-
ఊహించలేని విధంగా అభివృద్ధి
బీబీనగర్:ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఊహించలేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని జమీలాపేట, నెమురగొముల, రాయరావుపేట గ్రామాల మీదుగా చేపట్టిన రహదారి విస్తరణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కేసీఆర్ నిద్ర లేకుండా శ్రమిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో అలవెన్సు పెట్టుకున్న టీడీపీ సైతం ఆంధ్రా రాష్ట్రానికి నిధులు తెచ్చుకోలేకపోయిందని కాని టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంతో అలవెన్సు లేకపోయినా కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారని తెలిపారు. రానున్న 4ఏళ్లలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తయారు చేస్తామని దీంట్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల శాశ్వత సమస్యల పరిష్కారం కోసం వాటర్గ్రిడ్, ధర్మల్ప్లాంట్ లాంటి పెద్ద ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చేపడుతూ జిల్లాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందన్నారు. క్షణం తీరిక లేకుండా పని చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత ఎవరికీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఎంపీపీ గోళి ప్రణిత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏరుకల సుధాకర్గౌడ్, జెడ్పీటీసీ బస్వయ్య, సర్పంచ్లు మీరాబాయి, నర్సింహ, అనసూయ, అంజయ్య, ఎంపీటీసీ మన్నె బాల్రాజు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధే లక్ష్యంగా..
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని..బంగారు తెలంగాణకు బాటలు వేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. 66వ గణతంత్ర దిన వేడుకలు జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కలెక్టర్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో అభ్యుదయం వైపు పయినిస్తామని..అభివృద్ధి సాధిస్తామని అన్ని రకాలుగా బాగుపడుతామని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో పురోగమింపచేయడానికి అవసరమయ్యే పథకాలను, ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం జరుగుతోందని వివరించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్లు అర్పించారు. సందర్భంగా సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. వ్యవసాయం పంట రుణాల మాఫీ పథకం కింద జిల్లాకు రూ.634 కోట్లు విడుదల చేయగా ఇప్పటి వరకు 4 లక్షల 74వేల రైతుల ఖాతాలకు రూ.561 కోట్లు జమ చేశారని తెలిపారు. 2009 నుంచి 2014 వరకు వడగండ్ల వాన, అతివృష్టి, అనావృష్టి, కరువు, తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.65 కోట్లు లక్షా 53వేలు వారివారి ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ చెప్పారు. ఖరీఫ్, రబీ సీజనల్లో పంట రుణాల కింద రైతులకు రూ.1752 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.1995 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఖరీఫ్లో 60 వేల 495 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.85 కోట్లతో కొనుగోలు చేసి రైతులకు ఆమొత్తాన్ని చెల్లించి మద్ధతు ధర కల్పించామని చెప్పారు. మిషన్ కాకతీయ రాష్ట్ర ప్రభుత్వం చెరువులు సంరక్షణ, పునరుద్ధర ణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 952 చెరువులనను మరమ్మతు చేయనున్నారని వివరించారు. ఇప్పటి వరకు 472 చెరువులకు రూ.275 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేసి పరిపాలనా ఆమోదానికి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. వాటర్గ్రిడ్ వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.25 వేల కోట్లతో తెలంగాణలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని రాష్ట్రంలో మన జిల్లాలోని చౌటుప్పుల్ గ్రామంలో త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదు గా పైలాన్ ఆవిష్కరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. నక్కల గండి జిల్లా ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు, ఫ్లోరైడ్ నివారణకు 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.6,500 కోట్లతో నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణం అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. విద్యుత్ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీర్చడమేగాక, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు గతేడాది డిసెంబర్ 23 తేదీన ఏరియల్ సర్వే నిర్వహించి 6,800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు రూపకల్పన చేశారని తెలిపారు. ఇప్పటికే 10,700 ఎకరాల్లో భూ సేకరణ సర్వే పూర్తి చేసుకుని అటవీ భూములను అటవీయేతర భూములుగా మార్చేందుకు గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. నిమ్స్కు బదులు ఎయిమ్స్ బీబీనగర్ మండలం రంగాపురంలో నిర్మాణ దశలో ఉన్న ని మ్స్ను సీఎం కేసీఆర్ ఇటీవల సందర్శించారని, రాష్ట్రానికే తలమానికంగా నిలిచే విధ ంగా ఎయిమ్స్గా మార్చుటకు, హెల్త్ హబ్ ఏర్పాటు చేయాలనే కీలక నిర్ణయాన్ని ప్రకటించినందుకు జిల్లా ప్రజల తరపున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. మరో తిరుపతిగా.. యాదగిరిగుట్ట యాదగిరిగుట్టను ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని హంగులతో అభివృద్ధి పర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగా రూ.750 కో ట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటికే మంజూరు చేసిన రూ.100 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అదే విధంగా తెలంగాణకు హరితహారం, ఉద్యానవనశాఖ, ఆసరా పింఛన్లు, ఎస్సీ మహిళలకు 3 ఎకరాల భూ పంపిణీ, ఆహార భద్రత కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం, రోడ్ల మరమ్మతులు, తదితర పథకాల అమలును వివరించారు. రాచకొండతోపాటు జిల్లా గ్రామీణాభివృద్ధి, పురపాలన పురోగతి, ఇతర సంక్షేమ పథకాల అమలకు కృషి చేస్తున్న అధికారులను ఆయన అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లవేళలా కృషి చేస్తూ, జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలలో పోలీస్ యంత్రాంగం సహాయ, సహకారాలందించడంతోపాటు, వాటిల్లో పాలుపంచుకుంటున్న వారందరికి కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎస్పీ టి.ప్రభాకర్రావు, నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, జేసీ సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్రెడ్డి, డీఆర్వో నిరంజన్, డీఆర్డీఏ పీడీ చిర్రా సుధాకర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వేలానికి వేళాయే!
* ఆ జాబితాలో 3,500 ఎకరాలు హెచ్ఎండీఏ భూములు? * రూ.6,500 కోట్ల సమీకరణకు సర్కార్ యోచన * నగర శివార్లలో ‘రియల్’కు పూర్వ వైభవం సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరానికి సమీపంలోని ప్రభుత్వ భూముల విక్రయానికి రంగం సిద్ధమవుతోంది. వివిధ విభాగాల వద్ద నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల లెక్కతేల్చిన సర్కార్... వాటిని విక్రయించడం ద్వారా సమకూరే నిధులతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలనుకుంటోంది. వివిధ ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూములు దీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్నట్లయితే వాటిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం...భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఆదేశాలిచ్చిన విషయం విదితమే. వీటి అమ్మకం ద్వారా రూ.6,500 కోట్లు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల బడ్జెట్లోనూ ఈ అంశాన్ని పెట్టింది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూముల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నిధులు సమకూర్చుకోవడమే గాక... అక్కడ వివిధ సంస్థల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్న ద్విముఖ వ్యూహంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ భూముల వివరాలను ఇటీవల తెప్పించుకొంది. వీటిలో సింహభాగం హెచ్ఎండీఏకు చెందిన 3,500 ఎకరాలు...
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement