-
వేల ఎకరాలు ఎందుకు?
విమానాశ్రయం అంటే వేల ఎకరాలు కావాలనే వాదనలో వాస్తవం లేదని తిరువనంతపురం ఎయిర్పోర్టు నిరూపిస్తోంది. అధిక ఎయిర్ ట్రాఫిక్ ఉన్న తిరువనంతపురం విమానాశ్రయాన్ని 628 ఎకరాల్లో నిర్మించారు. దేశంలోనే అత్యంత ఎక్కువ ఎయిర్ ట్రాఫిక్ ఉన్న ముంబై విమానాశ్రయాన్ని 1850 ఎకరాల్లోనే నిర్మించారు. కానీ.. భోగాపురం విమానాశ్రయానికి 15 వేల ఎకరాలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. దేశంలో ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల భూమి వివరాలు ఇలా.. విమానాశ్రయం భూమి విస్తీర్ణం (ఎకరాల్లో) తిరువనంతపురం 628 అహ్మదాబాద్ 1124 చెన్నై 1283 ముంబై 1850 -
‘పుష్కర’ను పూర్తి కా‘నీరు’!
నిలిచిన పుష్కర ఎత్తిపోతల పథకం భూ సేకరణ వివాదంతో నిలిచిన నిర్మాణం పనుల రద్దుకు అధికారుల ప్రతిపాదనలు సాగునీటికి నోచని ఎనిమిది వేల ఎకరాలు గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతాయి. బీడు భూములు సస్యశ్యామలమవుతాయి. బతుకులు బంగారుబాటలో నడుస్తాయి... ఏడేళ్లుగా అన్నదాతలు కన్న కలలివి. పుష్కర ఎత్తిపోతల పథకంపై పెట్టుకున్న ఆశలివి. భూ సేకరణపై అభ్యంతరం తెలుపుతూ తూర్పు గోదావరి జిల్లా తుని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనులకు గ్రహణం పట్టింది. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు భూ సేకరణ సమస్యనే సాకుగా చూపుతున్నారు. పనుల రద్దుకు ప్రతిపాదనలు పంపారు. రైతుల ఆశల్ని అడియాశలు చేశారు. పాయకరావుపేట, న్యూస్లైన్ : పుష్కర ఎత్తిపోత లపథకం ద్వారా గోదావరి జలాలు మెట్ట ప్రాంతాల్లో పరవళ్లు తొక్కుతాయని ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ మిగిలే పరిస్థితులు తలెత్తాయి. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని, పాయకరావుపేట మండలాల్లోని 8 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులకు పచ్చజెండా ఊపారు. పుష్కర ప్రధాన కాలువ తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట నుంచి పిల్ల కాలువల ద్వారా తుని మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు, పాయకరావుపేట మండలం పాల్తేరు, కందిపూ డి, ఈదటం ముఠా ఆనకట్ట చానల్ ద్వారా పెదరామభద్రపురం, శ్రీరాంపురం, కుమారపురం, రాజవరం, కేశవరం గ్రామాల్లోని సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాలువ నిర్మాణం ప్రారంభించారు. పిల్ల కాలువలు, వాటిపై నిర్మాణాల కోసం రూ.2.92 కోట్లతో పనులు చేట్టారు. తుని మండలం వల్లూరు వద్ద ఎలైన్మెంట్ పనులు మార్చాలని, ఎస్.అన్నవరం వద్ద కాలువకు భూసేకరణ ఆపాలని రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో తుని పాయకరావుపేట నియోజక వర్గాల్లో 8 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులు ఆగిపోయాయి. భూ సేకరణ సాకు భూసేకరణ విషయంలో రైతుల నుంచి ఎదురవుతున్న సమస్యలను నీటిపారుదల శాఖాధికారులు సాకుగా చూపుతున్నారు. తుని మండలంలో 1496 ఎకరాల ఆయకట్టు, పాయకరావుపేట మండలంలో ముఠా చానల్ ద్వారా సాగు నీరందించే పెదరామభద్రపురం, శ్రీరాంపురం, కుమారపురం, రాజవరం, కేశవరం గ్రామాల్లో 6694 ఎకరాల ఆయకట్టు పనుల రద్దుకు ప్రతిపాదనలను పుష్కర అధికారులు ప్రతిపాదనలు పంపారు. పాల్తేరు ప్రాంతంలో 497 ఎకరాలు, ఈదటం ప్రాంతంలో 1699 ఎకరాలు, కందిపూడి ప్రాంతంలో 821 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో పాల్తేరు, ఈదటం, కందిపూడి ప్రాంతాల్లో ఏడాదిన్నర క్రితం కాలువ పనులను నిలిపివేశారు. కొన్నేళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న తమ కలలు ఫలిస్తాయో లేదోన్న ఆతృత రైతుల్లో నెలకొంది. పుష్కర అధికారులు స్పందించి భూసేకరణ సమస్యను పరిష్కరించి ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న కాలువ పనులను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement