-
విమానంలో నిరసన..పార్టీ అధ్యక్షుడి అరెస్ట్
సాక్షి, మధురై: విమానంలో నిరసన చేపట్టారని ఒక పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన ఘటన శనివారం తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నుంచి మధురై వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) అధినేత కేఏ మురుగన్ నిరసనకు దిగారు. మధురై విమానాశ్రయ పేరును యు. ముత్తురామలింగ థేవార్గా మార్చాలని, మురుగన్తోపాటు ఏఐఎఫ్బీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. విమానం మధురై ఎయిర్పోర్ట్కు చేరుకోగానే, నినాదాలకు దిగిన మురుగన్, ఏఐఎఫ్బీ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ముత్తురామలింగది థేవార్ సామాజికవర్గం. మాజీ పార్లమెంట్ సభ్యుడు ముత్తురామలింగ 1963లో మరణించారు. ఆయనను థేవార్ కులస్థుల ఆరాధ్య నాయకుడిగా చెప్తుంటారు. మధురై విమానాశ్రయ పేరును ముత్తురామలింగ థేవార్గా మార్చాలని మురుగన్, తమిళనాడు ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కలసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కొద్దిసేపటి తర్వాత మురుగన్తో సహా సదరు పార్టీ కార్యకర్తలను పోలీసులు విడిచిపెట్టారు. -
ఈసారి థేవర్ల ఓటు ఎవరికి ?
సాక్షి, న్యూఢిల్లీ : మధురై విమానాశ్రయానికి ముత్తురామలింగ థేవర్గా పేరు మార్చాలంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన కొన్ని వందల మంది బుధవారం నాడు విమానాశ్రయం ముందు ఆందోళన చేశారు. వారి పిలుపు మేరకు ఆ రోజున నగరంలోని దాదాపు ఐదు వేల దుకాణాదారులు బంద్ జరిపారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తమ ఉనికిని చాటు కోవడంతోపాటు, మధురై విమానాశ్రయానికి తమ గురువైన ముత్తురామలింగ థేవర్ పేరును పెట్టాలనే పెండింగ్ డిమాండ్ను నెరవేర్చుకోవడానికి ఇదే సమయం అంటూ వారు ఆందోళన చేపట్టారు. మొత్తం రాష్ట్ర జనాభాలో 8–10 శాతం ఉన్న థేవర్ల సామాజిక వర్గంలో మారవర్లు, కల్లార్లు, అగముడయ్యర్లు అనే మూడు ఉప కులాలు ఉన్నాయి. వీరందరిని రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలుగా గుర్తించింది. మధురై దక్షిణాది జిల్లాలైన శివంగంగాయి, థేని, తిరునెల్వేలిలలో వీరు ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడు ఏఐఏడిఎంకే పార్టీకి సంప్రదాయంగా ఓటు వేస్తున్న వీరు ఈ సారి తమ సామాజిక వర్గానికి చెందిన టీటీవి దినకరణ్ పార్టీకి ఓటు వేస్తామని చెబుతున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం దినకరణ్ ‘అమ్మ మక్కాల్ మున్నేట్ర కళగం’ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పిలుపు మేరకు థేవర్లు తాజా ఆందోళన చేపట్టారు. దేశ స్వాతంత్య్రానికి ముందు 1939లో స్వాతంత్య్ర సమర యోధుడు సుభాస్ చంద్రబోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ను ఏర్పాటు చేశారు. దేశ స్వాతంత్య్రానంతరం ఈ పేరుకు ముత్తు రామలింగ థేవర్ విశేష ప్రాచుర్యం కల్పించారు. అప్పటి నుంచి థేవర్లంతా ఈ పేరుతోనే ఓ సంఘంగా చెలామణి అవుతున్నారు. ముత్తురామలింగ చనిపోయాక మూడేళ్ల అనంతరం అంటే, 1971లో ఆయన సమాధి ప్రాంతాన్ని ఆయన స్మారక భవనంగా తీర్చిదిద్దారు. 1980లో ఆయన చిత్ర పటాన్ని రాష్ట్ర అసెంబ్లీలో వేలాడదీశారు. ఆయన జయంతి రోజైన అక్టోబర్ 30వ తేదీని థేవర్ల జయంతిగా జరుపుకుంటారు. 2018, అక్టోబర్ 30వ తేదీన మధురైలో ఉన్న ముత్తురామలింగ థేవర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎడప్పడి కే పళనిస్వామి, డిప్యూటి సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, దినకరన్లు సందర్శించి పూలమాలలు అలంకరించారు. మధురై విమానాశ్రయానికి ముత్తురామలింగ థేవర్ పేరు పెట్టాలంటూ థేవర్లు గత పదేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ను నెరవేర్చుకోవడానికి ఇదే అసలైన సమయమని వారు భావించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేపడతామని ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు..
కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement