-
రైలులో టాయిలెట్లను పర్యవేక్షించిన మంత్రి: వీడియో వైరల్
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు బోగీలలోని కొత్తగా రూపొందించిన టాయిలెట్ల డిజైన్లను తనఖీ చేశారు. కొత్త హంగులతో ఆధునికరించిన మరుగుదొడ్లను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. అక్కడ ఒక వ్యక్తి చేసిన వర్క్ గురించి మంత్రికి వివరిస్తున్నాడు. ఆ వీడియోలో చాలా వరకు మరుగుదొడ్లను బాగా ఆధునీకరించారు. మంత్రి అశ్విన్ స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ చక్కగా ఉండేలా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ట్రైయిన్లు కూడా చెత్తతో పేరుకుపోయి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవడమే కాకుండా ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. పైగా ప్రజలను కూడా రైళ్లు శుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా దీనికి సహకరించాలని విజ్క్షప్తి చేశారు కూడా. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని రైల్వే మంత్రి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు చాలా బాగా చేస్తున్నారు మంత్రి గారు, భవిష్యత్తులో కూడా ఇలానే మెయింటెన్ చేస్తే బాగుంటుందంటూ కామెంట్లు చేస్తూ..ట్వీట్ చేశారు. Inspected the new upgraded toilet designs for existing coaches. pic.twitter.com/2v426YZiEy — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 31, 2023 (చదవండి: రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేకత ఏమి లేదు: కాంగ్రెస్ చీఫ్ ఎం ఖర్గే) -
రైలు టాయిలెట్లో యువకుడు దారుణ హత్య?
సాక్షి ప్రతినిధి, చెన్నై: కదులుతున్న రైలు బోగీలోని టాయిలెట్ను అగంతకులు అనువుగా ఎంచుకున్నారు. టాయిలెట్లోకి యువకుడిని లాక్కుని వెళ్లి కత్తులతో నరికి దారుణంగా హతమార్చి శవాన్ని బయటకు విసిరివేసిన కిరాతక సంఘటన తమిళనాడులో చోటుచేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు. ఉద్యోగులు, పాఠశాల, కాలేజీ విద్యార్థుల సౌకర్యం కోసం తూత్తుకూడి– తిరుచెందూరు మధ్య ప్యాసింజర్ రైలును నడుపుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఈ రైలు తిరుచెందూరుకు చేరుకోగా ప్రయాణికులంతా దిగిన వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు అధికారులు యథావిధిగా బోగీలన్నింటినీ తనిఖీ చేశారు. ఇంజిన్ నుంచి ఐదో బోగీ టాయిలెట్ తలుపు తెరిచిచూడగా రక్తం మడుగులు కట్టి ఎండిపోయిన స్థితిలో ఉండడాన్ని గమనించి గగుర్పాటుకు గురయ్యారు. హత్య జరిగిన తీరును బట్టి ఒకరి కంటే ఎక్కువ మంది దుండగులు యువకుడిని హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. మధ్యాహ్నం వేళ ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండడం, ప్రయాణ సమయంలో తలుపేసిన టాయిలెట్ నుంచి శబ్దం వచ్చే అవకాశం లేకపోవడం వల్ల హతుడిని టాయిలెట్లోకి లాక్కుని వెళ్లి నరికి హత్య చేసినట్లు భావిస్తున్నారు. మృతదేహం లేకపోవడంతో పరుగులు తీస్తున్న రైలు నుంచి గిరాటు వేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రైళ్లలో టాయ్లెట్లు ఎట్లా వచ్చాయంటే..
న్యూఢిల్లీ: ‘నేను ప్యాసింజర్ రైల్లో అహ్మెద్పూర్ రైల్వే స్టేషన్కు వచ్చాను. కడుపు విపరీతమైన ఉబ్బరంగా ఉంది. రైలు దిగాను. స్టేషన్లో ఓ లోటలో నీల్లు పట్టుకున్నాను. రైలు పట్టాలకు దూరంగా పరిగెత్తాను. కడుపు భారాన్ని దించుకుంటున్నాను. ఇంతలో రైల్వే గార్డు పచ్చ జెండా ఊపాడు. నేను వెనక నుంచి మొత్తుకుంటూ ఒక చేతిలో లోట, మరో చేతిలో దోవతి పట్టుకొని పరుగెత్తుకొస్తున్నాను. కాళ్లకు దోవతి అడ్డంపడి ఊడిపోయింది. స్టేషన్లో ఫ్లాట్ఫామ్ మీదున్న మహిళలు, పురుషులు అందరి ముందు నా మానం పోయింది. నా కోసం ఐదు నిమిషాలు రైలు ఆపని గార్డుకు ప్రజల తరఫున భారీ జరిమానా విధించాలని ప్రార్థిస్తున్నాను. అలా చేయని పక్షంలో పత్రికలకు నివేదిస్తా’ అని ఓఖిల్ చంద్ర సేన్ అనే ప్రయాణికుడు 1909లో వెస్ట్ బెంగాల్ సాహిబ్గంజ్ రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. ఫ్రేమ్ కట్టిన ఈ ఫిర్యాదు లేఖ ఢిల్లీ రైల్వే మ్యూజియంలో నేటికి కనిపిస్తుంది. ఈ లేఖనే రైల్వే బోగీల్లో మరుగుదొడ్లు నిర్మించాలనే ఆలోచనకు నాంది పలికింది. వందేళ్ల క్రితం నుంచి నేటికి రైల్వే శాఖపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియా విస్తరణతో నేడు ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. ట్విట్టర్ ఫిర్యాదులను రైల్వే మంత్రియే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యాలు అరకొరగానే ఉంటున్నాయి. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్ ముందు ప్రజాభిప్రాయ సేకరణ పేరిట పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాలను, డిమాండ్లను రైల్వే శాఖ స్వీకరిస్తుంది. ఈసారి కూడా ఆ కసరత్తు ఎప్పటి తంతులాగానే జరిగింది. పార్లమెంట్ సభ్యులు కూడా పార్టీల వారిగా విడిపోతారు. కొంత మంది వ్యక్తిగత అభిప్రాయాలను కూడా చెబుతారు. తమ నియోజక వర్గానికి కొత్త రైళ్లు కావాలని, కొత్త స్టాప్లు కావాలని, గేజ్ కన్వర్షన్ కావాలని, కొత్తగా రూట్ కావాలనే అందరూ మాట్లాడుతారు. ఎవరు కూడా రైల్వే వ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? దాన్ని స్వరూపం ఎలా ఉండాలి? సమస్యలను పరిష్కరించడం ఎలా, భవిష్యత్తుకు బాటలు వేయడం ఎలా ? ఆలోచించరు. సాక్షాత్తు రైల్వే మంత్రి కూడా ఆ దిశగా ఆలోచించరు. అందుబాటులో ఉన్న బడ్జెన్ను సర్దుకోవడం ఎలా ? ప్రయాణికులపై భారం వేయకుండా పెట్టుబడులను సమీకరించడం ఎలా ?, అన్ని ప్రాంతాల వారిని, ముఖ్యంగా పాలకపక్షాల ప్రయోజనాలను ఎలా పరిరక్షించాలనే ధోరణిలో ఆలోచిస్తారు. అందుకనే ఎన్ని చర్యలు తీసుకున్నా సమస్యలు ఎప్పటికి తీరకుండానే ఉంటున్నాయి. రాజకీయ కారణాల వల్ల ప్రయాణికుల చార్జీలను పెంచకుండా సరకు రవాణా చార్జీలను పెంచడం ద్వారా రెవెన్యూ పెంచుకునేందుకు రైల్వేలు గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తు వస్తున్నాయి. గూడ్సు రైళ్లు నడిచేందుకు ప్రత్యేక కారిడార్ లేకపోవడం వల్ల ఆ రైళ్లు నేడు గంటకు 26 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. అందుకని వాటిలో సరకు రవాణాకు పెద్దగా డిమాండ్ ఉండడం లేదు. రోడ్డు రవాణా స్పీడ్గా ఉండడంతో, రవాణా చార్జీలు రైలుతో సమానంగా లేదా అంతకన్నా తక్కువగా ఉండడంతో వ్యాపారులు సరకు రవాణాకు ఎక్కువ వరకు రోడ్డు మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల చార్జీలు కూడా పెద్దగా పెంచక పోవడం వల్ల పెట్టుబడులకు డబ్బులు లేవని, బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయని రైల్వే శాఖ ఎప్పుడూ ఆర్థిక శాఖపై ఆరోపణలు చేస్తుంటుంది. డబ్బుల్లేకనే తాము కొత్త ప్రాజెక్టులను పెద్దగా ప్రకటించలేక పోతున్నామని, కొత్త రైళ్లు ప్రవేశపెట్టలేక పోతున్నామని ప్రస్తుత రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గత ఏడాది బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు. కేటాయింపులను కూడా సరిగ్గా ఖర్చు పెట్టలేక పోయారన్నది నిపుణుల విశ్లేషన. రైల్వే శాఖ వద్ద మంజూరై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు 362. ఎలాంటి కొత్త ప్రాజెక్టులు ప్రకటించకుండా కనీసం ఐదేళ్ల హాలిడే ప్రకటిస్తే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తికావు. చైనాలో ప్రయాణికుల చార్జీలు, సరకు రవాణా చార్జీలు మనకన్నా యాభై శాతం తక్కువ. అయినా అవి మనకన్నా రెండింతల లాభాల్లో నడుస్తున్నాయి. వాటి వేగం మన రైళ్లకన్నా మూడింతలు ఎక్కువ. భారత్ నడుపుతున్న 13,000 రైళ్లు సకాలంలో వచ్చి పోయేలా, వాటి భద్రతకు, ఆరోగ్యకరమైన ఆహారానికి, మరుగుదొడ్ల శుభ్రతకు ముందుగా చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రయాణికులు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు
నిరాశపర్చిన ఈ–టూవీలర్స్ విక్రయాలు..
ఏకలవ్యలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గోదావరి వరదల సమయంలోనూ..
ఊహించని పరిహారం
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
కన్నీటి సుడులు.. కరిగె సూరీడు
జగన్ను మళ్లీ సీఎం చేసుకుందాం
గంటల్లోనే పరిహారం
హార్బర్ ప్రమాదంలో మూడో రోజే పరిహారం
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement