్లడిస్తాయి. ఇక సంప్రదాయ బీమా పాలసీలు (జీవించి ఉంటే మెచ్యూరిటీ చెల్లించేది) తీసుకునే వారు వార్షిక ప్రీమియం రూ.5 లక్షలు మించకుండా చూసుకోవాలి. అప్పుడే చివర్లో చేతికొచ్చే మొత్తం పన్ను రహితం. ఈ నిబంధన 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాలు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాలలో చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది. పైన చెప్పుకున్న వాటికి ఇది భిన్నం. సెక్షన్ 80సీ కింద గరిష్టంగా ఈ పథకాల్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఆ మొత్తంపై మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకాలు పూర్తిగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక రిస్క్ ఉంటుంది. రాబడులు పన్ను పరిధిలోకి వస్తాయి. రాబడులపై హామీ ఉండదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లాభ, నష్టాలు ఏవైనా రావచ్చు. కాకపోతే ఈక్విటీల్లో ఐదేళ్లకు మించిన కాలానికి నికరంగా రాబడులే వస్తాయని చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. ఈ పథకంలో పెట్టుబడులపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. పన్ను ఆదా సాధనాల్లో తక్కువ లాకిన్ ఉన్నది ఇదే. ఈఎల్ఎస్ఎస్ నుంచి మూడేళ్లు నిండకుండా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. మూడేళ్ల లాకిన్ పీరియడ్లో ఈ పథకం నుంచి ఆదాయం రావాలని కోరుకుంటే, గ్రోత్ ఆప్షన్కు బదులు డివిడెండ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. దాంతో ఫండ్ డివిడెండ్ ప్రకటించిన ప్రతీ సందర్భంలోనూ ఇన్వెస్టర్కు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. కాకపోతే డివిడెండ్ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలిపి, పన్ను వర్తించే ఆదాయం ఉన్నప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఏడాదికి మించిన కాలంపై వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. ఈఎల్ఎస్ఎస్ పథకాలు మూడేళ్ల లాకిన్తో ఉంటాయి కనుక.. ఇందులో వచ్చే రాబడులు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.లక్ష వరకు ఉంటే ఎలాంటి పన్ను లేదు. ఈ పరిమితికి మించిన లాభంపైనే 10 శాతం పన్ను చెల్లించాలి. అందుకే ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో గ్రోత్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకుని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందాలి. మూడేళ్లు నిండిన తర్వాత నుంచి ఏటా రూ.లక్ష లాభం మించకుండా ఉపసంహరించుకుని, తిరిగి ఆ మొత్తాన్ని మరొక ఈఎల్ఎస్ఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. దీనివల్ల లాభంపై పన్ను పడదు. దీర్ఘకాలంలో మంచి నిధి జమవుతుంది. సుకన్య సమృద్ధి యోజన భేటీ బచావో భేటీ పడావో అనే పథకం కింద సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర సర్కారు తీసుకొచ్చింది. కుమార్తెలకు సంబంధించిన డిపాజిట్ పథకం ఇది. ఆడ పిల్ల విద్య లేదా వివాహం అవసరాల కోసం తల్లిదండ్రులు ఆమె పేరిట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కరు ఇద్దరు కుమార్తెల పేరిటే ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోగలరు. ఇద్దరికి మించి కుమార్తెలు ఉంటే, వారి పేరిట ఇన్వెస్ట్మెంట్కు అవకాశం ఉండదు. పీపీఎఫ్ మాదిరే ఇందులోనూ పెట్టుబడిపై పన్ను లేదు. రాబడి, చివరిలో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. పన్ను లేని, మెరుగైన రాబడితో కూడిన డెట్ సాధనం ఇది. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో వస్తుంది కనుక భద్రత పరంగా సందేహం అక్కర్లేదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రేటు 8 శాతం. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే ఇందులోనే రాబడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడులకు 21 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ముందస్తు ఉపసంహరణలను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తారు. కుమార్తెల వయసు 10 ఏళ్లు మించకుండా ఉంటే, వారిపైనే ఈ పథకం కింద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కుమార్తె వయసు 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రి లేదా సంరక్షకుడు ఖాతాను నిర్వహించొచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఈ ఖాతా తెరుచుకోవచ్చు. -
యువత పెట్టుబడులకు సరైన వేదిక ఏది?
యువత పెట్టుబడులకు సరైన వేదిక ఏది? – హిమ బిందు యుక్త వయసులోనే అంటే ఇరవైలలోనే (ఉదాహరణకు 25 సంవత్సరాలు) సొమ్ములుండి పెట్టుబడులను దీర్ఘకాలంపాటు మరిచిపోగలిగితే స్మాల్ క్యాప్ ఫండ్తో మదుపును ప్రారంభించవచ్చు. పెట్టుబడిదారులు ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మరీ దీర్ఘకాలానికైతే స్మాల్ క్యాప్ ఫండ్స్ అత్యధిక లాభాలను ఆర్జించిపెట్టే ఆస్తుల విభాగంలోకి వస్తాయి. అయితే విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు విలువ భారీగా వేగంగా పడిపోతుంటుంది. ఇది బాగా ఆందోళనలు కలిగిస్తుంది. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలోనూ, ఆపై పలు ఇతర క్లిష్టకాలాల్లోనూ వీటి విలువలు 50 శాతం పతనమయ్యాయి. అతితక్కువ సమయంలోనే విలువలు భారీగా క్షీణించాయి. అంటే రూ.100 పెట్టుబడి రూ.50కు చేరుతుంది. అత్యధిక శాతం మంది ఇన్వెస్టర్లు దీనిని ఆమోదించబోరు. కనుక గరిష్ట రిస్కుకు సిద్ధపడితేనే వీటివైపు దృష్టి పెట్టవచ్చు. ఇరవైలలోనే మీరు సంపాదిస్తూ, పన్నులు చెల్లిస్తూ ఉంటే లెక్కల పద్ధతిలో పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. ట్యాక్స్ సేవింగ్ ఫండ్లో అవసరమైనంత సొమ్మును మదుపు చేయవచ్చు. దేశీ ఇన్వెస్టర్లకు పన్ను పొదుపు ఫండ్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మొత్తాన్ని ఫ్లెక్సీక్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే ఇరవైలలోనే సంపాదిస్తూ గరిష్ట రిస్కుకు సిద్ధపడుతుంటే.. స్మాల్ క్యాప్ ఫండ్స్నూ పరిశీలించవచ్చు. పన్ను ఆదాకు పీపీఎఫ్ సరైనదేనా? – శంకర్ పీపీఎఫ్ పెట్టుబడిదారులకు నా సలహా ఏమంటే.. ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కొనసాగించవచ్చు. అలాకాకుండా ఇప్పుడే పెట్టుబడుల కోసం ఆలోచిస్తుంటే అదంత లాభదాయకం కాబోదు. ఎందుకంటే.. పీపీఎఫ్ అనేది స్థిర ఆదాయ ఆర్జన కోసం 15ఏళ్ల కాలపు క్రమానుగత పెట్టుబడి పథకం(సిప్). 15ఏళకాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే.. పీపీఎఫ్కంటే ఇతర పన్ను ఆదా ఫండ్స్ నుంచి లభించే రిటర్నులే అధికంగా ఉండే వీలుంది. ఇది మొట్టమొదట ఆలోచించవలసిన విషయం. అయితే ఇప్పటికే పీపీఎఫ్లో ఉంటే పెట్టుబడులు కొనసాగించవచ్చు. వడ్డీ ఆదాయం పన్నురహితంకావడంతో స్థిర ఆదాయ కేటాయింపులు చేపట్టవచ్చు. సుప్రసిద్ధమైన పథకంకావడంతో ఇప్పటికే పీపీఎఫ్లో ఉంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రత్యామ్నాయాల్లో ఇది అత్యుత్తమమైనదిగా భావించవచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ లేదా మార్కెట్ ఆధారిత పెట్టుబడుల ఖాతా లేనప్పటికీ చాలా మంది ప్రజలు పీపీఎఫ్ ఖాతాను కలిగి ఉన్నారు. నిజానికి దేశీయంగా ఈక్విటీ ఇన్వెస్టర్ల సంఖ్యతో పోలిస్తే ఇటీవల పీపీఎఫ్ పెట్టుబడిదారుల సంఖ్య రెట్టింపునకంటే అధికంగా నమోదైంది. ప్రభుత్వ అండతో అత్యంత నమ్మకమైన పెట్టుబడి మార్గంకావడంతో అత్యధికులు పీపీఎఫ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. వడ్డీ ఆదాయం పూర్తిగా పన్నురహితంకావడం ఆకర్షణీయం. వెరసి ఇప్పటికే పీపీఎఫ్లో ఉంటే కొనసాగించండి. కొత్తగా ఇన్వెస్ట్ చేయదలిస్తే ఇతర పన్నుఆదా ఫండ్స్నూ పరిశీలించవచ్చు. -
విజయ్! ఫండ్స్తోనే కావాల్సిన నిధి
సిప్ చేస్తే దీర్ఘకాలిక లక్ష్యాలు ఈజీనే నా పేరు విజయ్కుమార్. వయసు 36 ఏళ్లు. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నాతో పాటు నా భార్య, 5 ఏళ్ల అబ్బాయి అరుణ్ ఉంటున్నారు. నాకు నెలకు రూ.లక్ష జీతం వస్తోంది. జీతంగా లక్ష రూపాయల వరకు వస్తున్నాయి. ఇందులో రూ.35,000 వరకు పొదుపు చేస్తున్నాను. నా సేవింగ్స్ విషయానికి వస్తే.. ప్రతీ నెలా రూ.5,000 చొప్పున ట్యాక్స్ సేవింగ్ పథకం (ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం ఈ విలువ లక్ష రూపాయలుగా ఉంది. ప్రతి ఏటా ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.18,000 కడుతున్నాను. ఈ పాలసీ 2027లో మెచ్యూరిటీ అవుతుంది. మెచ్యూరిటీ కింద రూ. 6.5 లక్షలు వస్తాయి. ఈపీఎఫ్ కింద ప్రతి నెలా రూ. 3,500 జీతంలో కోత కోస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖాతాలో రూ. 1.35 లక్షలు వరకు ఉన్నాయి. నా ఆర్థిక లక్ష్యాల విషయానికి వస్తే...55 ఏళ్ల నాటికి పదవీ విరమణ చేయాలనుకుంటున్నా. అప్పటికి పూర్తి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనుకుంటున్నాను. అలాగే అరుణ్ ఉన్నత చదువులకు తగిన నిధి సమకూర్చుకోవాలన్నది నా లక్ష్యం. ప్రస్తుతం విద్యావ్యయం రూ.5 లక్షలుగా ఉంది. దీని ప్రకారం తగిన ఆర్థిక ప్రణాళికను సూచించగలరు. హాయ్!.. విజయ్కుమార్ గారు... మీ ఆదాయం, వ్యయాలు, పొదుపు, ఆర్థిక లక్ష్యాల గురించి చాలా వివరణాత్మకంగా రాశారు. అలాగే మీ పెట్టుబడులను అంతా ఒకేదానిలో కాకుండా వివిధ పథకాలకు కేటాయించడం ద్వారా నష్ట భయాన్ని తగ్గించుకున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందవచ్చు. మీ రెండు లక్ష్యాలు దీర్ఘకాలానికి చెందినవే. ఇందులో మొదటిది మీ అరుణ్ ఉన్నత విద్యకి చేరుకోవడానికి ఇంకా 15 ఏళ్లు అంటే 2031 వరకు సమయం ఉంది. ప్రస్తుతం మీరు చదివించాలనుకున్న చదువుకు రూ.5 లక్షలు అవుతాయి. ఏటా విద్యా వ్యయం 7.5 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేస్తే.. 2031 నాటికి రూ.13.76 లక్షలు అవసరమవుతాయి. అదే రిటైర్మెంట్కు ఇంకా 19 ఏళ్ల సమయం ఉంది. ప్రస్తుతం మీ ఇంటి ఖర్చు నెలకు రూ.30,000 అవుతున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం ఏటా 6 శాతం చొప్పున లెక్కిస్తే 2035 నాటికి రిటైర్మెంట్ నిధి కనీసం రూ.3.59 కోట్లు అవసరమవుతాయి. రిటైర్మెంట్కు.. ఫండ్స్లో పెట్టుబడి! మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి నెలా అదనంగా రూ.34,000 అవసరమవుతాయి. ప్రస్తుతం మీరు రూ.35,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అదనంగా ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్కు కేటాయించండి. సిప్ విధానంలో ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవచ్చు. మీ రిస్క్ సామర్థ్యాన్ని మధ్యస్థంగా అంచనా వేసుకొని ఈ పోర్ట్ఫోలియోను సూచించడం జరిగింది. ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని పిల్లవాడి చదువుకు వినియోగించుకోండి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి రిటైర్మెంట్కు అక్కరకు వస్తుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement