-
ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ను ప్రారంభించిన కేసీఆర్
సాక్షి, ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దేశ రాజధానిలో ప్రారంభించారు. గురువారం ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తానికి (1గం.05ని.) ఆయన ఆఫీస్ రిబ్బన్ను కట్ చేశారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో వసంత్ విహార్ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో మొదటి అంతస్తులోని తన కార్యాలయంలో కేసీఆర్ భేటీ అయ్యారు. మొత్తం 1,300 గజాల్లో ఉన్న స్థలంలో 20 వేల చదరపు అడుగుల ప్రాంతంలో భవనాన్ని నిర్మించారు. అందులో లోయర్ గ్రౌండ్, గ్రౌండ్, మొదటి, రెండవ, 3వ అంతస్తులతో కలిపి మొత్తం 5 అంతస్తులు న్నాయి. లోయర్ గ్రౌండ్లో మీడియా సమావేశాల ను నిర్వహించేందుకు వీలుగా మీడియా హాల్తోపాటు రెండు ఇతర గదులను నిర్మించారు. లోయర్ గ్రౌండ్లోకి వచ్చే మీడియాకు వీలుగా ఉండేలా ప్రత్యేక ఎంట్రెన్స్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్త లు, నాయకుల కోసం క్యాంటీన్ను సిద్ధం చేశారు. మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. 2,3 అంతస్తుల్లో ఢిల్లీలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు వచ్చే కార్యకర్తలు, నాయకులు బస చేసేందు కు 18 గదులతోపాటు రెండు ప్రత్యేక సూట్ రూమ్లను సిద్ధం చేశారు. సూట్ రూమ్లలో పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బస చేస్తారు. ఆంక్షలతో ఆలస్యం ఢిల్లీలోని వసంత్ విహార్లో 2021 సెప్టెంబర్ 2న కేసీఆర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించినప్పటికీ.. ఢిల్లీలో కాలుష్యం కారణంగా నిర్మాణ పనులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు. ఇదీ చదవండి: ‘బీజేపీని తరిమికొట్టే టైం వచ్చింది’ -
బీఆర్ఎస్ ఖాతాలో అరుదైన ఘనత
ఢిల్లీ: భారత రాష్ట్ర సమితి(BRS) అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలో నేడు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్.. ఈ కార్యాలయాన్ని కేంద్ర బిందువుగా మార్చాలని భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఆఫీస్ను అంతే ఘనంగా నిర్మించారు. అయితే ఈ ఫీట్ ద్వారా బీఆర్ఎస్ తెలుగు రాష్ట్రాల నుంచి మరో ఘనత సాధించింది. తెలుగు రాష్ట్రాల తరపున ఢిల్లీలో కేంద్రీయ కార్యాలయం ప్రారంభించిన తొలి పార్టీగా నిలిచింది బీఆర్ఎస్. ఇంతదాకా ఏ పార్టీ కూడా ఈ ప్రయత్నమూ చేయలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నేడు బిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరగనుంది. ఆడంబరానికి దూరంగా సాదాసీదాగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ భావించారు. అందుకే రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. ఇక.. వాస్తు పండితులు సుధాకర్ తేజ, శృంగేరి పీఠం రుత్వికులు గోపి శర్మ, ఫణి శర్మ ఆధ్వర్యంలో క్రతువులు జరగనున్నాయి. మ.1.05 నిమిషాలకు రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభిస్తారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. BRS Office ప్రత్యేకతలు ఇవే ► 20 వేల చదరపు అడుగులలో జి +3 మూడంతస్తుల భవనం నిర్మాణం ► మొదటి అంతస్తులో సీఎం కేసీఆర్ కార్యాలయం, పేషి కాన్ఫరెన్స్ హాల్ ► రెండవ, మూడవ అంతస్థుల్లో బస చేసేందుకు 18 గదుల ఏర్పాటు, ► రెండు ప్రత్యేక సూట్ రూంలు అందులో ఒకటి ప్రెసిడెంట్ సూట్, మరొకటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూట్ ► గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శుల కోసం నాలుగు గదులు, కార్యాలయ రిసెప్షన్, కార్యకర్తలు, నాయకుల కోసం క్యాంటీన్ ఇదీ చదవండి: తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం -
నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు(బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. అత్యాధునిక హంగులతో వసంత్ విహార్లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన రేపు(గురువారం) ప్రారంభించనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ఇప్పటికే పార్టీ ఆఫీస్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రారంభానికి ముందు శాస్త్రోక్తంగా యాగం, హోమం, ఇతర పూజ కార్యాక్రమాలను నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనం అవుతారని తెలుస్తోంది. రేపు పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొని.. గురువారం ఆయన ఢిల్లీలో ఉంటారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్కు వస్తారని సమాచారం. ఈ మధ్యలో ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో, మరికొందరు జాతీయ నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: తడిసినా కొంటాం.. రైతన్నకు సీఎం కేసీఆర్ భరోసా -
పోలీసులను చూసి భవనం పైనుంచి దూకేశాడు..
సాక్షి, ఢిల్లీ : పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునే యత్నంలో ఓ వృద్ధుడు(69) భవనం పైనుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వసంత్ విహార్లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఫైనాన్స్ వ్యాపారం చేసే వీరేంద్ర థింగ్రా ఒకరికి బాకీ పడిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఈ విషయమై అతనిపై ఒక చీటింగ్ కేసు కూడా నమోదైంది. పోలీసులకు దొరక్కుండా వీరేంద్ర గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అతను సోమవారం వసంత్ విహార్లోని తనయుడు సంజయ్ ఇంటికి వచ్చాడు. అతని ఆచూకీ పసిగట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకుందామని ఆ ఇంటికి చేరుకున్నారు. కానీ, పోలీసులను చూసి తనను అరెస్టు చేస్తారని భయపడిన థింగ్రా భవనం పైకెక్కి దూకేశాడని పోలీసులు వెల్లడించారు. ‘థింగ్రా ఫైనాన్స్ వ్యాపారి. ఒకరికి డబ్బు చెల్లించడంలో విఫలమవడంతో అతనిపై ఒక చీటింగ్ కేసు నమోదై ఉంది. ఈ విషయమై అతను తీవ్ర ఒత్తిడికి లోనైనట్టు మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్లో రాసి ఉంది’ అని సౌత్వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమీషనర్ మిలింద్ దుంబెర్ చెప్పారు. సూసైడ్ నోట్లోని చేతిరాత వీరేంద్రదా, కాదా? అనేది తేల్చాల్సివుందని ఆయన చెప్పారు. కానీ, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం వీరేంద్రది హత్యేనని ఆరోపిస్తున్నారు. ‘మా నాన్నను ఎవరో చంపేశారాని నాకొక ఫోన్ కాల్ వచ్చింద’ని థింగ్రా తనయుడు సంజయ్ తెలిపారు. కేసుకు సంబంధించి ఇంతవరకూ అనుమానితులను గుర్తించలేదని పోలీసులు తెలిపారు. -
జిగీష హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష
మరొకరి జీవిత ఖైదు ≈ శిక్షలు ఖరారు చేసిన ఢిల్లీ కోర్టు ≈ దోషులకు 9.8 లక్షల జరిమానా ≈ సౌమ్య హత్య కేసులోనూ ≈ వీరే దోషులు న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగిని జిగీష ఘోష్ (28) హత్య కేసులో ఢిల్లీ కోర్టు ఇద్దరికి మరణ శిక్ష , ఒకరికి జీవిత ఖైదును విధించింది. 2009 మార్చి18న దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్లో ఉన్న తన నివాసం వద్ద నుంచి ఆమెను కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హతమార్చారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆఫీస్ క్యాబ్ ఆమెను ఇంటి వద్ద దింపి వెళ్లగా అంతలో కొందరు ఆమెను కిడ్నాప్ చేశారు. 3 రోజులకు సూరజ్కుండ్లో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఈ కేసులో 2009 జూన్లో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ధర్మాసనం రవి క పూర్, బల్జీత్, అమిత్ శుక్లాలను దోషులుగా నిర్ధారించింది. రవి క పూర్, అమిత్శుక్లాలకు మరణశిక్ష, బల్జీత్కు జీవిత ఖైదు శిక్షలను ఖరారు చేసింది. రూ.9.8 లక్షల జరిమానా.. ముగ్గురికి రూ. 9.8 లక్షల జరిమానా విధించింది. ఇందులో రూ. 6 లక్షలను బాధిత కుటుంబానికి అందజేయాలని సూచించింది. జిగీష నుంచి బంగారు గొలుసు, 2 ఫోన్లు, 2 ఉంగరాలు, డెబిట్, క్రెడిట్ కార్డులు దొంగిలించి తర్వాత దారుణంగా హత్య చేశారు. ఆమె డెబిట్ కార్డుతో నిందితులు షాపింగ్ చేశారని సీసీటీవీ ఫుటేజీలో ఆ దృశ్యాలు లభించినట్లు బాధితురాలి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది తెలిపారు. వారు ఇప్పటికే ఏడేళ్లు జైలు జీవితం గడిపారని, వారిపై కనికరం చూపాలని కోర్టును నిందితుల తరఫు న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన అదనపు సెషన్స్ జడ్జి సందీప్ యాదవ్.. హత్య జరిగే సమయంలో జిగీష తనను చంపవద్దని దోషులను ప్రాధేయపడినట్లు.. కావాలంటే తన వద్ద ఉన్న వస్తువులను తీసుకోమని.. తన డెబిట్ కార్టు పిన్నంబర్ను సైతం వారికి తెలియపరిచినట్లు వెల్లడించారు. అయినప్పటికీ దోషులు జిగీషను వదల్లేదని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలిపై దోషులు అనాగరికంగా, ఆటవికంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై జాలి చూపలేమని తెలిపారు. కాగా, 2008 సెప్టెంబర్లో జరిగిన టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసుకేసులోనూ వీరే నిందితులుగా ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement