-
యూట్యూబ్ సంచలన నిర్ణయం
న్యూయార్క్ : ప్రముఖ వీడియో వెబ్సైట్ ‘యూట్యూబ్’ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాల తయారీ, అమ్మకాలకు సంబంధించిన వీడియోలను తమ సైట్లో నిషేధించాలని నిర్ణయించింది. ఆయుధాల వాడకంతో సమాజంలో చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాలతో ఆంక్షలను యూట్యూబ్ కఠినతరం చేసింది. గత నెల అమెరికాలోని పార్క్లాండ్ స్కూల్లో చోటుచేసుకున్న సామూహిక కాల్పుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్ధ తెలిపింది. నాలుగు నెలలుగా ఈ విషయంపై సంస్థ నిపుణులతో చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఆయుధాలను ఎలా ఉపయోగించాలో తెలిపే వీడియోలను య్యూట్యూబ్ ఇదివరకే నిషేధించిన విషయం తెలిసిందే. ఈ వీడియోలను చూసి స్ఫూర్తి పొందిన ఓ వ్యక్తి లాస్వెగాస్లో 58 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటన అనంతరం యూట్యూబ్ ఆయుధాలకు సంబంధించిన వీడియోలపై నిషేదం విధించింది. వచ్చే నెల నాటికి పూర్తి స్థాయిలో ఈ నిషేధాన్ని అమలులోకి తెస్తామని సంస్థ తెలిపింది. -
వీడియోలు పోస్ట్ చేస్తే... లాభాల్లో సగం మీకే!
ప్రపంచలోనే అతిపెద్ద రిటైలర్ అమెజాన్.కామ్, ఆల్ఫాబెట్ ఇంక్స్ యూట్యూబ్ తో పోటీకి సిద్ధమైంది. అమెజాన్ మంగళవారం ఓ కొత్త సర్వీసును ఆవిష్కరించింది. యూజర్లకు వీడియోలు పోస్ట్ చేసుకునే సదుపాయంతో పాటు వాటిలో లాభాలను ఆర్జించే అవకాశాన్ని కల్పించింది. 'అమెజాన్ వీడియో డైరెక్ట్' పేరుతో ఈ సర్వీసును లాంచ్ చేసింది. వీడియోలను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయాల్లో 50 శాతం కంటెంట్ క్రియేటర్స్ కు చెల్లించేందుకు అమెజాన్ సిద్ధమైంది. కంపెనీ లైసెన్సు అగ్రిమెంట్ ప్రకారం అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. యాడ్-సపోర్డెడ్ వీడియోలకు, నికర ప్రకటన లాభాలనుంచి సగం క్రియేటర్స్ పొందేలా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైమ్ లోయల్టీ ప్రొగ్రామ్ ద్వారా అమెజాన్ ఇప్పటికే ఒరిజినల్ టీవీ ప్రొగ్రామ్ లను, డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్ట్స్, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ వీడియోలను వినియోగదారులకు యాక్సెస్ లో ఉంచింది. అదేవిధంగా వార్షిక ఫీజు 99 డాలర్లతో ఒక గంటలోనే కొనుగోలు చేసిన వస్తువులను డెలివరీ చేసే సర్వీసును కూడా అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ షేర్లు గత 12 నెలల్లో 57శాతం పెరిగాయి. ఈ సర్వీసు కోసం అమెజాన్ వివిధ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే నెలకు 10.99 డాలర్ల సబ్ స్క్రిప్షన్ తో వీడియో ప్రొగ్రామ్ ను, 8.99 డాలర్ల ఫీజుతో వీడియో స్ట్రీమింగ్ సర్వీసును అమెజాన్ ఆఫర్ చేస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement