-
అక్టోబర్ 10న సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) తదితర అత్యున్నత స్థాయి పోస్టులకు అర్హుల ఎంపికకు సంబంధించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 10వ తేదీన జరగనుంది. ఈ పరీక్షను జూలై 27వ తేదీన నిర్వహించాల్సి ఉండగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మూడు నెలల పాటు వాయిదా వేసి అక్టోబర్ 10న నిర్వహిస్తోంది. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 సీశాట్గా ఉదయం, మధ్యాహ్నం ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 10వ తేదీ వరకు అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతి పట్టణాల్లో 68 సెంటర్లలో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ప్రతి ఒక్క అభ్యర్థి కోవిడ్ ప్రొటోకాల్ను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు వివిధ పరిశీలన ప్రక్రియలు నిర్వహించాల్సి ఉన్నందున నిర్ణీత సమయానికి పది నిమిషాల ముందే పరీక్ష కేంద్రం ప్రధాన ప్రవేశ ద్వారాన్ని మూసివేయనున్నారు. బ్యాగులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి ఇతర వస్తువులు వేటినీ లోపలకు అనుమతించరు. కోవిడ్ కారణంగా పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేకపోతున్న కారణంగా వయోపరిమితి దాటిపోయే అభ్యర్థుల విషయంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు యూపీఎస్సీ వారికి ఈ సారి పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పరీక్షల ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో 400 మార్కులకు ఉంటుంది. పేపర్, పెన్ను (ఆఫ్లైన్ మోడ్)లతో ఈ పరీక్షలు జరుగుతాయి. నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలు చేస్తారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.66 మార్కు కోతపడుతుంది. -
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర ఆలిండియా కేడర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్–2020 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 72 పట్టణాల్లో, రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం పేపర్–1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం పేపర్–2 (సీశాట్) నిర్వహించారు. కఠినంగానే ప్రశ్నలు.. జనరల్ స్టడీస్ పేపర్ మోడరేట్గా ఉండడంతోపాటు ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు తెలిపారు. కరెంట్ అఫైర్స్కు సంబంధించి ఇటీవలి పరిణామాలతోపాటు ఆధునిక చరిత్ర, అగ్రి ఎకానమీ, కరోనా ప్రభావంపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయన్నారు. కాఠిన్యపు స్థాయి గతేడాది మాదిరిగానే ఉందన్నారు. కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉన్నా రోజూ వార్తలు, విశ్లేషణలు అధ్యయనం చేసేవారు సులువుగానే రాయొచ్చని చెప్పారు. అగ్రి ఎకానమీ, హిస్టరీ, ఆర్ట్, కల్చర్ అంశాల ప్రశ్నలు కష్టంగా ఉండగా.. పాలిటీపై ప్రశ్నలు సులువుగా తాజా అంశాలపై ఉన్నాయన్నారు. ఎంపీ లాడ్స్ నిధులు, పార్లమెంట్ సమావేశాలు, గాంధీయిజం, మార్క్సిజమ్, పార్లమెంటరీ డెమొక్రసీ తదితర అంశాలపై ప్రశ్నలున్నాయి. వ్యవసాయాధార ప్రశ్నలు కూడా ఎక్కువగానే వచ్చాయి. పర్యావరణ కాలుష్యం, జాతీయ పార్కులు, జీవ ఇంధనం, ప్రభుత్వ పథకాలు, వ్యాక్సిన్లు తదితర అంశాలపై ప్రశ్నలడిగారు. పేపర్–1లో 200 మార్కులకు 100 ప్రశ్నలు, పేపర్–2లో 200 మార్కులకు 80 ప్రశ్నలు ఇచ్చారు. పేపర్–1 ప్రకారం కటాఫ్ పేపర్–1 ప్రకారం కటాఫ్ నిర్ణయిస్తారు. పేపర్–2 సీశాట్ కేవలం క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే. అందులో 33 శాతం మార్కులు వస్తే చాలు. జనరల్ కేటగిరీ కటాఫ్ మార్కులు.. 2018, 2019ల్లో 98 కాగా 2017లో 105.34గా ఉన్నాయి. ఈసారి గతేడాది కంటే పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రిలిమ్స్లో అర్హత సాధించినవారికి జనవరి 8న మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. -
యూపీఎస్సీ..సివిల్స్-2016 గెలుపు బాట..
ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్ష సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్! ఒకవైపు అత్యున్నత కెరీర్, మరోవైపు ప్రజలకు సేవచేసే అవకాశం ‘సివిల్స్’కు ఎంపిక కావడం ద్వారా లభిస్తుంది. అందుకే దీనికి పోటీ తీవ్రంగా ఉంటుంది.ఈ పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ‘సివిల్స్-2016’పై స్పెషల్ ఫోకస్.. దరఖాస్తుకు చివరి తేదీ: మే 27, 2016 ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 7, 2016 మొత్తం ఖాళీల అంచనా: 1079 జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ పరీక్ష ద్వారా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్- ఫైనాన్స్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ వంటి మొత్తం 24 అఖిల భారత సర్వీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.వయసు: 2016, ఆగస్టు 1 నాటికి కనిష్ట వయసు 21 ఏళ్లు. గరిష్ట వయసు 32 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు; బీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.ఎంపిక ప్రక్రియ: సివిల్ సర్వీసెస్కు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. కాంపిటీటివ్ గెడైన్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ విధానం) మెయిన్ ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ విధానం) ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇందులో రెండు ఆబ్జెక్టివ్ (మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్) పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కు 200 మార్కులు కేటాయించారు. పేపర్కు రెండు గంటల చొప్పున సమయం అందుబాటులో ఉంటుంది. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. ఇందులో కనీసం 33 శాతం మార్కులు సాధించాలి. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పేపర్లలో నెగిటివ్ మార్కులు ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ ఇందులో రెండు అర్హత పేపర్లు పేపర్-ఎ (అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాష), పేపర్-బి (ఇంగ్లిష్) ఉంటాయి. ఒక్కో పేపర్కు 300 మార్కులు కేటాయించారు. వీటిని మెరిట్ జాబితా రూపకల్పనకు పరిగణనలోకి తీసుకోరు. గమనిక ప్రతి పేపర్కు 250 మార్కులు చొప్పున మొత్తం 1750 మార్కులు కేటాయించారు. మెయిన్లో ప్రతిభ కనబరచిన వారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఖాళీల ఆధారంగా దాదాపు రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్లో ప్రతిభ చూపిన వారితో తుది జాబితా రూపొందిస్తారు. దరఖాస్తు విధానం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన వారు రూ.100 ఫీజు చెల్లించాలి. వెబ్సైట్: www.upsconline.nic.in విజయానికి మార్గాలు పటిష్ట ప్రణాళిక ద్వారా సివిల్స్లో విజయం సాధించవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే సిలబస్లోని అంశాలకు సంబంధించి తొలుత ప్రాథమిక భావనలపై పట్టుసాధించాలి. ప్రిపరేషన్కు ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ఉపయోగించుకోవాలి. వీటిని చదవడం వల్ల బేసిక్స్పై అవగాహన ఏర్పడుతుంది. గత ప్రశ్నపత్రాలను విశ్లేషించడం ద్వారా ఏ అంశాలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందో గుర్తించవచ్చు. దానికి అనుగుణంగా ప్రిపేర్ కావొచ్చు. ప్రిపరేషన్ సమయంలో సమకాలీన అంశాలకు (కరెంట్ అఫైర్స్)కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, కల్చర్, ఆర్ట్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. ప్రిలిమ్స్ సిలబస్, మెయిన్స్ సిలబస్లో ఉమ్మడిగా ఉన్న అంశాలను గుర్తించి, వాటిని ఒకేసారి ప్రిపేరవ్వాలి. దీనివల్ల సమయం ఆదాతోపాటు ఆయా అంశాలపై పట్టుసాధించడానికి వీలవుతుంది. సివిల్స్ మెయిన్స్కు సంబంధించి ఆప్షనల్ సబ్జెక్టు ఎంపిక పై అభ్యర్థులు స్పష్టమైన అవగాహన ఏర్పరుచుకోవాలి. ఆసక్తి, మెటీరియల్ లభ్యత, శిక్షణ, అకడమిక్ నేపథ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సివిల్స్ ఔత్సాహికులు ప్రిపరేషన్లో సమకాలీన అంశాలకు ప్రాధాన్యమిస్తూ వాటిని సిలబస్లోని అంశాలతో బేరీజు వేసుకొనే నైపుణ్యం సాధించాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కోచింగ్ తీసుకుంటేనే విజయం సాధ్యమనే అపోహ వీడాలి. - శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ. ప్రిలిమ్స్ పేపర్-2లో నిర్దేశిత 33 శాతం మార్కులు వస్తే చాలనే ధోరణి కాకుండా 60 శాతం మార్కులు సాధించేలా కృషి చేయాలి. తెలుగు మీడియం అభ్యర్థులు కాంప్రెహెన్షన్ కోసం ఇంగ్లిష్ వ్యాసాలను ప్రాక్టీస్ చేయాలి. పేపర్-1 కు సంబంధించి ఎకాలజీకి అధిక ప్రాధాన్యమివ్వాలి.మిగిలిన అన్ని విభాగాలనూ కరెంట్ అఫైర్సతో అనుసంధానిస్తూ చదవాలి. - వి.గోపాల కృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement