-
‘జీరో పాలిటిక్స్ను మా కమిటీ స్వాగతిస్తుంది’
సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు, ఏ పార్టీ కూడా మద్యం, డబ్బు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఆర్డినెన్స్ తీసుకురావడం సాహసోపేత నిర్ణయమని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వి. లక్ష్మణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దశల వారి మద్య నియంత్రణను విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. గతంలో ఉన్న బెల్టు షాపులను సమూలంగా తొలగించారని వెల్లడించారు. ప్రైవేటు రంగలో ఉన్నమద్యం షాపులను ప్రభుత్వ రంగంలోకి తీసుకు వచ్చి వాటి పని గంటలను తగ్గించారని తెలిపారు. ‘దీన్ని కూడా రాజకీయం చేయడం బాబుకే చెల్లింది’ రాత్రి ఎనిమిది గంటలు దాటితే మద్యం దొరకని పరిస్థితి సీఎం జగన్ కల్పించారని పేర్కొన్నారు. భారత దేశ చరిత్రలో ఏ సీఎం చెప్పని విధంగా ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రాబల్యం లేకుండా జీరో పాలిటిక్స్కు సీఎం జగన్ చేస్తున్న కృషిని తమ కమిటీ స్వాగతిస్తుందని తెలిపారు. ఏడు నెలల కృషి ఫలితంగా రాష్ట్రంలో మద్య వినియోగం 24 శాతం, బీరు వినియోగం 58 శాతం తగ్గించారన్నారు. దీనిపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో రోడ్డుప్రమాదాలు, నేరాలు, హత్యలు అనేక దుష్పరిణామాలు తగ్గాయని తెలిపారు. స్థానిక బహుఖ ఎన్నికలు ఒకే సారి నిర్వహించడం, ప్రచార సమయాన్ని తగ్గించడం ద్వారా ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు. గతంలో ఎన్నికల వ్యయంలో అభ్యర్థులు మూడో వంతు మద్యం పంపిణీకి కేటాయించేవారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు 60 నుంచి70 కోట్లు మద్యం పంపిణీకే ఖర్చు పెట్టారని తెలపారు. రూ. 200 కోట్లు ఉప ఎన్నికలకు ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు ది అన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలను డబ్బు ,మద్యం మయం చేసిన పాత్ర చంద్రబాబుకు దక్కిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు క్రియాశీలక రాజకీయాల్లో మద్యం, డబ్బు పాత్ర పెరిగిందన్నారు. కాగా ఈ ఎన్నికల్లో సీఎం జగన్ డబ్బు,మందు పాత్ర తగ్గించాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. సేవా దృక్పతం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి అలాంటి వారిని గెలిపించుకోమని చెప్పడాన్ని తమ కమిటీ స్వాగతిస్తుందని చెప్పారు. నిఘా యాప్ ద్వారా ఎన్నికల సమమయంలో మద్యం, డబ్బుల పంపిణీ జరిగితే వీడియో తీసి అధికారులకు పంపిస్తే.. సత్వరమే చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఒకవేళ మద్యం, డబ్బుతో ప్రలోభాలకు పాల్పడిన అభ్యర్థిని ఎన్నిక అయిన తరువాత గుర్దిస్తే వారి సభ్యత్వం రద్దు అవుతుంది తెలిపారు. కాగా రాష్ట్రంలో మద్యం, డబ్బు రహిత ఎన్నికలు జరగాలని తాము కోరుతున్నామన్నారు. గతంలో డబ్బు సంచులతో మద్యం బాటిళ్లతో ఎన్నికల్లో దిగిన రాజకీయ నాయకులకు స్వస్తి పలికి సేవా బావంతో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులపై పార్టీలు దృష్టి పెట్టాయన్నారు. సేవ చేసే నాయకులను ఎన్నుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రరాష్ట్ర ముఖచిత్రం మారుతుందని ఆయన అన్నారు. -
విభజనను తెలుగు జాతి అంగీకరించదు
ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను తెలుగు జాతి అంగీకరించటం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. సచివాలయం ఎదుట ఉన్న తెలుగుతల్లి విగ్రహం వద్ద గురువారం ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక, విశాలాంధ్ర మహాసభ, సమైక్యాంధ్రను కోరే ప్రభుత్వంలోని వివిధ శాఖల జేఏసీల ఆధ్వర్యంలో ‘మౌన ప్రదర్శన’ నిర్వహించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని బలవంతంగా వారిని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. తాము ప్రశాంతంగా ‘మౌన ప్రదర్శన’కు పూనుకుంటే.. పోలీసులు అడ్డుకోవడం అమానుషమన్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను తాము అంగీకరించబోమని, తుదివరకూ సమైక్య రాష్ట్రంకోసం పోరు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి చేగొండి రామజోగయ్య, పుత్తా శివశంకర్రెడ్డి, రామభాస్కర్, పోతుల శివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టికల్-3పై పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి
ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-ఆర్డినేటర్ లక్ష్మణరెడ్డి పిలుపు గుంటూరు, న్యూస్లైన్: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వానికిగల విశిష్ట అధికారాన్ని తొలగించేందుకు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్టికల్-3 సవరణకు రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి, సమైక్య స్ఫూర్తిని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి. లక్ష్మణరెడ్డి కోరారు. గుంటూరు లక్ష్మీపురంలోని ఏపీ కాటన్ అసోసియేషన్ హాల్లో వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ జేఏసీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, సమైక్య ఉద్యమస్ఫూర్తిని ఢిల్లీ పెద్దలకు చాటిచెప్పేందుకు డిసెంబర్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి, 8, 9, 10 తేదీల్లో పార్లమెంటును ముట్టడిస్తామన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన రోజు లక్షలాది మందితో చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని, విభజనపై అసెంబ్లీ అభిప్రాయం తెలిపేందుకు రాష్ట్రపతి 45 రోజుల సమయం ఇచ్చి తీరాల్సిందేననీ తెలిపారు. -
కేంద్రం దూసుకుపోతోంటే కాలయాపనా?: లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విభజనకు అనుకూలంగా తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా, సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా లేఖ ఇవ్వకుండా రోజుకో ప్రకటనతో, ‘కొబ్బరికాయ’ సిద్ధాంతాలతో కాలం గడుపుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సమన్వయకర్త వి.లక్ష్మణరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన చేసే పద్ధతి ఇది కాదంటూ నిత్యం కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తున్న బాబు.. అసలు తెలంగాణకు అనుకూలంగా తానిచ్చిన లేఖను వెనక్కి తీసుకోవడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. విభజన విషయంలో కాంగ్రెస్ తప్పుడు వైఖరి, విధానంతో ముందుకు వెళుతోందని నిజంగానే భావిస్తే బాబు కచ్చితంగా ఆ లేఖను వెనక్కి తీసుకునేవారని లక్ష్మణరెడ్డి చెప్పారు. కాంగ్రెస్కు ఇష్టంలేని పని చేయకూడదనే ఉద్దేశంతోనే లేఖను వెనక్కి తీసుకోకుండా మిన్నకుంటున్నార నే అనుమానం కలుగుతోంద ని గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్న ప్రతిపాదనను పట్టించుకోలేదు. అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరలేదు. సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటుపై తీర్మానం చేసినప్పుడు కూడా వ్యతిరేకించకుండా సీమాంధ్ర రాజధానికి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలంటూ ఆ తీర్మానాన్ని సమర్థించారు. ఇప్పటికీ అదే వైఖరితో ఉంటే జీవోఎం ముందు హాజరై తన ప్రతిపాదనలేంటో చెప్పేవారే. కానీ అలా చేయలేదు. రాష్ట్రపతికి ఉత్తరం రాసి మీ పద్ధతి బాగా లేదంటారు. తాజాగా విభజన అంటే కొబ్బరికాయ కొడితే సమంగా సగానికి పగిలినట్టుగా జరగాలన్నదే తన ఉద్దేశమంటారు. ఇంతా చేస్తే ఆయన అసలు ఉద్దేశమేంటో మాత్రం అర్థం కావడం లేదు..’ అని లక్ష్మణరెడ్డి విమర్శించారు. తన కుమారుడిని ఎలా ప్రోజెక్టు చేసుకోవాలా? అన్నది తేల్చుకోలేకే చంద్రబాబు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోందని ఆయన అన్నారు. ఒకపక్క కేంద్రంలో అంతా జరిగిపోతుంటే మళ్లీ ఆత్మగౌరవ యాత్ర అంటూ సీమాంధ్ర ప్రజల ముందుకు వెళతానని చంద్రబాబు చెబుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీమాంధ్రకు అన్యాయం చేసిన విషయం స్పష్టంగా తెలిసిపోతోందని, ఈ కారణంగానే అక్కడి ప్రజల్లోఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని ఆయన చెప్పారు. కొందరు పార్టీ కేడర్ను ముందుపెట్టుకుని యాత్రలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. ఇప్పుడు సమన్యాయం అంటూ కొత్త వాదన తేవడంతో బాబు మరింత చులకనయ్యారని విమర్శించారు. చంద్రబాబు వైఖరిలో స్పష్టత లేదనే విషయం రాష్ట్రానికే కాదు.. దేశమంతా తెలిసిపోయిందని చెప్పారు. వారానికోసారి ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు రాయడం మినహా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న విషయంలోగానీ, విభజించాలన్న విషయంలోగానీ ఏదీ తేల్చకుండా నాన్చుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క చంద్రబాబేనని లక్ష్మణరెడ్డి ధ్వజమెత్తారు. -
అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజన అసాధ్యం: వి. లక్ష్మణరెడ్డి
విజయవాడ, న్యూస్లైన్ : అసెంబ్లీ తీర్మానం లేకుండా దేశంలో ఏ ఒక్క రాష్ర్టం ఏర్పాటు కాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి. లక్ష్మణరెడ్డి చెప్పారు. విజయవాడ ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన వేదిక కృష్ణా జిల్లా శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఏర్పడిన ఏ రాష్ట్రాన్ని పరిశీలించినా మాతృరాష్ట్ర అసెంబ్లీ తీర్మానాలు ఆమోదించాకే విభజన జరిగిందన్న వాస్తవాన్ని యూపీఏ పెద్దలు గుర్తించాలని హితవు పలికారు. చివరికి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలతోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని గుర్తుచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 విభజన ప్రక్రియ ఎలా ఉండాలనే విషయాన్ని మాత్రమే స్పష్టం చేసిందని, రాష్ట్రాల విభజనకు ప్రాతిపదిక ఏమిటనేది నిర్థారించడంలేదని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, వెనుకబడిన ప్రాంతాలు ప్యాకేజీలు ప్రకటించాలని శ్రీకృష్ణ కమిటీ సూచించినప్పటికీ ఆ దిశగా కేంద్రం అడుగులు వేయలేదన్నారు. 1956-2010 మధ్యకాలంలో అత్యంత వేగంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందని కమిటీ నివేదికలో పేర్కొందని తెలిపారు. శాస్త్రీయపద్ధతిలో రూపొందించిన ఈ కమిటీ నివేదికపై చట్ట సభల్లో చర్చకు రాకుండానే బుట్ట దాఖలైందన్నారు. కేవలం టీఆర్ఎస్.. కాంగ్రెస్లో విలీనం కావడమే విభజనకు ప్రాతిపదిక అన్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ వ్యాఖ్యలున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్లమెంట్లో బీజేపీ ఓటు వేస్తే అది రాహుల్ను ప్రధానిని చేసేందుకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. రాష్ర్ట విభజనను ఎంఐఎం, సీపీఎం, వైఎస్సార్ సీపీ బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయని, మిగిలిన పార్టీలు విభేదాలు పక్కనబెట్టి అదేబాటలో నడవాలని సూచించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement