-
పొగాకు మార్కెట్ పతనం
కొండపి: నిన్నమొన్నటి వరకూ పర్వాలేదు అనుకున్న పొగాకు మార్కెట్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఒక్క రోజులోనే కొండపి వేలం కేంద్రంలో కేజీకి రూ.10 పైగా ధర తగ్గింది. దీంతో రైతులు ఆందోళనకు దిగి వేలాన్ని అడ్డుకున్నారు. స్థానిక పొగాకు వేలంకేంద్ర అధికారి మురళీధర్ ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటగా 48 బేళ్లు కొనుగోలు చేశాక సరైన ధర రాలేదని పచ్చవ, కామేపల్లి గ్రామాలకు చెందిన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వేలాన్ని అపాలని మురళీధర్ను కోరారు. దీంతో వేలాన్ని ఆపిన మురళీధర్ వ్యాపారులు, రైతులతో మాట్లాడి తిరిగి కొనుగోళ్లు ప్రారంభించారు. మరో ఆరు బేళ్లు కొనుగోలు చేసిన తరువాత ధరల విషయంలో మార్పు రాలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. దీంతో అర్ధగంట పాటు అక్కడే రైతులు, వ్యాపారులు, అధికారుల మధ్య సంవాదం చోటుచేసుకుంది. శని, సోమవారాల్లో 80 శాతానికి పైగా నంబర్ పొగాకును క్వింటా రూ.11,500 నుంచి రూ.11,800 వరకు కొనుగోలు చేయగా, అదే రకం పొగాకును రెండు రోజులు తరువాత రూ.10,500 నుంచి రూ.11,000లోపే కొనుగోలు చేయటం ఏమిటని రైతులు ప్రశ్నించారు. వేలంకేంద్రం రైతు నాయకుడు బొడ్డపాటి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఒక్కరోజులోనే వెయ్యి రూపాయలకు పైగా మార్కెట్ దిగకోస్తే ఎట్లా అని అధికారులను నిలదీశారు. దీనిపై ఆగ్రహించిన ఫీల్డ్ అసిస్టెంట్ మురళీ బ్రహ్మయ్యపైకి ఆవేశంగా వచ్చారు. దీంతో అక్కడే ఉన్న రైతులు బోర్డు అధికారి దుందుడుకు చర్యకు నిరసనగా ఆర్అండ్బీ రహదారిపై బైఠాయించారు. రైతు నాయకుడు బ్రహ్మయ్యపైకి క్షేత్రసహాయకుడు రావటం సరికాదని, వ్యాపారులు మాయాజాలంతో ధరలు తగ్గించి కొనటం అన్యాయం అని నినదించారు. అర్ధగంటకు పైగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలను అక్కడే ఆగిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులు, బోర్డు అధికారులతో మాట్లాడి సంయమనంపాటించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో రైతులు శాంతించి రాస్తారోకో విరమించారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు ధరల విషయంపై వేలం కేంద్రానికి వచ్చి ఆరా తీశారు. రైతులకు న్యాయం చేసేలా చూడాలని వేలం కేంద్రం అధికారులను కోరారు. -
మరింత తగ్గిన వర్జీనియా ధర
దేవరపల్లి, న్యూస్లైన్ : వర్జీనియా పొగాకు ధర రోజురోజుకీ పతనమవుతోంది. రోజుకు కిలోకు సగటు ధర రూ. 5 నుంచి రూ.6 తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గరిష్ట ధర కిలోకు రూ.166 నుంచి 168 ఇస్తున్నప్పటికి అతితక్కువ బేళ్లకు మాత్రమే ఈ ధర లభిస్తోంది. ఈ నెల 19న కిలో గరిష్ట ధర రూ.177 పలకగా, 21వ తేదీన రూ.165లకు పడిపోయింది. గురువారం మార్కెట్లో రూ.159 నుంచి రూ.168 గరిష్ట ధర లభించింది. అయితే 90 శాతం బేళ్లను రూ.162 నుంచి రూ.164కే కొనుగోలు చేశారు. శుక్రవారం ఈ ధర మరింత తగ్గటంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. గురువారం కంటే శుక్రవారం మార్కెట్లో సగటు ధర కిలోకు రూ.5 తగ్గటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐదు వేలం కేంద్రాల్లో రోజుకు సుమారు 5 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేస్తున్నారు. తగ్గిన ధరను బట్టి రోజుకు సుమారు రూ.15 నుంచి రూ.18 లక్షలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. గత రెండు రోజుల నుంచి కిలోకు రూ.10 సగటు ధర తగ్గిందంటున్నారు. లోగ్రేడు పొగాకు ధర రూ.130 నుంచి రూ.90కు చేరుకోగా, మాడు గ్రేడు కొనేనాధుడు లేడని రైతులు వాపోతున్నారు. వారం రోజుల్లో పొగాకు మార్కెట్ పతనం కావటంతో రైతులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మే 15 తర్వాత మార్కెట్ పుంజుకుంటుందని రైతులతో పాటు అధికారులు భావించారు. అయితే రోజురోజుకు తగ్గటంతో రైతులు అమోమయానికి గురవుతున్నారు. మున్ముందు మార్కెట్ ఎలా ఉంటుందోనని రైతులు కలవరపడుతున్నారు. పొగాకు కొనుగోలుదారులకు విదేశీ ఎగుమతి ఆర్డర్లు ఇంతవరకు ఖరారు కాకపోవటం వల్ల మార్కెట్ ఒడుదుడుకుల్లో ఉందని అధికారులు అంటున్నారు. ఇందువల్లే కొనుగోలుదారులు పొగాకు కొనుగోలుకు మక్కువ చూపటంలేదని చెబుతున్నారని, ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్ పరిస్థితి అంతుచిక్కటంలేదని దేవరపల్లి వేలం నిర్వహణాధికారి ఎస్వీవీఎస్ మూర్తి తెలిపారు. శుక్రవారం దేవరపల్లి వేలం కేంద్రానికి 907 బేళ్లును రైతులు అమ్మకానికి తీసుకురాగా 650 బేళ్లు అమ్ముడు పోయాయి.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
IPL 2024: ముగిసిన లీగ్ మ్యాచ్లు.. ప్లే ఆఫ్స్కు చేరిన జట్లు ఇవే
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
కమల్హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (19-05-2024)
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement