-
బైబ్యాక్లో వ్యవస్థాపకులూ పాల్గొనొచ్చు
బెంగళూరు: ఐటీ దిగ్గజం ప్రతిపాదించిన రూ. 13,000 కోట్ల బైబ్యాక్ ఆఫర్లో వ్యవస్థాపకులు కూడా తమ షేర్లను విక్రయించాలనుకోవడంలో తప్పేమీ లేదని సంస్థ మాజీ సీఎఫ్వో వి. బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లకు ఇదేమీ తప్పుడు సంకేతాలు పంపబోదని పేర్కొన్నారు. ‘సాధారణ పరిస్థితుల్లో వ్యవస్థాపకులు తమ షేర్లను విక్రయిస్తుంటేనే సందేహపడాల్సి రావొచ్చు. దేశీ పరిభాషలో బైబ్యాక్ అనేది పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించే డివిడెండ్కు మరో రూపం లాంటిదిగా భావించవచ్చు. నిజానికి సీఈవో సిక్కా రాజీనామా చేయడానికి కాస్త ముందుగా కంపెనీ బోర్డు బైబ్యాక్ ప్రకటించడమే నాలాంటి బయటి వ్యక్తులకు అసాధారణమైనదిగా అనిపిస్తోంది‘ అని ఆయన తెలిపారు. వ్యవస్థాపకులు బైబ్యాక్లో షేర్లు విక్రయిస్తే. కంపెనీ భవిష్యత్పై సందేహాలుండటం వల్లే ప్రమోటర్లు బైబ్యాక్లో పాల్గొన్నారన్న సంకేతాలేమైనా ఇచ్చినట్లవుతుందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ బాలా ఈ విషయాలు చెప్పారు. సీఈవో గురించి వారెప్పుడూ మాట్లాడలేదు.. కంపెనీ తమ సారథ్యంలోనే నడుస్తున్నప్పటికీ వ్యవస్థాపకులు ఎప్పుడూ కూడా తమ వాటాలను అడ్డం పెట్టుకుని నియంత్రణాధికారాలు దక్కించుకునేందుకు చూడలేదని బాలా చెప్పారు. తమ పనితీరు ఆధారంగానే కంపెనీపై అజమాయిషీ చేశారని, పనితీరు బాగుండి షేర్హోల్డర్లకు ప్రయోజనాలు చేకూర్చినంతకాలం వాటాదారుల మద్దతు తమకు ఉంటుందని వారు విశ్వసించారని తెలిపారు. ఇక, సీఈవో గురించి గానీ కంపెనీ పనితీరు లేదా వ్యూహాల గురించి గానీ వారెప్పుడూ మాట్లాడలేదని, సంస్థ వ్యవహారాల్లోనూ తలదూర్చలేదని బాలా చెప్పారు. -
కేజ్రీవాల్తో విందు కలెక్షన్ రూ. 50 లక్షలు
బెంగళూరు: అరవింద్ కేజ్రీవాల్తో విందు సమావేశం ద్వారా రూ. 50 లక్షలు సేకరించినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వెల్లడించింది. బెంగళూరులో శనివారం రాత్రి కేజ్రీవాల్తో ఏర్పాటు చేసిన విందు భేటీకి 200 మందిపైగా హాజరయ్యారని ఆప్ నాయకులు తెలిపారు. పార్టీ కోసం విరాళ సేకరణలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పారదర్శకంగా విరాళాలు సేకరించేందుకు ఆప్ మద్దతుదారులు, బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యుడు వి. బాలకృష్ణన్ ఈ కార్యక్రమం నిర్వహించారు. విందుకు హాజరుకాలేకపోయిన మరికొందరు తమకు విరాళాలు ఇస్తామని హామీయిచ్చారని బాలకృష్ణన్ తెలిపారు. కేజ్రీవాల్తో విందు భేటీ చాలా బాగా జరిగిందని చెప్పారు. మీడియాపై చేసిన ఆరోపణల గురించి కేజ్రీవాల్ను ప్రధానంగా ప్రశ్నించారని వెల్లడించారు. నరేంద్రమోడీ నాయకత్వంలోని గుజరాత్ చీకటి కోణాలను చూపించే దమ్ము మీడియాకు లేదని కేజ్రీవాల్ విమర్శించిన సంగతి తెలిసిందే. -
లోక్సభ రేసులో ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 60 మంది అభ్యర్థుల పేర్లతో నాలుగో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) విడుదల చేసింది. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్, పాత్రికేయుడు ఆశిష్ కేతన్ పేర్లు ఇందులో ఉన్నాయి. బాలకృష్ణన్ సెంట్రల్ బెంగళూరు నుంచి పోటీ చేయనున్నారు. ఇన్ఫీ డెరైక్టర్ పదవిని వదులుకుని ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆశిష్ కేతన్ న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇన్ఫోసిస్ మాజీ సీఈవో నందన్ నిలేకని కూడా లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. దక్షిణ బెంగళూరు లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నందన్ పోటీ చేస్తున్నారు. -
నందన్, బాలకృష్ణన్ ఢీ?
దేశంలోని ఐటీ దిగ్గజ కంపెనీలో ఒకప్పుడు వారిద్దరూ సహోద్యోగులు. ఉన్నత స్థానాల్లో ఉండగానే వారు సంస్థను వదిలారు. వారిద్దరూ ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మారనున్నారు. వారెవరో కాదు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో నందన్ నిలేకని, మాజీ సీఎఫ్ఓ వి. బాలకృష్ణన్. రానున్న లోక్సభలో ఎన్నికల్లో వీరిద్దరూ ముఖాముఖి పోటీ పడే అవకాశాలున్నాయని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ నుంచి బయటకు వచ్చిన బాలకృష్ణన్- ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఇన్ఫీ డెరైక్టర్ పదవిని వదులుకుని ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. 10 రూపాయల రుసుం చెల్లించి ఆప్ సభ్యత్వం తీసుకున్నారు. దేశంలో ఆప్ సృష్టించనున్న విప్లవంలో తాను భాగస్వామి కావాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరినట్టు 48 ఏళ్ల బాలకృష్ణన్ వెల్లడించారు. అయితే ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్ తర్వాత ఈ టాప్ పోస్టు రేసులో ముందంజలో ఉన్నట్లు చెబుతున్న బాలకృష్ణన్(‘బాల’ అని సుపరిచితం) హఠాత్తుగా గుడ్బై చెప్పడం అటు పరిశ్రమ వర్గాలతోపాటు, విశ్లేషకులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరోవైపు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యునీక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ - ఆధార్ ప్రాజెక్టు) చైర్మన్ నందన్ నిలేకనిపై బాలకృష్ణన్ను ఆప్ పోటీ పెట్టే అవకాశముందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దక్షిణ బెంగళూరు లోక్సభ స్థానం నుంచి నందన్ను పోటీకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనికి నిలేకని ఒప్పుకున్నారని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర్ నిర్ధారించారు. అటు బాలకృషన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో నిలేకనిపై ఆప్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే నిలేకనిపై పోటీ చేసేందుకు తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరలేదని బాలకృష్ణన్ తెలిపారు. ఎన్నికల్లో ప్రచారం చేస్తానని నిలేకనికి మాట ఇచ్చానని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ విషయంపై ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని బాలకృష్ణన్ అభిప్రాయపడుతున్నారు. ఆప్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో ఇంకా స్పష్టం కాలేదు. కేజ్రీవాల్ను కలిసిన తర్వాత పోటీపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఒకవేళ ప్రజాభిప్రాయం మేరకు కేజ్రీవాల్ ఆదేశిస్తే బాలకృష్ణన్ బరిలో దిగే అవకాశం లేకపోలేదు. ఐటీ దిగ్గజాల పోటీ సమాచారంతో ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది. -
ఇన్ఫీలో మరో బిగ్ వికెట్!
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు ఒక్కొక్కరుగా కంపెనీని వీడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో ఇన్ఫీ డెరైక్టర్, మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) వి. బాలకృష్ణన్ కూడా చేరారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్ఫోసిస్ ప్రస్తుత సీఈఓ, ఎండీ ఎస్డీ శిబులాల్ తర్వాత ఈ టాప్ పోస్టు రేసులో ముందంజలో ఉన్నట్లు చెబుతున్న బాలకృష్ణన్(‘బాల’ అని సుపరిచితం) హఠాత్తుగా గుడ్బై చెప్పడం అటు పరిశ్రమ వర్గాలతోపాటు, విశ్లేషకులనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నెల 31 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి వస్తుందని ఇన్ఫోసిస్ శుక్రవారం బీఎస్ఈకి వెల్లడించిన సమాచారంలో పేర్కొంది. కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇన్ఫీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మళ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత(ఈ జూన్లో) గత ఆరు నెలల కాలంలోనే ఎనిమిది మంది టాప్ అధికారులు ఇన్ఫీకి గుడ్బై చెప్పడం గమనార్హం. ఇదిలాఉండగా.. ఇన్ఫోసిస్ ల్యాబ్స్కు హెడ్గా వ్యవహరిస్తున్న సీనియర్ వైస్ప్రెసిడెంట్ సుబ్రమణ్యం గోపరాజు కూడా వైదొలగుతున్నట్లు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో 24 గంటల్లోనే ఇద్దరు టాప్ అధికారులు నిష్ర్కమించినట్లయింది. సొంత కుంపటి...: ఇన్ఫీ నుంచి వ్యక్తిగత కారణాలతోనే బయటికి వెళ్తున్నానన్న బాలకృష్ణన్... సొంతంగా ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఫండ్ను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. దీనికి సెబీ అనుమతికోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఇన్ఫీ మాజీ వైస్ప్రెసిడెంట్ మోహన్దాస్ పాయ్, విప్రో మాజీ ఎగ్జిక్యూటివ్ గిరీష్ పరాంజపేలతో కలిసి బాలకృష్ణన్ ఈ పీఈ వెంచర్ను ప్రారంభిస్తుండటం గమనార్హం. మరో ఐటీ కంపెనీకి మారే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని... ఏడాదిగా ఇన్ఫీకి రాజీనామా నిర్ణయంపై ఆలోచిస్తున్నానని కూడా ఆయన చెప్పారు. కాగా, మూర్తి చైర్మన్గా తిరిగి రావడానికి.. తన నిష్ర్కమణకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. నారాయణ మూర్తి పునరాగమనం ఇన్ఫీకి చాలా ప్రయోజనకరమైన అంశమని కూడా పేర్కొన్నారు. బాలకృష్ణన్ ప్రస్తుతం అనుబంధ సంస్థలైన ఇన్ఫోసిస్ బీపీఓ విభాగానికి హెడ్గా, ఇన్ఫోసిస్ లోడ్స్టోన్ చైర్మన్గానూ వ్యవహరిస్తున్నారు. కాగా, బాల నిష్ర్కమణ ఇన్ఫీకి కచ్చితంగా పెద్ద దెబ్బేనని... భారత్లో అత్యుత్తమ సీఎఫ్ఓల్లో ఒకరిగా ఆయన తనదైన ముద్రను వేశారని మోహన్దాస్ పాయ్ వ్యాఖ్యానించడం విశేషం. కంపెనీలో ఆయన మరింత ఉన్నత పాత్ర పోషించాల్సిందని.. అయితే, ఆయన ఒక మంచి టీమ్ను ఇన్ఫీకి అందించారని కూడా పాయ్ పేర్కొన్నారు. బోర్డులోకి కిరణ్ మజుందార్ షా... బాలకృష్ణన్ రాజీనామా నేపథ్యంలో ఇన్ఫీ యాజమాన్యం తక్షణం స్పందించింది. క్రిస్ గోపాలకృష్ణన్ను తాత్కాలికంగా బీపీఓ విభాగానికి హెడ్గా నియమించింది. మరోపక్క, బీజీ శ్రీనివాస్ను ఇన్ఫోసిస్ లోడ్స్టోన్ చైర్మన్ వ్యవహరిస్తారని వెల్లడించింది. ఈ మేరకు చైర్మన్ నారాయణ మూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అత్యున్నత నిబద్ధత, మేధస్సు, ఉత్సాహంతో పనిచేసే ‘బాల’... ఇన్ఫీలో ఇక ఉండరన్న విషయాన్ని ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. కంపెనీ నిర్మాణంలో ఆయన పాత్ర ఎనలేనిది’ అని నారాయణ మూర్తి ఆయన రాజీనామాపై వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షాను ఇన్ఫోసిస్ బోర్డులోకి స్వతంత్ర డెరైక్టర్గా తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా ఇన్ఫీ సీనియర్ వైస్ప్రెసిడెంట్ యూబీ ప్రవీణ్ రావును బోర్డులో హోల్టైమ్ డెరైక్టర్గా తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించింది. కంపెనీ ఫైనాన్స్ విభాగాన్ని బలోపేతం చేయడంలో బాలకృష్ణన్ కీలక పాత్ర పోషించారని ఇన్ఫీ సీఈఓ, ఎండీ శిబులాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెళ్లిన వారికి బంపర్ ఆఫర్లే! ఇన్ఫోసిస్ను వదిలి వెళ్లిన ప్రముఖుల్లో బంపర్ ఆఫర్లు పొందిన వారూ ఉన్నారు. అశోక్ వేమూరి... ఆయన సెప్టెంబర్లో ఐగేట్ కంపెనీకి ప్రెసిడెంట్, సీఈవోగా నియమితులయ్యారు. ఇన్ఫీతో పోలిస్తే దాదాపు మూడింతల అధిక ప్యాకేజీ(రూ.14.5 కోట్లు) వేమూరికి లభించడం విశేషం. ఇన్ఫోసిస్లో 2012-13లో వేమూరికి లభించిన ప్యాకేజీ మొత్తం రూ. 4.9 కోట్లే. కంపెనీలో ఏదో జరుగుతోంది...? నారాయణ మూర్తి పునరాగమనం తర్వాతే ఇన్ఫీకి టాప్ ఎగ్జిక్యూటివ్లు వరుసగా గుడ్బై చెబుతుండటంపై పరిశీలకుల్లో భిన్నాభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూర్తితో విభేదాలు ఒక కారణమైతే.. సీనియర్లకు తగిన విలువనివ్వడంలేదన్న వాదనలూ ఉన్నాయి. ‘అగ్రశ్రేణి నిపుణులు కంపెనీ నుంచి వేగంగా వైదొలుగుతున్నారు. మూర్తి రాకను ఇన్ఫీ సిబ్బంది సానుకూలంగా పరిగణించినట్లు కనబడటం లేదు’ అని ఇకాన్ ఇన్వెస్ట్మెంట్స్కు చెందిన అనిల్ సింఘ్వీ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్లు మూర్తిని పూర్తిగా స్వాగతించారని.. సీనియర్ ఎగ్జిక్యూటివ్ల విషయంలో ఇది బెడిసికొట్టినట్లుందని విశ్లేషకులు అంటున్నారు. నారాయణ మూర్తి చైర్మన్గా మళ్లీ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఇన్ఫీ షేరు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. బీఎస్ఈలో శుక్రవారం 1.1% ఎగబాకి ఆల్టైమ్ గరిష్టంతో(రూ.3,552) ముగిసింది. కాగా, మూర్తి పునరాగమనం తర్వాత ఆయన కొడుకు రోహన్ మూర్తిని తనకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా నియమించుకోవడం తెలిసిందే. వాస్తవానికి రోహన్ను వైస్ ప్రెసిడెంట్గా నియమించాలని ప్రతిపాదించారు. విమర్శలురావడంతో దీన్ని విరమించుకున్నారు. రోహన్ను కంపెనీ తదుపరి సీఈఓగా తీసుకొచ్చేందుకు మూర్తి పావులు కదపడం ఇష్టంలేకే సీనియర్లు ఒక్కొక్కరుగా గుడ్బై చెబుతున్నారన్న వాదనలూ లేకపోలేదు.‘బాల’ నిష్ర్కమణతో ఈ ఊహాగానాలు మళ్లీ తెరపైకివచ్చాయి. బాల రాజీనామాతో కంపెనీపై ప్రభావం పడక పోయినా... టాప్ ఎగ్జిక్యూటివ్ల వరుస గుడ్బైలతో దీర్ఘకాలంలో షేరుపై ప్రతికూలతకు దారితీయ్చొనేది నిపుణుల అభిప్రాయం. 6 నెలలు.. 8 మంది... 1. స్టీఫెన్ ఆర్ ప్రాట్: ఇన్ఫీ ఉత్తర అమెరికా విభాగం యుటిలిటీస్, రిసోర్సెస్ హెడ్. నవంబర్లో రాజీనామా 2. కార్తీక్ జయరామన్: ఆస్ట్రేలియాలో ఇన్ఫీ బీపీఓ సేల్స్ హెడ్. సెప్టెంబర్లో గుడ్బై 3. హంబెర్టో ఆండ్రేడ్: లాటిన్ అమెరికాలో ఇన్ఫీ బీపీఓ హెడ్. సెప్టెంబర్లో నిష్ర్కమణ. 4. అశోక్ వేమూరి: కంపెనీ అమెరికా కార్యకలాపాల హెడ్. ఆగస్టులో గుడ్బై. 5. సుధీర్ చతుర్వేది: ఇన్ఫీ వైస్ప్రెసిడెంట్, అమెరికాలో ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్. ఆగస్టులో రాజీనామా. 6. బసబ్ ప్రధాన్: ఇన్ఫీ గ్లోబల్ సేల్స్ హెడ్. జూలైలో నిష్ర్కమణ. 7. సుబ్రమణ్యం గోపరాజు: ఇన్ఫీ ల్యాబ్స్ హెడ్, సీనియర్ వైస్ప్రెసిడెంట్. డిసెంబర్ 19న రాజీనామా 8. వి. బాలకృష్ణన్: ఇన్ఫీ డెరైక్టర్, బీపీఓ హెడ్, లోడ్స్టోన్ చైర్మన్. డిసెంబర్ 20న గుడ్బై
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement