-
వలస జీవులపై మృత్యు పంజా
వెలిగండ్ల/హనుమంతునిపాడు: దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకుని..తిరిగి వస్తూ కాసేపట్లో గమ్యం చేరతారనగా వారు వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొని పది మంది విగతజీవులయ్యారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గు జిల్లా రాజ్నంద్గావ్ సమీపంలోని సోమనీ గ్రామం వద్ద ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల, హనుమంతునిపాడు, సీఎస్పురం, కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలాలకు చెందిన 9 మంది, బిలాయ్నగర్కు చెందిన స్కార్పియో డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల బంధువులు తెలిపిన వివరాల మేరకు..వెలిగండ్ల మండలం పాపాయిపల్లి, హనుమంతునిపాడు మండలం మంగంపల్లి, సీఎస్పురం మండలం వెంగనగుంట, మర్రిపూడి మండలం గార్లపేట గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు 20 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాయ్ నగరానికి వలస వెళ్లాయి. కొందరు బిలాయ్లోని ఉక్కు కర్మాగారంలో, మరికొందరు స్థానికంగా వివిధ కార్యాలయాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. బిలాయ్ నగరంలోని క్యాంప్–1లో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పండుగలు, శుభకార్యాలకు స్వగ్రామాలకు వచ్చి వెళ్తుంటారు. దసరా ఉత్సవాలు కావడంతో శనివారం రాత్రి దుర్గు జిల్లా రాజ్నంద్గావ్ సమీపంలో డోంగర్గడ్లో ఉన్న దుర్గా మాత గుడికి స్కార్పియో వాహనంలో వెళ్లి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం తిరిగి క్యాంప్నకు వస్తున్నారు. క్యాంప్నకు 25 కి.మీ దూరంలో రాజ్నంద్గావ్ సమీపంలోని సోమనీ గ్రామం వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న లారీ వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని ఢీకొంది. ఈ సంఘటనతో వెలిగండ్ల మండలం పాపాయిపల్లికి చెందిన శెట్టి మంజు (18), శెట్టి వెంకట లక్ష్మి (27), హనుమంతునిపాడు మండలం మంగంపల్లికి చెందిన పాపాబత్తుని పెద్ద మంగయ్య (30), అతని భార్య వెంకటలక్ష్మి (25), పాపాబత్తుని మనీషా(15), సీఎస్పురం మండలం వెంగనగుంట గ్రామానికి చెందిన కుడారి ఆదినారాయణ (32), అతని భార్య సావిత్రి(28), మర్రిపూడి మండలం గార్లపేటకు చెందిన అండ్ర విజయ్కుమార్ (32), అతని భార్య నాగమణి(25) అక్కడికక్కడే మృతి చెందారు. పాపాయిపల్లికి చెందిన శెట్టి వెంకటలక్ష్మి భర్త శెట్టి వెంకటేశ్వర్లు, శెట్టి బాబు, మంగంపల్లికి చెందిన పాపాబత్తిన మహేంద్రలు తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్నారు. కుడారి ఆదినారాయణ, భార్య సావిత్రిల ఏకైక కుమారుడు 5 సంవత్సరాల నితీష్ ప్రాణాలతో బయటపడ్డాడు. తల్లిదండ్రులను కోల్పోయిన నితీష్ను చూసి బంధువులు విలపిస్తున్నారు. మృత్యువులోనూ వీడని బంధం: దసరా పండుగ సందర్భంగా భార్యాభర్తలు కలసి జంటలుగా దుర్గాదేవిని దర్శించుకునేందుకు వెళ్లి వస్తుండగా మృత్యువు ఆ కుటుంబాలను వెంటాడింది. మృతుల్లో మూడు జంటలు ఉన్నాయి. భార్యా భర్తలు ఇద్దరూ ఒకేసారి చనిపోవడం బంధువులను కలిచివేసింది. శోకసంద్రంలో బంధువులు: మృతి చెందిన వారందరూ సమీప బంధువులు. వీరి మరణవార్త విని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పాపాయిపల్లి, మంగంపల్లి, వెంగనగుంట, గార్లపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరణవార్త విన్న బంధువులు మృతులను చూసేందుకు బిలాయ్ వెళ్లారు. మంగంపల్లిలో విషాదం మంగంపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలియడంతో గ్రామంలో విషాదం నిండింది. మంగంపల్లికి చెందిన మంగయ్య, వెంకటలక్ష్మిలు సింగరాయకొండలో హోటల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల బిలాయ్నగర్ క్యాంప్లో ఉంటున్న మంగయ్య మామ చిన్నబాలయ్యను చూసేందుకు భార్య వెంకటలక్ష్మితో కలిసి వెళ్లారు. నిన్న మొన్న మొన్నటి వరకు కళ్లముందే ఉండి అత్తగారి ఇంటికి వెళ్లొస్తామని చెప్పి వెళ్లిన వారు కానరాని లోకాలకెళ్లారని మంగయ్య తండ్రి రోశయ్య కన్నీరు మున్నీరయ్యాడు. రోశయ్యకు ముగ్గురు కుమారులుండగా మంగయ్య పెద్ద కుమారుడు. పెళ్లయిన ఏడాదికే... గార్లపేట (మర్రిపూడి): పెళ్లయిన ఏడాదికే గార్లపేటకు చెందిన జంట ఛత్తీస్గఢ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. మండలంలోని గార్లపేట గ్రామానికి చెందిన ఆండ్ర విజయకుమార్(32), వెలిగండ్ల మండలం పాపాయిపల్లి గ్రామానికి చెందిన నాగమణి(25) తో 2017 అక్టోబర్లో వివాహమైంది. బతుకుదెరువు నిమిత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లారు. విజయకుమార్ తండ్రి రోశయ్య రైల్వే ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. రోశయ్యకు ముగ్గురు సంతానం. చివరి సంతానంగా జన్మించిన విజయకుమార్ అక్కడే ఉంటూ వెల్డర్ పనిచేస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో విజయకుమార్, నాగమణిలు చనిపోయినట్లు తెలుసుకున్న బంధువులు భోరున విలపించారు. హుటాహుటిన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి బయలు దేరి వెళ్లారు. -
శ్రీలంకలో బస్సు ప్రమాదం: 11 మంది మృతి
శ్రీలంకలోని మధ్య బందర్వాలా కొండ ప్రాంతంలో గత రాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 10 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి అజిత్ రోహన్ మంగళవారం వెల్లడించారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారని తెలిపారు. బస్సు కొండపై నుంచి కిందకి వస్తున్న క్రమంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. వాతావరణం చాలా ప్రతికూలంగా ఉండటం వల్ల ఆ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించారు. అయితే అధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలు చేపట్టలేకపోయామని అజిత్ రోహన్ వెల్లడించారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement