-
డిజిటల్ జాబ్స్.. ఫ్యూచర్ ట్రెండ్స్
రాబోయే రోజుల్లో పంచభూతాల మాదిరి ఐదు డిజిటల్ టెక్నాలజీ విభాగాలైన మొబిలిటీ, సోషల్ మీడియా, అనలిటిక్స్, క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్... కొలువులకు పట్టం కడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఐటీ, ఐటీ ఆధారిత రంగాలతోపాటు ఇతర రంగాల్లో పుష్కలమైన అవకాశాలున్నప్పటికీ... ఏటా లక్షల మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేస్తుండడంతో నైపుణ్యాలున్న అభ్యర్థుల ఎంపిక కంపెనీలకు సవాలుగా మారుతోంది. దాంతో సరిపడ నైపుణ్యాలు, సృజనాత్మకత కలిగిన వారిని నియమించుకోవడానికి నూతన విధానాలకు శ్రీకారం చుడుతున్నాయి. కొత్తగా ఆలోచించే నైపుణ్యం, సంస్థకు అవసరమైన ప్రతిభ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. వందల సంఖ్యలో ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలు కలిగిన హైదరాబాద్లో మరికొద్ది రోజుల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భవిష్యత్ రిక్రూట్మెంట్ ట్రెండ్స్పై విశ్లేషణ.. అభివృద్ధి పథంలో ఐటీ మ్యానుఫాక్చరింగ్, హెల్త్కేర్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, టెలికాం తదితర రంగాలన్నింటిలో ఐటీ పరిజ్ఞానం అవసరం. రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్(రిమ్), ఎంటర్ప్రైజ్ సొల్యూషన్(ఈఆర్పీ, ఎస్ఏపీ, ఒరాకిల్), బీపీఓ, కేపీఓ, ఇంజనీరింగ్ సొల్యూషన్స్, టెస్టింగ్ తదితర రంగాల్లో గత మూడు నాలుగేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి నెలకొంది అంటున్నారు టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రీజినల్ హెడ్, టెలికామ్ టెక్నాలజీ బిజినెస్ యూనిట్ గ్లోబల్ హెడ్ వి.రాజన్న. అందుక నుగుణంగా ఆయా విభాగాల్లో యువతకు అవకాశాలు లభించనున్నాయని పేర్కొంటున్నారు. పంచ డిజిటల్ శక్తులు ఐబీఎం మెయిన్ ఫ్రేమ్స్తో మొదలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిణామ క్రమం.. ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. విభిన్న రంగాల్లో అభివృద్ధితో డిజిటల్ విప్లవానికి తెరలేచింది. పంచభూతాల మాదిరి ఐదు డిజిటల్ శక్తులు అందుబాటులోకొచ్చాయి. మొబిలిటీ, సోషల్ మీడియా, అనలిటిక్స్, క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అనే ఈ పంచ శక్తులు రానున్న రోజుల్లో ఊహించని రీతిలో విస్తరించనున్నాయని విశ్లేషించారు రాజన్న. ఆయా టెక్నాలజీల్లో నైపుణ్యాలు సొంతం చేసుకున్నవారికి అవకాశాలకు కొదవ ఉండదని ఆయన చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంచడంతో ఇన్సూరెన్స్, డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యువతలో ఉద్యోగ నైపుణ్యాలు, ఎంటర్ప్రెన్యూరియల్ స్కిల్స్ మెరుగుపరచేందుకు ఉద్దేశించిన నేషనల్ మల్టి స్కిల్ ప్లాన్; రూ.500కోట్లతో ఐఐటీలు, ఐఐఎంల ఏర్పాటు; చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్.. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొత్త కొలువులకు మార్గం వేస్తాయని హెచ్ఆర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆశాజనకంగా జాబ్ మార్కెట్ గతేడాది దేశవ్యాప్తంగా 1.6 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు లభించాయి. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరగనుంది. అయితే కంపెనీల నియామక విధానాల్లో కొన్ని సహజమైన మార్పులు నెలకొంటున్నాయి. గతేడాదితో పోల్చితే ఐటీ పరిశ్రమ అభివృద్ధి పథంలో పయనించనుంది. 13 నుంచి 15 శాతం వృద్ధిని నమోదు చేయనుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఐటీతోపాటు అన్ని రంగాల జాబ్ మార్కెట్ కూడా 10-11 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశముంది. దేశీయ సేవల ద్వారా లభించే 30శాతం ఆదాయంలో ఇటీవలి కొన్ని త్రైమాసికాల్లో తగ్గుదల కనిపించినా మళ్లీ పుంజుకుంటోంది. రైల్వేలు, హెల్త్కేర్ రంగాల్లో అభివృద్ధి చోటుచేసుకునే అవకాశం ఉంది. తదనుగుణంగా ఉద్యోగావకాశాలూ పెరగనున్నాయి. ఆన్డిమాండ్ హైరింగ్ నియామక విధానాల మార్పుల్లో భాగంగా కంపెనీలు ఆన్డిమాండ్ హైరింగ్కు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటివరకు 60 శాతం క్యాంపస్ నియామకాలుంటే.. 40 శాతం ఆన్డిమాండ్ హైరింగ్ లేదా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ (ఈపీ) హైరింగ్ ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీలు క్యాంపస్ నియామకాల కంటే ఆన్డిమాండ్ హైరింగ్కే మొగ్గుచూపుతున్నాయి. ఎందుకంటే.. క్యాంపస్ నియామకాలు ఏడాదిలో ఏదో ఒక సీజన్లో మాత్రమే జరుగుతుంటాయి. అంటే 2015-16కి గాను త్వరలో క్యాంపస్ సెలక్షన్స్ జరుగనున్నాయి. ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులను భారీ సంఖ్యలోనే కంపెనీలు ఎంపిక చేసుకునే అవకాశముంది. అయితే, వారికి ఆఫర్ లెటర్ ఇచ్చి, కోర్సు పూర్తి పూర్తయ్యేవరకు కంపెనీలు వేచిఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఆన్డిమాండ్ హైరింగ్ బాటపడుతున్నాయి. తమ అవసరానికి అనుగుణంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అంతేగానీ నియామకాలను తగ్గించడం లేదు. ఈ విధమైన నియామకాల్లోనూ కళాశాలతో సంబంధం లేకుండా ఏ విద్యార్థైనా పాల్గొనవచ్చు. కరిక్యులం ప్రధానం కంపెనీలు ప్రధానంగా కరిక్యులం, సిలబస్ పరిధిలోనే విద్యార్థి ప్రతిభను పరీక్షిస్తాయి. అంతకుమించి ఎక్కువగా ఆశించేదీ ఉండదు. పరిశ్రమ అవసరాలకు సరితూగే రీతిలో ఎప్పటికప్పుడు మనవిశ్వవిద్యాలయాలు కరిక్యులంలో మార్పులు చేస్తూనే ఉన్నాయి. కాబట్టి విద్యార్థి కరిక్యులంను పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకోవాలి. కరిక్యులంలో పరిపూర్ణత సాధిస్తే సులభంగా జాబ్ను సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు. నియామక ప్రక్రియ ఇలా ‘నియామకాల్లో కంపెనీల వారీగా స్పల్ప తేడాలున్నప్పటికీ.. దాదాపు అన్ని కంపెనీలు అభ్యర్థులకు రాతపరీక్ష, గ్రూప్డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. ఇంటర్వ్యూలో టెక్నికల్, హెచ్ఆర్ అనే రెండు రకాలుంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూలో అభ్యర్థి కరిక్యులం, అకడమిక్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో అభ్యర్థి పర్సనాలిటీని అంచనా వేస్తారు. బృందంతో కలిసి పనిచేసే సామర్థ్యం, అభ్యర్థి దృక్పథం, అణకువ, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలను పరీక్షిస్తారు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు రాత పరీక్షకు బదులు ఆన్లైన్ టెస్ట్లను కూడా నిర్వహిస్తున్నాయని సైయింట్ కంపెనీ కార్పొరేట్ అఫైర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రెసిడెంట్ బి.అశోక్రెడ్డి తెలిపారు. నైపుణ్యాలే గీటురాయి ఐటీ కంపెనీల నియామకాల్లో సంప్రదాయ కోర్సునభ్యసించిన విద్యార్థులకూ అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీ సంబంధిత సర్వీసులైన రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్(రిమ్), బీపీఓ, కేపీఓ తదితర రంగాల్లో సంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. సంప్రదాయ కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలల్లోనూ క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కనీసం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో పూర్తిస్థాయి నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఏదైనా డేటాబేస్లోనూ ప్రావీణ్యం పొందాలి. ఒక శాప్ లేదా ఒరాకిల్ తదితర ఈఆర్పీ పరిజ్ఞానం పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, బృందనైపుణ్యాలను పెంచుకోవాలి. ఏదైనా టెక్నాలజీ విభాగంలో పనిచేయడానికి సిద్ధమవ్వాలి. అంతేకాకుండా ఐటీ కంపెనీలు ఐటీ సంబంధిత గ్రూప్లతోపాటు కోర్ బ్రాంచ్ల విద్యార్థులకూ సమప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎందుకంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఒక హారిజాంటల్ ప్రక్రియ. అంటే.. ప్రతి రంగంలోనూ ఈ రంగం వినియోగం ఉంటుంది. కాబట్టి ఐటీ సంస్థలకు ఐటీ నిపుణులతోపాటు సంబంధిత రంగ నిపుణుల అవసరం ఉంటుంది. అందుకే కోర్ బ్రాంచ్ ఉత్తీర్ణులను కూడా ఐటీ సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. అలాగే బీఎస్సీ తదితర కోర్సులు చదివిన విద్యార్థులకు సైతం కొన్ని కంపెనీలు సంబంధిత శిక్షణనిచ్చి ఐటీ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నాయి. సైన్స్ టు సాఫ్ట్వేర్ ‘భారత ఐటీ రంగంలో మంచి అవకాశాలున్నాయి. విద్యార్థులు జాబ్ మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా తమను తీర్చిదిద్దుకోవా లి. బీఎస్సీ కోర్సులనభ్యసించిన వారూ సాఫ్ట్వేర్ నిపుణులు గా కెరీర్ను తీర్చిదిద్దుకునేందుకు టీసీఎస్ అవకాశం కల్పిస్తోంది. ఇగ్నైట్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది సైన్స్ టు సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. బీఎస్సీ విద్యార్థులకు మూడు, నాలుగు నెలలపాటు శిక్షణ ఇచ్చి ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దుతారు. ఐటీకి దీటుగా ఎనర్జీ, పవర్, హెల్త్కేర్, ఇన్ఫ్రాస్ట్ర క్చర్ డెవలప్ మెంట్ రంగాల్లోనూ ఉద్యోగాలున్నాయి. పవర్ అండ్ ఎనర్జీ రంగం ఈ ఏడాది గణనీయమైన వృద్ధి సాధించింది. అభ్యర్థులు నైపుణ్యాలు పెంచుకుంటూ అవకాశాలను అంది పుచ్చుకోవాలి’ - వి. రాజన్న, వైస్ ప్రెసిడెంట్ అండ్ రీజినల్ హెడ్, టీసీఎస్ -
భూతల స్వర్గమా! వెతల మార్గమా?
దేశంలో ఏ రాష్ట్రాన్ని అయినా ఎందుకు పునర్విభజిం చాలి? ఆ పునర్విభజన లక్ష్యాలు ఏమిటి? పురోగమి స్తున్న ఒక రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం వెనుక ఉన్న హేతుబద్ధత ఎలాంటిది? ప్రస్తుతం రాష్ర్ట పరిస్థి తులను చూసిన తర్వాత ఈ ప్రశ్నలు చాలా మంది వేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు జరుగు తున్న ప్రయత్నం నిలకడగా సాగే అభివృద్ధి పునాదిగా ఉండాలన్న దృష్టితో జరుగుతున్నదా? లేదా 2009 తర్వాత పరిణామాల కారణంగా కొన్ని రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి ఆ ప్రయత్నం జరుగుతున్నదా? కేంద్ర ప్రభుత్వానికి ఉన్న రాజకీయ కారణాలవల్ల విభజన అనివార్యమైతే ఆ ప్రక్రియ న్యాయబద్ధంగా జరుగుతోందా? 12వ పంచవర్ష ప్రణాళిక ఆర్థికవ్యవస్థలో శీఘ్రగతిన ప్రగతిని తిరిగి తీసుకురావాలని చెబుతోంది. ఆ ప్రగతి సమ్మిళిత వృద్ధి, నిలకడగా సాగే వృద్ధి అనే ఆశయాలతో కూడినది. విభజన ప్రయత్నంలో ఈ అంశాలకు ప్రాధాన్యం దొరుకుతోందా? ప్రాతిపదికే పెద్ద గందరగోళం రాష్ట్రాల పునర్విభజనకు జరుగుతున్న ఏ ప్రతిపాదనకైనా దేశ సమగ్రత, ఐక్యత ప్రధాన ధ్యేయంగా ఉండాలి. మానవ వనరుల అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి పెరు గుదలకు దోహదం చేసేదిగా ఉండాలి. పరిపాలనా సౌలభ్యాన్ని మరింత సరళం చేసి, పాలనా వ్యయాన్ని తగ్గించాలి. మంచి పాలనకు ఆస్కారం కల్పించాలి. మరీ ముఖ్యంగా పునర్విభజన జరుగుతున్న రాష్ట్రాలు స్వయంసమృద్ధి కలిగి ఆర్థికంగా పరిపుష్టమై ఉండాలి. కలిసి ఉన్నప్పటి కాలం నాటి పరిస్థితులకంటే పౌరులకు మెరుగైన జీవితాన్ని ఇచ్చేదిగా ఉండాలి. 1955 నాటి రాష్ట్రాల పున ర్విభజన సంఘం నివేదికలో (2వ భాగం) పునర్విభజన అనివార్యమైతే జాతీ య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజ నకు భాషను ప్రాతిపదికగా తీసుకోవడంలోని ప్రయోజనం గురించి ఈ నివేది కలో ఉంది. ఒకే భాష వల్ల పరిపాలన సులభమవుతుంది. కుల మతాలను బట్టి కాకుండా భాష సాయంతో ప్రజలందరినీ సమంగా గుర్తించే అవకాశం ఉంటుం దని కూడా చెబుతోంది. 1949, ఏప్రిల్ 1 నాటి జేవీపీ (జవహర్ వల్లభ్ భాయ్ పటేల్, పట్టాభి) నివేదిక చెప్పిన మాటలను కూడా చూడాలి. ప్రజల మనోభా వాలు విభజనపట్ల గాఢంగా మొగ్గి ఉంటే ప్రజాస్వామికవాదులుగా దానిని గౌర వించాలి. అయితే భారత్ అఖండంగా ఉంచడానికి ఉన్న పరిమితులను కూడా గమనించాలని ఆ నివేదిక సూచించింది. 1972లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో చేసిన ప్రకటన కూడా గుర్తుండే ఉంటుంది. ఒకే కుటుంబంలోనే వివాదాలుంటాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలు దేశంలోని అన్ని రాష్ట్రాలలోనే కాదు, ఆయా రాష్ట్రాలలో కూడా ఇలాంటి హెచ్చు తగ్గులు కనిపిస్తుంటాయి. ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ, శ్రీకాకుళం ప్రాంతా లను వెనుకబడిన వాటిగా చెబుతారు. తెలంగాణ ప్రాంతం వెనుకబడినదిగా పేరున్నప్పటికీ కొన్ని మెరుగైన పరిస్థితులు ఉన్న ప్రాంతాలు కూడా అక్కడ ఉండి తీరతాయి. రెండు ప్రాంతాలను పోల్చి చూసినప్పుడు అందులో ఒకటి వెనుకబడి ఉన్నదనే ఒక్క కారణంతో తిరుగులేని నిర్ణయాలను తీసుకోవడం సాధ్యం కాదు. విభజనకు అదే ప్రాతిపదిక అయితే దానికి అంతం ఎక్కడ? కొందరు ఉత్తరప్రదేశ్ను విభజించాలని సలహా ఇస్తున్నారు. మూడు, నాలుగు రాష్ట్రాలుగా ఆ రాష్ట్రాన్ని విభజిస్తామా? దేశాన్ని సంస్థానాల కాలం నాటికి తిరోగమింపచేస్తామా? విభజన అంశానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. వెనుకబాటునే చూపి విభజన చేయవచ్చునని ఎవరూ చెప్పలేరు. ఆర్థిక వెనుక బాటుతనాన్ని కష్టపడి పనిచేయడంవల్ల, దేశం మొత్తం చేయూతనివ్వడం వల్ల అధిగమించవచ్చు. వెనుకబాటుతనమనేది వాస్తవంగా సర్వసాధారణమైన సమస్య. దారిద్య్రంలో భాగం. ఈ అంశాలన్నీ ఉద్వేగాల ప్రాతిపదికగా కాకుం డా శాంతియుత వాతావరణంలో సమష్టిగా ఆలోచించవలసినవే. 13వ కేంద్ర ఆర్థిక కమిషన్ ఇచ్చిన నివేదికలో వివిధ రాష్ట్రాల మధ్య పోల్చి చూడదగ్గ తలసరి (జీఎస్డీపీ) ఆదాయాల గురించి పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం (మన 28 రాష్ట్రాలలో) మధ్యప్రదేశ్ 26, ఉత్తరప్రదేశ్ 27, బీహార్ 28 స్థానాలలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటుచేసిన ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖం డ్ల తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే ఎక్కువ కాదు. 13వ కేంద్ర ఆర్థిక కమిషన్ చెప్పిన ప్రకారమే గోవా, హర్యానా, మహారాష్ట్ర, హిమాచల్ప్రదేశ్, పం జాబ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, సిక్కిం రాష్ట్రాలు చిన్నవి కావడం మూలంగానే ధనిక రాష్ట్రాలుగా అవతరించాయని ఎవరైనా రుజువు చేయగ లరా? చిన్న రాష్ట్రంగా ఉన్నందువలనే ఛత్తీస్గఢ్ ఉగ్రవాదంతో పోరాడగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుందని ఎవరైనా చెప్పగలరా? జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల (25.09.2013, ది హిందూ) చేసిన ప్రకటనను గమని ద్దాం. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ఫలాలను అందుకోవాలన్న ఉద్దేశమే జార్ఖండ్ ఏర్పాటు వెనుక ఉన్న ఆశయం. కానీ 13 ఏళ్ల తర్వాత కూడా ఆ ఆశయం నెరవేర లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జార్ఖండ్ ప్రజల స్థితి దుర్భరం. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ (25.08.13 ది హిందూ) అభిప్రాయం కూడా ఇలాగే ఉంది. కేంద్రం మీద ఆధారపడకుండా స్వయంసమృద్ధి కలిగి, ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పుడే రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడుతు న్నట్లు బహుగుణ పేర్కొన్నారు. యూపీని వదిలి ఏపీని పట్టుకున్నారు చిత్రమేమిటంటే ఉత్తరప్రదేశ్ను బుందేల్ఖండ్, పూర్వాంచల్, అవధ్ప్రదేశ్, పశ్చిమప్రదేశ్లుగా విభజించాలని బహుజన సమాజ్ పార్టీ అధికారంలో ఉన్న ప్పుడు మూజువాణీ ఓటుతో (2011, నవంబర్ 21) ఆమోదించింది. భారత జనాభా ప్రస్తుతం 121,01,93,422. అన్ని రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాలలో 640 జిల్లాలు ఉన్నాయి. ఇందులో యూపీలో 71 జిల్లాలో 19,95,81,477 జనాభా ఉంది. తర్వాతి స్థానం మధ్యప్రదేశ్ది. దాదాపు 7 కోట్ల జనాభాతో 50 జిల్లాలు ఉన్నాయి. అయితే బీఎస్పీ తీర్మానాన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ఎందుకు పూనుకుంది? చిన్న రాష్ట్రాలతో పరిపాలనా సౌలభ్యం ఎక్కువనే వాదన ఇప్పుడు సమంజసమా? సాంకేతిక పరిజ్ఞానంతో దూరభారాలు సడలిపోయాయి. ఈ విషయాన్ని తాజా గా పరిశీలించాల్సిందే. వైశాల్యం అభివృద్ధికి ఆటంకం కాదన్న వాస్తవాన్ని మహా రాష్ట్ర రుజువు చేసింది కూడా. ఇటీవల రఘురామ్ రాజన్ కమిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం గోవా, కేరళ, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హర్యానా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. ఇవన్నీ చిన్న రాష్ట్రాలు కావడంవల్లనే అభివృద్ధి చెందాయా? ఆంధ్రప్రదేశ్ కంటే మహారాష్ట్ర చాలా పెద్దది. అయినా అక్కడ విభజన ఊసు లేదు. రఘురామ్ కమిటీ నివేదిక ఒడిశా, బీహార్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అరుణాచల్, అసోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్- ఈ పదింటినీ పరిమిత అభివృద్ధికి నోచుకున్న రాష్ట్రాలుగా తేల్చింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అరుణాచల్, అసోం, మేఘాలయ సాపేక్షంగా చూస్తే చిన్న రాష్ట్రాలు. అవి అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదు? రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఈ ఏడాది జనవరిలో రిజర్వు బ్యాంకు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ పన్ను ఆదాయం 2009-10 ఏళ్లలో దాదాపు రూ.45,140 కోట్లు. 2010-11లో 53, 400 కోట్లు. 2011-12లో రూ.66,020 కోట్లకు పెరిగింది. ఈ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ది మూడవ స్థానం. మహారాష్ట్ర, తమిళనాడు తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి. ఉత్తర్ప్రదేశ్ది నాల్గవ స్థానం. కాబట్టి స్వయం సమృద్ధి కలిగిన ఒక రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం ఎందుకు? సుప్రీం ముందున్న వ్యాజ్యాల మాటేమిటి? చిన్న రాష్ట్రాలతో దేశం భూతల స్వర్గం అయిపోతుందనిచేస్తున్న వాదనలలో నిజమెంత? 1956 నుంచి కూడా రాష్ట్రాల మధ్య వివాదాలకు సంబంధించి వ్యాజ్యాలు సుప్రీంకోర్టు ముందుకు వస్తూనే ఉన్నాయి. వీటిలో ఎక్కువ సరిహ ద్దులకు లేదా జల వివాదాలకు సంబంధించినవి. అమ్మకం పన్ను వసూళ్ల గురించి కూడా కొన్ని గణాంకాలు వెలువడ్డాయి. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్శి వి.భాస్కరరావు చెబుతున్న లెక్కల ప్రకారం రాష్ట్ర వార్షిక వాణిజ్య పన్నుల వసూళ్లు 47 వేల కోట్ల రూపాయలు. ఇం దులో కోస్తా జిల్లాలు, రాయలసీమ వాటా 13 వేల కోట్లు (28 శాతం). తెలం గాణ వాటా (హైదరాబాద్, రంగారెడ్డి మినహాయిస్తే) 7 వేల కోట్లు (15 శాతం). ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి వాటా 27 వేల కోట్లు (57 శాతం). హైదరాబాద్, రంగారెడ్డి నుంచి వస్తున్న అమ్మకపు పన్ను వసూళ్లలో 80 శాతం కోస్తా, రాయలసీమ ప్రాంతం వారు చెల్లిస్తున్నవేనన్న వాదన ఉంది. ఈ నేప థ్యంలో హైదరాబాదు ఏ ఒక్కరి సొత్తుకాదని పెద్దవాదనే నడుస్తోంది. జయ పాల్రెడ్డి కూడా హైదరాబాద్ అనేది భారతదేశ ప్రజలందరికీ చెందిందని చెబుతున్నారు. ఆంధ్ర ప్రాంతం వారు హైదరాబాద్కు ఉపాధి కోసం వచ్చినట్లే తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా వాసులు ముంబై నగరానికి పొట్ట పట్టుకొని వెళ్లారు. అనంతపురం వారు బెంగళూరు నగరానికి, చిత్తూరు జిల్లా వాసులు చెన్నైకి ఉద్యోగాల కోసం వెళ్లారు. చివరిగా ఐటీ పరిశ్రమ గురించి కొన్ని మాటలు. ఈ రంగానికి సంబం దించి ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతులతో పాటు మంచి వాతావరణాన్ని కూడా కలిగి ఉందని ఐటీ, ఐటీ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వి.రాజన్న చెబుతున్నారు. ఇటీవల ఆర్థికవ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ హైదరాబాద్ను మొదటిసారిగా ఐటీ పెట్టుబడుల ప్రాంతంగా ప్రకటించింది. 25 సంవత్సరాలలో రెండు దశలలో పూర్తయ్యే ఈ పథకంలో 1.18 లక్షల కోట్లు సాఫ్ట్వేర్లోను, 1.01 లక్షల కోట్లు హార్డ్వేర్లోను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వా మ్యంలో పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో ఉద్యోగావకాశాలు ఇబ్బడి ముబ్బ డిగా పెరగడం ఖాయం. గత ఏడాది రూ.53,246 కోట్లుగా ఉన్న ఐటీ పరిశ్రమ ఆదాయం 2013కు రూ.64,354 కోట్లకు పెరిగింది. ఈ పురోగతి ఇలా కొనసాగ డానికి ఉన్న కారణాలను గమనించాలి. వాటిని పాఠాలుగా స్వీకరించాలి. అది సాధ్యమవుతుందా?
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement