-
పల్లె జీవితాలపై పిడుగు..
శ్రీగిరి విజయ్కుమార్రెడ్డి : ‘పచ్చని పల్లె జీవితాల్లో పిడుగులు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. కోట్ల వోల్టుల శక్తితో దూసు కొస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భూమిపై పడుతున్న పిడు గుల (క్లౌడ్ టూ గ్రౌండ్) సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో మర ణాలూ పెరిగాయి. తెలంగాణలోనూ ఇదే పరి స్థితి నెలకొంది. మృతుల్లో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉంటున్నారని నిపుణులు చెబుతు న్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 316 మంది పిడుగుపాటు కారణంగా చనిపోయారు. ప్రతి ఏటా మే నుంచి అక్టోబర్ వరకు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లోనే లక్షకు పైగా పిడుగులు పడుతున్నట్లు భారత లైటనింగ్ రిపోర్ట్ 2022–23 తాజా నివేదిక వెల్లడించింది. అయితే పిడుగుపాటు మరణాలు జాతీయ విపత్తు జాబితాలో లేకపోవటంతో మృతుల కుటుంబాలకు ఎలాంటి సాయం అందడం లేదు. పరిహారం అందించే అంశం అధికారులు, ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటోంది. దీంతో బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో ఏటా సగటున లక్షకు పైగా పిడుగులు ♦ పొట్టకూటి కోసం మిరపనారు నాటేందుకు వెళ్లిన ఇద్దరు మహిళా కూలీలను పిడుగు కబళించింది. మిరప నారు నాటుతుండగా ఉన్నట్టుండి పిడుగు పడింది. మరుక్షణంలోనే చిలివేరు సరిత (30), నేర్పాటి మమత (32) మృత్యువాత పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్ శివా రులో గత మంగళవారం ఈ పిడుగు పాటు సంభవించింది. ఆ ఇద్దరు మహి ళల కుటుంబాల్లో చీకట్లు నింపింది. ♦ పిడుగుపాటు జీవితాల్ని ఎలా ఛిద్రం చేస్తుందో చెప్పే చిత్రమిది. 2021 సెప్టెంబర్ 3న ఆసిఫాబాద్ మండలం కౌటాల పరి«దిలోని ముత్తంపేటలో పున్నయ్య (52), పద్మ (40), శ్వేత పత్తి చేనులో పనులు ముగించుకుని ఎడ్లబండిపై ఇంటిబాట పట్టారు. ఇంతలో ఉరు ములు, మెరుపులతో వర్షం మొదలైంది. అకస్మాత్తుగా ఓ పిడుగు నిప్పులు కురి పించింది. అంతే బండెద్దులతో పాటు పున్నయ్య, పద్మ, శ్వేత అక్కడి కక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రకృతి పగబట్టిన ఈ ఘటనలో విపత్తు సాయం నయా పైసా కూడా బాధిత కుటుంబాలకు అందలేదు. సాంకేతికత వినియోగంలో విఫలం.. ♦ పిడుగుపాటు మరణాలు భారీగా పెరుగుతున్నా జాతీయ, రాష్ట్ర విపత్తు నివారణ సంస్థలు కనీస చొరవ తీసుకోవటం లేదని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. వాస్తవానికి పిడుగులు పడే సమాచారాన్ని ముందే పసిగట్టే సాంకేతికతను (లైటనింగ్ డిటెక్షన్ నెట్వర్క్) ఐఐటీ మహారాష్ట్ర ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. దీంతో 20 నుంచి 40 కి.మీ. పరిధిలో పిడుగుపడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేయొచ్చు. ఒడిశా, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్ర విపత్తు నివారణ సంస్థలు అందివచ్చిన సాంకేతికతను వినియోగిస్తూ వివిధ మాధ్యమాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో గతంలో కంటే మరణాల సంఖ్య తగ్గినట్లు లైటనింగ్ రెసిలెంట్ ఇండియా సంస్థ పేర్కొంది. పిడుగుల వాన..పిల్లల చదువుకు బ్రేక్ మహబూబ్నగర్ జిల్లా గండీడ్ పరిధిలోని పెద్దవార్వాల్కు చెందిన కటిక బాలరాజ్(52) ఈ ఏడాది జూన్ 11న రోజు మాదిరిగానే భార్య జమునతో కలిసి మేకలు మేపేందుకు వెళ్లాడు. ఒక్కసారిగా కురిసిన పిడుగుల వర్షంతో 30 మేకలు సహా బాలరాజ్ అక్కడికక్కడే చనిపోగా, జమున తీవ్ర అస్వస్థతకు గురైంది. తండ్రి మరణంతో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన కూతుళ్లు గౌరేశ్వరి (డిగ్రీ), చందన (ఇంటర్) చదువులు ఆకస్మికంగా ఆగిపోయే పరిస్థితి నెలకొంది. 14వ స్థానంలో తెలంగాణ మేఘం నుంచి భూమిపై (క్లౌడ్ టూ గ్రౌండ్) పడే పిడుగుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. 2022–23లో అత్యధి కంగా మధ్యప్రదేశ్ 9,41,663 పిడుగు లతో దేశంలో మొదటి స్థానంలోలో ఉండగా, తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (6,85,893), ఛత్తీస్గఢ్ (5,16,504) ఉన్నాయి. తెలంగాణ (2,19,477) ఈ జాబితాలో 14వ స్థానంలో ఉంది. జాతీయ విపత్తులుగా పరిగణించాలి.. పిడుగుపాటుతో అత్యధికంగా మరణిస్తున్నది రైతు కూలీ లే. దేశంలో పిడుగుపాటు మరణాలు పెరిగిపో తున్న తీరు ఆందోళనకరంగా మారింది. పిడుగుపాట్లను జాతీయ విప త్తులుగా పరిగణించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలి. పిడుగులు పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించేందుకు, ఆపై ప్రచారం చేసేందుకు కావాల్సిన సాంకేతికత ఇప్పుడు ఆందుబాటులో ఉంది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఏటా వందల మరణాలు చోటుచేసుకుంటుండటం దురదృష్టకరం. – కల్నల్ సంజయ్ శ్రీవాత్సవ, లైటనింగ్ రెసిలియెంట్ ఇండియా, న్యూఢిల్లీ త్వరలో కార్యాచరణ మొదలుపెడతాం తెలంగాణలోనూ పిడుగుపాటు మరణా లు సంభవిస్తున్నాయి. దీనిపై త్వరలో కా ర్యాచరణ మొదలుపెడతాం. సాంకేతికత ను ఎలా ఉపయోగించుకోవాలి, యంత్రాంగాన్ని ఏ మేరకు సిద్ధం చేయాలన్న అంశంపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. పిడుగు పాటు మరణాలు, నష్టాలను కూడా జాతీయ విపత్తు జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరతాం. – బి.వినోద్కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు -
Prime Volleyball League 2023: కోల్కతా శుభారంభం
బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా థండర్బోల్ట్స్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్లో కోల్కతా 15–11, 15–11, 15–14, 10–15, 14–15తో బెంగళూరు టోర్సెడోస్ జట్టును ఓడించింది. కోల్కతా వరుసగా మూడు సెట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ లీగ్ నిబంధనల ప్రకారం ఫలితంతో సంబంధం లేకుండా రెండు జట్లు నిర్ణీత ఐదు సెట్లు ఆడాల్సి ఉంటుంది. ఈ గెలుపుతో కోల్కతా ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. నేడు జరిగే మ్యాచ్లో కాలికట్ హీరోస్తో ముంబై మిటియోస్ తలపడతాయి. -
కోల్కతా థండర్బోల్ట్స్ ఉత్కంఠ విజయం
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ టోర్నమెంట్లో కోల్కతా థండర్బోల్ట్స్ జట్టు విజయంతో శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం కాలికట్ హీరోస్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా థండర్బోల్ట్స్ 3–2 (15–13, 12–15, 15–10, 12–15, 15–13) సెట్ల తేడాతో గెలిచింది. కోల్కతా కెప్టెన్ అశ్వల్ రాయ్ అద్భుత ప్రదర్శనతో తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నేడు జరిగే మ్యాచ్లో బెంగళూరు టార్పెడోస్ జట్టుతో కొచ్చి బ్లూ స్పైకర్స్ తలపడుతుంది. -
అక్కడ పిడుగులుపడే అవకాశాలు అధికం!
సాక్షి, విజయనగరం: జిల్లాలోని కురుపాం ఏజెన్సీలో భారీ వర్షం సోమవారం భారీ వర్షం కురిసింది. అదేక్రమంలో జియమ్మవలస మండలం మరువాడలో పిడుగుపడి రెండు కుటుంబాల్లో విషాదం నిండింది. పొలం పనులకు వెళ్లిన వారిపై పడిన పిడుడుపడటంతో ముగ్గురు మృతి చెందారు. మరువాడకు చెందిన అన్నదమ్ములు పారయ్య, పండయ్య .. ఉపాధ్యాయుడు చీమల భూషణరావు మృతి చెందారు. విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు,గొర్రెల కాపరులకు హెచ్చరికలు జారీచేశారు. నెల్లూరు జిల్లా.. వరికుంటపాడు, చంద్రశేఖరపాలెం. గుంటూరు జిల్లా అమరావతి, పెదకురుపాడు, తాడికొండ, అచంపేట్, క్రోసూరు, చందర్లపాడు. ప్రకాశం జిల్లా.. హనుమంతునిపాడు, తర్లుపాడు. కడప జిల్లా పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లె, కలసపాడు, వేంపల్లె, యర్రగుంట్ల, కమలాపురం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని, సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందాలని అధికారులు చెప్పారు. -
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో మెలియపుట్టి, పాతపట్నం టెక్కలి, నందిగం, పలాస, సోంపేట, కోటబొమ్మాలి, హిరమండలం, సర్వ కోట, కొత్తూరు, భామిని, సీతంపేట.. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పాచిపెంట, మెంటాడ, దత్తిరాజేరు, గంట్యాడ, రామభద్రపురం, సాలూరు, గజపతినగరం.. విశాఖ జిల్లాలో అనంతగిరి, అరకులోయ, దేవరపల్లి, హుకుంపేట పాడేరు, చీడికాడ.. గుంటూరు జిల్లాలో బొల్లపల్లి, వెల్దుర్తి, దుర్గి.. కర్నూలు జిల్లాలో ఆత్మకూరు, బండి ఆత్మకూరు, కొత్తపల్లె, ఓర్వకల్, హాలహర్వి, చిప్పగిరి మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని విపత్తుల నిర్వహణ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement