-
అమ్మమ్మ తోడుగా..
తిమ్మాపూర్ : ఎంపీడీవో కార్యాలయం సమీపంలో మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన బారె చంద్రమణికి ఎల్ఎండీ రిజర్వాయర్ శివారులోనే అంత్యక్రియలు నిర్వహించారు. తమ ఆర్థిక స్థితి బాగాలేనందున, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లలేమని కుటుంబసభ్యులు చెప్పడంతో వారి సమక్షంలో రామకృష్ణకాలనీ సర్పంచ్ సారయ్య, గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజులపాటు గ్రామస్తుల సంరక్షణలోనే ఉన్న పిల్లలు అమ్మమ్మ చెంతకు చేరారు. కొంతకాలంగా రామకృష్ణకాలనీలో ఉంటున్న బారె చంద్రమణి, పొరండ్లకు చెందిన నీలం భాస్కర్ మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చంద్రమణి మరణించిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచి ఆమె తల్లిగారి ఊరైన కాటారం మండలం దామెరకుంటకు పోలీ సులు సమాచారంమందించారు. చంద్రమణికి ఏడేళ్లలోపు కుమార్తె, కుమారుడు ఉండగా రామకృష్ణాకాలనీ గ్రామస్తులే ఆలనాపాలనా చూశారు. మృతురా లి తల్లి మధునమ్మ, కుటుంబసభ్యులు బుధవారం రాత్రి కరీంనగర్ చేరుకోగా ఆమె ఫిర్యాదు మేరకు గురువారం ఎల్ఎండీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని దామెరకుంటకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు నిరాకరించారు. తమ ఆర్థికస్థితి బాగాలేదని చెప్పడంతో రామకృష్ణాకాలనీ సర్పంచ్ కిన్నెర సారయ్యతోపాటు గ్రామస్తులు కలి సి ఎల్ఎండీ శివారు లో ఖననం చేశారు. అప్పటి దాకా గ్రామస్తుల సంరక్షణలోనే ఉన్న మృతురాలి పిల్లలు మనోహర్(5), రమ్య(7)ను అంత్యక్రియల సమయంలో అక్కడికి తీసుకురాగా అమ్మమ్మను, మామయ్యను చూసి పిల్లలు విలపించారు. పిల్లల పరిస్థితి చూసి కుటుంబసభ్యులు, గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. అంత్యక్రియల అనంతరం పిల్లలిద్దరూ అమ్మమ్మతో వెళ్లిపోయారు. జీవితంపై విరక్తిచెంది... భాస్కర్ ఇంట్లో గొడవల కారణంగా అతనితోపాటు తన కూతురు చంద్రమణి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మధునమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రమణికి 2007 లో పోచమల్లుతో వివాహం కాగా ఇద్దరు పిల్లలు జన్మించారు. గొడవల కారణంగా నాలుగేళ్ల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. అప్పటినుంచి పిల్లలిద్దరినీ చంద్రమణి తీసుకుని పొరండ్లకు వచ్చి కూలీ పని చేసుకుంటోందని ఫిర్యాదులో పేర్కొంది. పొరండ్లకే చెందిన నీలం భాస్కర్తో కలిసి రెండేళ్ల నుంచి రామకృష్ణకాలనీలో ఉంటోందని, ఇదే సమయంలో భాస్కర్ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు తెలియడంతో జీవితంపై విరక్తి ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని, తన కూతురు చికిత్స పొందుతూ మరణించిందని మధునమ్మ తన ఫిర్యాదులో పేర్కొంది. -
హత్యకేసులో అనుమానితుడి ఆత్మహత్యాయత్నం
తిమ్మాపూర్ : పోలీసుల భయంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంకరపట్నం మండలం మొలంగూర్ వద్ద ముత్తారానికి చెందిన రాజేందర్ ఆదివారం రాత్రి హత్యకు గురి కాగా, ఈ కేసులో తిమ్మాపూర్ మండలం మక్తపల్లెకు చెందిన మైలారం శంకర్ను పోలీసులు అనుమానించారు. సోమవారం సాయంత్రం శంకరపట్నం పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు మక్తపల్లెకు వచ్చి శంకర్ను, ఆయన భార్యను, స్నేహితులను విచారించారు. అనంతరం ఇంటివరకు అతడిని తీసుకుని పోలీసులు వెళ్లగా బాత్రూంకు వెళ్లివస్తానని ఇంటి వెనుకకు వెళ్లిన శంకర్ తిరిగి రాలేదు. పోలీసులు వెనక్కి వెళ్లి చూడగా శంకర్ గొంతును కత్తితో కోసుకున్నాడు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్కు తరలించారు. ప్రైవేటు ఆసుపత్రిలో శంకర్ గొంతుకు శస్త్ర చికిత్స జరిగిందని, ఏమీ మాట్లడలేని స్థితిలో ఉన్నాడని స్థానికులు తెలిపారు. -
టోల్ వసూల్
తిమ్మాపూర్, న్యూస్లైన్ : రాజీవ్ ఫోర్లేన్ రహదారిపై శనివారం అర్ధరాత్రి నుంచి టోల్టాక్స్ వసూలు ప్రారంభమైంది. జూన్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం అనుమతివ్వడంతో.. ఒకటో తేదీ ప్రారంభమైన తర్వాత రాత్రి 12.01 గంటలకు హెచ్కేఆర్ రోడ్ వేస్ ఆధ్వర్యంలో టోల్టాక్స్ వసూళ్లు మొదలుపెట్టారు. శనివారం రాత్రి 10 గంటలకు ఫోర్లేన్పై బసంత్నగర్, రేణికుంట, దుద్దెడ వద్దనున్న మూడు టోల్గేట్ల వద్ద ఒకేసారి పూజలు ప్రారంభించారు. రేణికుంటలో హెచ్కేఆర్ సీజీఎం రామకృష్ణ, గాయత్రి కన్స్ట్రక్షన్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ కోటి లింగం, ప్రతినిధి విజయభాస్కర్ పాల్గొన్నారు. అన్ని టోల్గేట్ల వద్ద వాహనాల కోసం రెండు లేన్లు పోవడానికి, మరో రెండు లేన్లు రావడానికి ఏర్పాటు చేశారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ట్రాక్టర్ల రాకపోకల కోసం అదనంగా మరో రెండు లేన్లను ఏర్పాటు చేశారు. టోల్గేట్ వద్ద అంబులెన్స్, క్రేన్తోపాటు పెట్రోలింగ్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. రేణికుంట టోల్ ప్లాజా వద్ద కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 94910 60033, పెట్రోలింగ్ వాహనం ఫోన్ నంబర్ 94910 60044 అందుబాటులో ఉంటుందని హెచ్కేఆర్ ప్రతినిధులు తెలిపారు. ప్రమాదాలు జరిగితే కంట్రోల్ రూమ్ నంబర్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ను, వాహనాలు రోడ్డుపై చెడిపోతే పెట్రోలింగ్ వాహనానికి ప్రయాణికులు ఫోన్ చేసి సేవలు వినియోగించుకోవచ్చని వివరించారు. టోల్ రేట్లు రెండేళ్లకోసారి మారుతాయని, మొత్తం 22 సంవత్సరాలు టోల్టాక్స్ వసూలు చేయడం జరుగుతుందని చెప్పారు. -
సీవోఈలో కరీంనగర్ టాప్
తిమ్మాపూర్, న్యూస్లైన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) పాఠశాలల్లో కరీంనగర్లోని అల్గునూర్ పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో కరీంనగర్, కడప, వైజాగ్ సీవోఈలు ఏర్పాటుచేశారు. అల్గునూర్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి టాప్లో నిలిచారు. ఎంపీసీ విభాగంలో యు.అమృత 974 మార్కులతో ప్రథమ, బి.హరిత(973)ద్వితీయ, నల్ల గంగాధర్(966) తృతీయ స్థానంలో నిలిచారు. బైపీసీలో 957మార్కులతో టీ.శివకుమార్ ప్రథమ, జి.హరిత940, దీరావత్ శివ 934మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఐఐటీ, జేఈఈ మెయిన్స్కి అల్గునూర్ సీవోఈకి చెందిన 62మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 13 మంది అర్హత సాధించారు. వారిని సీవోఈ ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి, లెక్చరర్లు అభినందించారు. ప్రొఫెసర్ అవుతా.. నాది రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామం. తల్లి లలిత మరణించగా.. తండ్రి యాదయ్య వ్యవసాయం చేస్తున్నాడు. నేను మొదటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివా. సీవోఈలో సీటు రావడమే సంతోషమనిపించింది. ఇప్పుడు ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. ప్రొఫెసర్ కావడమే నా లక్ష్యం. -అమృత డాక్టర్ లక్ష్యం.. నాది మహబూబ్నగర్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్. తల్లిదండ్రులు వెంకటస్వామి, సాలమ్మ కూలీ పని చేస్తుంటారు. నేను ఇంటర్లో 956 మార్కులు సాధించిన వయసు లేకపోవడంతో మెడిసిన్లో సీటు వచ్చే పరిస్థితిలేదు. ఎవరైనా ఫ్రీ కోచింగ్ ఇస్తే లాంగ్టర్మ్ తీసుకుని ఎంబీబీఎస్ సీటు సాధించి డాక్టర్ అవ్వాలన్నది లక్ష్యం. - శివకుమార్ ఇంజినీర్నవుతా.. అల్గునూర్ సీవోఈ ద్వారా ఐఐటీ, జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించిన టాపర్గా నిలవడం సంతోషంగా ఉంది. నాది ధర్మపురి మండలం జైన్ గ్రామం. తల్లిదండ్రులు లక్ష్మీ, లక్ష్మణ్ చనిపోయారు. ఐఐటీ ఖరగ్పూర్లో సీటు సాధించి కష్టపడి చదివి ఎరోస్పేషన్ ఇంజినీర్ కావాలనేది నాలక్ష్యం. - ఎన్.గంగాధర్ -
మృగాళ్లు
మగాళ్లు మృగాళ్లలా మారారు. మద్యం మత్తులో మానవత్వం మరిచి పైశాచికంగా వ్యవహరించారు. జిల్లాలో బుధవారం జరిగిన సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారుు. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో... జీవితాంతం తోడూనీడగా ఉంటానని బాస చేసిన భర్తే వంద రూపాయల కోసం భార్యతో ఘర్షణ పడి ఆమెను హతమార్చాడు. సిరిసిల్ల మండలం రాజీవ్నగర్లో మద్యం తాగడానికి డబ్బులివ్వడం లేదని భార్యాబిడ్డలను చితకబాదాడో ప్రబుద్ధుడు. తిమ్మాపూర్ మండలం రేణికుంటలోఓ మానవమృగం మహిళా చెవులు కొరికి, వికృత చేష్టలకు పాల్పడి సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. వీరందరికీ స్థానికులు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పారు. హుస్నాబాద్ రూరల్, న్యూస్లైన్ : మద్యం మహమ్మారి వారి కాపురంలో చిచ్చు పెట్టింది. రూ.100 కోసం ఆలినే కడతేర్చాడు. తండ్రి చేసిన పనికి తల్లి పరలోకాలకు వెళ్లగా తండ్రి జైలుపాలు కావడంతో వారి కుమారుడు బిక్కుబిక్కుమంటూ తాతమ్మ దగ్గర విలపించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. అక్కన్నపేటలో శ్రీనివాస్ చేతిలో హతమైన భార్య రేణుకను చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ మల్లమ్మ పెంచి పెద్దచేసింది. రేణుకకు ఆమె గ్రామస్తుల వద్ద విరాళాలు సేకరించి ఆమెకు మేన బావ అయిన శ్రీనివాస్తో పెళ్లి చేశారు. వీరికి కుమారుడు నాగచైతన్య(6) ఉన్నాడు. శ్రీనివాస్ జులాయిగా తిరుగుతూ నిత్యం తాగి వచ్చి రేణుకను వేధించడం సాధారణమైపోయింది. చివరకు మంగళవారం రాత్రి అతడి చేతిలోనే కడతేరగా సర్పంచ్ శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామస్తులే మళ్లీ విరాళాలు సేకరించి అంత్యక్రియలు నిర్వహించారు. దర్యాప్తు చేసేందుకు వచ్చిన సీఐ సదన్కుమార్, ఎస్సై మహేందర్రెడ్డి సైతం రూ.2 వేలు అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సిరిసిల్ల రూరల్ : మద్యం మహమ్మారి మరో కుటుంబంలోనూ చిచ్చు పెట్టింది. తాగేందుకు డబ్బులివ్వలేదని సిరిసిల్ల మండలం రాజీవ్నగర్కు చెందిన నగేశ్ భార్యాబిడ్డలను చితకబాదగా గ్రామస్తులు అతడిని కట్టేసి దేహశుద్ధి చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement