-
ఉద్యోగం లేదని ఉసురుతీసుకున్నాడు
సాక్షి, రాయదుర్గంటౌన్: ఉన్న ఉద్యోగం.. కొత్తగా ఎక్కడా పని దొరక్కపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. రాయదుర్గం పట్టణంలోని 28వ వార్డు బళ్లారి రోడ్డు పక్కన నివాసం ఉంటున్న పూల వ్యాపారి వెంకటేశులు, గీతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన అరవింద్ (28) బీటెక్ చదివి బెంగళూరులోని విప్రో కంపెనీలో పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. మరో ఉద్యోగం చూసుకునేందుకు బెంగళూరుకు వెళ్లి మంగళవారం ఉదయమే రాయదుర్గం వచ్చాడు. ఉన్న ఉద్యోగం పోవడం.. సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేవారు. -
ఉద్యోగం వచ్చేసరికి... ప్రాణం పోయింది
కలలు నెరవేరకుండానే నిరుద్యోగి కన్నుమూత ఏడాది కాలం కొనసాగిన నియామక ప్రక్రియ గ్రూప్-4 నియామకాలపై నిరుద్యోగుల్లో ఆందోళన గుంటూరు(నగరంపాలెం): ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నెలల తరబడి కలలు కన్న ఓ వికలాంగుడు కన్నుమూశాడు. ఆశించిన ఉద్యోగం చేతికందే నాటికి అలసిపోయిన ఆశలతో తుదిశ్వాస విడిచాడు. పోస్టుల భర్తీలో చోటుచేసుకున్న ఎడతెగని ఆలస్యం అతనిలో తీవ్ర నైరాశ్యం నింపింది. దీంతో మానసిక ఆందోళనకు లోనై ఈ నెల ఒకటో తేదీన కన్నుమూశాడు. పొన్నూరు మండలం కొండముది గ్రామానికి చెందిన కోండ్రు నాగరాజు(41) అంధుడు. జిల్లాలో 2015 మార్చి 31వ తేదీన వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన బ్యాక్లాగ్ నోటిఫికేషన్లో క్లాస్-4 ట్యాంక్ క్లీనర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం వరకు ఈ నియామక ప్రక్రియ కొనసాగింది. నాగరాజు మెరిట్లిస్ట్లో, షార్టు లిస్టులో అర్హత సాధించటంతోపాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యాడు. అనంతరం వికలాంగత్వం జన్యునిటీ సర్టిఫికెట్ కోసం జనవరిలో హైదరాబాద్కు వెళ్లాడు. ఫిబ్రవరిలో ఆ సర్టిఫికెట్ అందింది. దీంతో నియామక ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారు. ఈలోగా ఈనెల 1న హైబీపీ కారణంగా తలలో నరాలు పగిలి నాగరాజు చనిపోయినట్లు వికలాంగశాఖ కార్యాలయానికి సమాచారం వచ్చింది. ఏడాదికాలం కొనసాగిన ప్రక్రియ.. గత సంవత్సరం మార్చి 31న జిల్లాలో క్లాస్-4, గ్రూప్-4కు సంబంధించి 74 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. క్లాస్-4కు సుమారు 3,700 దరఖాస్తులు రాగా, వాటిని క్లాసిఫికేషన్ చేసి మెరిట్ లిస్టు తయారు చేయటానికి వికలాంగుల శాఖ అధికారులకుఐదునెలల సమయం పట్టింది. సెప్టెంబరులో లిస్టు విడుదల చే శారు. నెలరోజులు అభ్యంతరాలు స్వీకరించారు. డిసెంబర్లో షార్ట్ లిస్టును విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులను జన్యునిటీ టెస్టుకోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేసేవారు. జనవరిలో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి ఫిబ్రవరిలో సర్టిఫికెట్లు అందజేశారు. నియామక ఉత్తర్వులు సిద్ధం చేసి గురువారం ఉదయం అభ్యర్థులకు ఇవ్వనున్నారు. ఇక గ్రూప్ 4 నియామకాలపై ఇప్పటి వరకు మెరిట్లిస్ట్ మాత్రమే విడుదల చేశారు. దానికి షార్టు లిస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎంత సమయం పడుతుందో వేచి చూడాల్సిందే. జరుగుతున్న ఆలస్యంపై అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement