-
కరోనా: ఈతలు, సమీప అడవిలో వనభోజనాలు
ధారూరు: ధారూరుకు కరోనా ముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మండలంలో ఈ రోజు వరకు ఒక్క పాజిటవ్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శని, ఆదివారాల్లో కోట్పల్లి ప్రాజెక్టుకు వస్తున్నారు. ప్రాజెక్టు నీటిలో ఈతలు కొడుతున్నారు. వన భోజనాలు చేసి ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. వీరిని అధికారులు నిరోధించలేకపోతున్నారు. అన్లాక్ ప్రక్రియ ఉండటంతో ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా పాజిటివ్ కేసులు నమోదైన పెద్దేముల్లో ఇప్పటికే స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతుండగా, తాండూరు, వికారాబాద్లోనూ ఒకటి రెండు రోజుల్లో వ్యాపార సముదాయాల బంద్ పాటించాలని వాణిజ్యవర్గాలు తీర్మానించాయి. ఆయా గ్రామాల మధ్య ఉన్న ధారూరులో వారాంతపు సంత కొనసాగుతోంది. దీనికి వికారాబాద్, యాలాల, పెద్దేముల్, కోట్పల్లి, పరిగి తదితర మండలాల నుంచి వాపారులు, కూరగాయల రైతులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. పక్క మండలాల్లో లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వినియోగదారులు ధారూరు సంతకు భారీగా వచ్చే అవకాశముంది. వీరిలో ఎవరికి కరోనా ఉందో.. ఎవరికి లేదో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు ధారూరులో ఒక్క కేసు లేదు. వికారాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నివాసం ఉంటున్న మండలానికి చెందిన ముగ్గురు ఈ వ్యాధిబారిన పడ్డారు. వినియోగదారులు ఇతర ప్రాంతాల నుంచి వస్తే మాత్రం మండలానికి కరోన వైరస్ వ్యాప్తి ప్రమాదం పొంచిఉందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ముప్పును అడ్డుకోవాలని అధికారులను కోరుతున్నారు. -
ధారూరు రైల్వేస్టేషన్లో అధికారుల పర్యటన
ధారూరు, న్యూస్లైన్: సైడింగ్ రైల్వే లైన్ల ఏర్పాటు విషయమై ఆదివారం ఓ రైల్వే ఉన్నతాధికారి ఇంజినీరింగ్ సిబ్బంది, చెట్టినాడు సిమెంట్ కంపెనీ ప్రతినిధులు కలిసి ధారూరు రైల్వే స్టేషన్ను సందర్శించారు. వికారాబాద్ మార్గంలో ఉన్న సోనీ సుద్ద కంపెనీ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి వరకు మధ్యలో ఉన్న దూరాన్ని ఆయన పరిశీలించారు. కాగా అధికారులు సందర్శన విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాండూరు మార్గంలో రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి విషయంలో గతంలో స్థానికులు ఆందోళన దిగిన నేపథ్యంలో అధికారులు రైల్వే సైడింగ్ లైన్ల నిర్మాణం విషయాన్ని గోప్యతను పాటిస్తున్నట్లు తెలిసింది. రైల్వే శాఖ సీసీఎస్ క్రిస్టఫర్ రైల్వే సైడింగ్ లైన్లు ఎన్ని వేయాలి..? ఎంత దూరం ఏర్పాటు చేయాలి..? ఎన్ని గూడ్స్ రైళ్లు ఆగే వీలుందనే వివరాలను సేకరించారు. రైల్వే సైడింగ్ లైన్లు వేయాలంటే తాండూరు వైపు ఎక్కువ వంపుగా ఉండడంతో చదును చేసేందుకు తీసుకోవాల్సి చర్యలను గురించి ఇంజినీరింగ్ సిబ్బందితో మాట్లాడారు. ముందుగానే సిద్ధం చేసుకున్న మ్యాప్ ప్రకారం సైడింగ్ లైన్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. అధికారుల పర్యటన వివరాల కోసం విలేకరులు రైల్వే అధికారిని వివరణ కోరగా ఆయన స్పందించలేదు. కాగా ధారూరులో స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. మీ స్టేషన్ నుంచి రోజుకు 150 మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారని, ప్రస్తుతం నడుపుతున్న ప్యాసింజర్ రైళ్లలో కొన్నింటిని హాల్టింగ్ నుంచి తప్పించాల్సి ఉంటుందన్నారు. ధారూరుకు 4 కిలోమీటర్ల దూరంలో స్టేషన్ ఉండడంతో ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో తాండూరు, వికారాబాద్కు బస్సుల్లో వెళ్లి అక్కడి నుంచి రైళ్లలో వెళ్తున్నట్లు విలేకరులు చెప్పగా.. అయితే మీ గ్రామం వరకు కొత్తగా రైల్వే లైన్ వేయమంటారా..? అంటూ ఎదురు ప్రశ్నించా రు. ఆయన వైఖరితో విలేకరులు నిర్ఘాంతపోయారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement