-
పండుగ వేళ పాకిస్తానీలకు కొత్త కష్టాలు..
ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి ముందే పాకిస్తాన్లో కూరగాయలు, పాలు, పంచదార, వంటనూనెలు, నెయ్యి, మాంసం, గుడ్లు, పప్పుల ధరలు మూడు రెట్ల మేరకు పెరిగాయి. దీంతో బడుగు, మధ్య ఆదాయవర్గాల వారు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో కేజీ ఉల్లి ధర రూ. 150 (పాకిస్తానీ రూపాయిలు) నుండి 300 రూపాయలకు పెరిగింది. అయితే కొంతమంది విక్రేతలు తగ్గింపు ధరలో కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. బంగాళదుంప ధర కేజీ 50 పీకేఆర్ నుండి 80 రూపాయలకు పెరిగింది. క్యాబేజీ ధర కిలో 100 పీకేఆర్ నుండి 150 పీకేఆర్కు పెరిగింది. పచ్చిమిర్చి కిలో 200 పీకేఆర్ల నుంచి 320 రూపాయలకు పెరిగింది. క్యాప్సికం కూడా కిలో 400 పీకేఆర్లకు చేరింది. సాధారణంగా రంజాన్ మాసంలో పండ్ల విక్రయాలు పెరుగుతాయి. చిన్న సైజు అరటి పండ్ల ధర డజను 80 పీకేఆర్ల నుంచి 120 రూపాయలకు పెరిగింది. మంచి నాణ్యమైన పెద్ద అరటిపండ్లు డజన్కు 200 పీకేఆర్లకు విక్రయిస్తున్నారు. పుచ్చకాయ ధర కూడా 150 నుంచి 200 పీకేఆర్లకు అమ్ముతున్నారు. -
ఇవి మార్చితే.. చావును ఏమార్చినట్టే!
మన నిత్య జీవన విధానం, అలవాట్లు వంటివి మన జీవితకాలంపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిందే. మరి ఏయే అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటే.. 'మరణం' మనకు ఎంతెంత దూరం జరుగుతుందో తెలుసా.. దానిపై ఓ విస్తృత అధ్యయనం జరిగింది. 2011-2013 మధ్య 40 నుం 90 ఏళ్ల మధ్య వయసున్న ఏడు లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఆరు కీలక అంశాలను గుర్తించారు. వీటిని పాటించని వారితో పోలిస్తే.. పాటిందే వారిలో మరణ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుందన్నది తేల్చారు. ముఖ్యంగా వ్యాయామం చేయనివారితో పోలిస్తే.. వారంలో కనీసం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం చేసేవారు. మరణానికి దూరంగా ఉంటారని గుర్తించారు. మానసిక ఒత్తిడి, ఆందో నియంత్రించుకోగలిగితే 29 శాతం, డ్రగ్స్కు దూరంగా ఉంటే 380 మరణం రిస్క్ ను తప్పించుకున్నట్టేనని తేల్చారు. చదవండి: Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ దేనిని పాటిస్తే మరణ ప్రమాదం ఎంత శాతం తగ్గుతుంది? -
అమానుష ఘటన!ఆస్పత్రి వెలుపలే కూరగాయల బండిపై మహిళ ప్రసవం!
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించాలని అధికారులు ప్రచారం చేసినా ప్రజలు ధైర్యం చేయలేకపోతున్నారు. ఆఖరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నా ముందుకు రావడం లేదు కూడా. ఎందుకుంటే? అక్కడ జరిగిన పలు ఘటనలే. పోతే పోయాయి డబ్బులు అని కార్పోరేట్ ఆస్పత్రికే వెళ్తున్నారు. ప్రభుత్వాస్పత్రులంటే ప్రజలు జంకడానికి ఇవేనేమో అనిపించేలా ఇక్కడ ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన నిండు గర్భిణి ఆస్పత్రి వెలుపలే గజగజలాడే చలిలో ఓ కూరగాయాల బండిపైనే ప్రసవించింది. ఆరుబయటే బహిరంగంగా ఓ తల్లి నొప్పులు పడి కనే దుస్థితి ఎదురైంది. ఈ ఘటనతో మాకు ఆస్పత్రులు, అక్కడ సిబ్బందిపై నమ్మకం పోయిందంటూ ఆ మహిళ భర్త కన్నీటిపర్యంతమయ్యాడు. అదీకూడా ఆస్పత్రి ప్రాంగణలోనే ఈ దారుణం జరగడం మరింత బాధకరం! అసలేం జరిగిందంటే..ఈ దిగ్బ్రాంతికర ఘటన హర్యానాలో అంబాలాలోని ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. మెహాలి జిల్లాలోని దప్పర్ నివాసి తన భార్య గర్భవతి అని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆమెకు నొప్పులు మొదలవ్వడంతో స్ట్రెచర్ కోసం కంగారుగా ఆస్పత్రిలోకి పరుగెట్టాడు ఆ వ్యక్తి. అయితే అక్కడ ఆస్పత్రి సిబ్బంది ఎవరూ స్ట్రెచర్ తెచ్చేందుకు రాలేదు. పైగా అక్కడ ఉన్నవారెవరూ ఆమెను జాయిన్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఆమెను లోపలికి తీసుకువెళ్లేలోపే ఆస్పత్రి గేటు సమపంలో బహిరంగ ప్రదేశంలోనే ప్రసవించింది. ఆ తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగానే ఉన్నారు. తాను ఎంతలా ఆ ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నా పట్టించుకోలేదని ఆవేదనగా చెప్పాడు ఆ వ్యక్తి. ఆ తల్లి బిడ్డలను దేవుడే కాపాడాలంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఘటనతో తనకు ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై నమ్మకంపోయిందని వేదనగా చెప్పాడు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో ఒక్కసారిగా సదరు ఆస్పత్రిలో భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో ఆ తల్లి బిడ్డలను ఆస్పత్రి సిబ్బంది లోపలికి తీసుకెళ్లి వార్డులో ఉంచారు. ఈ ఘటన గురించి పంజాబ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్కు చేరడంతో తక్షణమే ఈ ఘటనపై సమగ్ర స్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఏ రాష్ట్రం అయినా అభివృద్ధిపథంలోకి వెళ్తుండటం అంటే సామాన్యుడికి సైతం సక్రమమైన వైద్యం, బతకగలిగే కనీస సౌకర్యాలు ఉన్నప్పుడే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. ఇలాంటి ఘటనలు పునురావృతమవుతున్నంత కాలం అధికారులపై, నమ్మకంపోతుంది. పైగా అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుంగా పోతుంది. ఇప్పటికైనా పాలకులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సామాన్యుడికి అన్నిరకాల వసతులు అందేలా చేసి ప్రజలచేతే తమ రాష్ట్రం అభివృద్ధిపథంలోకి పోతుందని సగర్వంగా చెప్పేలా చేయండి. అప్పడు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. (చదవండి: చనిపోయిన భర్త నుంచే పిల్లలు పొందాలనుకుంది! అందుకోసం ఆమె ఏకంగా..) -
పీహెచ్డీ ఉన్నా కూరగాయల అమ్మకం
ప్రైవేట్ జాబ్లు చేసి.. అవి నచ్చక వ్యాపారం చేసినవారిని చూశాం. చాలీచాలని జీతాలకు కుటుంబాలను పోషించలేక పలు ఆదాయ మార్గాలను వెతుకున్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు సంబంధించిన వార్తలు కూడా చదివాం. అయితే తాగాజా ఓ వ్యక్తి నాలుగు మాస్టర్ డిగ్రీలు తీసుకొని.. ఏకంగా న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసి కూరగాయలు అమ్ముతున్నారు. ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పంజాబ్కు చెందిన డా.సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రోఫెసర్గా పని చేసేవారు. అనుకోని పరిసస్థితుల్లో ఆయన తన ఉద్యోగం మానేసి ఇల్లూఇల్లు తిరుగుతూ కురగాయలు అమ్ముతున్నారు. యూనివర్సిటీలోని లా డిపార్టుమెంట్లో 11 ఏళ్లపాటు పనిచేసిన సందీప్ సింగ్ నాలుగు మాస్టర్ డిగ్రీలు(న్యాయ శాస్త్రం, పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్)తో పాటు లా కోర్సులో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇన్నేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగం చేసిన సందీప్ నెలవారి జీతాల విషయంలో చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారు. జీతాల తగ్గింపు, సరైన సమయానికి సాలరీ రాకపోవటం వంటివి ఆయన్ను తీవ్రంగా వెంటాడాయి. చేసేదేంలేక కూరగాయల అమ్మకాన్ని మొదలుపెట్టారు డా. సందీప్. తాను ఇల్లూ ఇల్లు తిరిగి కూరగాయలు అమ్మె బండికి వినూత్నంగా ‘పిహెచ్డీ సబ్జీవాలా’ అని పేరు పెట్టుకున్నారు. పంజాబ్లోని పాటియాలకు చెందిన సందీప్.. ఉద్యోగం కంటే కూడా కూరగాయలు అమ్మటం వల్లనే తాను ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పటం గమనార్హం. మరోవైపు తాను మరో మాస్టర్ డిగ్రీ కోసం చదువకుంటూ.. కూరగాలయలు అమ్మగా వచ్చిన మొత్తంతో టీచింగ్ వృత్తిని మానుకోకుండా పిల్లలకు ట్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: Punjab: వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం -
పెద్దపల్లికి చెందిన యువరైతు అద్భుత ప్రతిభ..!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement