-
నూరు దెబ్బలు తిన్న జీవితం
ప్రతిధ్వనించే పుస్తకం పోరాటంలో గొప్ప నాయకులుగా పేరొందినవాళ్ల జీవిత చరిత్రలు ఒక రకమైన దృష్టికోణాన్ని ఇస్తాయి. నల్లా నరసింహులు క్షేత్రస్థాయిలో పనిచేసినవాడు కాబట్టి ఆ అనుభవాలు ఇవ్వగలిగే తీవ్రత వేరే. ‘కడవెండి గ్రామాన నల్లోల నర్సిమ్మ/ పేర్జెప్పి గుంజికొట్టెరా దొరగాడ/ నీకైన మొనగాడురా’ అని ఆ ప్రాంతపు జనం పాడుకునేవారు. ‘జనగామ సింహం’ నల్లా నరసింహులు (2 అక్టోబర్ 1926 – 5 నవంబర్ 1993) వరంగల్ జిల్లా కడవెండిలో జన్మించారు. ఏడవ తరగతి చదువుకున్నారు. వృత్తిరీత్యా చేనేత కార్మికుడు. ‘పోరాటం ముగిసిన తర్వాత’ ఆయన మీద పడిన మరణ శిక్ష, యావజ్జీవ శిక్షలు రద్దయినాక 1959లో జైలు నుంచి విడుదలైనారు. 1987లో తెలంగాణ సాయుధ పోరాటం 40వ వార్షికోత్సవం సందర్భంగా యోధులు తమ అనుభవాలు నివేదించాలన్న కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు నివేదిక బదులు పుస్తకమే రాశారు. ‘తెలంగాణ సాయుధ పోరాటం: నా అనుభవాలు’ 1989లో ప్రచురితమైంది. అందులోని కొన్ని భాగాలు ఇక్కడ: సౌజన్యం: విశాలాంధ్ర. ‘దొరసాని (విసునూరు రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ) దగ్గర పనిచేసే 20 మంది జీతగాళ్లతో సహా ఆ గ్రామంలో జీతగాళ్లందరిని సంఘటిత పర్చి ఒక రోజు సమ్మె జరిపించినాము. 3 రోజుల తర్వాత రైతులు సంప్రదింపులకు దిగారు. రైతులు ఇచ్చే రేటు తాను కూడా ఇస్తానని దొరసాని తన ఏజెంటును సంప్రదింపులకు పంపించింది. 3 కుంచాల జొన్నలకు బదులు నాలుగు కుంచాలకు నెలజీతం పెంచబడింది. తూమెడుకు బదులు ఇద్దు ధాన్యం సంవత్సరానికి భిక్షం పేర అదనంగా ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. సంవత్సరానికి 15 రోజులు సెలవు కూడా అంగీకరించారు.’ ‘ఒకనాడు భూస్వామి రామచందర్రావు గ్రామంలో ఒక బజారు వెంట వస్తుండగా పొరపాటున ఒక రైతు తన ఇంటిముందు అరుగుమీద కూర్చున్నాడు. రైతు భూస్వామి వచ్చి వెళ్లిన విషయాన్ని కనిపెట్టలేదు. ఇంకేముందీ ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువగాదన్నట్లు’ మొత్తం గ్రామములోని ప్రజల ఇంటిముందరి అరుగులన్ని మూలమట్టంగా కూలగొట్టించాడు.’ ‘భూస్వాములకు, పోలీసులకు వ్యతిరేకంగా అలజడి చేస్తారా? సాధారణ యువకుడవు నీవు చెప్పితే ఇన్ని వందల ప్రజలు ఒక్కమాట మీద ఆగి మామీదికి రాకుండా చేయగలిగిన సత్తా ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పమని ఒక సాకుతో బోర్ల పండబెట్టి ఒక జవాన్ నడుంమీద కూర్చోని అరికాళ్లు పైకి లేపి పట్టుకున్నాడు. మరొక జవాను కర్రతో అరికాళ్లపై కనీసం 100 దెబ్బలైనా కొట్టాడు. రక్తం ఎర్రగా కమిలి రెండు రోజులు లేవకుండా అడ్డం పడిపోయాను. పోలీసులు మాకు మూత్రం త్రాగించడం, వారి వృషణాలను నోటిలో చొప్పించడం లాంటి కిరాతకాలకు పాల్పడ్డారు.’ ‘(నల్లగొండ) జైలు ప్రధాన ద్వారంలో అడుగుపెట్టిన తక్షణమే కుడికాలికి ఒక ఇనుప కడియం తగిలించారు. చెప్పులు కూడా లోపల తొడగటానికి వీలు లేకుండా ఆఫీసులో పడవేయించారు. ఆ రాత్రి ఎలాగో కాలం గడిపాము. తెల్లవారి ముఖాలు కడుక్కున్నంక రొట్టెలు ఇచ్చారు. అవి ఇనుప కంచాలు. కొద్దిగా ఆలస్యం జరిగితే వాటిలో పోసిన పులుసుకు చిలుము వచ్చి తినడానికి వీల్లేకుండా డోకు వచ్చేది.’ ‘(మహబూబ్నగర్ జైలు నుండి జంపుఖానాను నిలువుగా చించి, వాటిని జోడించి, ఆ పొడవు సరిపోక ధోవతి కూడా దానికి కట్టి, గోడ దూకి పారిపోయాక) అంతకు క్రితం సాయంత్రం 6 గంటలకు భోజనం చేసిన మేము పరుగులెత్తడం, దూరం ప్రయాణించడం వలన ఆకలి వేసింది. 25 ఏళ్ల ప్రాయం గల ఆ రైతు వేరుసెనగ కాల్చి మాకు పెట్టాడు. మేము కడుపు నిండా తిని నీరు తాగాం. మొలకు పంచ లేదని, ఏదైనా ఒక పాత పంచె ఇవ్వమని ఆ యువకున్ని కోరినాం. తన వద్ద పంచెలు లేవని చెప్పాడు. నా మొలకు కట్టుకున్న కొత్తచొక్కా తీసుకుని ఏదైనా ఒక పాతపంచ తీసుకువచ్చి ఇవ్వమని కోరినాను. అతడు గ్రామంలోకి వెళ్లి పాతపంచె తెచ్చాడు. దానిని నేను మొలకు కట్టుకుని నా చొక్కా అతనికిచ్చి వేశాను.’ -
1969 తెలంగాణ ఉద్యమకారుడికి రూ.10 లక్షల సహాయం
జైళ్లకు వెళ్లిన వారికి పింఛన్లు ఇవ్వడం వీలుకాదు: నాయిని సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తొలి విడత ఉద్యమంలో పాల్గొని పోలీసు కాల్పుల్లో గాయపడ్డ సికింద్రాబాద్కు చెందిన పగడాల పరంధాములుకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఈ మేరకు గురువారం సచివాలయంలో రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరంధాములుకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ రాష్ట్రం కోసం తొలి, మలి ఉద్యమాల్లో త్యాగాలు చేసినవారి సేవలను ప్రభుత్వం మరువదన్నారు. తెలంగాణ కోసం అసువులు బాసిన ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారన్నారు. ఆయా కుటుంబాల్లో అర్హులకు ఉద్యోగాలు కూడా ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లిన వారికి పింఛన్లు అందజేయాలన్న డిమాండ్ ఉన్నా, అది సాధ్యం కాదన్నారు. 1969లో, 2001 తరువాత జరిగిన మలి ఉద్యమంలో వేలాది మందిపై కేసులు నమోదై అరెస్టయ్యారని తెలిపారు. అప్పట్లో బడులే జైళ్లుగా మారాయన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో 1975 ఎమర్జెన్సీ కాలంలో జైళ్లకు వెళ్లిన వారికి పింఛన్లు అందజేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పరంధాములుకు 1969లో జనరల్ బజార్లో జరి గిన కాల్పుల్లో రెండు తూటాలు శరీరంలోకి వెళ్లాయని, ఆయన ఈ విషయాన్ని తన దృష్టికి తేవడంతో సీఎంకు చెప్పి ఆర్థిక సాయాన్ని మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరంధాములు సతీమణి సత్యలీల పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement