-
మహిళాభ్యుదయం కోసమే ‘4 ఈ సెంటర్’
నాగోలు: మహిళల అభ్యున్నతి కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని, మహిళాసాధికరతకు ప్రధాని నరేంద్రమోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు, తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ అన్నారు. బుధవారం రాత్రి నాగోలు డివిజన్ బండ్లగూడ అనంద్నగర్లో బీజేపీ రంగారెడ్డి అర్బన్ మహిళా మోర్చా పాలసీ, రీసెర్చ్ ఇంచార్జి కాలంశెట్టి లయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (చదువు, ఉపాధి, వ్యవస్థాపకత, సాధికారత) 4 ఈ సెంటర్ను వనతి శ్రీనివాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలను చదువు, ఉపాధి రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు. వ్యవస్థాపకత, సాధికరత కోసం 4 ఈ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో రాణించేలా మహిళలను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ నిరంతరం ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సుకన్య సమృద్ధి పథకం, ఆయుష్మాన్ భారత్ తదితర పథకాలపై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. మహిళల అభ్యదయ కోసం తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా 4 సెంటర్ నాగోలులో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, నాగోలు కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, రాష్ట్ర ఇంచార్జి నళిని, రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ విభాగం అధ్యక్షుడు సామ రంగారెడ్డి, గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్రెడ్డి, నేతలు శ్యామల, గజం రాజ్యలక్షి్మ, బద్దం బాలకృష్ణగౌడ్, డప్పురాజు పాల్గొన్నారు. -
తమిళి సై టీం రెడీ
* కార్యవర్గం ప్రకటన * వానతికి ఉపాధ్యక్ష పదవి * ప్రధాన కార్యదర్శిగా మోహన్రాజు సాక్షి, చెన్నై : రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తన టీంను సిద్ధం చేసుకున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని తమిళి సై ప్రకటించారు. వానతీ శ్రీనివాసన్కు ఉపాధ్యక్ష పదవి, ఎస్ మోహన్రాజు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకున్న పొన్ రాధాకృష్ణన్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని నెలల అనంతరం ఎట్టకేలకు ఆ పదవి తమిళి సై సౌందరరాజన్ను వరించింది. పార్టీలకు అతీతంగా అందరూ ఆహ్వానించారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి ఆమె సాగించిన సేవకు ప్రతి రూపంగా పార్టీ నాయకత్వ పగ్గాలు దక్కాయని చెప్పవచ్చు. అయితే, ఆమెను అధికార పూర్వకంగా అధ్యక్షురాలిగా ఆమోదించేందుకు మరి కొన్ని నెలలు పట్టాయి. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమెను అధ్యక్షురాలిగా ఆమోదిస్తూ తీర్మానించారు. దీంతో తమిళి సై టీం ఎలా ఉండబోతోందోనన్న ఎదు రు చూపులు పెరిగాయి. రాష్ట్రంలో అధికార పగ్గాలు లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీకి రాష్ట్ర కార్యవర్గం మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో తన టీం ఎంపికపై తీవ్ర కసరత్తులు చేసిన తమిళి సై ఎట్టకేలకు శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ జాబితాను ప్రకటించారు. కొత్త టీం బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో అధ్యక్షురాలితో పాటుగా తొమ్మిది మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, తొమ్మిది మంది కార్యదర్శుల్ని నియమించారు. కోశాధికారి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా ఒకర్ని నియమించారు. ఆ జాబితా మేరకు ఉపాధ్యక్షులుగా - వానతీ శ్రీనివాసన్, శుభ నాగరాజన్, కరుప్పు ఎం.మురుగానందన్, డీ.కుప్పురాము, ఎం.చక్రవర్తి, ఎస్.సురేంద్ర, ఎం.సుబ్రమణి, శివగామి పరమశివం, తమిళరసి యోగంను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా ఎస్.మోహన్రాజులు(నిర్వాహక), ఎస్ఆర్.శరవణ పెరుమాళ్, కేఎస్.నరేంద్రన్, జీకేఎస్.సెల్వకుమార్, కార్యదర్శులుగా ఎస్.పళనిస్వామి, ఎస్.ఆదవన్, కె.టి.రాఘవన్, పొన్ బాలగణపతి, సీ.ధర్మరాజు, బి.జి.మోహన్రాజు, మహాలక్ష్మి, గిరిజ, మనోహరన్, అనుచంద్రులు వ్యవహరించనున్నారు. రాష్ట్ర కోశాధికారిగా ఎస్ఆర్ శేఖర్, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా కే.సర్వోత్తమన్లనునియమించారు. కాగా కన్యాకుమారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ధర్మరాజును రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో ఆయన స్థానంలో ఆ జిల్లా అధ్యక్షుడుగా ధర్మపురం తిరుగణేషన్ వ్యవహరించనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement