-
ముగిసిన నామినేషన్ల పరిశీలన
ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులవి తిరస్కరణ మార్చి 2న ఉపసంహరణ నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. ఈ స్థానానికి పోటీ చేసేందుకు మూడు జిల్లాల నుంచి 27మంది 47 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో ఎన్నికల నియమావళికి లోబడి నామినేషన్ల పరిశీలించిన పిదప 25మంది అభ్యర్థుల నామినేషన్లు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత సాధించాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాల దష్ట్యా తిరస్కరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ వేసే అభ్యర్థిత్వాన్ని కనీసం పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి. కానీ బి.కుమార్ (వరంగల్) నామినేషన్ ముగ్గురు ఓటర్లు మాత్రమే ప్రతిపాదించడంతో దానిని తిరస్కరించారు. అదే విధంగా ఎన్నికల మాన్యువల్ ఆర్టికల్ 173 (బీ) ప్రకారం పట్టభద్రుల స్థానానికి పోటీ చేసే అభ్యర్థి వయస్సు 30 ఏళ్లు ఉండాలి. కానీ ఎల్.చందులాల్ (వరంగల్) వయస్సు 27 ఏళ్లు మాత్రమే ఉండడంతో ఆ నామినేషన్ను తిరస్కరించారు. నల్లగొండ జిల్లా నుంచే అధికం.. అర్హత సాధించిన నామినేషన్లలో అత్యధికంగా నల్లగొండ జిల్లానుంచే ఉన్నాయి. వీటిలో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న వారిలో తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్), సూరం ప్రభాకర్రెడ్డి (వామపక్షాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి) నల్లగొండ జిల్లాకు చెందిన వారు. పల్లా రాజేశ్వరరెడ్డి, ఎర్రబెల్లి రామ్మోహన్రావు వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు. అయితే ఈ అభ్యర్థులు నామినేషన్ పత్రంలో పేర్కొన్న చిరునామా, ఓటర్లు ఉన్న ప్రాంతాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. తీన్మార్ మల్లన్న తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. పల్లా రాజేశ్వర్రెడ్డి హైదరాబాద్లోని జూబ్లిహిల్స్, సూరం ప్రభాకర్రెడ్డి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ చిరునామా పేర్కొన్నారు. రామ్మోహన్రావు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కళ్లెడ చిరునామా పేర్కొన్నారు. మొత్తం దాఖలైన నామినేషన్లు - 27 ఎన్నికల్లో పోటీ కి అర్హత సాధించినవి - 25 -
ముగిసిన నామినేషన్ల పర్వం
మొత్తం 27 నామినేషన్లు చివరి రోజున 21 నామినేషన్లు దాఖలు నేడు నామినేషన్ల పరిశీలన మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి స్థానానికి నామినేషన్లు పర్వం ముగిసింది. మూడు జిల్లాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొందరు అభ్యర్థులు రెం డు, మూడు చొప్పున నామినేషన్లు వేశారు. దీంతో 27 మంది అభ్యర్థులకుగాను.. 44 నామినేషన్ సెట్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజైన గురువారం 21 మంది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు వేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న, వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి సూరం ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మల్లన్న నామినేషన్కు హాజరైన జిల్లా నేతలు వరంగల్ రూరల్ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజవర్గానికి జరుగుతు న్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) నల్లగొండ కలెక్టరేట్లో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి జిల్లా నేతలు పలువురు తరలివెళ్లారు. అంతకుముందు ఏచూరి గార్డెన్స్లో జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లన్నను గెలిపించుకునేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. సమావేశంలో ఏఐసీసీ కా ర్యదర్శి, రాష్ట్ర బాధ్యుడు ఆర్సీ.కుంతియా, పీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, కత్తి వెంకటస్వామి, గుజ్జుల శ్రీనివాస్రెడ్డి, మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement