-
పంచాయతీ అధ్యక్షుడి హత్య
• మరొకరికి బెదిరింపు • నిందితులను అరెస్టు చేయాలని రాస్తారోకో • వాహనాలపై దాడికి యత్నం తిరువళ్లూరు: పాతకక్షలతో ఓ పంచాయతీ అధ్యక్షుడు నడి రోడ్డుపై హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తిరువళ్లూరు సమీపంలోని వెళ్లవేడు వద్ద చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా మేల్మణంబేడు గ్రామానికి చెందిన తంగరాజ్ రియల్టర్. ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహించే తంగరాజ్ పదేళ్ల నుంచి అదే గ్రామానికి పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం యథావిధిగా వాకింగ్ వెళుతున్న తంగరాజ్ను మూడు ద్విచక్ర వాహనాలతో వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీ శ్యామ్సన్, డీఎస్పీ ఈశ్వరన్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టడంతో పాటు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం రూబి అనే పోలీసు జాగిలాన్ని రప్పించి విచారణ చేపట్టారు. పంచాయతీ అధ్యక్షుడి హత్యతో మేల్మణంబేడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చే యడంతో పాటు భారీగా పోలీసులను మోహరించారు. రాస్తారోకో-వాహనాలపై దాడికి యత్నం తంగరాజ్ హత్య నేపథ్యంలో పోలీసులు అదే గ్రామానికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడానికి ప్రయత్నించారు. అయితే హత్య చేసినట్టు అనుమానం ఉన్న వారిని కాకుండా మృతుని బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించిన గ్రామస్తులు రాస్తారోకో చేయడానికి ప్రయత్నించారు. అటు వైపు వస్తున్న వాహనాలపై దాడికి దిగారు. దీంతో వాహనంలో ఉన్న డ్రైవర్తో పాటు ప్రయాణికులు వాహనాన్ని నడిరోడ్డులో వదిలిపెట్టి పరుగులు పెట్టారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. హత్య కేసులో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పాతకక్షలే కారణం తంగరాజ్ హత్యకు పాతకక్ష్యలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1998వ సంవత్సరంలో తంగరాజ్ అనుచరులు అదే గ్రామానికి చెందిన మనోహరన్ను హత్య చేశారని, వారి బంధువులే హత్య చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా వుండగా పది సంవత్సరాల నుంచి పంచాయతీ అధ్యక్షుడిగా ఉన్న తంగరాజ్, ప్రస్తుతం తన భార్య పేరిట నామినేషన్ను దాఖలు చేశాడు. దీంతో ఎన్నికల నుంచి తప్పుకోవాలని కొందరు బెదిరించారన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా వుండగా మేల్మణంబేడు పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన మణివేలు అనే వ్యక్తిపై సైతం దుండగులు దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసుపై సైతం పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
‘తిరువళ్లూరు’లో 88.23 శాతం ఉత్తీర్ణత
తిరువళ్లూరు, న్యూస్లైన్: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం విడుదల చేసిన ప్లస్టూ పరీక్షా ఫలితాల్లో తిరువళ్లూరు జిల్లాలో 88.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన ట్టు కలెక్టర్ వీరరాఘవరావు వెల్లడించా రు. జిల్లా వ్యాప్తంగా ప్లస్టూ పరీక్షలకు 40,032 మంది విద్యార్థులు హాజరుకాగా, 35,320 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది మరో మూడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్లస్టూ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 289 పాఠశాలకు చెందిన విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వీటిలో 69 పాఠ శాల విద్యార్థులు వంద శాతం ఫలితాలను సాధించి రికార్డు సృష్టించారు. టాపర్లు వీరే: తిరువళ్లూరు జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థుల జాబి తాను కలెక్టర్ వీరరాఘవరావు శుక్రవారం ఉదయం విడుదల చేశారు. తమిళాన్ని ప్రథమ భాషగా ఎంచుకుని విధ్యనభ్యసించిన మెగప్పేరు వేలమ్మాల్ పాఠశాలకు చెందిన కే. రంజిత్(1188) జిల్లా స్థాయిలో మొదటి స్థానం సంపాదించగా, అంబత్తూరు సేతు భాస్కర పాఠశాలకు చెందిన పూజా(1187), పంజె ట్టి వేలమ్మాల్ పాఠశాల విద్యార్థిణి శరణ్య(1187) మార్కులతో రెండవ స్థానం సాధించారు. మూడవ స్థానంలో పంచెట్టి వేలామ్మాల్ పాఠశాలకు చెందిన రమ్యప్రభ(1186), మెగప్పేరు వేలమ్మాల్ పాఠశాలకు చెందిన అనణ్య(1186) మార్కులతో మూడవ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాల టాపర్లు: ప్రభుత్వ పాఠశాల పరిధిలోని పళవేర్కాడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన సంగీత(1160), టీఎంకేవీ అమ్మయ్యార్కుప్పం పాఠశాలకు చెందిన ప్రభాకరన్(1160) మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించారు. రెండవ స్థానంలో పొన్నేరి ప్రభుత్వ బాలుర పాఠశాలకు చెందిన కుమరవేల్(1157) నిలిచారు. మూడవ స్థానంలో కవరపేట ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఆనంది(1153), అంబత్తూరు పీకే పాఠశాల విద్యార్థిని యువరాణి(1153) మార్కులతో మూడవ స్థానంలో నిలిచినట్టు కలెక్టర్ వివరించారు. సత్తాచాటిన తెలుగు విద్యార్థి: ప్లస్టూ పరీక్షలలో తెలుగు, సంస్కృతం, ప్రెంచ్ భాషను మొదటి భాషగా ఎంచుకుని చదివిన విద్యార్థులు తమ సత్తాను చాటారు. సంస్కృతాన్ని మొదటి భాషగా ఎంచుకున్న వేలమ్మాల్ విద్యార్థులు అజిత్(1192), శ్రీనిధి(1192) మార్కులతో మొదటి స్థానం సాధిం చారు. సంస్కృతాన్ని ప్రథమ భాషగా ఎంచుకున్న దీపక్ అరవింద్(1189) మార్కులతో రెండవ స్థానంలోనూ, ప్రెంచ్ను మొదటి భాషగా తీసుకున్న వేలమ్మాల్ విద్యార్థులు మణిగండ న్(1188), తెలుగును మొదటి భాషగా ఎంచుకున్న రంజిత్(1188) మూడవ స్థానంలో నిలిచారు. తమిళ విద్యార్థులకు దీటుగా సంస్కృతం, తెలుగు విద్యార్థులు రాణించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement