-
డీఎస్సీ జాప్యంతో నిరుద్యోగుల ఆత్మహత్య
సీఎం కేసీఆర్కి ఆర్.కృష్ణయ్య లేఖ సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్ జాప్యం కారణంగా ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రని, దీనిపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎం కేసీఆర్కి బహిరంగ లేఖ రాశారు. నోటిఫి కేషన్ జాప్యం కారణంగా ఇటీవలే నారా యణఖేడ్లో మన్నేపు రామకృష్ణ అనే నిరు ద్యోగి, అంతకు ముందు మరో నలుగురు మరణించినట్లు పేర్కొన్నారు. టెట్ ఫలి తాల తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తామని 15 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి ప్రకటించినా చేయలేదన్నారు. మూడేళ్లుగా ఆరు సార్లు టీచర్ పోస్టుల భర్తీ వాయిదా వేశారని, సెప్టెంబర్ 12లోగా టీచర్ పోస్టు ల భర్తీ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతిని గుర్తు చేశారు. -
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్: చక్రపాణి
► వైద్యశాఖలో 400 పోస్టులు ► వ్యవసాయ శాఖలో 10,150 ఏఈవోల భర్తీ ఖమ్మం: రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామని టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం అష్ణగుర్తి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే 5వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టామని, త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదలవుతాయని అన్నారు. 15వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని, నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిస్థాయిలో నియామకాలు జరుగుతాయన్నారు. 12 ఏళ్లుగా వివాదంలో ఉన్న గ్రూప్-1 పోస్టుల భర్తీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం నుంచి జీవో వస్తే వెంటనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, మొత్తం 8వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతాయన్నారు. రెండు మూడు రోజుల్లోనే ఫారెస్ట్ బీట్, రేంజ్ అధికారుల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఈ పోస్టులకు ఇంటర్ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజావైద్యం పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని, ఆ శాఖలో కూడా ఖాళీల భర్తీకి మరో 400 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని, ప్రధానంగా పారామెడికల్ స్టాఫ్కు సంబంధించిన నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. వ్యవసాయ శాఖలో 10,150 ఏఈవోలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
'ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే'
గండీడ్ (రంగారెడ్డి): తెలంగాణలో ఇప్పట్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లా గండీడ్ లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం టీచర్ల పదోన్నతులు, బదిలీలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తోన్న వారిపై తెలంగాణ ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement