-
శ్రీవారి చలవతో నీటికష్టాలు తీరాయి: గవర్నర్
తిరుమలలో భారీ వర్షాలు కురిసి, జలాశయాలు కళకళలాడటానికి ఏడు కొండల వాడి దయే కారణం అని గవర్నర్ నరసింహన్ అన్నారు. శ్రీవారి సన్నిధిలో భక్తులకు ఈ ఏడాది నీటి కష్టాలు తప్పినట్లే అని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం ఆయన తిరుచానూర్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వరుడి దయతోనే చిత్తూరు జిల్లాలో మంచి వర్షాలు కురిసి, రైతుల కష్టాలు తీరాయని చెప్పారు. ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి తిరుచానూర్లో అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వేదిక్ యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొంటారు. -
వైభవంగా అవతారోత్సవాలు
పెద్దశేషునిపై సుందరరాజ స్వామి దివ్యదర్శనం తిరుచానూరు : పద్మావతీ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన సుందరరాజ స్వామి వారి వార్షిక అవతారోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాత్రి స్వామి వారు పెద్దశేషవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. ప్రతి ఏటా జ్యేష్టమాసంలో వచ్చే ఉత్తరాభాద్ర నక్షత్రం ముగిసే సమయానికి స్వామివారికి మూ డు రోజుల పాటు అవతారోత్సవాలు నిర్వహిసా ్తరు. అవతారోత్సవాల్లో భాగంగా స్వామివారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారినిఆలయ ముఖమండపడంలోకి వేంచేపు చేసి, కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదపారాయణం నడుమ ఉభయదేవేర్లతో సహా స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి ఊంజల్సేవను కన్నులపండువగా నిర్వహించారు. రాత్రి 7.15 గంటలకు స్వామి వారిని వాహన మండపంలోకి వేంచేపు చేసి, పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం దివ్యాలంకార శోభితుడైన స్వామి వారు ఉభయదేవేర్లతో సహా పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. అవతారోత్సవాల్లో నేడు అవతారోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్సేవ, రాత్రి 7.15 గంటలకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. -
వైభవంగా అవతారోత్సవాలు ప్రారంభం
పెద్దశేషునిపై సుందరరాజస్వామి దర్శనం తిరుచానూరు: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన సుందరరాజస్వా మి వార్షిక అవతారోత్సవాలు బుధవా రం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే అవతారోత్సవాల్లో మొదటి రోజైన బుధవారం రాత్రి స్వామి వారు పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. అవతారోత్సవాల్లో భాగంగా స్వామిని వేకువనే సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామిని వేంచేపుగా ఆలయ ముఖమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదపారాయణం నడుమ ఉభయదేవేరులతో సహా స్వా మిని అభిషేకించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామికి ఊంజల్సేవ కన్నులపండువగా నిర్వహించారు. రాత్రి 7.15 గంట లకు స్వామిని వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి పెద్దశేష వాహనం పై కొలువుదీర్చారు. అనంతరం దివ్యాలంకార శోభితుడైన స్వామి ఉభయదేవేరులతో సహా పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శ నం కల్పించారు. సుందరరాజస్వామి అ వతారోత్సవాల్లో భాగంగా రెండవ రోజై న గురువారం రాత్రి 7.15 గంటలకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 గంటలకు అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్సేవ జరుగుతాయి. -
వైభవంగా అమ్మవారి తెప్పోత్సవాలు
తొలిరోజు తెప్పపై విహరించిన శ్రీకృష్ణుడు నేత్రపర్వంగా అభిషేకం తిరుచానూరు, న్యూస్లైన్: తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో తొలిరోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా స్వామిని తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామిని సన్నిధి నుంచి వేంచేపుగా శ్రీకృష్ణస్వామి ముఖమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం వేదపారాయణం, మంగళవాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఆలయ అర్చకులు నేత్రపర్వంగాఅభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఉభయదేవేరులతో సహా స్వామిని వేంచేపుగా ఆలయం నుంచి అమ్మవారి పుష్కరిణికి తీసుకొచ్చి తెప్పపై కొలువుదీర్చారు. అనంతరం సర్వాంగ శోభితుడైన స్వామి ఉభయదేవేరులతో సహా తెప్పపై కొలువై మూడు పర్యాయాలు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 7.30 గంటలకు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగారు. ఆయాకార్యక్రమాల్లో ఆలయ స్పెషల్గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్రెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు కేపీ.వెంకటరత్నం, ధర్మయ్య, ఆర్జితం, ప్రసాదం ఇన్స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు, ఏవీఎస్వో రామకృష్ణ, వీఐ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. తెప్పోత్సవాల్లో నేడు తెప్పోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత సుందరరాజస్వామికిఅభిషేకం, సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం, రాత్రి 7.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగుతాయి. -
లక్ష్మీకాసుల హారం దొరికిందట!
తిరుచానూరు, న్యూస్లైన్: మూడు రోజుల క్రితం మాయమైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి లక్ష్మీకాసుల హారం శుక్రవారం ప్రత్యక్ష మైంది. ఆలయంలోని గర్భగుడిలోనే ఉందని అర్చకులు వెల్లడించారు. పద్మావతి అమ్మవారి మూలమూర్తికి కవచాలు, హస్తాలు, కాసులహారం, మంగళసూత్రం వంటి దాదాపు 18 రకాల బంగారు ఆభరణాలు నిత్య అలంకరణగా వాడతారు. ప్రతి శుక్రవారం అమ్మవారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఆ సమయంలో మాత్రమే ఈ ఆభరణాలను తీసి గర్భగుడిలోనే ఉన్న నగల పెట్టెలో భద్రపరుస్తారు. ఈనెల 13 నుంచి జరగనున్న వసంతోత్సవాల సందర్భంగా 6వ తేదీ ఉదయం ఆలయంలో కోయిల్ఆళ్వార్ తిరుమంజన సేవ నిర్వహించారు. ఆ సమయంలో అమ్మవారి నగలన్నిం టినీ తీసి పెట్టెలో భద్రపరిచారు. ఆరోజు సాయంత్రం అమ్మవారి లక్ష్మీకాసుల హారం మాయమైనట్టు అర్చకులు గుర్తించి అధికారులకు సమాచారం చేరవేశారు. గురువారం ఈ విషయం బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గర్భాలయాన్ని శుద్ధి చేశాక, నీరు వెళ్లే తూములో హారం ఇరుక్కు పోయిందని అర్చకులు చెబుతున్నారు. కాగా, ఈ వ్యవహారం పై టీటీడీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించి నట్టు తెలిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement