-
హైదరాబాద్లో కుండపోత వర్షం.. కిలోమీటర్లమేర నిలిచిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షంతో నగరంలో కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక వాకర్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోడ్డుపై నడవాలంటేనే జంకుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతవరణశాఖ వెల్లడించింది. కూకట్పల్లి వై జంక్షన్ చెరువును తలపిస్తోంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. మెట్రో పక్కన పార్క్ చేసిన బైక్లు నీటిలో మునిగాయి. ఫతేనగర్ స్టేషన్ దగ్గర భారీగా వరద నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. 5 అడుగులకు పైగా వరద నీరు చేరడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఫతేనగర్ మీదుగా వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ సిబ్బంది సూచించారు. అమీర్పేట్ నుంచి కూకట్పల్లి వెళ్లే వాహనాలు నిలిపివేశారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ మెట్రో ఇబ్బందులు భారీ వర్ష ప్రభావం మెట్రో స్టేషన్లను కూడా తాకింది. మెట్రో స్టేషన్లలో సర్వర్ ప్రాబ్లమ్ తలెత్తింది. టికెట్లు ఇష్యూ కాకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో అరగంట నుంచి మెట్రో స్టేషన్లలో భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి ముందస్తు సమాచారం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
శ్రీనగర్ కాలనీలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
హైదరాబాద్: శ్రీనగర్ కాలనీలోని రత్నదీప్ సూపర్మార్కెట్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్లను నివారించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీ మాసుంబాషా, బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ రావు అక్కడ పర్యటించారు. నాలుగువైపులా కూడలి ఉండటంతో వాహనాలు ఇష్టమొచ్చినట్లు మళ్లుతున్నాయని దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు పరిష్కారంగా ఇక్కడ టూ వే చేయాలని నిర్ణయించారు. శ్రీనగర్ కాలనీ వైపు నుంచి టీవీ 9 వైపు బంజారాహిల్స్కు వెళ్లే వాహనదారులు నేరుగా వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాగే, టీవీ9 వైపు నుంచి పెట్రోల్ బంక్ మీదుగా రత్నదీప్ సూపర్మార్కెట్ వైపు వెళ్లేందుకు వీలుపడదు. ఇటు వైపు వాహనాలను అనుమతించకుండా మధ్యలో డివైడర్ను ఏర్పాటు చేస్తారు. రత్నదీప్ వైపు వెళ్లేవారు శ్రీనగర్కాలనీ పార్కు వైపు నుంచి యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగు వైపులా వాహనాలను అనుమతించకుండా కేవలం రాకపోకలు మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా చేస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుందని అధికారులు తెలిపారు. -
కళ్లలో యుద్దం
జిల్లాలో పెరుగుతున్న వాహనాల రద్దీ కాలుష్య కోర ల్లో చిక్కుకుంటున్న పట్టణాలు దెబ్బతింటున్న వాహనదారుల ఆరోగ్యం నిత్యం ట్రాఫిక్లో చిక్కుకునే వారి కళ్లకు పొంచి ఉన్న ముప్పు జిల్లాలో వాహనాల రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఫలితంగా వాతావరణంలో ధూళికణాలు భారీగా పేరుకుపోతున్నాయి. ట్రాఫిక్లో కళ్లకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. ఏకాగ్రత కోల్పోవడం, విచక్షణా శక్తి దెబ్బతినడం వంటి మానసిస సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఎక్కువ సమయం ఏసీ గదుల్లో గడిపేవారికి కూడా కళ్లల్లోతడి ఆరిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. తిరుపతి క్రైం: సున్నితమైన నేత్రాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిత్యం నేరుగావచ్చి పడే దుమ్ము కణాల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నీరుకారడం .. మంట.. ఎర్రబడడం .. వంటివాటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిత్యం రోడ్లపై ప్రయాణించే జిల్లావాసులు ఈ తరహా సమస్యలతో నేత్ర వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ సర్వేలోనూ ఈ విషయం స్పష్టమైంది. జిల్లాలో సుమారు వాహనాలు 3.5 లక్షలకు పైగా ఉన్నాయి. వీటికితోడు కలియుగ వైకుంఠం తిరుమలకు రోజూ ఇతర ప్రాంతాల నుంచి 15 వేల వాహనాలు వస్తుంటాయి. వీటికితోడు జిల్లాలో అక్కడక్కడా రోడ్డు పనులు జరుగుతుం టాయి. ఫలితంగా వాతావరణ, గాలి కాలుష్యం తీవ్రమవుతోంది. వాస్తవానికి పీఎం 2.5 ధూళికణాలు ఘనపు మీటరు గాలిలో- 40 మైక్రోగ్రాములు, పీఎం-10 ధూళికణాలు- 60 మైక్రోగ్రాములు నుంచి వుంటే ప్రమాదమే. జిల్లాలో ప్రధాన పట్టణాలైన చిత్తూరు, మదనపల్లి, పుంగనూరు, కుప్పం, పుత్తూరు, సత్యవేడు, గంగాధరనెల్లూరు, పలమనేరు, పీలేరు తదితర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నాయి. సర్వేలో తేలిన అంశాలు ఓ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల చాలామంది కంటి పరీక్షలు చేపట్టారు. ఇందులో జిల్లాలోని మొత్తం వాహనదారుల్లో దాదాపు 12శాతం మందిలో కంటి దురద, నీరు కారడం, ఎర్రబడడం గుర్తించారు. గాలి, వాతావరణ కాలుష్యం కారణంగా ఇవి వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇందులో 20-40 ఏళ్ల మధ్య వయసు వారే అధికంగా ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ బాధ్యతలు, ఇతర పనులతో నిత్యం ట్రాఫిక్లో తిరిగేవారు నేత్ర సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవి చేయకూడదు.. కళ్లు.. దురదపుట్టిన వెంటనే అదేపనిగా నలపకూడదు, వైద్యుల సూచనలతో చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర కంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కొన్ని సార్లు కంటిపై పొర కూడా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. కొందరు మెడికల్షాపుకు వెళ్లి ఐడ్రాప్స్ తీసుకుని వినియోగిస్తున్నారు. దీనివల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇవి చేయాలి.. ట్రాఫిక్లో తప్పని సరిగా సరైన కళ్లద్దాలు ధరించాలి. బెక్లపై తిరిగేవారు హెల్మెట్, గాగుల్స్ ధరించడం మంచిది. ఏసీగదులు, స్క్రీన్ వాచింగ్ వల్ల నేత్ర సమస్యలు పెరుగుతాయి. దుమ్మూ,ధూళి వల్ల శ్వాసకోస వ్యాధులు, ముక్కుకు సంబంధించిన జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. -
ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే ఫ్లై ఓవర్ నిర్మాణం
ఎంపీ కేశినేని నాని విజయవాడ(భవానీపురం) : రాజధాని అవసరాలు, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, ఏలూరు రోడ్ ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకే బెంజి సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని) చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్రావు, మేయర్ కోనేరు శ్రీధర్, జాతీయ రహదారుల రీజినల్ ఆఫీసర్ అనిల్ దీక్షిత్, పీడీ సురేష్, మేనేజర్ మధుసూదన్, విద్యావాణిలతో కలిసి ఆయన శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఎంపీ మాట్లాడుతూ నగరంలో ప్రధాన కూడలి అయిన బెంజి సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జ్యోతి కన్వెన్షన్ నుంచి స్టెల్లా కలాశాల జంక్షన్ వరకు సుమారు 618 మీటర్లకు బదులుగా మరో 820 అడుగులు పెంచి 1.4 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణం చేయాల్సి ఉందని తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని రమేష్ హాస్పటల్ సర్కిల్ వరకు పెంచడం వలన కేంద్రం నుంచి రూ.120 కోట్లు అదనంగా నిధులు సమీకరించాల్సి ఉందని చెప్పారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం నేషనల్ హైవే అధికారుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరొక నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో గుండుగొలను బైపాస్ రోడ్ ఏర్పాటు చేసినందున బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణం స్టెల్లా కాలేజి వరకు సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపిందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రమేష్ హాస్పటల్ వరకు పొడగించాలని కోరుతూ గతంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారిని పలుమార్లు కలిశామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన నిధులను త్వరలో సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి గన్నె వెంకట నారాయణ ప్రసాద్(అన్న), డెప్యూటీ మేయర్ జి రమణారావు, కార్పొరేటర్లు సీహెచ్ గాంధీ, దేవినేని అపర్ణ, కె.రమాదేవి, జాస్తి సాంబశివరావు, నజీర్, సీనియర్ నాయకులు టి ప్రేమ్నాథ్, కె రామామరావు, తెలుగు మహిళ అధ్యక్షురాలు కె సూర్యలత పాల్గొన్నారు. -
సీఎం వద్దకు ద్విచక్ర ‘108’ ఫైలు
ఆమోదించిన వెంటనే నగర రోడ్లపైకి.. సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రద్దీతో కొట్టుమిట్టాడే హైదరాబాద్లో ద్విచక్ర ‘108’ అంబులెన్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్యశాఖ సంబంధిత ఫైలును సీఎం ఆమోదం కోసం పంపింది. ముందుగా 50 ద్విచక్ర అంబులెన్సులు అవసరమని ప్రతిపాదన పెట్టింది. ఒక్కో ద్విచక్ర వాహనానికి, దానికి అనుబంధంగా వైద్య పరికరాల కోసం రూ. 1.25 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ద్విచ క్ర వాహన కంపెనీలు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించారు. త్వరలో నగర రోడ్లపైకి ఈ ద్విచక్ర అంబులెన్సులు రానున్నాయని ఓ వైద్యాధికారి పేర్కొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement