-
డాలర్ డౌన్ ఫాల్!
దొడ్డ శ్రీనివాసరెడ్డి : గ్లోబల్ కరెన్సీగా అమెరికన్ డాలర్కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. డాలర్కు వ్యతిరేకంగా సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్న దేశాల సంఖ్య పెరిగిపోయింది. ఈ దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. ప్రస్తుతం దాదాపు అన్ని దేశాల విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అమెరికన్ డాలర్లే 60 శాతానికి పైగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్యం, రుణాలు, సెక్యూరిటీల లావాదేవీల్లో సగానికి పైగా డాలర్లలోనే సాగుతున్నాయి. ఇక విదేశీ కరెన్సీల ఎక్సే్ఛంజ్ మార్కెట్లలో మొత్తం అన్ని కరెన్సీలను కలుపుకొన్నా 90 శాతం ట్రేడింగ్ అమెరికన్ డాలర్ల ద్వారానే జరుగుతోంది. ఇక ముందు ఈ పరిస్థితి మారబోతోంది. డాలర్పై ఆధారపడటం మాని సొంత కరెన్సీలను బలోపేతం చేసుకోవాలనే కోరికతో అనేక దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సమీప భవిష్యత్లోనే గ్లోబల్ కరెన్సీ స్థానాన్ని అమెరికన్ డాలర్ కోల్పోయే ప్రమాదం వచ్చింది. ఇలా మొదలైంది.. బ్రెట్టన్వుడ్ ఒప్పందంతో అమెరికన్ డాలర్ పెత్తనం మొదలైంది.రెండో ప్రపంచ యుద్ధకాలంలో కుదేలైన అనేక దేశాలు ముఖ్యంగా యూరప్ దేశాలు అనేకానేక ఉత్పత్తుల కోసం అమెరికాపై ఆధారపడాల్సి వచ్చింది. వాణిజ్య ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలనే విషయమై ఐక్యరాజ్యసమితి ద్రవ్య, ఆర్థిక సదస్సు అమెరికా న్యూ హాంప్షైర్లోని బ్రెట్ట్టన్వుడ్లో జరిగింది. 44 దేశాలు పాల్గొన్న ఈ సమావేశంలో అంతర్జాతీయంగా బంగారు ధరలను డాలర్ విలువకు జతచేస్తూ ఒప్పందం చేసుకున్నా యి. దాంతో ఇతర కరెన్సీల విలువను డాలర్ మారక విలువ కోసం ఈ ఒప్పందం ప్రాతిపదికైంది. ఒక డాలర్ విలువ ఒక ఔన్స్ (31.1034768 గ్రాములు) బంగారంతో సమానమైంది. 1970లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్ విలువను బంగారు ధరకు జత చేయడాన్ని రద్దు చేసినప్పటికీ అప్పటికే డాలర్ నిల్వలు అన్ని దేశాల్లో పెరిగిపోయి గ్లోబల్ కరెన్సీగా అవతరించింది. పనామా, ఎల్ సాల్వడార్, జింబాబ్వే లాంటి 11 దేశాలు ఇప్పటికీ అమెరికన్ డాలర్నే తమ దేశాల్లో అధికారిక కరెన్సీగా చెలామణి చేస్తున్నాయి. డాలర్ శక్తిసామర్థ్య ంతో రెచ్చి పోయిన అమెరికా అనేక సందర్భాల్లో ఆ డాలర్నే ఆయుధంగా వాడుకుంది. ఉక్రెయిన్లో భాగమైన క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడు వివిధ బ్యాంకుల్లో రష్యా నిల్వ చేసిన 64,000 కోట్ల డాలర్లను అమెరికా జప్తు చేసింది. రష్యా విదేశీ మారక నిల్వల్లో ఇది సగానికి పైగా ఉంది. ఇలాంటి ప్రయోగమే వివిధ సందర్భాల్లో అఫ్గానిస్తాన్, ఇరాన్, వెనెజులా వంటి దేశా లపై అమెరికా ప్రయోగించింది. అమెరికా ఆంక్షలను ఉల్లంఘించిన బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానాలు కూడా విధించింది. తొలుత రష్యాలో.. క్రిమియా ఆక్రమణ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఎదుర్కొనడానికి 2014లో రష్యా చైనాతో చేతులు కలిపి డాలర్కు వ్యతిరేకంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీంతో గ్లోబల్ కరెన్సీగా చెలామణి అవుతున్న అమెరికన్ డాలర్కు పెద్ద సవాల్ మొదలైంది. రష్యా, చైనా మధ్య జరిగే అన్ని వ్యాపార లావాదేవీల్లో మారక ద్రవ్యంగా రూబుల్–యువాన్లు వినియోగించాలని ఈ రెండు దేశాలు నిర్ణయించా యి. అంతేకాదు రష్యా తన విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అధికశాతం చైనా యువాన్ కరెన్సీని సమకూర్చుకోవాలని కూడా నిర్ణయించింది. దాంతో గత ఏడాదికి రష్యా విదేశీ మారక నిల్వ ల్లో యువాన్ 60 శాతానికి పెరిగినట్లు రష్యా ఆర్థిక శాఖ ప్రకటించింది. అలాగే డాలర్ స్థానంలో తమ సొంత కరెన్సీల్లోనే వ్యాపారం నిర్వహించాలని ఇటీవల చైనా, బ్రెజిల్ నిర్ణయించాయి. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన బ్రెజిల్తో చైనా చేసుకున్న ఒప్పందం కారణంగా డాలర్ పెత్తనానికి మరో పెద్ద సవాల్ ఏర్పడింది. బ్రెజిల్ రీస్ చైనా యువాన్ బంధం డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించింది. గత ఏడాది ఈ రెండు దేశాల మధ్య 15,000 కోట్ల డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. డాలర్, యూరో, యెన్, పౌండ్లకు బదులు తమ దేశాల కరెన్సీలతోనే వ్యాపారం సాగించాలనే ఏకైక ఎజెండాతో ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక మంత్రిత్వ శాఖలు, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇటీవల అధికారిక సమావేశం నిర్వహించాయి. 70 శాతం నుంచి 59 శాతానికి.. గత జనవరిలో దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెది పాండోర్ ఒక ఇంటర్వ్యూలో ‘బ్రిక్, (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయ మారకాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటున్నాయి’అని వెల్లడించారు. సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్–జదాన్ ఇటీవల మరో బాంబు పేల్చారు. చమురు వ్యాపారంలో డాలర్కు ఇతర కరెన్సీల వినియోగంపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా నుంచి ఇలాంటి ప్రకటన రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. అంతర్జాతీయంగా చమురు వాణిజ్యం దాదాపుగా అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంది. అందుకే దాన్ని పెట్రోడాలర్గా పిలుస్తారు. చమురు ఎగుమతుల్లో ఒపెక్ (చమురు ఉత్పత్తి చేసే దేశాలు) దేశాల్లో అగ్రస్థానంలో నిలిచే సౌదీ అరేబియా ఇతర కరెన్సీల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి చరమగీతం పాడినట్లేనని అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం. భారత్–రష్యా మధ్య కూడా వాణిజ్యం అమెరికన్ డాలర్లో కాకుండా ఇతర కరెన్సీల్లో జరుగుతోంది. భారతీయ సంస్థలు రష్యా నుంచి చేసుకున్న దిగుమతులకు అరబ్ ఎమిరేట్స్ కరెన్సీ దినార్ను వినియోగించేవి. ఇప్పుడు రూబుల్లో చెల్లింపులు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభానికి వివిధ దేశాల విదేశీ మారక నిల్వల్లో అమెరికన్ డాలర్ వంతు 59 శాతానికి తగ్గిపోయింది. ఇది 1999 నాటికి 70 శాతం ఉండేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) పేర్కొంది. ఇక భారత్ వంతు.. భారత్ కూడా తన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆవిష్కరించే దిశలో చర్యలు మొదలుపెట్టింది. అనేక దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్న తరుణంలో డాలర్, యూరో, యెన్, పౌండ్లతో దీటుగా రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చెలామణి చేసేందుకు తొలి అడుగులు వేసింది. రూపాయిని మారక విలువగా వినియోగించేందుకు వీలుగా ఆర్బీఐ రష్యా, శ్రీలంకతోపాటు మొత్తం 18 దేశాల్లోని 60 బ్యాంకుల్లో వోస్ట్రో అకౌంట్లను ప్రారంభించింది. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలను రూపాయి ద్వారా నిర్వహించడానికి వీలుగా ఆర్బీఐ ఈ అకౌంట్లను ప్రారంభించిందని భారత ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ ప్రకటించారు. రూపాయితో వ్యాపారం చేయడానికి ఒప్పుకున్న దేశాల్లో బ్రిటన్, మలేషియా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, శ్రీలంక, మయన్మార్, బోట్స్వానా, ఇజ్రాయెల్, ఫిజి, ఒమన్, జర్మనీ, కెన్యా, గయానా, మారిషస్, టాంజానియా, ఉగాండా దేశాలున్నాయి. అమెరికా వాల్స్ట్రీట్లో ‘డాక్టర్ డూమ్’గా పేరుపడ్డ ఆర్థికవేత్త నౌరియల్ రుబిని ‘రానున్న రోజుల్లో భారత రూపాయి అంతర్జాతీయ విపణిలో అతి ముఖ్యమైన విదేశీ మారకద్రవ్యంగా అవతరించబోతోంది’ అన్నారు. -
శాంతి పరిరక్షణలో భాగస్వామ్యం
బలగాలు పంపిస్తున్న దేశాలకు నిర్ణయ ప్రక్రియలో సముచిత పాత్ర ఉండాలి - ఐరాస శాంతి పరిరక్షణ సదస్సులో ప్రధాని మోదీ - పీస్ కీపింగ్ ఆపరేషన్స్ను ఆధునీకరించాలని సదస్సు నిర్ణయం న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు బలగాలను పంపిస్తున్న దేశాలకు సంబంధిత నిర్ణయ ప్రక్రియలో సముచిత భాగస్వామ్యం లభించకపోవడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తప్పుబట్టారు. శాంతి పరిరక్షణకు సంబంధించిన కొన్ని ఆదేశాలు బలగాల్లో సంఘర్షణలకు దారితీస్తున్నాయన్నారు. దాని వల్ల సైనికుల ప్రాణాలే కాకుండా, మొత్తం శాంతి పరిరక్షణ లక్ష్యమే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బలగాలను పంపిస్తున్న దేశాలకు నిర్ణయ ప్రక్రియలో, మేనేజ్మెంట్ స్థాయిలో, ఫోర్స్ కమాండర్స్ స్థాయిలో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లనే ఈపరిస్థితి తలెత్తుతోందని విశ్లేషించారు. ఐరాస నిర్వహించిన ‘ఉన్నతస్థాయి శాంతిపరిరక్షణ సదస్సు’నుద్దేశించి మంగళవారం మోదీ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భద్రతాపరిస్థితుల నేపథ్యంలో.. శాంతి పరిరక్షణ దళాల బాధ్యత శాంతి, భద్రతలను కాపాడేందుకే పరిమితం కాలేదని, మరిన్ని ఇతర సవాళ్లను ఎదుర్కొనేందుకు కూడా వాటి సేవలను ఉపయోగించుకుంటున్నామని పేర్కొన్నారు. ఐరాస శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు భారత్ సహకారం కొనసాగుతుందన్న మోదీ.. 850మంది భారతీయ సైనికులతో కూడిన మరో బెటాలియన్ను, మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న 3 పోలీస్ బృందాలను ఈ సేవలకు త్వరలో పంపిస్తామన్నారు. ఐరాస శాంతి పరిరక్షణ మిషన్స్లో భాగంగా భారత్ తరఫున 1.8 లక్షల మంది భారతీయ సైనికులు 49 కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారిలో 161 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ‘ఐరాస శాంతి పరిరక్షణ కార్యక్రమాలు విజయవంతం కావడమనేది సైనికులు ఉపయోగించే ఆయుధాలపై కాదు.. భద్రతామండలి ఇచ్చే నైతిక స్థైర్యంపై ఆధారపడి ఉంటుంది’ అని తేల్చిచెప్పారు. నిర్దిష్ట కాలావధిలోగా భద్రతామండలిలో సంస్కరణలు చేపట్టి, దానిని మరింత విస్తరించాలని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారత దళాలు రెండో ప్రపంచ యుద్ధం నుంచి పాల్గొంటున్నాయని మోదీ తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారత ఉపఖండానికి చెందిన 24వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, దాదాపు అందులో సగంమంది సమాచారం నేటికీ తెలియరాలేదన్నారు. విధుల్లో మృతిచెందిన సైనికుల స్మారక నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, జపాన్ ప్రధానమంత్రి షింజోఅబె.. తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దాదాపు 50 దేశాల నేతలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఐరాస శాంతి పరిరక్షణ ఆపరేషన్స్ను ఆధునీకరించాలని నిర్ణయించారు. అలాగే, భద్రతామండలికి, దళాలను పంపిస్తున్న దేశాలకు మధ్య సంప్రదింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఆ డిక్లరేషన్లో పేర్కొన్నారు. యూఎన్ శాంతిదళాల్లో లైంగిక వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న ఐరాస విధానాన్ని అందులో పునరుద్ఘాటించారు. ప్రాంతీయ స్థాయిలో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రాంతీయ, ఉప ప్రాంతీయ సంస్థలతో ఐరాస శాంతి దళాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. మోదీ విజ్ఞప్తి ముదావహం: భారత్ అభివృద్ధిలో అమెరికాలోని భారతీయులు కీలక పాత్ర పోషించాలన్న ప్రధాని మోదీ విజ్ఞప్తిని అమెరి కా అధ్యక్షుడు ఒబామా స్వాగతించారు. ‘ఇక్క డి భారతీయులు తమ సామర్ధ్యాన్ని భారత్ అభివృద్ధికి కూడా ఉపయోగించాలన్న మోదీ విజ్ఞప్తిని మేం స్వాగతిస్తున్నాం’ అని సోమవారం మోదీతో భేటీ అనంతరం ఒబామా పేర్కొన్నారు. ‘ప్రెసిడెంట్ మోదీ’ నోరు జారిన ఒబామా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నోరు జారారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘ప్రెసిడెంట్ మోదీ’గా సంబోధించారు. సోమవారం ఇద్దరు నేతల మధ్య భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘‘స్వచ్ఛ ఇంధన వినియోగంలో ప్రెసిడెంట్ మోదీ దూకుడు ధోరణిని మేం ప్రోత్సహిస్తున్నాం’’ అని ఒబామా అన్నారు. ఆ తరువాత అమెరికా అధ్యక్ష భవనం ఒబామా ప్రసంగ పాఠంలో ఆ పదాన్ని సరిదిద్దింది. స్వదేశానికి చేరుకున్న మోదీ: ఐర్లాండ్, అమెరికాల పర్యటనను ముగించుకుని ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 12గంటల సమ యంలో ఢిల్లీకి చేరుకున్నారు. అంతకు ముందు ‘నా అమెరికా పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో అసాధారణ లోతును, బహుముఖీయతను ప్రదర్శించింది.నాకు అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించింది. ప్రతీ కార్యక్రమం భారత్కు ప్రయోజనం కల్పించే ఏదో ఒక ఫలితం రాబట్టింది.’ అని ట్వీట్ చేశారు. చిరునవ్వులతోనే మోదీ-షరీఫ్ పలకరింపులు న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి 70 సర్వప్రతినిధి సభలో ప్రసంగించేందుకు అమెరికాకు వచ్చిన భారత్, పాకిస్తాన్ ప్రధానుల మధ్య ప్రత్యక్ష భేటీ ఏదీ జరగనప్పటికీ.. మంగళవారం మాత్రం ఇద్దరు నేతలు కాసేపు ఎదురెదురుగా కూచున్నారు.. చేతులు ఊపి పరస్పరం పలకరించుకున్నారు. చిరునవ్వులతోనే అభినందనలు తెలుపుకున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ సదస్సులో వివిధ దేశాధినేతలతో పాటు, భారత్, పాక్ ప్రధానులు కూడా పాల్గొన్నారు. సదస్సులో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్లో ఒక పక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి కూచున్నారు. ఆ తరువాత కొద్ది సేపటికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మోదీకి సరిగా ఎదుటి వైపు తనకోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కూచున్నారు. కొద్ది నిమిషాల పాటు ఒకరినొకరు ఏమీ పలకరించుకోలేదు.. కొద్దిసేపట్లో సదస్సు ప్రారంభమవుతుందనగా షరీఫ్ మోదీ వైపు చూస్తూ చేయి ఊపి నవ్వారు. వెంటనే మోదీ కూడా చేయి ఊపి నవ్వి.. బాగున్నారా అన్నట్లుగా తలాడించారు. ఇంత కు మించి వారిద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు జరగలేదు. ఒకరి ప్రసంగానికి మరొకరు చప్పట్లతో అభినందనలు తెలుపుకున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement