-
త్రీ స్టార్ విశాఖ.. ఫలించిన పోరాటం
జీవీఎంసీ పోరాటం ఫలించింది. స్వచ్ఛ సర్వేక్షణ్–2020కి కీలకం కానున్న గార్బేజ్ ఫ్రీసిటీ ర్యాంకింగ్స్లో 3–స్టార్ రేటింగ్ సాధించింది. నెల రోజుల క్రితం స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించిన ర్యాంకింగ్స్లో జీవీఎంసీకి సింగిల్ స్టార్ రేటింగ్ కేటాయించింది. అన్ని అర్హతలున్నా సరైన రేటింగ్ దక్కకపోవడంతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో జీవీఎంసీ పోరాటం సాగించింది. ఈ క్రమంలో కాపులుప్పాడలోని భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ను పరిశీలించిన కేంద్ర బృందం రేటింగ్లో మార్పుచేసినట్లు ప్రకటించింది. మహా నగరం స్ఫూర్తితో మరో ఆరు నగరాలు సైతం త్రీస్టార్ రేటింగ్ పొందాయి. 2018–19లో సింగిల్ స్టార్కే పరిమితమైన గ్రేటర్.. తాజా రేటింగ్స్తో స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉందని జీవీఎంసీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: అనేక రంగాల్లో ది బెస్ట్ సిటీగా మన్ననలు పొందిన మహా విశాఖ నగరం.. తాజాగా గార్బేజ్ ఫ్రీ సిటీ ర్యాంకింగ్స్లోనూ మెరుగైన స్థానం సంపాదించింది. 2019–20 సంవత్సరానికిగానూ త్రీస్టార్ రేటింగ్ సాధించింది. నెల రోజుల క్రితం ప్రకటించిన ర్యాంకింగ్స్లో సింగిల్ స్టార్కే పరిమితం చెయ్యడంతో.. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో జీవీఎంసీ అమీతుమీ తేల్చుకోవడంతో పొరపాటు గ్రహించిన కేంద్రం.. విశాఖ నగరం త్రీస్టార్ రేటింగ్ సాధించినట్లు గురువారం ప్రకటించింది. అన్నీ ఉన్నా.. సింగిల్ రావడంతో.. వ్యర్థాల నిర్వహణలో భాగంగా చెత్తలేని నగరాలకు స్వచ్ఛసర్వేక్షణ్లో భాగంగా గార్బేజ్ ఫ్రీ సిటీ స్టార్ రేటింగ్స్ కేటాయిస్తున్నారు. ఈ విభాగంలో 2018–19లో విశాఖ నగరం సింగిల్ స్టార్ సాధించింది. అప్పుడు రాష్ట్రాలకు కూడా మెరుగుపరచుకునే అవకాశం ఇవ్వడంతో.. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 2 స్టార్ రేటింగ్ సాధించినట్లుగా ప్రకటించారు. అయితే 2019–20లో సింగిల్ స్టార్, 3, 5, 7 స్టార్ కేటగిరీలు మాత్రమే కేటాయింపులు చేశారు. మొత్తం మూడు విభాగాల్లో వీటిని గణించారు. మాండేటరీ, ఎసెన్షియల్, డిజైరబుల్ విభాగాల్లో మొత్తం 25 ఉప విభాగాలుంటాయి. వీటిలో 24 విభాగాల్లో పాస్ అయిన జీవీఎంసీ.. కేవలం భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణలో మాత్రం ఫెయిల్ అయ్యింది. వీటిలో ఒక్కదాంట్లో ఫెయిల్ అయినా సున్నా మార్కులు కేటాయిస్తారు. భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఉన్నప్పటికీ థర్డ్ పార్టీ ఏజెన్సీ అయిన కాంటార్ సంస్థ విశాఖలో సీ అండ్ డీ ప్లాంట్ లేదంటూ నమోదు చేసింది. దీంతో ఈ విభాగంలో ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ను రెండేళ్ల క్రితం నుంచే జీవీఎంసీ నిర్వహిస్తునప్పటికీ.. ఇందులో నమోదు చెయ్యకపోవడంపై జీవీఎంసీ కమిషనర్ జి.సృజన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్తో పోరాటం సాగించాలని నిర్ణయించారు. కమిషనర్ సూచనలతో అదనపు కమిషనర్ వి.సన్యాసిరావు అన్ని ఆధారాలు, డాక్యుమెంట్స్తో ఢిల్లీ వెళ్లి ఉన్నతాధికారులకు అందించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర బృందం పది రోజుల క్రితం విశాఖ వచ్చి.. సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ని సందర్శించింది. అన్ని అనుకూలంగా ఉన్నాయని గుర్తించిన స్వచ్ఛభారత్ మిషన్ గురువారం రేటింగ్స్ను మార్పు చేస్తూ త్రీ స్టార్ కేటాయించింది. విశాఖ స్ఫూర్తితో 148 నగరాలు గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్స్లో తమకు అన్యాయం జరిగిందని విశాఖ నగరం పోరాటం ప్రారంభించిందని తెలుసుకున్న తర్వాత అనేక నగరాలు ముందడుగు వేశాయి. తమకూ అన్యాయం జరిగిందంటూ 148 నగరాలు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు ఫిర్యాదు చేశాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న స్వచ్ఛభారత్ మిషన్ అన్ని నగరాలకూ ప్రత్యేక బృందాల్ని పంపించి.. అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేశాయి. వీటిలో జీవీఎంసీతో పాటు మరో ఆరు నగరాలకు త్రీస్టార్ రేటింగ్ కేటాయిస్తున్నట్లు స్వచ్ఛభారత్ మిషన్ ప్రకటించింది. వడోదర, అహ్మద్నగర్, పూణే, బల్లార్పూర్, నోయిడా, గ్వాలియర్ నగరాలకూ త్రీస్టార్ ర్యాంకింగ్స్ లభించాయి. ఇందులో విశాఖ ఫిర్యాదు బలమైంది కావడంతో జాబితాలో తొలి పేరును విశాఖ నగరాన్ని ప్రకటించడం విశేషం. మార్పు చేయడం సంతోషకరం అన్ని అర్హతలున్నా సింగిల్ స్టార్కి పరిమితం చెయ్య డం నిరాశకు గురిచేసింది. 2019 నుంచి భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లో పనులు కొనసాగుతున్నప్పటికీ ఈ విభాగంలో సున్నా మార్కులు వెయ్యడం చూసి ఎక్కడో తప్పు జరిగిందని అర్ధమైంది. అందుకే ఫిర్యాదు చేసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. ప్లాంట్లో తయారవుతున్న ఇసుక, టైల్స్ ఇలా పునర్వినియోగ సామగ్రిని చూసిన బృందం రేటింగ్ను మార్పు చేయడం సంతోషకరం. మా కష్టానికి ప్రతిఫలం లభించింది. జీవీఎంసీ టీమ్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ ర్యాంకు మెరుగయ్యేందుకు అవకాశం జీఎఫ్సీలో సింగిల్ స్టార్ రావడంతో దీని ప్రభావం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుపై పడుతుందని చాలా బాధపడ్డాం. కమిషనర్ సూచనల మేరకు ఢిల్లీ వెళ్లి స్వచ్ఛభారత్ మిషన్కు అన్ని డాక్యుమెంట్లు అందించాం. వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ని పరిశీలించిన ఉన్నతా«ధికారుల బృందం రేటింగ్ని పెంచింది. త్రీ స్టార్ రావడంతో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు మరింత మెరుగవుతుంది. – వి.సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ -
దీపావళికి ఆ మూడు చిత్రాలు రెడీ
దసరా, దీపావళి, సంక్రాంతి ఇలాంటి విశేష పర్వదినాల్లో సినీ ప్రేక్షకులను అలరించడానికి చిత్ర పరిశ్రమలో సందడి వాతావరణాన్ని సృష్టించడానికి భారీ చిత్రాలు తెరపైకి రావడం సర్వసాధారణం. ఆ విధంగా ఈ సారి కోలీవుడ్లో ముగ్గురు స్టార్స్ చిత్రాల వారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కత్తి, ఐ, పూజై ఈ మూడు చిత్రాలు దీపావళికి తెరపై వెలుగులు విరజిమ్మడానికి ముస్తాబవుతున్నాయి. ఇళయదళపతిగా తమిళనాట అశేష అభిమానం గల నటుడు విజయ్ నటిస్తున్న భారీ చిత్రం కత్తి. ఆయనతో క్రేజీ బ్యూటీ సమంత తొలిసారిగా రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కెప్టెన్. విజయ్ నాయకుడిగా, ప్రతి నాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇంతకుముందు విజయ్, ఏఆర్ మురుగదాస్ కలయికలో వచ్చిన తుపాకీ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. అయితే కత్తి చిత్రంపై తమిళ భాషాభిమాన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్ర విడుదలను అడ్డుకుంటామని, అవసరమైతే ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతామని అంటున్నారు. చిత్ర నిర్మాతలు మాత్రం కత్తి చిత్ర వివాదంపై వివరణ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కత్తి చిత్రం విడుదల ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. కాగా విశాల్, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం పూజై. కమర్షియల్ దర్శకుడిగా పేరొందిన హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నటుడు విశాల్ సొంతంగా నిర్మించడం విశేషం. పూజై చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రారంభదశలోనే వెల్లడించింది. ఇక రెండేళ్లకుపై నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న చిత్రం ఐ. స్టార్ దర్శకుడు శంకర్, సియాన్ విక్రమ్ల కలయికతో అన్నియన్ వంటి సంచలన చిత్రం తరువాత తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఐ. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలిం నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఐ చిత్రం కోసం విక్రమ్ ఆహార్య విషయంలోను, నటనాపరంగాను చాలా ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో పాటు ఎంతగానో శ్రమించారు. వెయిట్లెస్, వెయిట్ ప్లస్ అంటూ చిన్న రకాల శారీరక రూపాల్లో అబ్బురపరచనున్నారు. శంకర్ చిత్రం అంటేనే బ్రహ్మాండానికి చిరునామా అంటారు. అలాంటి శంకర్ ఐ చిత్రంలో ఎన్ని అద్భుతాలు సృష్టించనున్నారో అని ఇటు చిత్ర పరిశ్రమ, అటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి బరిలోకి దించనున్నట్టు ఆస్కార్ ఫిలింస్ వర్గాల సమాచారం. పై మూడు చిత్రాల పైనా భారీ అంచనాలే ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
Advertisement