-
భారత జట్ల బోణీ
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక థామస్–ఉబెర్ కప్ చాంపియన్షిప్లో భారత పురుషుల, మహిళల జట్లు విజయాల బోణీ చేశాయి. ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్లో భారత పురుషుల జట్టు 5–0తో క్లీన్స్వీప్ చేయగా... ఆస్ట్రేలియాతోనే జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో భారత మహిళల జట్టు 4–1తో గెలుపొందింది. పురుషుల విభాగం తొలి మ్యాచ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ 21–19, 21–13 తో ఆంటోని జొయ్పై నెగ్గాడు. డబుల్స్ మ్యాచ్ లో అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంట 21–11, 21–15తో మాథ్యూ చావు–సావన్ సెరాసింఘే జోడీని ఓడించింది. మూడో మ్యాచ్లో సాయి ప్రణీత్ 21–9, 21–6తో జాకబ్ స్కెలెర్పై గెలిచాడు. నాలుగో మ్యాచ్లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా జోడీ 21–16, 20–22, 21–8తో సిమాన్ వింగ్ హంగ్–రేమండ్ టామ్ ద్వయంపై నెగ్గింది. ఐదో మ్యాచ్లో లక్ష్య సేన్ 21–5, 21–14తో కయి చెన్ తెహ్పై గెలిచాడు. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో చైనాతో భారత్ ఆడుతుంది. వైష్ణవి, సైనా విజయం: మహిళల విభాగం తొలి సింగిల్స్లో సైనా 21–14, 21–19తో చెన్పై గెలిచి 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్లో మేఘన– పూర్వీషా రామ్ జం ట 13–21, 16–21తో గ్రోన్యా సోమర్విల్లె–రెనుగా వీరన్ జోడీ చేతిలో ఓడింది. దీంతో 1–1తో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచాయి. మూడో మ్యాచ్లో వైష్ణవి రెడ్డి 21–17, 21–13తో జెన్నిఫర్ టామ్పై గెలుపొంది భారత్కు 2–1తో ఆధిక్యం అందించింది. నాలుగో మ్యాచ్లో సంయోగిత–ప్రాజక్తా జంట 21–19, 21–11తో లౌసా మా–అన్ లౌసి స్లీపై గెలిచి 3–1తో భారత విజయాన్ని ఖాయం చేసింది. ఐదో మ్యాచ్లో అనురా 21–6, 21–7తో జెసిలీపై నెగ్గి భారత్ను 4–1తో గెలిపించింది. బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో జపాన్తో భారత్ ఆడుతుంది. -
సైనా, సింధు గెలిచినా...
సెమీస్లో జపాన్ చేతిలో ఓడిన భారత్ ఖాతాలో కాంస్య పతకం ఉబెర్ కప్ టోర్నమెంట్ న్యూఢిల్లీ: సొంతగడ్డపై అంచనాలకు మించి రాణించిన భారత మహిళల జట్టు జోరుకు ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తెరపడింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో టీమిండియా 2-3 తేడాతో జపాన్ చేతిలో ఓడిపోయింది. ఉబెర్ కప్ చరిత్రలో తొలిసారి సెమీఫైనల్కు చేరిన భారత్ ఈ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. డబుల్స్ విభాగంలో జపాన్ జోడిలు పటిష్టంగా ఉండటం భారత విజయావకాశాలపై ప్రభావం చూపింది. మరో సెమీఫైనల్లో చైనా 3-0తో దక్షిణ కొరియాను ఓడించి శనివారం జరిగే ఫైనల్లో జపాన్తో అమీతుమీకి సిద్ధమైంది. సెమీఫైనల్స్లో ఓడిన భారత్, కొరియా జట్లకు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల విభాగంలో చైనాకు షాక్ థామస్ కప్ పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ చైనాకు జపాన్ షాక్ ఇచ్చింది. సెమీఫైనల్లో జపాన్ 3-0తో చైనాను ఓడించి పెను సంచలనం సృష్టించింది. తొలి మ్యాచ్లో ప్రపంచ 4వ ర్యాంకర్ కెనిచి టాగో 21-13, 21-11తో ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ లాంగ్పై; రెండో మ్యాచ్లో కెనిచి హయకావా-హిరోయుకి ఎండో 22-20, 21-19తో బియావో చాయ్-వీ హాంగ్లపై; మూడో మ్యాచ్లో కెంటో మొమొటా 23-25, 21-18, 21-14తో పెంగ్యూ డూపై నెగ్గి జపాన్కు చిరస్మరణీయ విజయం అందించారు. గత ఐదు పర్యాయాల్లో (2004, 06, 08, 2010, 2012) విజేతగా నిలిచిన చైనా 2002 తర్వాత తొలిసారి సెమీఫైనల్లో ఓడింది. మరో సెమీఫైనల్లో మలేసియా 3-0తో ఇండోనేసియాపై గెలిచి ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్తో తలపడేందుకు సిద్ధమైంది. ఆ ఇద్దరూ అజేయం... తొలి మ్యాచ్లో ప్రపంచ 8వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ 21-12, 21-13తో ప్రపంచ 12వ ర్యాంకర్ మినత్సు మితానిపై గెలిచి భారత్కు శుభారంభం అందించింది. వేర్వేరు టోర్నీల్లో మితానితో ఆడిన గత రెండు మ్యాచ్ల్లో ఓడిన సైనా సొంతగడ్డపై మాత్రం ఏకపక్ష ఆటతీరుతో పైచేయి సాధించింది. రెండో మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ పి.వి.సింధు 19-21, 21-18, 26-24తో ప్రపంచ 13వ ర్యాంకర్ సయాకా తకహాషిపై నెగ్గి భారత్కు 2-0 ఆధిక్యాన్ని అందించింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులోని నిర్ణాయక మూడో గేమ్లో సింధు మ్యాచ్ పాయింట్ను కాచుకొని గెలువడం విశేషం. మూడో గేమ్లో 19-20తో వెనుకబడిన సింధు ఆ తర్వాత వరుసగా రెండు పాయింట్లు నెగ్గి 21-20తో ముందంజ వేసింది. అనంతరం సింధు ఆధిక్యంలోకి వెళ్లిన మూడుసార్లూ తకహాషి స్కోరును సమం చేసింది. అయితే స్కోరు 24-24 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో సైనా, సింధు ఆడిన ఐదేసి సింగిల్స్ మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా నిలువడం విశేషం. జ్వాల-అశ్విని జోడి నెగ్గి ఉంటే... ఈ టోర్నీ డబుల్స్ విభాగంలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం కీలకమైన పోటీలో అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 36వ స్థానంలో ఉన్న జ్వాల-అశ్విని జంట 12-21, 22-20, 16-21తో ప్రపంచ 4వ ర్యాంక్ జోడి హిసాకి మత్సుతోమో-అయాకా తకహాషి చేతిలో ఓడిపోయింది. ఒకవేళ ఈ మ్యాచ్లో గనుక జ్వాల జంట నెగ్గి ఉంటే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లేది. మూడో మ్యాచ్లో గెలిచి ఈ పోటీలో నిలిచిన జపాన్కు నాలుగో మ్యాచ్ ఫలితం కూడా అనుకూలంగా వచ్చింది. ప్రపంచ 16వ ర్యాంకర్ ఎరికో హిరోస్ 21-14, 21-15తో ప్రపంచ 65వ ర్యాంకర్ పి.సి.తులసీపై నెగ్గి స్కోరును 2-2తో సమం చేసింది. ఇక నిర్ణాయక ఐదో మ్యాచ్లో సైనా నెహ్వాల్-పి.వి.సింధు కలిసి జతగా బరిలోకి దిగినా ఫలితం లేకపోయింది. ప్రపంచ 5వ ర్యాంక్ జోడి మియుకి మయెదా-రీకా కకీవా జోడి 21-14, 21-11తో సైనా-సింధు జంటను ఓడించి జపాన్కు 3-2తో విజయాన్ని అందించింది. 1981 తర్వాత ఈ మెగా ఈవెంట్లో జపాన్ మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. -
ఉబెర్కప్లో సెమీస్కు చేరతాం
సైనా నెహ్వాల్ విశ్వాసం న్యూఢిల్లీ: సింగిల్స్లో తాను రాణిస్తే అది జట్టులోని మిగిలిన వారందరి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పేర్కొంది. త్వరలో ప్రారంభం కానున్న థామస్, ఉబెర్ కప్ టోర్నీ కోసం ప్రాక్టీస్లో పాల్గొంటున్న సందర్భంగా సైనా మాట్లాడింది. మూడు సింగిల్స్, రెండు డబుల్స్ విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో తొలి సింగిల్స్లో సైనా, రెండో సింగిల్స్లో పి.వి.సింధు ఆడనున్నారు. అయితే తొలి మ్యాచ్ ప్రభావం ఇతర మ్యాచ్లపై తప్పక ఉంటుందని, ఆ మేరకు తాను మరింతగా శ్రమించాల్సి ఉంటుందని సైనా తెలిపింది. ‘నాతోపాటు రెండో సింగిల్స్లో సింధు, ఆపై డబుల్స్లో జ్వాల-అశ్విని జోడి గెలుస్తారు. జట్టుగా మేమంతా కలిసి రాణించగలమన్న విశ్వాసం ఉంది’ అని సైనా వ్యాఖ్యానించింది. ఈ పోటీల్లో భాగంగా ఉబెర్ కప్లో భారత మహిళల జట్టు.. థాయ్లాండ్, కెనడా, హాంకాంగ్ జట్లు ఉన్న గ్రూప్లో ఆడనుంది. అయితే థాయ్లాండ్ మినహా మిగిలిన రెండు జట్లపైనా సనాయాసంగానే నెగ్గుతామని, థాయ్లాండ్పైనా పైచేయి సాధిస్తామని సైనా ధీమా వ్యక్తం చేసింది. ఇటీవల ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తాను ఆడకపోయినా మిగతా వాళ్లంతా చక్కగా రాణించారని పేర్కొంది. గాయాల నుంచి కోలుకొని నెల రోజుల నుంచి సాధన చేస్తున్నానని, పూర్తి ఫిట్నెస్తో టోర్నీ కోసం ఎదురు చూస్తున్నట్లు సైనా చెప్పింది. సారథులు సైనా, కశ్యప్ థామస్, ఉబెర్ కప్ టోర్నీల్లో భారత్కు పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ సారథ్యం వహించనున్నారు. థామస్ కప్లో మలేషియా, దక్షిణ కొరియా, జర్మనీలు గల గ్రూప్లో ఆడనున్న భారత పురుషుల జట్టులో కె.శ్రీకాంత్ తొలి సింగిల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. ఉబెర్ కప్లో సారథి సైనాయే తొలి సింగిల్స్ ఆడనుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement