-
ఈ జర్నలిస్టు.. ఉగ్రవాద నిందితుడట!!
రాజ్దీప్ సర్దేశాయ్ పేరు తెలియని భారతీయులు చాలా తక్కువ మంది. ఎన్నికలతో పాటు దేశంలో ప్రధాన రాజకీయ పరిణామాలు ఎప్పుడు చోటుచేసుకున్నా తనదైన శైలిలో జాతీయ మీడియా చానళ్లలో విశ్లేషణలు అందిస్తుంటారు. అలాంటి వ్యక్తి ఫొటోను ఒడిషాకు చెందిన ఒక వార్తాపత్రిక తన మొదటి పేజీలో ప్రచురించింది. ఆయన ఏదో పెద్ద పాత్రికేయుడని ఆ ఫొటో వేస్తే పర్వాలేదు.. ఉగ్రవాద కేసులో నిందితుడు ఈయనే అంటూ ఆ ఫొటోను ఫొటోషాప్లో కొద్దిగా మార్పుచేర్పులు చేసి ప్రచురించింది. దాంతో.. సర్దేశాయ్ తీవ్ర ఆగ్రహావేశాలకు గురయ్యారు. సంబద్ అనే ఒడియా పత్రిక తన ఫొటోను స్కెచ్ గా మార్చి ప్రచురించిందని, ట్విట్టర్లో ఎవరో ఏదో చెబితే దాన్ని పట్టుకుని ఇలా వేసేశారని ఆయన ట్వీట్ చేశారు. ఫొటోషాప్ చేసిన ఫొటోలు, అబద్ధాలు, తప్పుడు రిపోర్టింగ్.. వీటితో ఇంకెంత కాలం ఈ భక్తుల సైన్యం ట్విట్టర్లో తనవెంట పడతారని ఆయన ప్రశ్నించారు. దాంతో సంబద్ పత్రిక ఎడిటర్ ట్విట్టర్ ద్వారా సర్దేశాయ్కి క్షమాపణలు తెలిపారు. అయినా ఆయన శాంతించలేదు. క్షమాపణలను అంగీకరిస్తాను గానీ, తప్పు చేసిన విషయాన్ని పత్రిక మొదటిపేజీలో తన ఫొటోతో మళ్లీ ప్రచురించాలని డిమాండ్ చేశారు. ఆయన చెప్పినట్లే మొదటిపేజీలో ఆయన ఫొటోతో సహా క్షమాపణ వార్తను బాక్సు కట్టి మరీ ప్రచురించారు. దాన్ని కూడా రాజ్దీప్ మళ్లీ ట్వీట్ చేసి చెప్పారు. గతంలో రాజ్దీప్ సర్దేశాయ్ ట్విట్టర్ అకౌంటును కొంతమంది హ్యాక్ చేశారు. దాన్నుంచి అసభ్యకర సందేశాలు పంపారు. దాంతో కొన్నాళ్ల పాటు ఆయన తన ట్విట్టర్ ఖాతాను ఆపేశారు. Just saw a Odhiya newspaper Sambad puts up my sketch as a terror suspect based on RW Twitter gang mischief.If not war, these guys will kill! — Rajdeep Sardesai (@sardesairajdeep) 23 September 2016 Photo shopped pics,lies,fake reporting, abuse: what next will this bhakt army stoop to on Twitter? And who will call their diabolical bluff? — Rajdeep Sardesai (@sardesairajdeep) 23 September 2016 @sambad_odisha is this journalism? U should be ashamed to put up photo shopped pics as news — Rajdeep Sardesai (@sardesairajdeep) 23 September 2016 @sardesairajdeep Sir, we sincerely apologise for this grave error on our part. — Sambad (@sambad_odisha) 23 September 2016 Apology accepted but expect it with the same prominence on your front page Tomw. And start a refresher course. https://t.co/Z7IAqbUE4a — Rajdeep Sardesai (@sardesairajdeep) 23 September 2016 Appreciate unreserved apology from editor @sambad_odisha on front page. Lesson for all of us to be more careful. pic.twitter.com/QPF6sWB976 — Rajdeep Sardesai (@sardesairajdeep) 24 September 2016 -
ఆ ఏడుగురు ఉగ్రవాదులను మీరు చూశారా?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఉగ్రవాదుల కలకలం రేగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు అనుమానిత వ్యక్తులు డెహ్రాడూన్లో ఓ వీధిలో వెళుతుంటే సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉత్తరాఖండ్ పోలీసులు ఆ వీడియోను వాట్సాప్లో విడుదల చేశారు. వారిని ఎక్కడైనా చూసి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇందులో చూపిన ప్రకారం ముందు ముగ్గురు ఆతర్వాత నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా చుట్టుపక్కల చూస్తూ ముఖాలకు ముసుగు ధరించి, వీపులపై బ్యాగులు తగిలించుకొని సీసీటీవీ కెమెరా ముందు నుంచి కదిలారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు అడుగడుగునా అన్ని రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా అనుమానిత చోట్ల సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఏడుగురు అనుమానితులు డెహ్రాడూన్లోని ఓ వీధిలో కనిపించారు. దీంతో పోలీసులు రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించారు. వారి కోసం గాలింపులు ప్రారంభించారు. ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు పెట్టుకున్న నలుగురు వ్యక్తులను సీసీటీవీ ఆధారంగా హరిద్వార్ లోని రూర్కీలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా సీసీటీవీ ఫుటేజి కూడా సంచలనం రేపుతోంది. -
పాక్ మహిళా రాయబారిపై ఉగ్రవాద ఆరోపణలు!
బంగ్లాదేశ్లో పనిచేస్తున్న పాక్ రాయబారిపై ఉగ్రవాద ఆరోపణలు రావడంతో.. ఆమెను పాక్ వెంటనే వెనక్కి పిలిపించింది. ఇంతకుముందు దాదాపు ఏడాది క్రితం ఇలాగే ఓ పాకిస్థానీపై ఉగ్రవాద ఆరోపణలు రాగా, అప్పట్లో బంగ్లాదేశ్ ఆ రాయబారిని బహిష్కరించింది. తాజాగా ఫరీనా అర్షద్ అనే మహిళా రాయబారిని సొంత దేశానికి తీసుకెళ్లాలని పాక్ను బంగ్లా కోరింది. దాంతో వెంటనే ఆమెను వెనక్కి పిలిపించారు. ఢాకాలో ఉన్న పాక్ హైకమిషన్లోని రాజకీయ విభాగంలో సెకండ్ సెక్రటరీగా పనిచేస్తున్న అర్షద్ తమ దేశాన్ని వీడి వెళ్లిన విషయాన్ని బంగ్లా నిర్ధారించింది. జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) అనే సంస్థకు చెందిన ఇద్రిస్ అనే ఉగ్రవాదిని పట్టుకున్నప్పుడు తమ సంస్థకు అర్షద్తో సంబంధాలున్నాయని, ఆమే తమకు డబ్బులు పంపుతోందని చెప్పారు. తాను ఆమెతో కలిసి ఆమె కారులోనే తిరిగానని, అప్పుడే ఆమె తనకు 382 డాలర్లు ఇవ్వగా.. తాను గత రెండేళ్లలో 48 సార్లు పాకిస్థాన్ వెళ్లి వచ్చానని ఇద్రిస్ చెప్పాడు. కాగా, వారం రోజుల క్రితం అర్షద్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు కథనాలు రాగా, అవన్నీ నిరాధారమంటూ పాక్ హైకమిషన్ ఖండించింది. డిటెక్టివ్ బ్రాంచి నుంచి వచ్చిన లీకులనే కథనాలుగా రాశారంటూ విమర్శించింది. అయితే చివరకు అదే నిజమైంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement