-
అడవిలోకి వెళ్లింది.. ఆదివాసీల జీవితాలకు ఆశాకిరణం అయ్యింది..
‘స్టుపిడ్ ఐడియా, ఈ ఆలోచనను ఇక్కడే ఆపెయ్’ అన్నారు... పేరెంట్స్. ‘పీహెచ్డీ పూర్తయింది కదా! మంచి ఉద్యోగం తెచ్చుకుని పెళ్లి చేసుకో’ అని కూడా అన్నారు. ఆమె వినలేదు... అడవిలోకి వెళ్లింది. ఆదివాసీల జీవితాలకు ఆశాకిరణం అయింది. వేలాది మంది జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపింది... విజ్ఞాన దీపాలను వెలిగించింది. డాక్టర్ నీలమ్ గుప్తా... ఢిల్లీలో చదివారు. చదువుకున్న వాళ్లందరూ నగరంలోనే ఉండిపోతే ఆదివాసీలు ఎప్పటికీ అడవిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నగరాన్ని వాళ్లకు పరిచయం చేయాలి. వాళ్లను నగరంలోకి తీసుకురావాలి. అందుకు రోడ్మ్యాప్ తయారు చేసే పని తనకు తానుగా తీసుకున్నారు. ఇంట్లో వాళ్లను సమాధానపరిచి ఆదివాసీల గ్రామాల్లో అడుగుపెట్టారు. చదువురాని వాళ్ల కోసం ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. బొమ్మలతో చదువు చెప్పసాగారు. నగరానికి, కుగ్రామానికీ తేడా బొమ్మలతో చూపించారు. పేదరికం, అసమానత, లింగ వివక్షల విషయంలో తన సేవలను మరింతగా విస్తరించారు. ‘ఆరోహ్ (ఏ రే ఆఫ్ హోప్)’ పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించి సేవలను విస్తరించారు. ప్రభుత్వ సహభాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ప్రాజెక్టులను చేపట్టి విజయవంతం గా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లలేని కుగ్రామాలతో మమేకమైపోయిందామె జీవితం. అక్కడి యువతను కలుపుకుని వారి సహాయంతో సామాజిక, ఆర్థిక సర్వేలు నిర్వహించారు. వారిని ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సామాజిక కార్యకర్త డాక్టర్ నీలమ్ గుప్తా నీళ్లతో లెక్కలు ‘‘అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోని ఈ కుగ్రామాల్లో నివసించే వారికి ప్రతిదీ నేర్పించాల్సిందే. నీటి శుభ్రత, సహజ వనరుల పరిరక్షణ, ఆరోగ్యం, జీవనోపాధి, మహిళాసాధికారత వంటి విషయాలతోపాటు తాము కూడా అందరి లాగానే చదువుకోవచ్చు అని కూడా చెప్పాల్సి వస్తోంది. సర్వే గణాంకాల ప్రకారం ఒక గ్రామంలో స్కూలుకు వెళ్లాల్సిన వయసు పిల్లల సంఖ్య పెద్దదిగా ఉంటుంది. స్కూల్ రికార్డులో ఎన్రోల్ మెంట్ దగ్గరకు వచ్చేసరికి చాలా పరిమితంగా ఉంటుంది. అంతపెద్ద గ్యాప్ను పూడ్చడానికి చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి. ఎన్రోల్ మెంట్తో మా పని పూర్తయిందా? కానే కాదు. పాఠ్యాంశాల్లోని పాఠాలను యథాతథంగా బోధిస్తే సరిపోయేది కాదు. అక్కడి పరిస్థితి ఏమిటంటే... పదవ తరగతి విద్యార్థికి ఏదైనా ఒక రంగును చూపించి ‘అది ఏ రంగు? అని అడిగితే, ఇంగ్లిష్లో ఆ రంగు పేరు పలకడం, రాయడం రాక బిక్కమొహం పెట్టేవాళ్లు. కూడికలు, తీసివేతలు, భాగాహారాలను నేర్పించడానికి బకెట్లో నీటిని తీసుకుని మగ్గులతో కొలిచి మరో బకెట్లో పోస్తూ నేర్పించాం. ఇలా వాళ్లకోసం టీచింగ్ మెథడాలజీలో కొత్త కాన్సెప్ట్లను తయారు చేసుకున్నాం. నీరు మురికి కావడం, శుభ్రంగా ఉండడం వంటి తేడాలను చూపిస్తూ ఎన్విరాన్మెంట్ సైన్స్ నేర్పించాం. ‘పఢో ఔర్ బఢో’ అనే కార్యక్రమాన్ని రూపొందించి యాభై వేల మంది విద్యార్థులను ఎన్రోల్ చేయించి వారందరికీ చైల్డ్ ఓరియెంటెడ్ మోడల్ ద్వారా పాఠాలు చెప్పాం. బీహార్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లోని యాభై గ్రామాల్లో ఈ సేవలందించాం. ఆ తర్వాత మాకనిపించింది... మహిళలను చైతన్యవంతం చేసి, వారికి జీవనోపాధి కల్పించినట్లయితే తమ పిల్లలకు చదువు అవసరాన్ని వారే గుర్తించేలా చేయగలిగితే ఆ క్షణం నుంచి తమ అభివృద్ధికి తామే బాటలు వేసుకోగలుగుతారనిపించింది. అనిపించడమే కాదు, అదే నిజమైంది. మహిళలకు వారికి రకరకాల పనుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించాం. కంప్యూటర్ బేసిక్ ఎడ్యుకేషన్, స్పోకెన్ ఇంగ్లిష్ కూడా నేర్పించాం. ఈ మార్పు ఒడిషాలోని కందమల్, రాయగడ, నౌపద, గజపతి, కోరాపుట్ జిల్లాల్లో నూ, జార్ఖండ్లోని గిరిడీహ్, ధన్బాద్, బొకారో జిల్లాలు, బీహార్లోని గయ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ ప్రతి గ్రామంలోనూ నలభై శాతం మంది మహిళలు మా కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందిన వాళ్లే ఉన్నారు. ఆకాశమే హద్దు ఈ గ్రామాల్లో ‘ఆడపిల్ల వద్దనుకునే తల్లిదండ్రులు లేరు. ఆ తరం ముగిసిపోయింది. రూపాలి అనే అమ్మాయి అక్కడ అందరికీ ఓ రోల్మోడల్. ఆమె ఓ జపాన్ వస్తువుల రీటైల్ దుకాణంలో ఉద్యోగం చేస్తూ నెలకు పద్దెనిమిది వేలు సంపాదిస్తోంది. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ నుంచి ‘స్టార్ పెర్ఫార్మర్ ఆఫ్ డీడీయూ–జీకేవై’ పురస్కారాన్ని అందుకుంది. ఒకప్పుడు చదువుకోవచ్చనే విషయం కూడా తెలియని ఈ గ్రామాల్లో ఇప్పుడు పర్యటిస్తే రూపాలి వంటి అమ్మాయిలు ఎందరో కనిపిస్తారు. వీరందరి ఎదుగుదల నాకు కూడా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది’’ అని చెప్పారు 2019లో గ్లోబల్ కాంపాక్ట్ ఇండియా నెట్వర్క్ పురస్కారం అందుకున్న డాక్టర్ నీలమ్ గుప్తా. ఈ సందర్భంగా డాక్టర్ గుప్తా తాను బాల్యంలో ఈ ప్రదేశాల్లో పర్యటించినప్పుడు కంటపడిన సన్నివేశాలు, సంఘటనలను గుర్తు చేసుకున్నారు. స్వెటర్ అమ్మితే ‘‘నేనక్కడ అడుగుపెట్టేనాటికి అక్కడి పరిస్థితులు భయానకంగా ఉండేవి. మధ్యాహ్నం రెండు తర్వాత తెల్లవారు ఝామున ఐదింటి మధ్య బయటకు రావడం క్షేమకరం కాదు. అది తెలిసి మా పేరెంట్స్ నా ఆలోచనను అంగీకరించలేదు. అయితే అక్కడి యువతను చేరదీసి వారి ఆలోచన ధోరణిని మార్చడం ద్వారా నేను అనుకున్నది సాధించగలిగాను. అసలు నేను ఇంత మొండిగా ఈ పని తలకెత్తుకోవడానికి బలమైన కారణమే ఉంది. నా చిన్నప్పుడు ఒకసారి సెలవుల్లో మా నాన్నతో కలిసి ఇక్కడ పర్యటించాను. డిసెంబర్ చలిలో ఓ పదేళ్ల పాప చిరిగిన దుస్తులతో రోడ్డు పక్కన నిలబడి చలికి వణుకుతూ ఉంది. అప్పుడు నా స్వెటర్ ఇచ్చి వేసుకోమన్నాను. ఆ మరుసటి రోజు ఆ పాప మళ్లీ అలాగే చిరిగిన దుస్తులతోనే రోడ్డు పక్కన కనిపించింది. స్వెటర్ వేసుకోలేదేమని అడిగినపుడు నాకు మతి చలించిపోయే సమాధానం వచ్చింది. ఆ స్వెటర్ను పాప తండ్రి తీసుకువెళ్లి సంతలో అమ్మేసి ఇంట్లోకి తినడానికి సరుకులు తెచ్చాట్ట. కడుపు నింపుకోవడానికి ఇంక మరో దారి లేదు వాళ్లకప్పుడు. హాలిడే వెకేషన్ పూర్తి చేసుకుని నగరానికి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ సంఘటన నన్ను వెంటాడుతూనే ఉండేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి అయిన తర్వాత నా ఆలోచనను ఇంట్లో చెప్పాను. ఇంట్లో వాళ్లందరూ కోప్పడ్డారు. మొండిగానే నా ప్రయత్నం మొదలుపెట్టాను. స్థానికుల సహకారంతో విజయపథంలో ముందుకు సాగుతున్నాను’’ అన్నారామె. ఆంక్షల వలయం ఒడిషాలోని కోరాపుట్ జిల్లాలో ఓ కుగ్రామం మాది. నేను ఇప్పుడిలా కనిపిస్తున్నాను. కానీ, నా చిన్నప్పుడు అక్కడ నాగరకత తెచ్చే సౌకర్యాలేవీ లేవు. మా జీవనం మీద ఎన్నో నిబంధనలుండేవి. చీకటి పడితే వీథిలోకి అడుగుపెట్టడానికి వీల్లేదు. ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ వంటివన్నీ నిషేధం. ఈ నిషేధం పైకి కనిపించేది కాదు, కానీ అమల్లో ఉండేది. హింస, దాడులు నిత్యకృత్యం. నేను చదువుకోవడానికి స్కూలుకు వెళ్తానంటే మా పేరెంట్స్ వణికిపోయారు. ప్రపంచంతో సంబంధం లేనట్లు జీవించడమే అక్కడి వారికి తెలిసిన జీవితం. – రూపాలీ శర్మ -
బ్లడీఫెలోస్..
గిరిజన సంక్షేమ శాఖాధికారులపై మంత్రి రావెల ఆగ్రహం గుంటూరులో 13 జిల్లాల అధికారులతో సమీక్ష గుంటూరు వెస్ట్ : ‘రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖలో పరిస్థితులు అధ్వానంగా ఉంటున్నాయి. అధికారులు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. మీపైన మంత్రి, మేనేజింగ్ డెరైక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అంటూ అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ వారిచ్చే నిబంధనలను పాటించడం లేదు ’ అంటూ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరేమైనా లార్డ్స్... లేక కింగ్స్ అనుకుంటున్నారాఅంటూ మండిపడ్డారు. విశాఖ జిల్లా పాడేరు డివిజన్ గిరిజన శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మోహన్రావు పనితీరుపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉన్నతాధికారులు ఇచ్చే సూచనలు పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఆయనపై బ్లడీఫెలోస్.. అంటూ విరుచుకుపడ్డారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో సోమవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13 జిల్లాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులు తాము చేపట్టిన పనులను వివరించారు. శ్రీశైలం ఐటీడీఏ అధికారి వెంకటేశ్వర్లు చెంచుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తుండగా మంత్రి జోక్యం చేసుకుని చెంచుల్లో అక్షరాస్యత శాతం పెంచాలని, నిరుద్యోగ యువత వివరాలు సేకరించాలని సూచించారు. నిరుద్యోగులకు అవసరమైన స్కిల్ డెవెలప్మెంట్లో శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీడీఏ పరిధిలోని ప్రాజెక్టు డెరైక్టర్లు యాక్షన్ప్లాన్ తయారుచేసుకుని, వాటిని అమలుచేయాలని సూచించారు. రూ.1900 కోట్లతో గిరిజనుల అభ్యున్నతి అనంతరం మంత్రి రావెల విలేకరులతో మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఉప ప్రణాళిక కింద రాష్ట్రంలో షెడ్యూల్డు తెగల అభ్యున్నతికి, సంక్షేమానికి రూ.1900 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేంచిన లక్ష్యాల సాధనకు గిరిజన సంక్షేమాధికారులు కృషి చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నామని వెల్లడించారు. గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ (జీసీసీ) టర్నోవర్ను రూ.1000 కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించిందని, ఈ నిధులతో గిరిజన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాసాగర్, రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఎం.పద్మ, అదనపు సంచాలకుడు వీసీహెచ్ వీరభద్రుడు, గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఎ.రవిప్రకాష్, 13 జిల్లాలకు చెందిన డీటీడబ్ల్యూవోలు, ఐటీడీఏ ప్రాజెక్టు డెరైక్టర్లు, గిరిజన శాఖ ఇంజినీర్లు, అసిస్టెంట్ డెరైక్టర్లు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement