-
వాహనాల ఫిట్నెస్ టెస్ట్.. ఇక ఆటోమేటెడ్
సాక్షి, హైదరాబాద్: వాహనాల సామర్థ్య పరీక్షలకు ఆటోమేటెడ్ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. మనుషుల ప్రమేయం లేకుండా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల నాణ్యతను, పనితీరును, వినియోగ అర్హతను ధృవీకరించేందుకు ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం తాజాగా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ మేరకు అక్టోబర్ నాటికి గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని చోట్ల ఈ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ► ఆటోమెబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వాహనానికి సంబంధించిన 40 అంశాలను ఈ ఆటోమేటెడ్ ఫిట్నెస్ కేంద్రాలు తనిఖీ చేసి సదరు వాహనం సామర్థ్యాన్ని నిగ్గు తేలుస్తాయి. ► బస్సులు, లారీలు, ఆటోరిక్షాలు తదితర అన్ని రకాల ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వాహనాలను ఈ ఫిట్నెస్ కేంద్రాల్లోనే తనిఖీలు చేయవలసి ఉంటుంది. ► ప్రస్తుతం మోటారు వాహన తనిఖీ అధికారులే అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో స్వయంగా తనిఖీలు చేసి వాహనాల సామర్థ్యాన్ని ధృవీకరిస్తుండగా రానున్న ఆ రోజుల్లో ఆ పనిని యంత్రాలు చేయనున్నాయి. ► మరో వైపు ఈ ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ స్టేషన్ల (ఏవిఎఫ్ఎస్) నిర్వహణను పూర్తిగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ల కోసం నిర్వహించే పరీక్షలను పూర్తిగా ప్రైవేట్ అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లకు అప్పగించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఫిట్నెస్ కేంద్రాలను సైతం ప్రైవేటీకరించేందుకు తాజాగా రంగం సిద్ధమైంది. ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యానికి ఊతం వాహనాల సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ..నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేట్ సంస్థలు ఏ మేరకు కచ్చితమైన ప్రమాణాలను పాటిస్తున్నాయో నిర్ధారించడం సాధ్యం కాదని రవాణాశాఖ సాంకేతిక అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆటోమేటెడ్ వెహికల్ టెస్టింగ్ సెంటర్లను ఆర్టీఏలే నిర్వహించే విధంగా మార్పులు చేయాలంటున్నారు. పక్కాగా తనిఖీలు... ► వాహనం ఇంజన్ సామర్ధ్యం, బ్రేకులు, టైర్లు, కాలుష్య కారకాల తీవ్రత వంటి ముఖ్యమైన అంశాలు మొదలుకొని వైపర్లు, సైడ్ మిర్రర్లు, షాకబ్జర్వర్స్, డైనమో, బ్యాటరీ తదితర 40 అంశాలను ఈ యంత్రాలు క్షుణ్ణంగా పరీక్షిస్తాయి. ► ఎలక్ట్రికల్, మెకానికల్ లోపాలను గుర్తిస్తాయి. ► వాహనాల నుంచి వెలువడిన కాలుష్య కారకాలను గుర్తించి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్లకు అర్హత ఉన్నదీ లేనిదీ ఈ యంత్రాలే నిర్ధారిస్తాయి. ► గంటకు 30 వాహనాల వరకు తనిఖీలు నిర్వహించే విధంగా పూర్తిస్థాయిలో కంఫ్యూటరీకరించిన ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. ► ప్రస్తుతం మోటారు వాహన ఇన్స్టెక్టర్లు నిర్వహించే తనిఖీల్లో శాస్త్రీయత కొరవడినట్లు ఏఆర్ఏఐ నిపుణులు భావిస్తున్నారు. మొక్కుబడిగా నిర్వహించే ఈ తనిఖీల వల్ల కాలం చెల్లిన, డొక్కు వాహనాలకు తేలిగ్గా అనుమతి లభిస్తుందనే అభిప్రాయం ఉంది. ► ఇలా ఉత్తుత్తి తనిఖీలతో రోడ్డెక్కే వాహనాలు రహదారి భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. -
కొత్తగా 12 ఆర్టీఏ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
రాష్ట్ర రవాణాశాఖమంత్రి మహేందర్రెడ్డి వెల్లడి మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి మల్కాపురంలో వాహన ఫిట్నెస్ కేంద్రం పనులకు శంకుస్థాపన చౌటుప్పల్ : ప్రజల సౌకర్యార్థం రాష్ర్ట వ్యాప్తంగా నూతనంగా 12 ఆర్టీఏ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని కోదాడలో ఓ కేంద్రం ఏర్పాటవుతుందన్నారు. రూ.16కోట్ల వ్యయంతో చౌటుప్పల్ మండలం మల్కాపురంలో కాలం చెల్లిన వాహనాలను పరీక్షించేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న వాహన సామర్థ్య కేంద్రం (వెహికిల్ ఫిట్నెస్ సెంటర్) పనులకు మంత్రులు మహేందర్రెడ్డి, జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిలు బుధవారం శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మహేందర్రెడ్డి మాట్లాడారు. సిరిసిల్లలో రూ.20కోట్ల వ్యయంతో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇకనుంచి వాహనాలు ఫిట్నెస్లో ఉంటేనే రోడ్లపై తిరుగుతాయన్నారు. రెండేళ్లకోసారి ప్రతి వాహనాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రత చాలా ముఖ్యమన్నారు. రోడ్లపై జరుగుతున్న ప్రమాదాల్లో యేటా 8వేల మంది మృత్యువాతపడుతున్నారన్నారు. అందుకు కారణం ఫిట్నెస్ లేని వాహనాలు, అవగాహన లేని డ్రైవింగే కారణమన్నారు. అలాంటి వాహనాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ సందీప్సుల్తానియా, జాయింట్ కమీషనర్ పాండురంగానాయక్, జిల్లా రవాణా డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్ సోమ అరుణ, ఆర్టీఓ హనుమంతారెడ్డి, ఎంవీఐ, ఏఎంవీఐలు పాల్గొన్నారు. ‘పెంటావాలెంట్’తో ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ నల్లగొండ టౌన్ : పెంటావాలెంట్ టీకా వేయిండం వలన చిన్నారులను ఐదు ప్రాణాంతక వ్యాధుల నుం చి కాపాడవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జి.జగదీష్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్కుమార్లతో కలిసి చిన్నారులకు పెంటావాలెంట్ టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పెంటావాలెంట్ టీకాతో ఐదు రకాల వ్యాధులైన కంటసర్పి, కోరంతదగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బీబీ, హెమోఫిలస్ ఇన్ఫూయెంజా వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించుకోవచ్చన్నారు. ప్రతి చిన్నారి తల్లిదండ్రులు టీకాను విధి గా వేయించి వారిని ఆరోగ్యవంతులుగా ఉంచాలని సూచించారు. టీకాలు వేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ పి.ఆమోస్, డీఐఓ డాక్టర్ ఏబీ నరేంద్ర, డీఎంఓ ఓంప్రకాశ్, డెమో తిరుపతిరెడ్డి, ఇన్ చార్జి డీసీహెచ్ఎస్ డాక్టర్ ఉదయ్సింగ్, సూపరింటెండెంట్ డాక్టర్ అమర్, డాక్టర్ మాతృ, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ చందు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, అభిమన్యు, మాలే శరణ్యారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement