-
ఉప్పూరులో థర్మల్ కేంద్రం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి మెరుగుపడ్డ విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టుల ద్వారా ఫలాలు దక్కడంతో విద్యుత్ కొరతను అదిగమిస్తున్నారు. ఇక, మరిన్ని కొత్త ప్రాజెక్టుల దిశగా అడుగులు వేస్తున్న సీఎం జయలలిత రాష్ట్రంలో మిగులు విద్యుత్ లక్ష్యంగా కంకణం కట్టుకుని ఉన్నారు. ఇందులో భాగంగా పలు కొత్త ప్రాజెక్టులకు చర్యలు చేపట్టారు. రామనాథపురం ఉప్పూరులో 995 ఎకరాల విస్తీర్ణంలో తలా 800 మెగావాట్లు చొప్పున రెండు యూనిట్లతో నేల బొగ్గు సాయంతో ఉత్పత్తయ్యే థర్మల్ విద్యుత్ కేంద్రానికి నిర్ణయించారు. ఇందుకు గాను రూ. 12,778 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ పనులకు తగ్గ అన్ని కసరత్తులు పూర్తయ్యాయి. దీంతో ఉప్పూరు థర్మల్ విద్యుత్ కేంద్రం పనులకు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత శంకుస్థాపన చేశారు. అలాగే, పనులకు గాను తొలి విడతగా రూ.5,580 కోట్లను కేటాయించారు. ఇందుకు తగ్గ ఒప్పంద పత్రాల్ని బిహెచ్ఈఎల్ చైర్మన్ అతుల్ సోబ్తికి అందజేశారు. ఇక, విల్లుపురం జిల్లా ఉలందూరు పేటలో, చెన్నై వ్యాసార్పాడిలో, కృష్ణగిరి గురుపర పల్లిలో, కంచి కున్నం పట్టులో 230-110 కేవి, తిరువళ్లూరు అలమాడి, మదురై నాడార్ మంగలం, పుదుకోట్టై పూ కొడి, వేలూరు పున్నం, కడలూరు అదరిలో 110-33 కేవీ, తిరుప్పూర్ వేదనూర్, పుదూర్, ఈరోడ్ మొండియం పాళయంలలో 110-22, తిరువణ్ణామలై అత్తిమూరు, అంబట్టూల్లో 33-11 కేవిలతో రూ. 42 కోట్లతో నెలకొల్పిన విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు. రెవెన్యూ డివిజన్లు రెవున్యూశాఖ నేతృత్వంలో పుదుకోట్టై ఇలుప్పూర్లో కోటి 64 లక్షలతో నిర్మించిన రెవెన్యూ కార్యాలయం, అధికారుల క్వార్టర్స్ను ప్రారంభించారు. అలాగే, ఆ శాఖ పరిధిలో వివిధ ప్రాంతాల్లో రూ. 42 కోట్ల 81 లక్షలతో నిర్మించిన భవనాలు, అతిథి గృహాలు, క్వార్టర్స్లను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇక, చెన్నై ఎగ్మూర్, మదురై మేలూరు, కోయంబత్తూరు ఉత్తరం, విరుదునగర్ సాత్తూరుల్ని రెవెన్యూ డివిజన్లుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటుగా సోమవారం నుంచి ఆ నాలుగు ప్రాంతాలు రెవెన్యూ డివిజన్లుగా అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే, కీల్ పెన్నాత్తూరు, మేల్ మలయనూర్, కొండాచ్చిపురం, చూలగిరి, కరిమంగం, న ల్లవల్లి, కడయం, పల్లారం,పేర్నాంబట్టు, మానూరు, చెర్మింగాదేవి, కోరమ పాళయం, తలవాడి తదితర 16 రెవిన్యూ తాలుకాల్ని ప్రకటిస్తూ, అమల్లోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నత్తం విశ్వనాథన్, ఆర్బీ.ఉదయకుమార్, విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన దేశికన్, సలహదారు షీలా బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవాల అనంతరం సీఎం జయలలిత రాష్ట్రంలో వివిధ ప్రమాదాల్లో మరణించిన పలు కుటుంబాల్ని ఆదుకుంటూ తలా రూ.మూడు లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
సమగ్ర దర్యాప్తు
కూడగి ఘటనపై సీఎం ఆదేశం బాధితులకు పరామర్శ 23 మందిపై 23 కేసులు నమోదు సాక్షి, బెంగళూరు : కూడగి థర్మల్ కేంద్రం ముట్టడి సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం వెల్లడించారు. బీజాపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకా కూడగి వద్ద ప్రారంభించనున్న థర్మల్ విద్యుత్ కేంద్రం వల్ల తమ పంట పొలాలు నాశనమవుతాయని పలువురు రైతులు విద్యుత్ కేంద్రాన్ని శనివారం ముట్టడించిన సంగతి తెలిసిందే. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతులు చంద్రప్ప పూజారి, సదాశివ గుణాచారి గాయపడ్డారు. వీరిని స్థానిక కేఎల్ఈ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స ఇప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం వీరిద్దరిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని, ఈ విషయంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్నారు. గాయపడిన రైతులు మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ ఖర్చుతో అందివ్వనున్నట్లు చెప్పారు. కాగా, థర్మల్ కేంద్రం ముట్టడికి సంబంధించి 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై 23 కేసులు నమోదయ్యాయి. బాధితులను పరామర్శించిన వారిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోంశాఖ మంత్రి కేజే జార్జ్, న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచద్ర తదితరులు ఉన్నారు. రాజకీయం చేస్తున్నారు. మీడియాతో ఆదివారం బీజాపుర జిల్లా ఇన్చార్జి మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ... ‘థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికే పరిహారం అందించాం. ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయం కూర్చొని చర్చిస్తే సరిపోతుంది. అయితే బయటి వారు వచ్చి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ధర్నాకు ముందస్తు అనుమతి కూడా తీసుకోలేదు. విషయం దర్యాప్తు అనంతరం బయట పడుతుంది. ఇక బాధితులకు పరిహారం అందించే విషయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించిన తర్వాత చెబుతా’ అని పేర్కొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
2024 ఎన్నికల్లో ఇది బెస్ట్ ఫోటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
‘బిగ్ బ్రదర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
సర్జరీలపై ట్రోలింగ్.. అర్థం చేసుకోకుండా తిడతారేంటి? మీ వల్ల..
ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక
ఫస్ట్టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
తప్పక చదవండి
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement