-
పెళ్లి పీటలపై వధువు మృతి
అచ్చంపేట రూరల్: కోటి ఆశలతో కొత్త కాపురంలోకి అడుగు పెట్టాల్సిన ఓ యువతి.. తాళి కట్టించుకున్న కొద్దినిముషాలకే పెళ్లిపీటలపై కుప్పకూలి కన్ను మూసింది. తాళి కార్యక్రమం ముగిశాక.. అరుంధతి నక్షత్రాన్ని చూసేందుకు బయటకు రావాలని పురోహితుడు కోరగా, పైకి లేస్తున్న క్రమంలో ఆ యువతి పెళ్లి వేదికపై కింద పడిపోయింది. బంధువులు ఆందోళనతో ఆస్పత్రికి తీసుకెళ్లే లోగానే మృతి చెందింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మహేంద్రనగర్ కాలనీలో కొండి నిరంజన్, శంకరమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఇద్దరు కుమారులతో పాటు తండ్రి నిరంజన్ చనిపోయారు. చిన్న కుమార్తె లక్ష్మి అలియాస్ నిరంజనమ్మ(20)కు వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన శేఖర్ కుమారుడు బాగాడి వెంకటేశ్తో కుటుంబీకులు వివాహం నిశ్చయించారు. శనివారం ఉదయం 11 గంటలకు వధువు ఇంటి వద్ద మహేంద్రనగర్ కాలనీలోనే పెళ్లి వేడుక నిర్వహించారు. వరుడు తాళి కట్టిన అనంతరం అరుంధతి నక్షత్రాన్ని చూడడానికి బయటకు రావాలని నూతన జంటను పురోహితుడు పిలిచాడు. వధువు లక్ష్మి పైకి లేవడానికి ప్రయత్నించి అకస్మాత్తుగా పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోయింది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న లక్ష్మి కుప్పకూలవడంతో బంధువులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వధువు సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ పరశురాం తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్మన్ తులసీరాం, టీఆర్ఎస్ నాయకులు నర్సింహగౌడ్, కోట కిషోర్, హుస్సేన్ తదితరులు పరామర్శించారు. -
పెళ్ళి జరిగిన కాసేపటికే వధువు మృతి
-
అరుంధతీ నక్షత్రం చూస్తూ కుప్పకూలిన వధువు!
సాక్షి, నాగర్కర్నూల్ : పెళ్లి సందడిలో మునిగి తేలుతున్న కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ఊహించని షాక్ తగిలింది. అప్పటి వరకు బాజా భజంత్రీలు.. వింధు భోజనాలతో ఆహ్లాదకరంగా సాగిన ఆ పెళ్లి వేడుకలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన కాసేపటికే వధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విచారక ఘటన శనివారం నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో చోటుచేసుకుంది. వివాహమనంతరం ఆనవాయితీగా వరుడు అరుంధతి నక్షత్రాన్ని వధువుకు చూపిస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో బంధువులు వధువు బుజ్జి(23)ని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ వధువు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటివరకు ఆనందంగా గడిపిన ఆ ఇరుకుటుంబాలు శోకసంధ్రంలో మునిగిపోయాయి. గుండెపోటుతోనే నవ వధువు మరణించిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టంలో అసలేం జరిగిందనే విషయం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. అయితే అమ్మాయి ఇప్పటి వరకూ ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అరుంధతీ చూస్తూ భర్త కాళ్ల మీద పడి కుప్పకూలిపోవడం పలువుర్ని కంటతడిపెట్టిస్తోంది. -
కర్నూలులో మద్యం తాగి ముగ్గురు మృతి
-
కాటేసిన మద్యం
– వివాహ వేడుకలో అతిగా మద్యం తాగి ముగ్గురు మృతి – మిలటరీ మద్యం బాటిళ్లపై పోలీసుల ఆరా – ఎవరిపై కేసు నమోదు చేయని పోలీసులు నంద్యాల: వివాహ విందులో అతిగా మద్యం సేవించిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బిల్లలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరుడు భూమా రామకృష్ణారెడ్డి కుమారుడు రవికుమార్రెడ్డి వివాహ విందు సందర్భంగా ఆదివారం సాయంత్రం నుంచే గ్రామంలో సందడి మొదలైంది. హైదరాబాద్లోని గోల్కొండ మిలిటరీ హాస్పిటల్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న రవికుమార్రెడ్డి గ్రామస్తులకు, స్నేహితులకు మందు పార్టీ ఇవ్వడానికి దాదాపు 30 మిలిటరీ బాటిళ్లను గ్రామానికి తీసుకొచ్చారు. ఓల్డ్ఫాక్స్ రమ్, అరిస్ట్రోక్రాట్ విస్కీ, రాయల్ఛాలెంజ్ విస్కీలను బిందెల్లో పోసి, నీళ్లు కలిపి, గ్రామ నడిబొడ్డులోని గంగమ్మ ఆలయం వద్ద పానకంలా పంపిణీ చేశారు. విందులో పాల్గొన్న గ్రామానికి చెందిన కన్నాపుల్లయ్య, చిలకల కృష్ణుడు, గురువయ్య కూడా సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మద్యాన్ని అతిగా తాగారు. తర్వాత వీరు ఇళ్లకు వెళ్లారు. కొద్ది సేపటికి అపస్మారక స్థితికి చేరుకున్నారు. మొదట పుల్లయ్యను కుటుంబీకులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. తర్వాత గురువయ్య, చిలకల కృష్ణుడును కుటుంబ సభ్యులు వేర్వేరుగా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వీరు కూడా కోలుకోలేక అర్ధరాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు వీరి మృతదేహాలను గ్రామానికి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ మురళీధర్రెడ్డి, ఎస్ఐలు రమణ, సూర్యమౌళి, గోపాల్రెడ్డి, బిల్లలాపురం గ్రామానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. సోమవారం ఉదయం నంద్యాల ఇన్చార్జి డీఎస్పీ ఈశ్వరరెడ్డి గ్రామాన్ని సందర్శించి మృతదేహాలను పరిశీలించారు. ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షలకు పంపుతామని డీఎస్పీ తెలిపారు. అన్ని మిక్స్ చేయడమే ఘటనకు కారణం మిలిటరీ క్యాంటిన్ నుంచి తెచ్చిన పలు రకాల మద్యాన్ని బిందెల్లో పోసి నీళ్లు కలపడంతో కల్తీ జరిగినట్లు ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీరాములు తెలిపారు. అన్ని మిక్స్ చేసిన మద్యాన్ని సేవించడం ప్రమాదకరమన్నారు. దీంతోనే ముగ్గురు చెంది ఉంటారని పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు మద్యం తాగి ముగ్గురు మృతి చెందిన సంఘటనకు సంబంధించి ఎవరిపై కేసు నమోదు చేయలేదని రూరల్ ఎస్ఐ రమణ తెలిపారు. అయితే పోస్టుమార్టం నివేదిక అందాక కేసును పరిశీలిస్తామన్నారు. అప్పటి వరకు ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసులు నమోదు చేశామన్నారు. రోడ్డున పడ్డ మూడు కుటుంబాలు గ్రామంలోని దళిత వాడకు చెందిన కన్నాపుల్లయ్య నిరుపేద. ఆయన భార్య మరియమ్మ, కుమార్తె మౌనిక గుడిసెలో నివాసం ఉన్నారు. కన్నాపుల్లయ్య పగలంతా పని చేస్తేనే వీరి కుటుంబం గడవదు. ఆదివారం సాయంత్రం 6గంటలకు వివాహ విందుకు వెళ్లిన పుల్లయ్య విగత జీవిగా ఇంటికి చేరడంతో మరియమ్మ కుప్పకూలిపోయింది. పుల్లయ్య పెద్దకుమార్తె సుమలతకు వివాహం కాగా చిన్నకుమార్తె మౌనిక అవివాహితురాలు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దండబోయిన గురువయ్య కూలీగా పని చేసేవాడు. కాని రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కాలు విరిగింది. దీంతో కూలీ పని చేసే అవకాశం లేక పొట్టెళ్ల వ్యాపారం ప్రారంభించాడు. అతని కుమారుడు మధు టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. గురువయ్య కూడా రాత్రి పెళ్లి విందుకు వెళ్లి మృత్యువాత పడటంతో కుమారుడిపై కుటుంబ భారం పడింది. మృతుడి భార్య లక్ష్మి రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. వ్యవసాయ కూలీ చిలకల కృష్ణుడు నిరుపేద. ఈయనకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. కృష్ణుడు రోజూ కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కూడా రాత్రి వివాహ విందులో పాల్గొని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సంజీవనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. ఆయన కోలుకోలేక మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబం దిక్కులేనిదైంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
Advertisement