-
35 కి 38 మార్కులు.. ఎలా వచ్చాయంటే...
పాట్నా : బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు మరోసారి వివాదంలో పడింది. టాపర్స్ స్కాం చోటు చేసుకున్న రెండేళ్ల అనంతరం, మరో స్కాం వెలుగులోకి వచ్చింది. కొంతమంది క్లాస్ 12 విద్యార్థులకు మొత్తం(టోటల్) మార్కుల కంటే అత్యధికంగా వేసినట్టు తెలిసింది. కొంతమంది విద్యార్థులకైతే, ఏకంగా ఎగ్జామ్కు హాజరు కాకపోయినా.. మార్కులు వేశారు. అర్వాల్ జిల్లాకు చెందిన భీమ్ కుమార్ అనే విద్యార్థి... మ్యాథమేటిక్స్ థియరీలో మొత్తం(టోటల్) 35 మార్కులకు 38 మార్కులు పొందాడు. అదేవిధంగా అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లో కూడా తనకు 35కు 37 మార్కులు వచ్చినట్టు ఆ విద్యార్థి చెప్పాడు. మార్కులు చూసుకుని తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాయనని, ఇలాంటి ఘటనలు కేవలం స్టేట్ బోర్డు ఎగ్జామ్స్లో మాత్రమే జరుగుతాయని పేర్కొన్నాడు. భీమ్ కుమార్తో పాటు సందీప్ రాజ్కు కూడా ఇదే విధంగా ఆశ్చర్యకరమైన మార్కులు వచ్చినట్టు తెలిసింది. ఫిజిక్స్ థియరీ పేపర్లో తనకు 35 మార్కులు గాను, 38 మార్కులు వేసినట్టు చెప్పాడు. ‘ఇది ఎలా సాధ్యమవుతుంది. ఇంగ్లీష్, రాష్ట్ర భాషలో అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లో నాకు జీరో మార్కులు వచ్చాయి’ అని అన్నాడు. రాహుల్ అనే మరో విద్యార్థికి కూడా మ్యాథమేటిక్స్లో అబ్జెక్టివ్ పేపర్లో 35 మార్కులకు 40 మార్కులు వేశారని తెలిసింది. మరికొంత మంది విద్యార్థులు తాము కనీసం పరీక్షకు హాజరుకాకపోయినా.. ఆ సబ్జెట్లలో మార్కులు వచ్చినట్టు చెబుతున్నారు. ఇలా తప్పులుతడకలుగా మార్కులు వేసి, బిహార్ ఎగ్జామినేషన్ బోర్డు మరోసారి బజారు పాలైంది. -
టాపర్ స్కాం నిందితుడి ఆస్తుల అటాచ్
న్యూఢిల్లీ: 2016లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బిహార్ టాపర్’ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. విష్ణురాయ్ కాలేజీ నిర్వాహకుడు బచ్చారాయ్కి చెందిన రూ.4.53 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. సీబీఎస్ఈ ఆర్ట్స్ విభాగంలో అప్పటి బిహార్ రాష్ట్ర టాపర్గా నిలిచిన రూబీరాయ్ వైశాలిలోని బచ్చారాయ్ కళాశాలలోనే చదువుకుంది. ఈమెకు ‘పొలిటికల్ సైన్స్’ అంటే కూడా తెలీదని మీడియా ద్వారా వెల్లడి కావటంతో ప్రభుత్వం విచారణచేపట్టింది. దీంతో సీబీఎస్ఈ పరీక్షల్లో భారీ అవకతవకలతోపాటు 10,12వ తరగతి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించి 8 మందిపై పోలీసులు కేసువేశారు. వీరిలో విష్ణు రాయ్ కాలేజి నిర్వాహకుడు బచ్చా రాయ్ అలియాస్ అమిత్కుమార్ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. దీంతో ఈడీ బచ్చా రాయ్పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. బచ్చా, అతని కుటుంబసభ్యుల పేర్లతో వివిధ ప్రాంతాల్లో ఉన్న 31 ప్లాట్లను సీజ్ చేయంతోపాటు 10 బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసింది. -
అజ్ఞానమే నేటి జ్ఞానం
జీవన కాలమ్ ఈ దేశంలో అజ్ఞానానికి మరో ఆస్కారం లేదు. చచ్చినట్లు ప్రథమ స్థానంలో ఉండటమే. అవినీతి పెట్టుబడికి పుష్పించిన ‘అజ్ఞానం’ ఎప్పుడూ మీదికి ఎగబాకుతుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడెవరికీ జ్ఞానం అక్కరలేదు. చాలా సంవత్సరాల కిందట- ఒక పాత్రికే యుడు అనుకుంటాను- ఒక దుర్మార్గమైన పని చేశాడు. రాజకీయ నాయ కులలో విజ్ఞానాన్ని వెదకా లనే సాహసం చేశాడు. జన గణ మన ఎవరు రాశారు? అన్న ప్రశ్న వేశాడు. చాలామంది తెల్లమొహం వేశారు. కొందరు కష్టపడి, ప్రయత్నం చేసి ‘మహాత్మా గాంధీ’ అన్నారు. మరికొందరు తడువుకోకుండా ‘జవహ ర్లాల్ నెహ్రూ’ అన్నారు. ఈ మధ్య బిహార్లో రాష్ట్రంలోకల్లా ప్రథమ స్థానంలో నిలబడిన విద్యార్థులు తీరా ప్రశ్నలు అడిగే సరికి- భయంకరమైన సమాధానాలు చెప్పారట. ప్రభుత్వం కోపం తెచ్చుకుని ఇలా ‘అజ్ఞానానికి’ పట్టం కట్టిన అందరినీ- విద్యార్థులతో సహా- అరెస్టులు చేయించింది. ఇది అన్యాయం అని మనవి చేస్తున్నాను. అజ్ఞానం కొందరి జన్మహక్కు. దాన్ని ఏ జ్ఞానమూ రూపుమాపలేదు. ఈ విద్యార్థులు బిహార్ మంత్రివర్గంలో ఉండే అర్హతలను సంపాదించుకు న్నారని నితీశ్ కుమార్గారు గ్రహించాలి. వారి మంత్రి మండలిలో బొత్తిగా చదువులేనివారి దగ్గ ర్నుంచి, హైస్కూలు చదువు కూడా లేనివారు ఎందరో ఉన్నారు. నా ప్రశ్న: చదువులేనివారు ఉండటం మంచిదా? చదువు వచ్చిందని డిగ్రీలు ఉన్నవారు ఉండటం మంచిదా? ఏనాడయినా, ఏ పెద్దమనిషి అయినా లాలూప్రసాద్గారికి కానీ, రబ్రీదేవిగారికి కాని చదువు పరీక్షలు పెట్టే సాహసం చేశారా? బాబూ! మనది ప్రజాస్వామ్యం. అజ్ఞానం మన జన్మ హక్కు. రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన 17 ఏళ్ల అమ్మాయి రూబీరాయ్ పొలిటికల్ సైన్స్ అంటే వంటగదికి సంబంధించిన చదువు- అని వక్కా ణించింది. ఆవిడకి బిహార్ ముఖ్యమంత్రి అయ్యే హక్కు ఉన్నదని నా అభిప్రాయం. ఆ మధ్య- లాలూ గారి హయాంలో వారి సతీమణి వంటగదినుంచి సరాసరి ముఖ్యమంత్రి కుర్చీకి ప్రయాణం చేశారా లేదా? కొండంత ఉదాహరణ కళ్లముందే ఉన్న ఈ అమ్మాయి తప్పు చేసిందనడానికి ఎన్ని గుండెలు? ఒకాయన (బిహార్) తన పన్నెండో తరగతి పరీక్షని రెండుసార్లు ఫెయిలయ్యాడు. మూడోసారి పరీక్ష రాసి మొదటి తరగతిలో పాసయ్యాడు. ఎలాగ? పరీక్షలో పాసయ్యే దగ్గర మార్గాన్ని కను గొన్నాడు కనుక. ఇంక అతను ఆగలేదు. రెండుసార్లు పరీక్షలో తప్పిన అమిత్ కుమార్ రాష్ట్రంలోకల్లా తల మానికంగా నిలిచే దగ్గర సూత్రాన్ని కనుగొన్నాడు. వెంటనే వారి తాతగారి పేరుమీద విషుంరాయ్ కాలే జీని ప్రారంభించాడు. బిహార్ పరీక్షల శాఖ ఉద్యో గుల్ని పట్టుకున్నాడు. అడ్డమయిన వాళ్లనీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే ‘దుకాణం’ ప్రారంభిం చాడు. అప్పటికి ఆయన వయస్సు- కేవలం 19 సంవత్సరాలు. ఇతను కేవలం 13 నెలల్లో ఎమ్.ఎ. డిగ్రీ చేజిక్కించుకున్నాడు. సంగీతంలో పీహెచ్డీ డిగ్రీని పుచ్చుకుని డాక్టరయ్యాడు. ఇది ఎలా సాధ్యమయింది? తమరు సరిగ్గా ఊహించే ఉంటారు ఈ పాటికి. వీరికి లాలూప్రసాద్ గారితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. వారి అబ్బాయి- బొత్తిగా చదువులేని, ప్రస్తుత ఆరోగ్య మంత్రిగా ఉన్న తేజ్ప్రసాద్ యాదవ్గారితో సత్సం బంధాలు ఉన్నాయి. ఈ కాలేజీ మాత్రమే కాకుండా ఈ అమిత్ కుమార్గారికి మరి రెండు విద్యా సంస్థలు, ఒక హైస్కూలు ఉన్నాయి. చదువులో అవి నీతి కిందనుంచే ప్రారంభం కావాలని గ్రహించిన మేధావి ఈ అమిత్ కుమార్గారు. గత మూడు సంవకత్సరాలుగా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలి చిన వారంతా ఈ సంస్థవారే. ఈపాటికి 20 మంది ఉద్యోగులు- మొన్ననే బిహార్ స్కూలు ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ హరి హరనాథ్ ఝాతో సహా- అరెస్టు చేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన పిల్లలు కూడా అరెస్టయ్యారు. చెత్తకుండీలో చెత్తని తింటున్న ఆవుదేం నేరం? పాపం. ఈ పిల్లలేం చేస్తారు? దమ్ముంటే- ఆ చెత్తకి కారణమయిన, చెత్తనే కోరుకుంటున్న ఆ పిల్లల తల్లిదండ్రుల్ని అరెస్టు చెయ్యండి. ‘ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు?’ అని పోలీసులు రూబీరాయ్ అనే అమ్మాయిని అడిగారు. ఆ పిల్ల కళ్లనీళ్లు పెట్టుకుంది. ‘నువ్వు పరీక్ష రాయి. రిజల్టు సంగతి నేను చూసుకుంటాను’ అన్నా డట ఆమె నాన్న. ‘నాకు రెండో క్లాసు వస్తే చాలు అనుకున్నాను. నన్ను మొదటి స్థానంలో- రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపారు. నన్నేం చెయ్యమంటారు?’ అని వాపోయింది ఆ అమ్మాయి. ఈ దేశంలో అజ్ఞానానికి మరో ఆస్కారం లేదు. చచ్చినట్లు ప్రథమ స్థానంలో ఉండటమే. అవినీతి పెట్టుబడికి పుష్పించిన ‘అజ్ఞానం’ ఎప్పుడూ మీదికి ఎగబాకుతుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడెవరికీ జ్ఞానం అక్కర లేదు. జ్ఞానం ఉన్నదనే లేబుల్ కావాలి. మార్కెట్లో ఆ లేబుల్కి మంచి గిరాకీ ఉంది. అందుకనే మన దేశంలో ఈ లేబుళ్లను గర్వంగా చెప్పుకునే ఎన్నో దుకాణాలు వెలిశాయి. గొల్లపూడి మారుతీరావు -
టాపర్స్ స్కాం.. కీలక పురోగతి
పాట్నా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ ఇంటర్మీడియట్ టాపర్స్ స్కాంలో విచారణ వేగంగా జరుగుతుంది. ఈ స్కాంతో సంబంధం ఉన్న బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు(బీఎస్ఈబీ) చైర్మన్ లాల్ కేశ్వర్ సింగ్, ఆయన భార్య అయిన జేడీ(యూ) మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాలపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పోలీసుల కోరిన ప్రకారం పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఓమ్ ప్రకాశ్ బుధవారం భార్యాభర్తలపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు ప్రకటించారు. అవినీతి అరోపణలు రావడంతో జూనియర్ ప్రొఫేసర్ దిలీప్ కుమార్ వర్మను ప్రిన్సిపాల్ గా నియమించిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హా విద్యార్హత పత్రాలు నకిలీవని తేలింది. 2010 ఎన్నికల్లో ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఎనిమిదేళ్లకే మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేయటం విశేషం. ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం పాట్నాలోని గంగా దేవి మహిళా కాలేజీ పరిధిలో సోదాలు నిర్వహించారు. అక్రమ మార్గంలో సర్టిఫికేట్లు పొందిన విద్యార్థులు.. సర్టిఫికేట్కు రూ. 5 లక్షలు చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. టాపర్స్ స్కాంలో ఇప్పటికే కొందరు టాపర్స్ ను, మరో కీలకమైన వ్యక్తి, విషున్ రాయ్ కాలేజ్ డైరెక్టర్ బచ్చన్ రాయ్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement