-
కొత్త బ్యాంకులకు ఈసీ బ్రేక్?
ముంబై: ఈ నెలాఖరులోగా కొన్ని బ్యాంకు లెసైన్సులు మంజూరు చేయాలని రిజర్వు బ్యాంకు భావిస్తుండగా, ఎన్నికల ముందుగా ఇలాంటి చర్యలను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అడ్డుకుంటుందనే వార్తలు వినవస్తున్నాయి. ఈసీ నుంచి తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి తెలిపారు. ‘లెసైన్సుల మంజూరుపై ఈసీ అభిప్రాయాన్ని కోరుతూ ఆర్బీఐ లేఖ రాసిందని మాత్రమే నాకు తెలుసు. ఈసీ నుంచి సమాధానం వచ్చిందో, లేదో నాకు తెలియదు. ఈ విషయంపై నిన్నటి వరకు నాకు ఎలాంటి సమాచారం లేదు...’ అని ఆయన గురువారం ముంబైలో విలేకరులతో చెప్పారు. ఎన్నికలకు ముందుగా లెసైన్సుల జారీకి ఈసీ అంగీకరించదనీ, కొన్ని అంశాలపై మరింత స్పష్టతను ఈసీ కోరుతోందనీ పేర్కొంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఎన్నికల సీజను కంటే చాలాకాలం ముందుగానే లెసైన్సుల ప్రక్రియ మొదలైందనీ, కనుక ఈ వ్యవహారంలో ఈసీ జోక్యం చేసుకోబోదని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్లు గతంలో విశ్వాసం వ్యక్తం చేశారు. 2010-11 బడ్జెట్ నాటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, బ్యాంకింగ్ రంగంలో ప్రవేశానికి 26 కంపెనీలు దరఖాస్తు చేసుకోవడంతో గత జూలై నుంచి ఈ ప్రక్రియ ఊపందుకుంది. టాటా, మహీంద్రా గ్రూప్లు ఆ తర్వాత తమ దరఖాస్తులను ఉపసంహరించుకున్నాయి. ఇండియా పోస్ట్, ఐఎఫ్సీఐలతో పాటు అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు బ్యాంకు లెసైన్సుకు దరఖాస్తు చేశాయి. లెసైన్సుల జారీపై ఈసీ అభిప్రాయాన్ని కోరుతూ ఈ నెల తొలివారంలో ఆర్బీఐ లేఖ రాసినట్లు సమాచారం. ఇండియా పోస్ట్కు లెసైన్సు కష్టమే? బ్యాంకులు ఏర్పాటు చేయాలని ఆశిస్తున్న కొన్ని పారిశ్రామిక సంస్థలకు నిరాశ ఎదురుకావచ్చని అంటున్నారు. వీటికి లెసైన్సులు ఇవ్వడానికి రిజర్వు బ్యాంకు సుముఖంగా లేఖ పోవడమే ఇందుకు కారణం. లెసైన్సుల ప్రక్రియ తుదిదశకు చేరుకున్నప్పటికీ, తుది ప్రకటన వెలువడడానికి మరింత సమయం పడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. లెసైన్సులకు సంబంధించిన చర్చల్లో పలు వాణిజ్య సంస్థల ప్రస్తావన వచ్చింది. అయితే, ఈ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని రిజర్వు బ్యాంకులోని కీలక వర్గాల అభిప్రాయం. పారిశ్రామిక సంస్థలు బ్యాంకులు ఏర్పాటు చేయడాన్ని అమెరికా, దక్షిణ కొరియాల్లో అనుమతించరు. ఆస్ట్రేలియా, కెనడా, యూకే, హాంకాంగ్లలో అనుమతి ఇచ్చినప్పటికీ యాజమాన్యం, ఓటింగ్ హక్కులపై నిబంధనలు విధిస్తారు. భారత్లో 1993, 2004 సంవత్సరాల్లో బ్యాంకు లెసైన్సులను మంజూరు చేసినపుడు వాణిజ్య సంస్థలను పరిగణనలోకి తీసుకోలేదు. మరోపక్క, ఇండియా పోస్ట్ దరఖాస్తును పరిశీలించబోరనీ, ప్రభుత్వ యాజమాన్యంలోనిది కావడమే అందుకు కారణమనీ అంటున్నారు. నాలుగైదు సంస్థలకే లెసైన్సు? అన్ని వడపోతల తర్వాత నాలుగైదు సంస్థలకే లెసైన్సు దక్కవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో ఐడీఎఫ్సీతో పాటు రెండు ప్రముఖ ఎన్బీఎఫ్సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలున్నాయి. ప్రైవేటు రంగంలోని సంస్థలకు మాత్రమే లెసైన్సులు జారీ చేయనున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్, డిప్యూటీ గవర్నర్లు పలు దఫాలు సమావేశమయ్యారనీ, లెసైన్సులను ఏఏ సంస్థలకివ్వాలో ఇంకా ఖరారు చేయలేదని ఆ వర్గాలు తెలిపాయి. సంస్థల పేర్లను ఖరారు చేసిన తర్వాత ఆ జాబితాను ఆమోదం కోసం ఆర్బీఐకి చెందిన సెంట్రల్ బోర్డు కమిటీ(సీసీబీ)కి పంపిస్తారు. సాధారణంగా వారానికోసారి సమావేశమయ్యే సీసీబీ, ఈ జాబితాకు ఆ మోదముద్ర వేయడానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు సమావేశం కావాల్సి వస్తుంది. దీంతో లెసైన్సుల ప్రకటన జాప్యమయ్యే అవకాశముంది. -
జూన్ 1కల్లా కొత్త లోక్సభ : సీఈసీ సంపత్
వాషింగ్టన్ : జూన్ 1వ తేదీకల్లా కొత్త లోక్సభ కొలువు తీరనుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ తెలిపారు. అయిదు లేదా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. మార్చి మధ్యంతరంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. తొలి విడత పోలింగ్కు ఆరు వారాల ముందు నుంచే ఎన్నికల షెడ్యూల్ మొదలవుతుందని సంపత్ తెలిపారు. మొదటి విడత పోలింగ్కు మూడు వారాల ముందు నోటిఫికేషన్ విడుదల అవుతుందని సంపత్ పేర్కొన్నారు. -
మినీ మహా సమరం!
వచ్చే లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అనదగ్గ అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో కొత్త సభలను కొలువుతీర్చే పనికి ఎన్నికల సంఘం శుక్రవారం శ్రీకారం చుట్టింది. నవంబర్ 11న జరిగే ఛత్తీస్గఢ్ ఎన్నికలతో మొదలై...డిసెంబర్ 4న నిర్వహించే ఢిల్లీ, మిజోరం ఎన్నికలతో ఈ మినీ మహా సమరం ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడవుతాయి. ఢిల్లీ, రాజస్థాన్, మిజోరంలలో కాంగ్రెస్...మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ ఇప్పుడు పాలకపక్షాలుగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈమధ్య ఇచ్చిన రెండు తీర్పుల ప్రభావం ఈ ఎన్నికల్లో కనబడబోతున్నది. మొదటిది-పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ‘ఎవరూ నచ్చలేద’ని చెప్పేందుకు ఓటర్లకు తొలిసారి అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లలో అదనపు మీటను ఏర్పాటుచేయబోతున్నారు. అలాగే, నేరచరితులుగా తేలి రెండేళ్లకు మించి శిక్షపడే సందర్భంలో ప్రజాప్రతినిధుల సభ్యత్వం వెనువెంటనే రద్దవుతుందని ఇచ్చిన తీర్పు కూడా అన్ని పార్టీలనూ భయపెట్టేదే. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నపక్షంలో అలాంటివారికి టిక్కెట్ ఇచ్చేందుకు ఈసారి పార్టీలు ఉత్సాహం చూపించే అవకాశం లేదు. ఈ అయిదేళ్లలోనూ ఎప్పుడైనా తీర్పు వెలువడి, అందులో శిక్షకు గురైతే వెంటనే వారి సభ్యత్వం ఎగిరిపోతుందన్న భయం అన్ని పార్టీలకూ ఉంటుంది. ఎన్నికలనేసరికి పాలకపక్షాలుగా ఉన్న పార్టీలకు వణుకు సహజం. అయిదేళ్ల తమ పాలన తీసుకొచ్చిన మార్పులూ, అందులోని గుణదోషాలూ విస్తృతంగా చర్చకొచ్చే సమయం గనుక వాటిని సమర్ధించుకోవాల్సిరావడం ఇబ్బందే. ఆ రకంగా చూస్తే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలూ కే ంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తున్న కాంగ్రెస్కు అగ్నిపరీక్షలాంటివి. ఇప్పుడేలుతున్న రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలమనిగానీ, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈసారి సునాయాసంగా పాగా వేయగలమనిగానీ ఆ పార్టీకి నిండైన విశ్వాసం లేదు. కేంద్రంలో కుంభకోణాల పరంపర, అధిక ధరలు, అస్తవ్యస్థ పరిపాలన మాత్రమే కాదు...ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ పాలకపక్షంగా లేదా ప్రతిపక్షంగా విఫలమైన తీరే అందుకు కారణం. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓటర్లు వరసగా మూడుసార్లు కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు. మూడుసార్లూ షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో అక్కడున్న 70 స్థానాల్లో కాంగ్రెస్కు 41 వచ్చాయి. బీజేపీ 24 స్థానాలతో సరిపెట్టుకుంది. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఢిల్లీ పౌరుల్లో నెలకొన్న అభద్రతాభావం ఆమెకు ఈసారి ఆమెకు శాపమే. శాంతిభద్రతలు సక్రమంగా లేవని, మరీ ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన నిర్భయ ఉదంతం ప్రజల మనసుల్లో ఇంకా సజీవంగా ఉంది. ఇదికాక తరచుగా పెరిగిన విద్యుత్ చార్జీలు, నీటి బిల్లులు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలిగించాయి. నిత్యావసర సరుకులు...మరీ ముఖ్యంగా ఉల్లిగడ్డ ధర ఆకాశాన్నంటడం మధ్యతరగతి, దిగువతరగతి ప్రజలను బాగా కుంగదీసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను మూడుగా విభజించాక గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మూడుచోట్లా విపక్ష బీజేపీ విజయఢంకా మోగించింది. అయితే, ఈసారి కొత్తగా బరిలోకి దిగబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం తమ విజయావకాశాలను దెబ్బతీస్తుందేమోనన్న భయం అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్నూ వెన్నాడుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం రాజస్థాన్. అక్కడకూడా కాంగ్రెస్ పరిస్థితి ఆశావహంగా లేదు. శాంతిభద్రతల క్షీణత, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, విద్యుత్చార్జీల పెంపు అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి గుదిబండలు. ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాటను నిలుపుకోలేదని గుజ్జర్లు ఆగ్రహంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ది అత్తెసరు మెజారిటీయే. 200 స్థానాలున్న సభలో అప్పుడు కాంగ్రెస్ గెలుచుకున్నవి 96 స్థానాలు మాత్రమే. అప్పట్లో ఆరుగురు సభ్యులున్న బీఎస్పీ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. గత ఎన్నికల్లో 78 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ ఇప్పుడు సునాయాసంగా గెలవగలనన్న విశ్వాసంతో ఉంది. ఇప్పుడు పరిపాలిస్తున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మళ్లీ తమకే దక్కుతాయని బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రజాదరణపొందిన వివిధ పథకాలవల్లా, అభివృద్ధి కార్యక్రమాలవల్లా వరసగా మూడోసారి కూడా సునాయాసంగా విజయం సాధించగలనని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భావిస్తున్నారు. చౌహాన్ సన్నిహితులపై ఐటీ శాఖ దాడులు, కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారన్న కాంగ్రెస్ ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపబోవని పార్టీ భావిస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని 230 స్థానాల్లో బీజేపీకి ఇప్పుడు 153 స్థానాలుండగా కాంగ్రెస్ 66 స్థానాలు గెల్చుకుంది. ఇక ఛత్తీస్గఢ్లో ఉన్న 90 స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో 49 సాధించగా, కాంగ్రెస్ 39 స్థానాలు గెల్చుకుంది. ఆమధ్య కాంగ్రెస్ కాన్వాయ్పై నక్సలైట్లు దాడిచేసి ముఖ్య నాయకులను హతమార్చిన ఘటన తర్వాత తమపై సానుభూతి వెల్లువెత్తుతోందన్న అభిప్రాయం కాంగ్రెస్లో ఉంది. కానీ, పాలనలోనూ...మరీ ముఖ్యంగా ప్రజాపంపిణీ వ్యవస్థను తీర్చిదిద్దడంలో సమర్ధతను కనబరిచిన రమణ్సింగ్ సర్కారును సవాల్ చేయడం అంత సులభమేమీ కాదు. మొత్తమ్మీద ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్సభ ఎన్నికలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్ సంగతలా ఉంచి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్రమోడీ దీక్షాదక్షతలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష. ఇందులో ఘనవిజయం సాధిస్తేనే తన పార్టీలో మోడీ తిరుగులేని నేతగా ఎదుగుతారు... వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశలు ఈడేరతాయి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం.. ఈడీ చరిత్రలో తొలిసారిగా
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్ను పలకరించి మరీ! (ఫొటోలు)
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement