-
టెక్నాలజీ తోడై..!, పెన్ను వేలెడు.. రాత బారెడు
కీచైన్కు వేలాడుతూ వేలెడంత కనిపించే ఈ పెన్ను మన్నిక తెలుసుకుంటే నోరెళ్లబెడతారు. నానో ఇంకుతో పనిచేసే ఈ పెన్ను వంద పెన్సిళ్ల మన్నిక కంటే ఎక్కువే! టిటానియమ్తో రూపొందించిన ఈ పెన్నులో ఒక నానో ఇంకు కాట్రిడ్జ్ ఉంటుంది. ఇది ఒక జీవితకాలం మన్నుతుంది. దీనికి రీఫిల్ వేసుకోవడం, ఇంకు నింపుకోవడం, కాట్రిడ్జ్ మార్చుకోవడం వంటి అవసరమే ఉండదు. దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ క్యాప్ పెన్ను మొనను సురక్షితంగా ఉంచుతుంది. ‘ఇన్నోజూమ్’ అనే అమెరికన్ స్టార్టప్ సంస్థ క్రౌడ్ఫండింగ్ ద్వారా దీని రూపకల్పనకు నడుం బిగించింది. కనీస స్థాయిలో ఈ నానో ఇంకు పెన్నును మార్కెట్లోకి విడుదల చేయాలంటే 20 వేల డాలర్లు (రూ.16.67 లక్షలు) అవసరమవుతాయని ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు మూడువేల డాలర్లు (రూ.2.50 లక్షలు) మాత్రమే పోగయ్యాయి. ఈ ప్రాజెక్టుకు ఎంత త్వరగా పూర్తి డబ్బు సమకూరితే, అంత త్వరగా ఈ పెన్ను మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ పెన్ను ధర డిజైన్, నాణ్యతను బట్టి 29 నుంచి 99 డాలర్ల వరకు (రూ. 2,418 నుంచి రూ.8,255) ఉండవచ్చని అంచనా. -
భారత్లో టైటానియం వరల్డ్ టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న మలేషియా కంపెనీ టైటానియం వరల్డ్ టెక్నాలజీ భారత్లో ఎంట్రీ ఇచ్చింది. అనుబంధ కంపెనీ అయిన స్మార్ట్కోట్ ఇండియా ద్వారా సూక్ష్మజీవులను హరించే రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. సంస్థగత, పారిశ్రామిక వినియోగం కోసం స్మార్ట్కోట్ నానో, వ్యక్తిగత వినియోగం కోసం ఆర్మోర్–8 పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్కోట్ నానో స్ప్రే చేసిన తర్వాత దాని ప్రభావం ఏడాది పాటు ఉంటుందని స్మార్ట్కోట్ ఇండియా ఎండీ రామకృష్ణ కడియం గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. చదరపు అడుగుకు రూ.170 చార్జీ చేస్తామన్నారు. ఆర్మోర్–8 స్ప్రే నెల రోజులపాటు పనిచేస్తుంది. ధర 60 ఎంఎల్ రూ.399, 250 ఎంఎల్ రూ.1,499గా నిర్ణయించామన్నారు. అత్యాధునిక నానో కోటింగ్ టెక్నాలజీతో ఇది రూపొందాయని వివరించారు. ఉత్పత్తులకు ప్రతిష్టాత్మక సీఈ ధ్రువీకరణ ఉంది. -
ఆ గ్రహంపై టైటానియం వర్షం..
భూమికి 1,700 కాంతి సంవత్సరాల దూరంలో ఓ కొత్త గ్రహాన్ని పెన్ స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో గొప్ప విశేషం ఏమీ లేకపోవచ్చుగానీ.. ఈ గ్రహంపై టైటానియం యాక్సైడ్ రసాయనం మంచు మాదిరిగా జాలు వారుతూ ఉంటుందన్న సమాచారం మాత్రం ఆసక్తికరమే. భూమ్మీద ఈ రసాయనాన్ని సన్స్క్రీన్ క్రీముల తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. తెలిసిన ఎక్సోప్లానెట్లు అన్నింటిలో అత్యంత అధిక ఉష్ణోగ్రత కలిగిన కెప్లర్ 13ఏబీపై తాము పరిశోధనలు చేశామని.. నక్షత్రానికి అతి దగ్గరగా ఉన్న ఈ గ్రహం ఒకభాగం ఎప్పుడూ చీకట్లోనే ఉంటుందని పెన్ స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్త థామస్ బెటీ వివరించారు. మంచు రూపంలో టైటానియం యాక్సైడ్ కురిసేది కూడా ఈ చీకటి ప్రాంతంలోనేనని తెలిపారు. నక్షత్రానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 5,000 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటాయని బెటీ వెల్లడించారు. -
షావోమికి ఝలక్.. టైటానియం జంబో స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ కార్బన్ మరో సరికొత్త స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. టైటానియం సిరీస్ కొనసాగింపుగా ‘కార్బన్ టైటానియం జంబో’ పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీని ఎంఆర్పీ ధర రూ.7,490 కాగా, మార్కెట్ ఆపరేటింగ్ ధర కింద రూ.6,490కే అందించనున్నట్టు కార్బన్ ప్రకటించింది. అలాగే ఫోన్తో పాటు ప్యానల్ కవర్ను కూడా ఉచితంగా సంస్థ అందిస్తోంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి తమ తాజా ఫోన్ ప్రత్యేకత అనీ స్టాండ్బై మోడ్లో 400 గంటల టాక్టైమ్, 16గంటల పాటు బ్యాటరీ పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో స్పీడ్ , కెమెరా, ధరతో పోల్చుకుంటే.. ఈ డ్యుయల్ సిమ్ టైటానియం జంబో..షావోమి రెడ్మి 4 మొబైల్కు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. టైటానియం జంబో ఫీచర్లు 5 అంగుళాల స్క్రీన్ 1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 2జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఈ ఫోటోలు సౌర శక్తి ఫలకాలు
సౌరశక్తి విసృ్తత వినియోగానికి ఉన్న ఒక అడ్డంకి సౌరశక్తి ఫలకాలసైజు.వీటిని ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసుకుడమూ సాధ్యం కాదు. పైగా ఖర్చూ ఎక్కువే. ఈ ఇబ్బందులన్నింటికీ చెక్ పెట్టేశామంటోంది ఆల్టో యూనివర్శిటీ. ఫొటోలో కనిపిస్తున్నవి.. మామూలు ఫొటోలు మాత్రమే కాదు.. సాధారణ ఇంక్జెట్ ప్రింటర్తో ముద్రించుకోగల సౌరశక్తి ఫలకాలు కూడా. డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్ పేరుతో ఇలాంటివి ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నా ఆల్టో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ది చేసిన వాటి సామర్థ్యం ఎక్కువ. పైగా వీటిని ఫొటోలుగా, లేదంటే అక్షరాలుగా కూడా ముద్రించుకుని సౌరశక్తిని ఉత్పత్తి చేయవచ్చు. ప్రత్యేకమైన ఇంకును టైటానియం పొరపై ముద్రించడం ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ రకమైన సౌరశక్తి ఫలకాలకు అడ్వర్టయిజ్మెంట్ హోర్డింగ్లపై వాడితే అటు ప్రచారంతోపాటు ఇటు కరెంటూ ఉత్పత్తి చేయవచ్చునన్నమాట. దాదాపు వెయ్యిగంటలపాటు ఏకబిగిన పనిచేయించినా వీటి సామర్థ్యం 6.4 శాతం వరకూ కొనసాగిందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఘుఫ్రాన్ హష్మీ తెలిపారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
Advertisement