-
టీబీ రోగులకు డ్రోన్ సేవలు
బీబీనగర్ : టీబీ రోగుల కోసం బీబీనగర్ ఎయిమ్స్ ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రోన్ సేవలు విజయవంతమయ్యాయి. టీబీ రోగులు, అనుమానితుల నుంచి రక్త పరీక్షలకు నమునాలు సేకరించి వెనువెంటనే ల్యాబ్లకు పంపించడం, తిరిగి అవసరమైన మందులను రోగులకు పంపేందుకు డ్రోన్ సాయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, తండాలపరిధిలో 150 మంది నమునాలను సేకరించి డ్రోన్ ద్వారా ల్యాబ్లకు పంపి.. తిరిగి మందులు చేరవేశారు. ఆదివారం ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్భాటియా డ్రోన్ సేవల గురించి వెల్లడించారు.రెండు నెలలుగా డ్రోన్ సేవలపై చేపట్టిన ప్రయోగాలు ఫలించడంతో టీబీ రోగులకు చాలా సులువుగా సేవలు అందుతున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన డ్రోన్ సేవలను ఇటీవల ఎయిమ్స్కు వచ్చిన కేంద్రమంత్రి ఆర్కే.సింగ్ పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. పీహెచ్సీలు, సబ్సెంటర్లకు అనుసంధానం భువనగిరి, రామన్నపేట, బీబీనగర్ బొమ్మల రామారం మండలాల పరిధిలోని పీహెచ్సీలు, సబ్సెంటర్లకు డ్రోన్లను అనుసంధానం చేశారు. ఇక్కడి నుంచి రోగుల నమునాలను సేకరించి రిమోట్ ద్వారా జిల్లా కేంద్రంలోని క్షయవ్యాధి యూనిట్లకు డ్రోన్ ద్వారా పంపుతారు. తిరిగి అక్కడి నుంచి రోగులకు అవసరమయ్యే టీబీ మందులు, ట్యూబ్లు, రియాజెంట్లను డ్రోన్లో అమర్చి రోగులకు పంపుతారు. దీని కోసం ప్రస్తుతం ఎయిమ్స్లోని 3 డ్రోన్ పైలెట్లు, 2 డ్రోన్లు అందుబాటులో ఉంచారు. రోగుల ఖర్చు తగ్గించేందుకు సహాయపడుతుంది డ్రోన్ సేవల ద్వారా టీబీ నిర్థారణలో ట్యూమరౌండ్ సమయం తగ్గించడం, దూర ప్రాంతాల్లో, రవాణా సరిగ్గా లేని చోట నివసించే వ్యక్తులకు రవాణా ఖర్చులు తగ్గించేలా డ్రోన్ సేవలు సహాయపడతాయి, జిల్లా టీబీ కార్యాలయం నుంచి డ్రోన్ కార్యకలాపాలను పీహెచ్సీలతో పాటు సబ్సెంటర్లకు సైతం విస్తరిస్తున్నాం. – వికాస్భాటియా, డైరెక్టర్, ఎయిమ్స్ -
టీబీకి టాటా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్షయ వ్యాధి (టీబీ) కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదకర వ్యాధి వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా పెద్దలకు టీకా పంపిణీకి వైద్య శాఖ సన్నాహాలు చేస్తోంది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్) విధానాన్ని టీబీ నియంత్రణలోనూ వినియోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు 1,522 మందికి పరీక్షలు నిర్వహిస్తూ ప్రస్తుతం దేశంలోనే తొలి మూడు స్థానాల్లో ఏపీ ఒకటిగా ఉంది. ఇదిలా ఉండగా మరింతగా దేశంలో పెద్దలకు టీబీ నుంచి రక్షణ కోసం బాసిల్లస్ కాల్మెట్–గ్వెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీంతో మన రాష్ట్రంలో 12 జిల్లాల్లో వచ్చే నెలలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు అంశాల ప్రాతిపదికగా.. ఆరు అంశాల ప్రాతిపదికగా వివిధ వర్గాల వ్యక్తులకు తొలుత టీకా పంపిణీ చేపడతారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితోపాటు, ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, చ.మీ.కు 18 కిలోల కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులు ఇలా ఈ ఆరు వర్గాలకు చెందిన వారికి తొలుత టీకాలు వేస్తారు. టీకా పంపిణీకి ఎంపిక చేసిన 12 జిల్లాల్లో ఈ వర్గాలకు చెందిన వారు 50 లక్షల మంది వరకూ ఉన్నట్టు వైద్య శాఖ ప్రాథమికంగా నిర్థారించింది. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి టీకా పంపిణీకి అర్హులైన వారి ఎంపిక చేపడుతున్నారు. కాగా, ఇప్పటికే వైద్య శాఖ పిల్లలకు టీకా పంపిణీ చేస్తోంది. గత ఏడాది నుంచి వైద్య శాఖ ఉచితంగా టీకా పంపిణీ ప్రారంభించింది. తొమ్మిది నెలలలోపు పిల్లలకు మూడు డోసులుగా టీకాను వేస్తున్నారు. పుట్టిన ఆరు వారాల వయసులో ఒక డోసు, 14 వారాల్లోపు రెండో డోసు, చివరిగా 9 నెలల వయసులోగా మూడో డోసు వేస్తున్నారు. మూడు డోసుల టీకా వేసుకున్న పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇదే తరహాలోనే నిర్ధేశించిన పరిమాణంలో పెద్దలకు టీకాలు పంపిణీ చేయనున్నారు. టీకా పంపిణీకి అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాలను ఎంపిక చేశారు. వచ్చే నెల 15వ తేదీ తర్వాత పంపిణీ వ్యాక్సిన్ వెయిల్స్, సిరంజ్లు ఎంపిక చేసిన 12 జిల్లాలకు సరఫరా చేస్తున్నాం. 59 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేశాం. కేంద్ర వైద్య శాఖ 2025 నాటికి దేశంలో టీబీ నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందే మన రాష్ట్రంలో టీబీని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్తో ఫ్లూయిడ్ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా..? పొంచి ఉన్న మరో ముప్పు..!
యాంటీబయాటిక్స్ మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపేందుకు ఉపయోగపడే మందు. వీటి సహాయంతో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను తగ్గించి, రోగి ప్రాణాలు కాపాడవచ్చన్న విషయం తెలిసిందే. అయితే... ఈ యాంటీబయాటిక్స్ను విచ్చలవిడిగా, విచక్షణరహితంగా వాడటం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా హెచ్చరిస్తునే ఉన్నారు. అయినా ఇప్పటికీ వాటి దురుపయోగం ఆగడం లేదు. దాంతో తాజాగా ఇప్పుడు ఎంతకూ తగ్గని టైఫాయిడ్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందంటూ శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నివేదిస్తున్నారు. ఈ ముప్పును గుర్తెరిగి అప్రమత్తం అయ్యేందుకు ఉపయోగపడే కథనమిది. గతంలో కొన్ని జబ్బులు చాలా తేలిగ్గా... అంటే కేవలం ఓ చిన్న యాంటీబయాటిక్ వాడగానే తగ్గిపోయేవి. అసలు కొన్ని జబ్బులైతే ఎలాంటి మందులూ / యాంటీబయాటిక్స్ వాడకపోయినా తగ్గుతాయి. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు. చాలా వ్యాధులను వ్యాప్తి చేసే వ్యాధికారక క్రిములు... ఆ మందుల పట్ల తమ నిరోధకతను పెంచుకుంటున్నాయి. తాజాగా టైఫాయిడ్ను వ్యాప్తి చేసే క్రిమి కూడా అలా నిరోధకత పెంచుకుంటోందని కొన్ని అధ్యయనాల్లో aతేలింది. ఆసియాలో పెరుగుతూ.. అంతర్జాతీయంగా వ్యాప్తి టైఫాయిడ్ చాలా పురాతనమైన జబ్బు. దాదాపు వెయ్యేళ్ల నుంచి మానవాళిని బాధిస్తోందన్న దాఖలాలున్నాయి. ఇలా చాలాకాలం నుంచి వేధించిన మరోపురాతనమైన జబ్బు టీబీలాగే... టైఫాయిడ్ కూడా యాంటీబయాటిక్స్ తర్వాత పూర్తిగా అదుపులోకి వచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆనవాళ్లు లేకుండా మటుమాయమైంది. ఇది సాల్మొనెల్లా ఎంటరికా లేదా సాల్మొనెల్లా టైఫీ అనే రకాల క్రిము కారణంగా వ్యాప్తి చెందుతుంది. మనదేశంతో పాటు పొరుగు దేశాలైన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో నిర్వహించిన పరిశోధనల్లో ఆందోళన కలిగించే అనేక అంశాలు వెల్లడయ్యాయి. శాస్త్రవేత్తలు మనదేశంతో పాటు ఆయా దేశాల్లోని 3,489 రకాల టైఫీ స్ట్రెయిన్ల జీనోమ్ సీక్వెన్సింగ్ను పరిశీలించారు. దాంతో ఇప్పుడు తాజాగా యాంటీబయాటిక్స్కు ఓ పట్టాన లొంగని కొత్త స్ట్రెయిన్ టైఫాయిడ్ జబ్బును కలిగించే బ్యాక్టీరియా వృద్ధి చెందినట్లు తేలింది. నిపుణులు దీన్ని డ్రగ్ రెసిస్టెన్స్ టైఫాయిడ్ లేదా ‘ఎక్స్డీఆర్’టైఫాయిడ్గా పేర్కొంటున్నారు. టైఫాయిడ్ కొత్త స్ట్రెయిన్స్... ‘‘ఉత్పరివర్తనం చెందిన ‘ఎక్స్డీఆర్ టైఫాయిడ్’ 2016లో తొలిసారి పాకిస్తాన్లో వెలుగుచూసింది. ఆ తర్వాత ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతున్న ఈ ‘ఎక్స్ఆర్డీ’ టైఫీ స్రెయిన్స్ వ్యాప్తి... భారత్, పాక్, నేపాల్, బంగ్లాదేశ్... ఈ నాలుగు ఆసియా దేశాలనుంచే జరుగుతోంది. ఈ సూపర్బగ్స్ యునైటెడ్ కింగ్డమ్ (బ్రిటన్), యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడాల్లోనూ కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎంతో ఆందోళనకరం. అందుకే వీలైనంత త్వరగా ఈ అనర్థానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’’ అని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెంది జేసన్ ఆండ్రూస్ ప్రపంచానికి హితవు చెబుతున్నారు. ప్రతి ఏడాదీ దాదాపు కోటీ 10 లక్షల టైఫాయిడ్ కేసులు వస్తుండటం... ప్రస్తుతం ఆ వ్యాధి దాఖలాలే లేని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తుండటం... అది మందులకు ఓ పట్టాన లొంగకుండా వ్యాధిగ్రస్తుల్లో 20 శాతం మంది మృత్యువాతపడుతుండటం అన్నది ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించే ఓ ఆరోగ్యాంశం అవుతుందని కూడా ఆండ్రూ హెచ్చరిస్తున్నారు. డ్రగ్ రెసిస్టెన్స్ పెంచుకుంటున్న మరికొన్ని జబ్బులు ►క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే పెద్ద పేగుల్లో పెరిగే బ్యాక్టీరియా వల్ల వచ్చే నీళ్ల విరేచనాలు ఇప్పుడు పెద్దవయసు వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించేలా తయారయ్యాయి. ఈ క్లాస్ట్రీడియమ్ బ్యాక్టిరియా ఇటీవల యాంటీబయాటిక్స్కు నిరోధకత పెంచుకున్నట్లుగా తెలుసోది. ►గతంలో చిన్న పిల్లల్లో, పెద్దల్లో తరచూ వచ్చే సెగగడ్డలు అప్పట్లో చిన్న డోస్తో కేవలం మామూలు యాంటీబయాటిక్స్ తగ్గిపోయేవి. కానీ ఇప్పుడవి ఒక పట్టాన తగ్గడం లేదు. ►అప్పట్లో ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ (టీబీ), క్లెబిసిలియా నిమోనియా, సూడోమొనాస్ వంటి సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్కు తేలిగ్గానే లొంగిపోయేవి. కానీ ఇప్పుడవి మరింత మొండిగా మారాయి. ► ఈ వేసవిలో మామిడిపండ్లు కాస్త ఎక్కువగానే తిన్నప్పుడు కొందరిలో విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇలా జరగగానే కొందరు ఆన్కౌంటర్ మెడిసిన్ వాడుతుంటారు. ఎలాంటి మందులు వాడకపోయినా అవి మర్నాటికల్లా తగ్గిపోతాయి. ఇలా ఆన్కౌంటర్ మెడిసిన్స్ వాడటం వల్ల విరేచనాలే కాదు... మరెన్నో సమస్యలు మొండిగా మారుతున్నాయి. అందుకే ఆన్కౌంటర్ మెడిసిన్స్ను వాడకపోవడమే మంచిది. అందుబాటులో టైఫాయిడ్ వ్యాక్సిన్ టైఫాయిడ్కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అంతేకాదు... మనదేశంలో పిల్లలందరికీ ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన (మ్యాండేటరీ) వ్యాక్సినేషన్ షెడ్యూల్ జాబితాలో ఉంది. టీసీవీ వ్యాక్సిన్ రూపంలో దీన్ని 9 – 12 నెలల పిల్లలకు ఇస్తుంటారు. ఒకవేళ ఇవ్వకపోతే... రెండేళ్లు దాటిన పిల్లలకు దీన్ని ఇప్పించడం ద్వారా టైఫాయిడ్ నుంచి అనేక మంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చు. ఏ జబ్బుకు ఏ యాంటీ బయాటిక్... ఏ మోతాదులోనంటే? బాధితులకు వచ్చిన వైద్య సమస్య ఆధారంగా, దాని తీవ్రతను బట్టి... దానికి ఏ తర్చహా యాంటీబయాటిక్స్ వాడాలి, అది కూడా ఎంత మోతాదులో వాడాలి, దాన్ని ఎంతకాలం పాటు వాడాలన్న విషయాలు వైద్యులకే తెలుస్తాయి. ఒకవేళ మందుల మోతాదును తక్కువగా ఇస్తుంటే... రోగకారక క్రిములు క్రమంగా యాంటీబయాటిక్స్ తమపై పనిచేయని విధంగా నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవచ్చు. అందుకే డాక్టర్లు నిర్దేశించిన మేరకు మాత్రమే, వారు చెప్పిన కాల వ్యవధి వరకే వాటిని వాడాలి. దురుపయోగం చేయవద్దు... మన ప్రాణాలను రక్షించే ఈ యాంటీబయాటిక్స్ మందులను అదేపనిగా వాడటం వల్ల లేదా అవసరమైనదాని కంటే చాలా ఎక్కువ మోతాదుల్లో వాడటం వల్ల ఎన్నో దుష్పరిణామాలు ఉన్నాయి. మనకు చెడు చేసే సూక్ష్మజీవులు ఈ మందులకు నిరోధకత (రెసిస్టెన్స్) సాధిస్తే... ఆ తర్వాత మనల్ని రక్షించుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే యాంటీబయాటిక్స్ను దురుపయోగం చేసుకుని, వాటిని నిరుపయోగం చేసుకోకుండా, యాంటీబయాటిక్స్ పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. చదవండి: Green Tea- Weight Loss: గ్రీన్ టీ ఎంత మంచిది? నిజంగానే బరువు తగ్గుతారా? -
టీబీ లేకుండానే మందులిచ్చారు!
కృష్ణాజిల్లా, నూజివీడు : పట్టణంలోని జీఎంహెచ్ (అమెరికన్ ఆస్పత్రి)లోని ఎక్స్రే యూనిట్ సిబ్బంది ఒకరి ఎక్స్రే రిపోర్ట్ మరొకరికి ఇవ్వడంతో లేని టీబీ రోగానికి ఐదు నెలల పాటు మందులు మింగిన మహిళ ఉదంతమిది. ముసునూరు మండలం సూరేపల్లికి చెందిన కోకిలపాటి రజని (27) ఈ ఏడాది మే 30వ తేదీ అస్వస్థతగా ఉంటే వైద్యం కోసంపట్టణంలోని అమెరికన్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పరిశీలించి ఊపిరితిత్తులు ఎక్స్రే తీయించడంతో పాటు కొన్ని రక్తపరీక్షలు సైతం చేయించి నెమ్ము, టీబీ లక్షణాలున్నాయని చెప్పగా, డబ్బులు పెట్టుకోలేమని రజని చెప్పడంతో ప్రభుత్వాస్పత్రికి వెళితే ఉచితంగా ఇస్తారని తెలిపారు. దీంతో ఏరియా ఆసుపత్రిలోని టీబీ యూనిట్ వద్దకు వెళ్లగా వాళ్లు ఎక్స్రే చూసి టీబీ మందులు ఇచ్చేశారు. ఆ మందులు ఆమె వాడుతుండగా తీవ్ర స్థాయిలో నీరసానికి గురవ్వడం జరుగుతుండటంతో ప్రతి రోజూ గ్రామంలోనే సెలైన్ పెట్టించుకుంటూ నెట్టుకొస్తోంది. పరిస్థితి మరింత తీవ్రమవుతుండటంతో ఏరియా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు శ్రీకాంత్ వద్దకు ఈ నెల 8న వచ్చి తన బాధ చెప్పుకోవడంతో ఆయన మళ్లీ ఎక్స్రే తీయించగా టీబీ ఏమీ లేదని తేలింది. అమెరికన్ ఆసుపత్రిలో తీసిన ఎక్స్రేను మంగళవారం డాక్టర్కు చూపించారు. ఆయన పరిశీలిం చి ఆ ఎక్స్రే బి.గోపయ్య అనే వ్యక్తిదని, దానిపై బి.గొప్పయ్య అని ఉందని చెప్పారు. అమెరికన్ ఆసుపత్రిలోని ఎక్స్రే యూనిట్ సిబ్బంది తప్పిదానికి రజనీ అవస్థపడాల్సివచ్చింది. బాధితురాలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. టీబీ యూనిట్లోనూ నిర్లక్ష్యమే.. ఎక్స్రే రిపోర్టు తీసుకువచ్చినప్పుడు దానిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు కళ్లె పరీక్ష చేసి నిర్ధారించాల్సిన టీబీ యూనిట్ సిబ్బంది కూడా ఇక్కడ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందరి నిర్లక్ష్యానికి రజనీ నాలుగు నెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement